Sunday, September 6, 2026

పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...

💰💸 సంపద విజయ రహస్యాలు 💸💰

*రహస్యం*

 అంశం: దానం - ప్రధానం


"పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...

మీరు మనస్ఫూర్తిగా ఆశించినంత సంపదను, మీరు హృదయ పూర్వంగా కోరుకున్న సంపదను, మీరు భౌతికంగా అనుభవించాలి అనుకున్న సంపదను, ఖచ్చితంగా పొందాలి అనుకుంటే, మీరు ఇతరులకు ఏదైన దానం చేయడం అనే "అవకాశం" ద్వారా అనంత విశ్వం ఆశీస్సులతో అనంత సంపదని పొందడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇది సంపద విజయ రహస్యాలు...
 దానం చేస్తే పుణ్యం రాదు - దానం చేస్తే సంపద పొందుతారు. ఇది నిరూపించబడిన నిజం
(పుణ్యం అనేది విశ్వంలో లేదు)

 విద్య దానం - జ్ఞాన దానం - మహా దానం

బహిరంగ దానం, గుప్త దానం అని ముఖ్యంగా రెండు రకాల దానాలు ఉన్నాయి.

★ దానం(Donation) ఏదైనా ఇతరులకు అడిగినా, అడగకపోయినా, ఎవరికైనా వారి అవసరాలకోసం ఇవ్వడం.
★ దానం చేసిన వ్యక్తిని దాత(Donor) అంటారు. 
★ దానం తీసుకునే వారిని
గ్రహీతలు అంటారు.
★ దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు.

★ దానం ఇచ్చేవి ధనం, వస్తువు, ఆభరణాలు, భూమి, రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు.

★ ఆపత్కాల దానం
 భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు, సంస్థలు బాధితులకు దానం అందిస్తాయి.

★ రక్త దానం(Blood Donation) అనేది ప్రాణ దానం తో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని లేదా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి రక్తం, మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది తమ రక్తాన్ని దానం చేస్తారు.

★ అవయవ దానం  
 వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని కంటి పొర (Cornea), చర్మం (Skin), గుండె (Heart), మూత్రపిండం (Kidney), రక్తం, వగైరాలు మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 కళ్ళు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని *అవయవ దానం (Organ Donation)* అంటారు. 

★ అన్న దానం
ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

★ కన్యాదానం
కన్యాదానం వివాహంలో పెళ్ళికూతురు తండ్రి, కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం. వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానం గా కూడా పేరుగాంచింది.

★ భూదానం - గోదానం - సువర్ణ దానం
 వేదకాలంలో వందలలో, వేలల్లో ఆవులను దానం చేసేవారు. వందల ఎకరాలు భూమిని దానం చేసేవారు...
 తరువాతి కాలంలో చక్రవర్తులు, రాజులు, ప్రభువులు ప్రజలకు పశువులను, జీవాలను (గొఱ్ఱెలు, మేకలు మొ౹౹) దానం చేసేవారు. 
మొన్నటి వరకు కూడా భాగ్యవంతులు బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు కూడా దానం ఇచ్చారు. వేల రెట్లు సంపద పొదారు...

క్రైస్తవ, ముస్లీం, బౌద్ధ, హిందూ, యూదా, జైన మొదలగు అన్ని మతలలో, దానం గురించి చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది...

 పురాణాలలో దానం 
◆ వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి. 
◆ బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
◆ శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
◆ కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
◆ ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు.

★ అపాత్రదానం
 మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం.
 దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి.
 దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

★ దాతృత్వం:
 మానవులు దాన గుణం కలిగి వుండడం.
ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.
 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

నేటి యుగంలో, నేటి సామాజిక పరిస్థితులో అన్నిటి కన్నా గొప్ప దానం:
 "విద్య దానం" - "ఉన్నత దానం"
 "జ్ఞాన దానం" - "మహోన్నత దానం"
మీ తోటి వారికి, మీకు తెలిసిన వారికి విద్యా దానం జ్ఞానదానం ఇవ్వండి, ఇప్పించండి. ఎన్నో రెట్ల సంపదను పొందండి. 

"పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...


Wednesday, August 12, 2026

"మన సంస్కృతిలో పసుపు – కుంకుమ ప్రాధాన్యత."

"మన సంస్కృతిలో పసుపు – కుంకుమ ప్రాధాన్యత."

మన సనాతన భారతీయ సంస్కృతిలో కొన్ని వస్తువులు సాధారణంగా కనిపించినప్పటికీ, వాటి వెనుక తరతరాలుగా వస్తున్న గొప్ప ఆధ్యాత్మిక భావం దాగి ఉంటుంది. 

అలాంటి పవిత్రమైన మంగళద్రవ్యాలే పసుపు–కుంకుమలు.

మన ఇంట్లో ఏ పూజ ప్రారంభించినా, వ్రతం ఆచరించినా, శుభకార్యం మొదలుపెట్టినా, దేవతను ఆరాధించినా, సుమంగళిని గౌరవించినా పసుపు–కుంకుమలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

పసుపు మన సంప్రదాయంలో పవిత్రతకు, మంగళత్వానికి, శుభారంభానికి ప్రతీకగా భావించబడింది. 

అందుకే పూజా కార్యక్రమాల్లో పసుపుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

పసుపుతో గణపతి రూపాన్ని తయారు చేసి పూజించే సంప్రదాయం ఉంది. 

అలాగే కొన్ని పూజా విధానాల్లో పసుపుతో గౌరీదేవి రూపాన్ని సిద్ధం చేసి ఆరాధిస్తారు.

సాధారణమైన పసుపుకు దైవస్వరూపాన్ని కల్పించి, మంత్రపూర్వకంగా పూజించడం మన సనాతన ధర్మంలోని దైవభావానికి ఒక అందమైన ఉదాహరణ.

పసుపుతో ముడిపడిన కుంకుమకు కూడా మన సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉంది. 

దేవతకు కుంకుమ సమర్పించడం, పూజలో ఉపయోగించడం, పూజ అనంతరం ప్రసాదంగా స్వీకరించడం వంటి ఆచారాలు మనలో భక్తి, శుభభావనలను పెంపొందిస్తాయి.

నుదుటిపై కుంకుమ ధరించడం కేవలం అలంకారం కాదు; దైవస్మరణతో, మంగళభావంతో జీవించాలనే ఆంతర్యాన్ని గుర్తుచేసే పవిత్ర చిహ్నంగా మన సంప్రదాయం దానికి స్థానం ఇచ్చింది.

మన జీవితంలోని శుభసందర్భాలను గమనిస్తే పసుపు–కుంకుమలు మన ఆచారాల్లో అంతర్భాగంగా కనిపిస్తాయి. 

వివాహం వంటి మంగళకార్యాల్లో, వ్రతాల్లో, పూజల్లో, దేవతారాధనలో, సుమంగళి గౌరవంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 

అందుకే ఇవి కేవలం పూజా సామగ్రి కాదు; మన శుభసంకల్పానికి, మంగళభావానికి, సనాతన కుటుంబ సంప్రదాయానికి ప్రతీకలు.

సుమంగళికి పసుపు–కుంకుమ ఇవ్వడం మన సంస్కృతిలో ఎంతో అందమైన ఆచారం.

ఆమెకు పసుపు–కుంకుమ అందించడం ద్వారా ఆమె జీవితంలో మంగళం, శుభం, సౌభాగ్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 

అందువల్ల ఇది కేవలం ఒక వస్తువును ఇవ్వడం కాదు; ఒక మంగళాశీస్సును అందించడం, మన శుభభావాన్ని పంచుకోవడం.

మన పూర్వీకులు ప్రతి ఆచారానికీ ఒక ఆధ్యాత్మిక భావాన్ని జోడించారు. 

పసుపులో మంగళాన్ని, కుంకుమలో శక్తి–సౌభాగ్య భావాన్ని, అక్షింతల్లో సంపూర్ణతను, దీపంలో జ్ఞానాన్ని, పుష్పంలో భక్తిని దర్శించే ఆధ్యాత్మిక దృష్టిని మనకు అందించారు.

అందుకే పూజా మందిరంలో పసుపు–కుంకుమ కనిపించినప్పుడు వాటిని సాధారణమైన వస్తువులుగా మాత్రమే చూడకుండా, మన పూర్వీకులు తరతరాలకు అందించిన మంగళసంప్రదాయానికి పవిత్రమైన గుర్తులుగా భావించాలి.

పసుపు–కుంకుమలు మన ఇంటి అలంకారం కాదు, మన సనాతన సంస్కృతి అందించిన మంగళానికి చిరునామా. 

మన సంప్రదాయాన్ని తెలుసుకుందాం. 🙏

భక్తితో ఆచరిద్దాం - భావితరాలకు అందిద్దాం. 

✍🏻 వంగల ఆంజనేయ అవధాని

Tuesday, August 4, 2026

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం .

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 
  
   కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 
           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు . అవి 
    1 . కోష్ఠశ్రీత కామల .
 
    2 . శాఖాశ్రీత కామల .
    3 . కుంభ కామల 
      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 
  వ్యాధి లక్షణాలు -
     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 
  1 . కళ్లు పసుపు రంగులో ఉంటాయి.
   2 . శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 
   3 . అన్నం తినాలనిపించదు.
   4 . వాంతులు అవుతాయి.
   5 . కొంతమందిలో దురద వస్తుంది . 
   
  పాటించవలసిన ఆహారనియమాలు -
    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.
  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం - 
 * నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.
 * నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 
 * తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 
 * ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 
 * కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 
 * త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.
 * చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.
        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 
  

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.

                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 

             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.

       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

 రవి -

   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.

 చంద్రుడు -

   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .

 కుజుడు -

    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .

 బుధుడు -

    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .

 గురుడు -

     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.

  శుక్రుడు -

     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .

  శని -

     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .

         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  

  

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 

      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 

              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 

 గమనిక - 

    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 
ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .

  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 

  

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట .

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట . 
 
 శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి. మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరమున గల లక్షణములను తనచలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీపరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.
     
శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి 
   *  భూతనాడి .
   *  వాతనాడి .
   *  పిత్తనాడి .
   *  శ్లేష్మనాడి . 
   *  గురునాడి . 
       
       ఆహారవిహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలెనే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల మూలము వలనే రోగనిర్ధారణ చేయవచ్చు.
     
       ఏ రోగము నందు అయినను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షించవలెను. బొటనవ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి , ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును. వాతపిత్తశ్లేష్మనాడులు యే రోగనిర్ణయముకు ఆధారభూతములు . వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .
       
      ఒక్కోసారి రోగ లక్షణములును బట్టికూడా వైద్యం చేయవచ్చు . శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అయ్యి వృద్ధినొందునచో గుండె యెక్క కార్యక్రమము చెడుపుచున్నది అని గ్రహించవలెను. ఇది చాలా అనుభవము నందు అలవడును . 

నాడి పరీక్షించు విధానం -
       
     వ్యాధిగ్రస్తుని చేతిని పట్టుకొని మెటికలు విరిచి బొటనవేలు ప్రక్కన , మణికట్టు దాటియున్న స్థలమున నాడి పరీక్షించవలెను. 
పురుషులకు కుడిచేతిని , స్త్రీలకు ఎడమచేతిని పరీక్షించవలెను. అందులో 3 నాడులు పలుకుచుండును. మొదటి నాడి వాతమును , రెండోవది పిత్తమును , మూడొవది శ్లేష్మమును తెలుపును. ఇందులో యేది ఎక్కువ ఉదృతముగా ఉన్నచో ఆ ధాతువు ఎక్కువ ఉన్నది అని తెలుసుకొనవలెను. 
 
వైద్యుడు గమనించవలసిన ముఖ్యవిధి  - 
 
   వైద్యుడు వ్యాధిగ్రస్తునకు మందు ఇచ్చుటకు పూర్వము అతని వయస్సు , వృత్తి , వ్యాధి ఎప్పటినుంచి ఉన్నది , శరీరతత్వము , మల,ముత్ర విసర్జన క్రమము , నాడి మొదలగు వాటిని చక్కగా తెలుసుకొని వయస్సును అనుసరించి మందు ఇవ్వవలెను. 
  

  

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. -

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. - 
 
* బ్రాహ్మము - 
     
మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు  ధరింప చేసి పూజించి  కన్యాదానం చేయుట వరదక్షిణం  అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.
 
 * దైవ వివాహం - 
  
  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .
 
 * ఆర్షం - 
    
ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.
 
* ప్రాజాపత్యం - 
      
 నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .

 * రాక్షసం - 
     
 కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .
 
 * అసురం - 
        
 ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,
కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.
 
 * గాంధర్వం - 
      
 ప్రేమించి పెళ్లి చేసుకోవడం  .
 
* పైశాచికం - 
   
దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.
 
అష్టవిద నాయకలు -
 
* ప్రోషిత భర్త - 
 
    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.
 
* ఖండిత - 
 
ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేషించునది. 
 
 * కలహంతరత - 
   
    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.
 
 * విప్రలబ్ద -
    
ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.
  
* వాసవ సజ్జిక - 
  
భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .
  
* స్వాధీన పతిక - 
    
భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.
 
 * అభిసారిక -
  
బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.
 
 * వరిహోత్కంటిక - 
      
ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.

 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.

 వివాహం - 
 
స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .

 వివాహానికి శుభమైన వారములు. - 
 
 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.
 
వివాహానికి తిధులు - 

 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.

 వివాహానికి సరైన నక్షత్రాలు. - 
 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు  రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .

 వివాహ యోగములు - 
 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పూర్తిగా వర్జించవలెను . మిగిలిన వాటిలో శుభయోగములను తీసుకొనుట ఉత్తమము.

 వివాహ కరణములు -

 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.

 వివాహ లగ్నం -
  
వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.
 
వివాహనికి మాసములు - 

 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .