Monday, February 2, 2026

లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?


లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఎంతో అందంగా వివరించారు. దాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక చక్కని కథను పంచుకున్నారు.

మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.

ఈ పట్టణంలో అతి పెద్ద అల్లరి చేసే వ్యక్తి — కొలెస్ట్రాల్.

అతనికి కొన్ని సహచరులు కూడా ఉన్నారు. అతని ప్రధాన సహచరుడు — ట్రైగ్లిసరైడ్.

వీళ్ల పని ఏమిటంటే… వీధుల్లో తిరుగుతూ గందరగోళం సృష్టించడం, రోడ్లను బ్లాక్ చేయడం.

ఈ పట్టణానికి కేంద్ర భాగం — గుండె (Heart).
అన్ని రోడ్లు గుండె వైపే వెళ్తాయి.

ఈ అల్లరి మూకలు పెరిగితే ఏమవుతుందో ఊహించవచ్చు.
వీరు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.

కానీ మన శరీర పట్టణంలో ఒక పోలీస్ బలగం ఉంది — HDL (మంచి కొలెస్ట్రాల్).

ఈ మంచి పోలీస్ అల్లరి చేసే వారిని పట్టుకుని జైలులో ( కాలేయం – Liver ) వేస్తాడు.

ఆ తర్వాత కాలేయం వారిని శరీరం నుంచి బయటకు పంపుతుంది — మన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా.

కానీ ఒక చెడు పోలీస్ కూడా ఉన్నాడు — LDL (చెడుకొలెస్ట్రాల్).

ఈ LDL ఏమి చేస్తాడంటే…
జైలులో ఉన్న నేరస్తులను బయటకు తీసి మళ్లీ వీధుల్లో వదిలేస్తాడు.

మంచి పోలీస్ అయిన HDL తగ్గిపోతే,
మొత్తం పట్టణం గందరగోళంగా మారుతుంది.

అలాంటి పట్టణంలో ఎవరు జీవించాలని కోరుకుంటారు?

👉 ఈ నేరస్తుల సంఖ్య తగ్గించి, మంచి పోలీసుల సంఖ్య పెంచాలనుకుంటున్నారా?

👉 నడక ప్రారంభించండి (Walking)!

మీరు వేసే ప్రతి అడుగుతో —
 • HDL పెరుగుతుంది
 • కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు, LDL తగ్గుతాయి

మీ శరీరం (పట్టణం) మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది.

మీ గుండె — పట్టణ కేంద్రం —
ఈ నేరస్తుల వల్ల వచ్చే హార్ట్ బ్లాక్ నుంచి రక్షణ పొందుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటే,
మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా — నడక మొదలుపెట్టండి!

🌿 ఆరోగ్యంగా ఉండండి…
🌿 మంచి ఆరోగ్యం మీకు కలగాలని ఆకాంక్షిస్తున్నాం


ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచి, LDL (చెడుకొలెస్ట్రాల్) తగ్గించే ఉత్తమ మార్గం — నడక అని చెబుతుంది.

👉 ప్రతి అడుగు HDL‌ను పెంచుతుంది.
👉 కాబట్టి ముందుకు సాగండి… కదులుతూనే ఉండండి.

హ్యాపీ సీనియర్ సిటిజన్స్ వీక్ 🎉


🔻 ఇవి తగ్గించండి:
 1. ఉప్పు
 2. చక్కెర
 3. మైదా (వైట్ రిఫైన్డ్ ఫ్లోర్)
 4. పాలు మరియు పాల ఉత్పత్తులు
 5. ప్రాసెస్డ్ ఆహారాలు


🔺 ఇవి ప్రతిరోజూ తినండి:
 1. కూరగాయలు
 2. పప్పులు
 3. బీన్స్
 4. గింజలు (నట్స్)
 5. చల్లగా పిండిన నూనెలు (Cold Pressed Oils)
 6. పండ్లు


🧠 మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:
 1. మీ వయస్సు
 2. మీ గతం
 3. మీ లోపాలు


❤️ స్వీకరించాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:
 1. కుటుంబం
 2. స్నేహితులు
 3. సానుకూల ఆలోచనలు
 4. శుభ్రంగా, ఆహ్వానించేలా ఉండే ఇల్లు


🙂 అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:
 1. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి
 2. మీ సామర్థ్యానికి తగినంత శారీరక వ్యాయామం చేయండి
 3. బరువును పరిశీలించి నియంత్రించండి


🌱 స్వీకరించాల్సిన ఆరు ముఖ్యమైన జీవన అలవాట్లు:
 1. దాహం వేయే వరకు నీరు తాగకుండా ఉండకండి
 2. అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోకుండా ఉండకండి
 3. అనారోగ్యం వచ్చే వరకు వైద్య పరీక్షలను వాయిదా వేయకండి
 4. అద్భుతాల కోసం ఎదురు చూడకండి — దేవునిపై నమ్మకం ఉంచండి
 5. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు
 6. సానుకూలంగా ఉండండి — మంచి రేపటి మీద ఆశ ఉంచండి

Tuesday, January 27, 2026

ధర్మ సందేహాలు - సమాధానాలు .

ధర్మ సందేహాలు - సమాధానాలు . 

 * వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?
 
భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.
 
* ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?
 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక 4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 * సప్త సంతానములు అంటే ఏమిటి ?
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
* తొమ్మిది రకాల ఆత్మలు ఏవి ?
 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 * పదిరకాల పాలు ఏవి ?
 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 * యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?
 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 * అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?
 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.
 
* గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?
 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.
 
* వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు.
 
కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
 
నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
 
మామిడి పండు. - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
 
అంజూర పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
 
సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
 
యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
 
కమలా పండు. - భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 * పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?
 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం .

 * దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?
 
శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 * తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?
 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 * శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?
 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.
 
* నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?
 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .
  * ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు .
 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .
 2. స్మశాన భూమికి సమీపం లొను .
 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .
 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .
 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .
 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 
 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .
 
* పుజాంగాలు ఎన్ని రకాలు ?
 పుజాంగాలు 5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .
  
 * ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?
 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 * గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?
 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 * వివిధ జన్మలు ఏవి ?
 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .
 * శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.
 * ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?
 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై జోడించి నమస్కరించాలి.
 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
  * శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?
 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 * ధర్మం అంటే ?
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"
 
* సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?
 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.
 
* దేవతా లక్షణాలు ఏవి ?
 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 * నవ వ్యాకరణాలు అనగా ఏవి ?
 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .
 
* శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?
 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .
 
* పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు 
 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
         
     ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .
 
* శ్రీ వారి సుప్రబాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?
 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 * పంచ కోశాలు అంటే ఏమిటి ?
 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .
 * శౌచమంటే ఏమిటి ?
 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 
 1. బాహ్య శౌచం.
 2. అంతః శౌచం .
 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.
 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 * ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?
 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.
 
* రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?
 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 * పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?
 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.
 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.
 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.
 పదనాలుగు లోకములలో ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం. ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.
 ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.
 తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.
 పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.
 పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.
 పన్నెండో వది అయిన మహాతలం లొ క్రదువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .
 పదమూడవధి అయిన రసాతలం లొ "పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .
 పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.
 
* శరీరానికి సంభందించిన వివిధ అగ్నులు ఏవి ?
 1. క్షుధాగ్ని.( ఆకలి బాధ ). 2. క్రొధాగ్ని ( కొపం ).
 3. కామాగ్ని.( కొరిక ). 4. జట రాగ్ని 
 * అక్షౌహిణి అంటే ఏమిటి ?
 కురుక్షేత్రంలో 18 రోజులు జరిగిన యుద్దంలో కౌరవ పక్షాన 11 అక్షౌహిణి ల సైన్యం , పాండవుల పక్షాన 7 అక్షౌహిణి ల సైన్యం పాల్గోనినట్లు భారతంలో ఉంది. ఒక్క అక్షౌహిణి లొ 21, 870 రధాలు, అంతే సంఖ్యగల ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09350 పదాతి దళాలు ఉండేవి . వీటి సముచ్చయాన్ని ఒక్క అక్షౌహిణి అనేవారు.
 
* ఎటువంటి నీటిని తాగితే దుష్ట పీడలు నశిస్తాయి 
 1. భగవంతుడికి అభిషేకం చేసిన నీటిని,
 2. అర్ఘ్యము ఇవ్వగా మిగిలిన జలమును,
 3. ఆచమనము ఇచ్చిన జలమును,
 4. పాదోదకము ను సేవించినవారికి సర్వ తీర్ధాలలో ను స్నానం ఆచరించినంత పుణ్యం కలుగుతుంది. అన్ని తీర్దాలలోని జలంతో దేవుడుకి అభిషేకం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు. పైన పేర్కొన్న జలమును సేవించిన వారికి సర్వపీడలు సమసిపోతాయి.
 
* ద్వాదశ భిక్షాటన ఉపాయాలు ఏమిటి ?
 1. బిగ్గరగా అద్యయనం చేయడం . 2. పురాతన గాధలు చెప్పడం. 3. ఆడవారితో మాట్లాడటం. 4.పిల్లల్ని లాలించడం. 5. ఆడవారి వంటావార్పు స్తుతించడం. 6. వారి భర్తలను స్తుతించడం . 
 7. దీనత్వం ప్రదర్శించడం. 8. అంగవైకల్యం. 
 9. సాముద్రికం. 10. జ్యోతిష్యం . 11. చిట్కా వైద్యం. 12. గారడీ మంత్ర బాల విద్యలు.
 
* ఎన్ని సంవత్సరాలు కలిస్తే మహాయుగం అవుతుంది ?
 మనందరకి తెలిసిన యుగములు నాలుగు. అవి
 1. కృతయుగం - 17,20,000 సంవత్సరాలు.
 2. త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు.
 3. ద్వాపర యుగం - 8, 64,000 సంవత్సరాలు .
 4. కలి యుగం - 4,32,000 సంవత్సరాలు.
   ఈ విధంగా మొత్తం నాలుగు యుగాలు కలిస్తే 
43,12,000 సంవత్సరాలు అవుతాయి. ఈ నాలుగు యుగాలు కలిసిన కాలమే ఒక మహాయుగం అవుతుంది.
 
* ఏయే అవయవాల యందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించాలి ?
 శిఖ యందు 1. కం టం నందు 32, చేతుల యందు 12, తలకి 45, ఒక్కో చెవికి 6 రుద్రాక్షలు చొప్పున ధరించాలి. ఈ విధంగా సంఖ్యను అనుసరించి రుద్రాక్షలు ధరించి , నియమ నిష్టలతో పరమేశ్వరునిని పుజించి నట్లయితే వారికి అనంతమైన ఫలం దక్కుతుంది అని రుద్రాక్ష శాస్త్రము చెబుతుంది. అంతేకాకుండా 1000 రుద్రాక్షలను ధరించిన వారికి దేవతలు కూడా నమస్కరిస్తారు అని చెబుతుంది.

 * రాక్షసులతో సమానులు ఏవరు ?
 1. రాజాజ్ఞ మీరినవారు.
 2. ఆధారం లేక అప్పు చేసినవారు.
 3. తనంతటి వాడు లేడని గర్వించేవాడు .
 4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.
 5. చేసిన ఉపకారాన్ని మరిచేవాడు.
 6. ఆడదాని మాటలు విని కలహించేవాడు.
 7. నమ్మించి మోసగించేవాడు.
 8. స్త్రీని బలాత్కారంగా అనుభవించేవాడు.
 9. నిరసంగా పరిహసించువాడు .
 10. సభకు విగ్నం కలిగించువాడు.
 11. పురుషుని అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .
 12. హంతకుడు.
 * స్పటిక మాలను గృహస్తులు ధరించావచ్చా ?
 స్పటికమాలను గృహస్తులు ధరించరాదు అని శాస్త్రం చెబుతుంది.

 * అర్జునిడికి గల దశానామాలు ఏవి ?
 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్ధుడు. 
 4. కిరీటి . 5. శ్వేత వాహనుడు. 6. భీభత్సుడు 
 7. విజుయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి.
 10. ధనుంజయుడు.
  గణపతి అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా పూజించాలి ?
 ఎట్టి విఘ్నాలు లేకుండా సర్వ కార్యాలు విజయవంతం అవ్వడానికి శీఘ్రమే గణపతి అనుగ్రహం పొందటానికి ప్రతి ఒక్కరూ వినాయకుడ్ని ఈ విధంగా ధ్యానించి పూజించాలి .
    సమస్త గణాలకు అధిపతి అయిన పార్వతీ నందనా ! సకల సౌభాగ్యాలు, సిద్ధులు ప్రసాదించే ఏకదంతం కలవాడా ! గజ ముఖం కలిగిన వాడా !
 మూషిక వాహనా ! నీవు కుమారస్వామికి గురువువి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. అని ధ్యానించి భక్తి, శ్రద్దలతో పూజ ప్రారంబించాలి. అలా పూజించిన వారికి గణపతి అనుగ్రహము శీఘ్రమే లభిస్తుందని మహేశ్వరుడు మహా శివపురాణం లొ చెప్పాడు.

 * మనోదోషములు ఎన్ని ?
 1. కామము. 2. క్రోధము. 3. లోభము. 
4. మోహము 5. మదము. 6. మాత్స్చార్యము .
 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసుయ 
 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 * భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?
 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .
 1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .
 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .
 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.
 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.
 * ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?
 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 
     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు. శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .
    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.
  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.
 
* నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?
 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .
 
* రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.

 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 
 
* అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా చేస్తే పాపం అంటుతుంది.
 
* ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.
 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో మాత్రమే చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.
             
    

Tuesday, January 20, 2026

సర్వరోగ నివారిణి.శొంఠి...

సర్వరోగ నివారిణి.
శొంఠి..._*
*_అల్లం పై పొట్టు ని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది._*

*_శొంఠిని సంస్కృతంలో ‘మహా ఓషది’ ‘విశ్వభేషజ’ అని కూడా అంటారు._*

*_ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి._*

*_దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి‘మహా ఓషది’ అని అర్థం వచ్చేటట్లుగా ‘విశ్వభేషజ’ అని నామకరణం చేశారు._*

*_ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది._*

*_దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది._*

*_మానవునిలో జీవనశక్తిని (వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది._*

*_కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది._*

*_మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది._*

*_పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది._*

*_శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది._*

*_ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది._*

*_దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి._*

*_ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది._*

*_జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదుగా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది._*

*_అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది._*

*_కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాదుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది._*

*_ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి._*

*_రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును._*

*_పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది._*

*_మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైన్ధవ లవణం కలిపి తీసుకుని పల్లెరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది._*

*_నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి._

Monday, January 19, 2026

భారతీయ జాతీయ చిహ్నంలో ఎద్దు .గో సాంప్రదాయంతో ముడిపడి ఉండి భారతావనిలో గో సంతతిని రక్షించుకోలేని అసహాయ స్థితిలో భారతీయులు

జై గోమాత

 భారతీయ జాతీయ చిహ్నంలో ఎద్దు .గో సాంప్రదాయంతో ముడిపడి ఉండి భారతావనిలో గో సంతతిని రక్షించుకోలేని అసహాయ స్థితిలో భారతీయులు

భారత జాతీయ చిహ్నంలో ప్రాముఖ్యంగా కనిపించే నాలుగు ధర్మ జంతువులలో ఒకటి ఎద్దు (Bull).

 ఇది కేవలం జంతువు కాదు — ఇది భారతీయ నాగరికత, వ్యవసాయ సంస్కృతి, వేద సంప్రదాయం, మరియు ధర్మదృష్టిలో ఒక ఆదిమ చిహ్నం

ఎద్దు అంటే:

గో వంశానికి చెందినది
శక్తి, స్థిరత్వం, ధైర్యం
సస్యశ్యామలతకు మూలాధారం
యజ్ఞ–గో–కృషి సంస్కృతి ప్రతీక
పురావస్తు కోణం: సార్నాథ్ అశోక స్తంభంలోని ఎద్దు

అశోకుడి సింహస్తంభం (క్రీ.పూ. 250):

సింహం
గుర్రం
ఏనుగు
ఎద్దు
ఈ నాలుగు ధర్మ-మార్గ విస్తరణను సూచిస్తాయి.

ఎద్దు రూపం పూర్తిగా భారతీయ గోకుల సంప్రదాయం ఆధారంగా ఉంటుంది

 ఇది “బలి” జంతువు కాదు

  ఇది “ఆహార” సంకేతం కాదు

 ఇది “పరిపాలన-మోక్ష-యజ్ఞ” చక్రానికి మూలం

అంటే, చిహ్నంలోని ఎద్దు గో వంశ ప్రతీక.

వేదాల ప్రకారం:

గో = జీవన మూలం
గో = ధర్మం నిలబెట్టేది
గో = అహింస రూపం
గో = కృషి–యజ్ఞానికి ఆధారం
పురాణాలు గోమాతను:

ధర్మస్వరూపిణి
పంచయోగ మూలం
భూదేవి రూపం
సమృద్ధి లక్ష్మి స్థానం
గా చెప్పాయి.

ఎద్దు భారతీయ చిహ్నాల్లో:

ఋతువుల చక్రం
ఋగ్వేద యజ్ఞచక్రం
పంట–వర్ష–ప్రకృతి–సస్యశ్యామలత
ధర్మాన్ని నిలబెట్టే శ్రమ
అనే 4 వ్యవస్థలను సూచిస్తుంది.

అశోక చిహ్నం కూడా అదే నాలుగు దిక్కులను సూచిస్తుంది.

ధర్మచక్రం (చక్రాన్ని) నాలుగు జంతువులు భౌతిక ప్రపంచం నుండి పైకి లేపుతున్నట్టు చూపుతుంది.

అందువల్ల:

👉 ఎద్దు = ధర్మచక్రం స్థిరత్వానికి ప్రతీక

అశోక చక్రం — నైతిక ధర్మం

 ఎద్దు — జీవ వ్యవస్థల ధర్మం

అంటే:

జాతీయ చిహ్నం = నీతిధర్మం + జీవధర్మం కలయిక

అందువల్ల ఎద్దు → గోమాత తల్లితత్వం కాదు కానీ గోసంస్కృతికి ప్రతీక.

 అటువంటి సంస్కృతి గోసంతతిని కాపాడుకోలేని భారతీయ రాజకీయ వ్యవస్థ, ధర్మ బోధన చేసే పీఠాధిపతులు మఠాధిపతులు, హిందూ సమాజం సిగ్గు పడవలసిన తరుణం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భారతీయ జాతీయ చిహ్నానికి వన్నె తెస్తారని ఆశిద్దాం.

 గోమాతను రక్షించుకుందాం... భూమాతను కాపాడుకుందాం

 గోరక్ష జగద్రక్ష

గో-ఆధారిత వ్యవసాయం నీటి మట్టం పెంచుతుందనే విషయం శాస్త్రీయంగా నిరూపితమే.

జై గోమాత

గో-ఆధారిత వ్యవసాయం నీటి మట్టం పెంచుతుందనే విషయం శాస్త్రీయంగా నిరూపితమే.

గో-సంతతి వల్ల భూగర్భజలాలు పెరగడానికి 4 శాస్త్రీయ కారణాలు

గోమయ–గోమూత్రం వల్ల Soil Organic Carbon (SOC) పెరుగుతుంది

soil porosity ↑
infiltration rate ↑
percolation ↑
water-holding capacity ↑
మట్టిలో organic carbon 0.5% → 1.0% కి పెరిగితే

 నీటి నిల్వ సామర్థ్యం 20,000–40,000 లీటర్లు/ఎకరా పెరుగుతుంది

 (FAO & ICAR data-based accepted range).

గోమయ మైక్రోబయాలజీ → Soil aggregation → Deep percolation

గోమయంలో 60+ microbial species ఉంటాయి:

Bacillus
Lactobacillus
Streptomyces
Cellulolytic bacteria
ఇవి మట్టిలో aggregate formation చేపిస్తాయి.

Aggregation వల్ల:

 ✔ micro-pores + macro-pores ఏర్పడి

 ✔ నీరు వెంటనే 2–5 అడుగుల లోతు వరకు దిగుతుంది

 ✔ అక్కడినుంచి aquifer కు చేరే వేగం పెరుగుతుంది

ఇది chemical fertilizers చేయలేని పని. 

గో ఆధారిత వ్యవసాయంలో Tillage తగ్గుతుంది → Soil structure కాపాడుతుంది

Desi cow–based natural farming:

deep tillage లేదు
soil compaction తగ్గుతుంది
capillary breakages తగ్గి
percolation pathways సురక్షితం
దీంతో rainwater → root-zone → vadose zone → aquifer ప్రవాహం 20–40% వేగం పెరుగుతుంది.

 గోచరణ భూములు → Natural recharge zones
ఎక్కడ గోవులు తిరుగుతాయో అక్కడ:

dung → infiltration పెంచుతుంది
hoof marks → micro-water infiltration pits
urine → microbial activation
 ఇవి మొత్తం mini-recharge structures లాంటివి.
ఒక గోవు రోజుకు సుమారు 20–25 లీటర్లు మూత్రం విడుదల చేస్తుంది.

 ఇది soil-microbes ను activate చేసి infiltration tremendous గా పెంచుతుంది.

మొత్తం ప్రభావం: 1 ఎకరాకు నీటి మట్టం ఎంత పెరుగుతుంది?
శాస్త్రీయంగా లెక్కిస్తే:
గోసంస్కృతి ఆధారిత natural farming ఉన్న భూమిలో:

Water Recharge Increase = 15% → 60% మధ్య
(FAO, ICAR-NBSS, ICRISAT field studies నుండి సేకరించిన డేటా)

అంటే ఒక ఎకరా భూమిలో సంవత్సరానికి 20–45% ఎక్కువ నీరు మట్టిలోకి దిగుతుంది.
Rough estimation (1 acre):
పొలానికి సంవత్సరానికి వర్షపాతం 700 mm అంటే:

total water = 28 లక్షల లీటర్లు/acre
10% recharge = 2.8 లక్షల లీ
30% recharge = 8.4 లక్షల లీ
40% recharge = 11+ లక్షల లీ
గో ఆధారిత వ్యవసాయం 2–4 రెట్లు recharge ను పెంచగలదు.

 రైతుకు వెన్నుముక గోమాత. సకాలంలో నీరు లేక వర్షాలు పడక రసాయనికి వ్యవసాయంలో అసువులు కోల్పోతున్నారు. గోమాతను రక్షించుకుని భూమాతను కాపాడుకుంటే గ్రామీణ రైతు రాజ్యం ఏర్పడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

 గోమాతను రక్షించుకుందాం భూమిలో నీటిమట్టం పెంచుకుందాం

 గోరక్ష జగద్రక్ష

 ధర్మస్య జయోస్తు

గోరక్షణ చట్టాలను బలపర్చడానికి అత్యంత స్పష్టమైన, ప్రత్యక్ష రాజ్యాంగ ఆధారం — Article 51A(g).”

జై గోమాత

“గోరక్షణ చట్టాలను బలపర్చడానికి అత్యంత స్పష్టమైన, ప్రత్యక్ష రాజ్యాంగ ఆధారం — Article 51A(g).”

ఇది రాజ్యాంగం పౌరునికే కాదు,

రాష్ట్ర ప్రభుత్వాలకు, మత సంస్థలకు, సమాజానికి కూడా విధించిన ధర్మబాధ్యత.

ఎందుకు Article 51A(g) గోరక్షణకు బలమైన రాజ్యాంగ ఆధారం?

ఆర్టికల్ 51A(g) ప్రకారం:

“ప్రాణిమాత్రాల పట్ల కరుణ చూపాలి.”
గోవు ప్రాణి మాత్రమే కాదు —

 సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా విలువైన జాతీయ సంపద.

అందువల్ల గోరక్షణ చేయడం, గోమాతపై హింసను నివారించడం —

 రాజ్యాంగపరమైన పౌర ధర్మం.

ప్రతి జంతువు జీవించడానికి హక్కు కలిగివున్నది.”
✔ “మానవులు జంతువులపై కరుణ చూపాలని 51A(g) ఆజ్ఞాపిస్తోంది.”
✔ “జంతువుల పట్ల హింసను ప్రభుత్వాలు నివారించాలి.”
✔ “గోరక్షణలో రాష్ట్రాలు విఫలమైతే — అది 51A(g) ఉల్లంఘన.”
చాలా తీర్పుల్లో Article 51A(g) ను కావాల్సిన గోరక్షణ చర్యలకు న్యాయబలముగా ఉపయోగించారు.

 ప్రభుత్వం గోరక్షణ చట్టాలు చేయడానికి ఇది నేరుగా ఆధారం
ఆర్టికల్ 246(3) వల్ల రాష్ట్రాలు గోరక్షణ చట్టాలు చేయాల్సి ఉంటుంది.

 అవి బలపడేందుకు 51A(g) మౌలిక నైతిక–రాజ్యాంగ–సామాజిక ఆధారం ఇస్తుంది.

అందువల్ల రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చు:
పశువులను వదిలేయడంపై కఠిన శిక్షలు
గోశాల రిజిస్ట్రేషన్ తప్పని సరి
stray cattle rehabilitation
పశు వైద్య సహాయం
పంచగవ్య ఆధారిత వ్యవసాయం ప్రోత్సాహం
అక్రమ రవాణా నియంత్రణ
వృద్ద ఆవుల రక్షణ
ఇవి చేయడానికి 51A(g) న్యాయపరంగా బలపరుస్తుంది. 

జంతుహింసను తగ్గించడానికి ప్రభుత్వాలు బలవంతంగా వ్యవహరించవచ్చు
Article 51A(g) ను ఆధారంగా తీసుకుని ప్రభుత్వాలు:

tighter rules
stricter penalties
scientific cattle management
animal welfare boardsకు బలం
గోశాలలకు గ్రాంట్స్
ఇవన్నీ తీసుకోవచ్చు — కోర్టులు కూడా అంగీకరిస్తాయి.

 ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రాజ్యాంగబద్ధమైన గోరక్షణ చట్టాలను అమలు చేసి మన జాతీయసంపదను కాపాడతారని ఆశిద్దాం

 గోమాతను రక్షిద్దాం భూమాతను కాపాడుదాం

 గోరక్ష జగద్రక్ష

 ధర్మస్య జయోస్తు

గోవత్స ద్వాదశి యొక్క ఆధ్యాత్మిక సాంకేతికత

జై గోమాత

గోవత్స ద్వాదశి యొక్క ఆధ్యాత్మిక సాంకేతికత

స్కాంద పురాణ మూల భావం
(సారాంశ రూపంలో)

“యః పూజయేత్ గోవృశభౌ ద్వాదశ్యాం కార్తికేఽనలే।

 స ధాన్యపురుషో భూయాత్ స పుత్రపౌత్రవాన్భవేత్॥”

అర్థం:

 కార్తీక ద్వాదశి నాడు ఆవు–పిల్లను పూజించే వాడు

 ధాన్యసమృద్ధిని పొందుతాడు

 పుత్ర–పౌత్ర సంపదను పొందుతాడు.

స్కాంద పురాణం ప్రకారం:

గోవును (ఆవు) పూజించడం అన్నదాత అయిన భూమాతను పూజించినందుకు సమానం.
గోవత్సం (ఆవు పిల్ల) పూజించడం వంశ పరంపర నడవడానికి దైవిక ఆశీర్వాదం.
కార్తీక శుక్ల ద్వాదశి నాడు ఈ పూజ చేస్తే “ధాన్యవృద్ధి” (అన్న/ఆహార సంపద)
 మరియు “సంతానాభివృద్ధి” (సంతాన సఫలం) అనుగ్రహంగా లభిస్తాయి.
ఆవు మనిషికి ఆహార–వ్యవసాయ చక్రంలో మూలాధారం

 గోమయం, గోమూత్రం గ్రామీణ వ్యవసాయంలో ఫలసారాన్ని పెంచుతాయి

 పంచగవ్య పంటలలో ధాన్య ఉత్పత్తిని పెంచుతుంది

 ➡ అందువల్ల స్కాంద పురాణం దీనిని “అన్నవృద్ధి” సంకల్పంగా పేర్కొంది

గోవును సంతానలక్ష్మి స్వరూపిణి అని శాస్త్రాలు పేర్కొంటాయి.

గోవత్సం (ఆవు పిల్ల) అంటే “జీవకోటి పరంపర” సూచకత్వం.

ఈ రోజు బాలకృష్ణుడు గోపాలకుడుగా గోవులతో క్రీడించిన రోజు.

 ➡ అందుకే వంశ, సంతానాభివృద్ధి ప్రధాన ఫలితంగా పేర్కొనబడింది.

గోమాత – శక్తి ఫీల్డ్ (Bio-electromagnetic resonance)
ఆధునిక పరిశోధన చెబుతుంది:

పశువుల గుండె ధడకలు
వాటి శరీరపు చెమట →
 పాజిటివ్ “Resonance Field’’ సృష్టిస్తుంది.
 ఈ రోజున గోవులకు అలంకరణ & పూజ → ఈ field మరింత బలపడుతుంది.
2. భూయజ్ఞం
గోవులతో మనిషి-భూమి మధ్య bio-cycle:

గోమయం → ప్రాణవాయువు (Oxygen microbes) పెంచుతుంది
గోమూత్రం → నేలకు nitrogen fixers
గోవుల మేత → భూలోకంలోని శక్తి చక్రం
దీనిని అగ్ని–భూమి–జలం చక్రం అంటారు.



3. ఆరోగ్య సాంకేతికత (Traditional Veterinary Science)
గోవత్స ద్వాదశి శరదృతువు తర్వాత వచ్చే కాలం.

 ఈ సమయంలో:

శరీర ఉష్ణత తగ్గుతుంది
రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది
అందుకే ఈ రోజున:

నెయ్యి
బెల్లం
మజ్జిగ
ఆయిల్ మసాజ్
ఇవన్నీ తప్పనిసరిగా చేస్తారు.

 గోమాతను రక్షించుకుందాం భూమాతను కాపాడుకుందాం

 గోరక్ష జగద్రక్ష

 ధర్మస్య జయోస్తు