Tuesday, April 29, 2025

గాయత్రీ మంత్రమనేది

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

  కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

 నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

 

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

 

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

 ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

 గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

 1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

 2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

 3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

 4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

 5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

 7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

 8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

 9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

 10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

 11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత 
 “న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

 
యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

From Whatsapp

Friday, April 25, 2025

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 
  
•. పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని - 
      
సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.
  
• పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం -
     
      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 
        
. ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .
           
. వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి . 


గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .

గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .
    
వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవు ని తల్లిలా భావించిన మన పూర్వికులు పూజించుట యే కాకుండా ఆవు కు సంబంధించిన వుత్పత్తులలోని గొప్పతనాన్ని తెలుసుకుని గ్రంధస్తం కూడా చేశారు అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. కొన్ని పురాతన గ్రంథాల నుండి ఆ వివరాలు సేకరించాను అవి మీకు తెలియచేస్తాను 

• ఆవుపాలు  

  ఇవి మధురంగా సమ శితోష్ణము గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

 • ఆవుపెరుగు -  

గర్భిణి స్త్రీకి వరం .  
                   వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

 • ఆవు వెన్న - 
              
ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

 •. ఆవునెయ్యి - 
             
. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

 • ఆవుపేడ - 
             
  ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.
 
• గుధస్తానంలో తిమ్మిరి కొరకు - 
             
ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .
 
• వంటి దురదలకు - 
               
 అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి . 

 • కడుపులోని క్రిములకు - 
              
 20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.
                  ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .
 
• ఆవుముత్రం - 
 
  ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి . 

 • గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

 * వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.
 
* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

 * ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

 * ప్రతిరోజు ఉదయమే గోమూత్రమును 30 గ్రా మోతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది. 


క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -

క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -
      
   క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను. 
    
    ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి 
           
. 1 - బాహ్యక్రిములు . 
             2 - అభ్యంతరములు . 
     త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి. 
          
. ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .  
            
. ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.  
        మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును . 
            మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును . 
      అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును . 
          క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను . ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 
      జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను . 
  
          ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును. మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును. 
     
  కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి 
  * ఆంత్రాదములు - 
         ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును. 
  * ఉదరావేష్టములు - 
         ఇవి కడుపున చుట్టుకుని ఉండును. 
 * హృదయాదములు - 
         ఇవి హృదయము నందు తిరుగుచుండును. 
 * మహాగుదములు - 
        ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును. 
 * భుఱువులు . 
 * దర్భ కుసుమములు - 
          ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును. 
 * సుగంధములు -  
         ఇవి సుగంధము కలిగి ఉండును. 
        కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును. 

  రక్తజ క్రిమి లక్షణము - 
       రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు. 
       ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి 
 * కేశాదములు - 
          ఇవి తల వెంట్రుకలను నశింపచేయును . 
 * రోమ విధ్వంసకములు - 
         ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును . 

 * రోమద్వికములు - 
        ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును . 
 * ఉదుంబరములు 
 * సౌరసములు . 
 * మాతలు .  
    
    ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు. 
     
. పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము . ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును. అవి 
  
. * కకేరుకములు . 
   * మకేరుకములు . 
   * సౌసుదాములు . 
   * లేలిహములు . 
   * సశూలములు . 
     
 ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును. 
                
. సమాప్తము.

Tuesday, April 22, 2025

లిపిడ్ ప్రొఫైల్

**లిపిడ్ ప్రొఫైల్**  
*అద్భుతంగా వివరించబడింది*  
ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు.  

**మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.** ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్*. వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు. ప్రధాన సహచరుడు *ట్రైగ్లిసరైడ్*. వారి పని ఏమిటంటే, రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం, మార్గాలను అడ్డుకోవడం.  

*హృదయం* ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్. అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి. ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.  

కానీ మన శరీర-పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.  
*HDL* మంచి పోలీస్, ఇబ్బంది కలిగించేవారిని అరెస్ట్ చేసి జైలులో (కాలేయం) ఉంచుతాడు. కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది.  

అయితే, ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు, *LDL*, అతను శక్తి కోసం ఆశించేవాడు.  
*LDL* ఇబ్బంది కలిగించేవారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు.  

మంచి పోలీస్ *HDL* కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు, పట్టణం గందరగోళంగా మారుతుంది. అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు?  

*మీరు ఇబ్బంది కలిగించేవారిని తగ్గించి, మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా?*  

**నడవడం ప్రారంభించండి!** ప్రతి అడుగుతో, మంచి పోలీసులు *HDL* పెరుగుతారు, మరియు ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, మరియు LDL* తగ్గుతారు.  

మీ పట్టణం (శరీరం) తిరిగి దీప్తిని పొందుతుంది. మీ హృదయం, సిటీ సెంటర్, ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్‌లు (హృదయ బ్లాక్) నుండి సురక్షితంగా ఉంటుంది. మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.  

*కాబట్టి, మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి!*  
*ఆరోగ్యంగా ఉండండి... మరియు*  
*మంచి ఆరోగ్యాన్ని పొందండి*  

ఇది మంచి *HDL* ను పెంచడానికి మరియు చెడ్డ *LDL* ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం. *ప్రతి నడక అడుగు HDL ను పెంచుతుంది. అందువల్ల, నడవండి, నడవండి మరియు నడవండి.*  
*సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్*  

### **తగ్గించాల్సినవి:**  
1. ఉప్పు  
2. చక్కెర  
3. బ్లీచ్ చేసిన పిండి  
4. పాల ఉత్పత్తులు  
5. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు  

### **కావలసిన ఆహారాలు:**  
1. కూరగాయలు  
2. పప్పులు  
3. బీన్స్  
4. గింజలు  
5. గుడ్లు  
6. కోల్డ్ ప్రెస్డ్ నూనె (ఆలివ్, కొబ్బరి, ...)  
7. పండ్లు  

### **మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:**  
1. మీ వయస్సు  
2. మీ గతం  
3. మీ ఫిర్యాదులు  

### **ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి:**  
1. మీ కుటుంబం  
2. మీ స్నేహితులు  
3. మీ సానుకూల ఆలోచనలు  
4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు  

### **అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:**  
1. ఎప్పుడూ నవ్వండి / చిరునవ్వు  
2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి  
3. మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి  

### **అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు:**  
1. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి  
2. అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి  
3. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి  
4. అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి  
5. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి  
6. సానుకూలంగా ఉండి, ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి  

*మీ స్నేహితులు ఈ వయస్సు పరిధిలో (47-80 సంవత్సరాలు) ఉంటే, దయచేసి వారికి ఈ సందేశాన్ని పంపండి.*
👌👏🤝💓
 ఆరోగ్యం ప్రాప్తిరస్తు

Wednesday, April 16, 2025

అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలను వ్యాపింప చేయండి )

వైబ్రేట్ హైయర్ 
( అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలను వ్యాపింప చేయండి )

 *తక్కువ వైబ్రేషన్ కలిగి ఉండటానికి కారణాలు:* 
 భయం, అనుమానం
 ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత.
 అసూయ, కోపం
 ద్వేషం, దురాశ
 అటాచ్మెంట్ లేదా నొప్పి

 * కాబట్టి ...... తక్కువ వైబ్రేషన్ మన రోగనిరోధక శక్తిని బలహీనపరచకుండా ఉండటానికి, అధికంగా కంపించేలా మనం అర్థం చేసుకోవాలి.
 నేడు భూమి యొక్క ఫ్రీక్వెన్సీ 27.4 హెర్ట్జ్. కానీ చాలా తక్కువ వైబ్రేట్ చేసే ప్రదేశాలు ఉన్నాయి:
 ఆస్పత్రులు
 సహాయ కేంద్రాలు.
 జైళ్లు
 భూగర్భO మొదలైనవి.
ఈ ప్రదేశాలలో కంపనం 20hz లేదా అంతకంటే తక్కువకు పడిపోతుంది.

 తక్కువ వైబ్రేషన్ ఉన్న మానవులకు, వైరస్ ప్రమాదకరంగా మారుతుంది.
 నొప్పి- 0.1 నుండి 2హెర్ట్జ్ 
 భయం- 0.2 నుండి 2.2 హెర్ట్జ్.
 చికాకు - 0.9 నుండి 6.8 హెర్ట్జ్.
 శబ్దం - 0.6 నుండి 2.2 హెర్ట్జ్.
 అహంకారం - 0.8 హెర్ట్జ్.
 ఆధిపత్యం - 1.9 హెర్ట్జ్.

 క్రింద ఇవ్వబడిన ప్రవర్తన కారణంగా అధిక కంపనం ఫ్రీక్వెన్సీ వస్తుంది : -
 ఔదార్యం - 95hz
 కృతజ్ఞత - 150 హెర్ట్జ్
 కరుణ -150 హెర్ట్జ్ లేదా అంతకంటే ఎక్కువ.
 అన్ని జీవులకు ప్రేమ మరియు కరుణ యొక్క ఫ్రీక్వెన్సీ - 150 Hz మరియు అంతకంటే ఎక్కువ. 
 *నిష్కామ ప్రేమ, విశ్వం పట్ల ప్రేమ యొక్క ఫ్రీక్వెన్సీ 205hz కంటే ఎక్కువ* 
 
* వైబ్రేట్ హయ్యర్ !!! *
 అధికంగా కంపించడానికి మాకు ఏది సహాయపడుతుంది?
 ప్రేమించడం, నవ్వడం, ఆశీర్వదించడం, ధన్యవాదాలు, ఆడటం, పెయింటింగ్, పాడటం, నృత్యం, యోగా, ధ్యానం, ఎండలో నడవడం, వ్యాయామం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మొదలైనవి.
  భూమి మనకు ఇచ్చే ఆహారాలు: విత్తనాలు-ధాన్యాలు-తృణధాన్యాలు-చిక్కుళ్ళు-పండ్లు మరియు కూరగాయలు-
 తాగునీరు: అధికంగా కంపించడానికి మాకు సహాయపడండి ..... !!!

 * *ప్రార్థన యొక్క కంపనం ఫ్రీక్వెన్సీ ఒక్కటే 120 నుండి 350 హెర్ట్జ్ వరకు ఉంటుంది ** 
 కాబట్టి పాడండి, నవ్వండి, ప్రేమించండి, ధ్యానం చేయండి, ఆడుకోండి, కృతజ్ఞతలు చెప్పి జీవించండి!
 _ * *అధికంగా వైబ్రేట్ చేద్దాం ... !!! * _* 
 ఈ సమాచారాన్ని నేచురోథెరపిస్ట్ డాక్టర్ హర్షల్ సాంచెటి, నాసిక్ రచన చేసి, సవరించారు.
 ఈ సమాచారం యొక్క అసలు మూలం * పవర్ Vs ఫోర్స్ * పుస్తకం నుండి
 * డేవిడ్ ఆర్ హాకిన్స్ డాక్టోరల్ థీసిస్ * ఆధారంగా.🙏🙏🙏

Tuesday, April 8, 2025

సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా!!!*

*సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా!!!*
 🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷

#అని చాలా మంది స్త్రీలకు కలిగే అనుమానం.

🌷🌼🌷#గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది. 

🌷🌼🌷సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు #ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి.

 🌷🌼🌷#ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, #దండకములు చెప్పించాలి.

🌷🌼🌷#ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు.

🌷“#దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం!
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!!
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్!
#జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!!
#సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!🌷

🌷🌼🌷#ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము.

🌷🌼🌷 #కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు.

🌷🌼🌷#దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు -

🌷🌼🌷#ప్రత్తివత్తుల దీపారాధన:- దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. 

🌷🌼🌷#అరటినార వత్తుల దీపారాధన:- కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -

🌷🌼🌷#తామరతూడు వత్తుల దీపారాధన: - ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -

🌷🌼🌷#జిల్లేడు వత్తుల దీపారాధన :- విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -

🌷🌼🌷#పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తుల #దీపారాధన: -                 
 అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది. -

🌷🌼🌷#కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన :- దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది. -

🌷🌼🌷#పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.
🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు .....🙏🏼🙏🙏🏻

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు .....🙏🏼🙏🙏🏻

మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలనుధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలనుధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩

Sunday, April 6, 2025

గుడిలో చేసే ప్రార్ధన

*🌹గుడిలో చేసే ప్రార్ధన 🌹*
*🍃🌾గుడి మండపంలో_*
*కొంతసేపు కూర్చుని ఒకచిన్నప్రార్ధన*
*‌మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు ‌దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు* 
*వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ_ అది ఏమిటంటే*..!

*🍁🌾"అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం*
*దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం 🙏

*🌺🌾మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ* *రెండు చేతులను*
*జోడించి కళ్ళు తెరిచి *ప్రశాంతమైన మనసుతో*
*దర్శనం చేసుకోండి*

*🍁🌾దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక_*
*గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని* *అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు* *తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి*

*" 🌺🌾అనాయాసేన మరణం "*
*నాకు నొప్పి లేక బాధ కానీ లేనిమరణాన్ని ప్రసాదించు*

*"🍁🌾 వినా ధైన్యేన జీవనం "*
*నాకు ఎవరి మీదా* *ఆధారపడకుండా*,
*నేను జీవితంలో ఎవరి* *ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు*

*" 🌺🌾దేహాంతే తవ సాన్నిధ్యం* "
*మృత్యువు నావద్దకు* *వచ్చినప్పుడు నేను*
*నిన్ను దర్శించుకునే విధంగా దీవించు*

*"🍇దేహిమే పరమేశ్వరం"*

*🌺🌾ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను*

*1. 🍁అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ *ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన * *మార్గంలోకి తీసుకు వెళ్ళు*

*2. 🍁ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ* ....
*నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు* *కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు*
*ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.*

*3. 🍁 నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా*
*ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు*.

*🌺🌾ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన* *విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో* *అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే* *ప్రసాదిస్తాడని మరువకండి*.

*🌺🌾దీనినే దర్పణ దర్శన పప్రక్రియ* 
*ఏమనస్సనే దర్పణం లో దర్శించి*, 
*ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ* 🙏

కలువలకు కమలాలకు తేడా ఏమిటి?*

*కలువలకు కమలాలకు తేడా ఏమిటి?*

కలువ పువ్వు తామర పువ్వు

"కలువ కు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం" అయితే చాల మంది కలువకూ-కమలానికి తేడా లేదను కుంటారు. ఏది నిజం. కవిగారు ప్రాస కోసం వర్ణించారా? కాదు కాదు. కలువ పువ్వు రాత్రి వికసిస్తుంది. కమలము పగలు వికసిస్తుంది. కలువలకు చంద్రుడు, కమలానికి (పద్మానికి) సూర్యుడు భౌతికంగా ఎంతో దూరం. అయినా వాటి మధ్య ఉన్న అనుబంధం గొప్పది. ఎందువలన అంటే, ఆ పుష్పాలు సూర్య చంద్రుల స్నేహ కిరణాలు సోకి విరిసి మురిసిపోతాయి. కమలం, పద్మం, తామర పువ్వు ఒకటే. కలువలు నీటిలో పుడతాయి. కమలాలు బురదలో పుడతాయి. అయితే సుమతీ శతకం లో బద్దెన కవి "కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్" అని అన్నాడు. కమలానికి సూర్యుడు ఎంత మిత్రుడైనా వాటిని నీటిలోంచి బయటకు తీస్తే సూర్య రశ్మిని తాళలేక వాడి పోతుంది. అలాగే 'తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట తథ్యము" అన్నది కూడా ముమ్మాటికీ నిజం. 'కుముదము' లేదా 'కువలయము' అంటే తెల్ల కలువ; ఏనుగు అని కూడా ఇంకొక అర్థం. కలువను ఉత్పలము అని కూడా అంటారు. నీలోత్పలము అంటే ముదురు నల్ల కలువ లేదా నీలి రంగు కలువ.

       పంకం (బురద) లో పుడుతుంది కనుక కమలాన్ని 'పంకజ' అంటారు. బురదలో పుట్టినా పద్మానికి ఆ బురద అంటదు. స్వచ్చంగా ఉంటుంది. అందుకే కమలం మన జాతీయ కుసుమం అయ్యింది. కమలం మరియు తామర పువ్వు ఒకటే. భగవద్గీత లో "తామరాకు మీద నీటి బొట్టులా" ఉండగలిగే వానిని స్థిత ప్రజ్ఞుడు అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశించాడు.  

      మన పురాణములలో ఎన్నో పుష్పాల వర్ణన వుంది. అలాగే పుష్పాలతో పురాణ పురుషులను వర్ణిస్తారు. ఉదాహరణకు పద్మం తో లక్ష్మీ దేవికి, విష్ణువుకు సంబంధం వుంది. పద్మం లో పుట్టినది కనుక లక్ష్మిని 'పద్మజ' అంటాం. 'జ' అంటే పుట్టినది అని అర్ధం. పద్మం బొడ్డులో పుట్టిన వాడు పద్మనాభుడు (విష్ణువు) లేదా పంకజ నాభుడు. నీటికి ఉన్న పర్యాయ పదాలు నీరు, జలము, వారి తద్వారా ఇందులో పుట్టిన పద్మాన్ని వరుసక్రమం లో నీరజ, జలజ, వారిజ అని అనవచ్చు. సరసు లో పుడితే సరసిజ. వారిజవైరికులేశ = వారిజ (కమలం) - వైరి (శత్రువు); వారిజ వైరి = కమలానికి శత్రువు (సూర్యుడు); వారిజవైరి కులం = సూర్య వంశం; వారిజ వైరి కులేశ = సూర్య వంశ ప్రభువు; శ్రీ రాముడు సూర్య వంశస్థుడు

భక్తి అంటే ఏమిటి?

*భక్తి అంటే ఏమిటి?*
               
*భక్తి అంటే ఏమిటి? అందులోని రకాలెన్ని?*

*భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. అసలు భక్తి ఎన్ని రకాలు, ఎటువంటి భక్తిని కలిగి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం…*
 
*1. శ్రవణ భక్తి :*
*సత్‌పురుషుల వాక్యాలు, సత్‌గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీని వల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు.*
 
*2. కీర్తనా భక్తి :*

*భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో మోక్షం పొందారు.*
 
*3. స్మరణ భక్తి :*
*భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామ స్మరణం, రూప స్మరణం, స్వరూప స్మరణం అని మూడు రకాలు ఉన్నాయి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.*

*4. పాదసేవన భక్తి :*
*భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్రసేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.*

*5. అర్చన భక్తి :*
*ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.*
 
*6. వందన భక్తి :*
*వందనం అంటే నమస్కరించడం. తనయందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోదించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.*
 
*7. దాస్య భక్తి :*
*ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు.*
 
*8. సఖ్య భక్తి :*
*సఖ్యం అనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.*
 
*9. ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి :*
*ఆత్మనివేదనమనగా భగవంతుడు తప్ప ఇంకెవరూలేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తి పొందారు.*

Tuesday, April 1, 2025

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*

*🚩సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*

*ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.*
*ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు."* 

*అవేమిటంటే:-*

*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో).

*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).

*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.
ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).

*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.

*👌మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత.*

మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.

మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.

       మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

   పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.

  తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .

 మధుమేహంలో ఉపయోగపడు ఔషధాలు -

 * పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.

 * ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 * నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.

 * మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.

 * ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .

 * త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.

 * తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.

 * రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 * మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.

 * ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.

 * లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును.

  నా అనుభవ యోగాలు -

 * మధుమేహం 300 వరకు ఉంటే మూడు మారేడు దళాలు అనగా 9 లేత ఆకులు ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు తినుచున్న కేవలం 15 నుంచి 20 రోజుల్లో 170 నుంచి 190 వరకు వచ్చును. ఆ తరువాత రెండు మారేడు దళాలు చొప్పున ఉదయం , రాత్రిపూట పైన చెప్పిన సమయాల్లో తీసికొనవలెను. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారు.

 * పొడపత్రి చూర్ణం ఒక స్పూన్ , నేరేడు గింజల చూర్ణం ఒక స్పూన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో ఆహారానికి గంట ముందు సేవించవలెను . అదేవిధముగా రాత్రిపూట పైనచెప్పిన మోతాదులో గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవించవలెను .

        పైన చెప్పినవన్నీ నేను కొంతమంది వ్యాధిగ్రస్తుల చేత వాడించాను . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఒకేసారి అల్లోపతి ఔషధాలు ఆపి ఇవి వాడవద్దు. ఇవి వాడుతూ అల్లోపతి ఔషదాల మోతాదు తగ్గించుకుంటూ చివరకి పూర్తిగా ఆపివేయవచ్చు . 

         ఈ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును.

     
        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .