Monday, December 1, 2025

ఒక్కొక్కరి ఆరోగ్యానికి తగ్గట్టు ఒక్కో రైస్ ఉంటుంది.

*అందరూ తెల్ల రైస్ తినడం కాదు అండి...* 
*షాప్ వాడు చెప్పినదే కొనడం కాదు...*

*ఒక్కొక్కరి ఆరోగ్యానికి తగ్గట్టు ఒక్కో రైస్ ఉంటుంది...ఆ రైస్ తినడం ఉత్తమం...మీ ఆరోగ్యానికి తగ్గట్టు ఏ రైస్ మంచిదో చెప్పే 15 ప్రాచీన వరి రకాల పూర్తి సమాచారం*

*1.రక్తశాలి:*
రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు, ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ ధాన్యాన్ని ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లో ఇది అమృత తుల్యమైన ధాన్యం.

*2.కర్పూకవుని:* 
కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.
ఈ ధాన్యం నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారము. కొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.

*3.కుళ్లాకార్:* 
కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు. 
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది. పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. 

*4.పుంగార్:*
పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది. ఇది100% మహిళలకు మంచిది.

*5.మైసూర్ మల్లిగ:*
మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.
ఈ ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు, ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పిల్లలకు ఈ బియ్యంతో అన్నం చేసి పెట్టడం చాలా అవసరం.

*6.కుజిపాటలియా,సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు:* 
కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.
ఇవి తెలుపు, సన్న రకాలు.ఈ బియ్యం కొవ్వు రహితం, సోడియం లేనివి. తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. గ్లూకోజ్ పదార్థాలు తక్కువగా ఉంటాయి, రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.

*7.రత్నచోడి:*
రత్నచోడి > తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
ఈ ధాన్యం తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి. కండపుష్టికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడేవారు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*8.బహురూపి,గురుమట్టియా,వెదురు సన్నాలు:*
తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి. కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి. బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధకశక్తి పెరగడానికి సహాయపడుతాయి.

*9.నారాయణ కామిని:*
నారాయణ కామిని >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి140 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*10.ఘని:*
ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*11.ఇంద్రాణి:*
ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.
ఈ ధాన్యం తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము. కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.పెద్దవాళ్లు కూడా తినవచ్చు. గుల్ల బారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

*12.ఇల్లపు సాంబ:*
ఇల్లపుసాంబ > తెలుపు> సన్నరకం> వంటకాలం>140 నుండి145 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, సన్నరకం. ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

*13.చిట్టి ముత్యాలు:*
ఈ ధాన్యం తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదాలకు ,పులిహారమునకు, బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

*14. దేశీ బాసుమతి:*
ఈ ధాన్యం తెలుపు,పొడవు రకము,సువాసన కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది. 

*15.కాలాజీరా:*
ఈ ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది.ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.


రోగములు - ఏకమూలికా ప్రయోగాలు .

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 
     
      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 
     
      ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 
 
 ఏకమూలికా ప్రయోగాలు - 

 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 
 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 
 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 
 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 
 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 
 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 
 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 
 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 
 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 
 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 
 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 
 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 
 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 
 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 
 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 
 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 
 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 
 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 
 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 
 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 
 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 
 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 
 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 
 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 
 * మద్యము శోకము నందు శ్రేష్టం . 
 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 
 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 
 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 
 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 
 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 
 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 
 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 
 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 
 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 
 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 
 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 
 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 
 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 
 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 
 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 
 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 
 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 
 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 
 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 
 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 
 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 
 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 
 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 
 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 
 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 
 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 
 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 
       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 
 

  

Tuesday, November 25, 2025

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 
 
నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 *  జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 
 
*  మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 
 *  బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 
 
*  ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 
 
*  నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 

 *  తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 
 
*  మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును .  


పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*

.

*పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*

*ముందుమాట:*  
మన శరీరం పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) ఆధారంగా పనిచేస్తుంది. తినే ఆహారంలో కూడా ఈ భూతాల సమతుల్యత ఉంటుంది. ఏ భూతం ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. అందుకే పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకుంటే శరీరం సమతుల్యం అవుతుంది మరియు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

1) *భూమి తత్త్వం (Earth Element) – స్థిరత్వం ఇచ్చే ఆహారం*  
ఈ తత్త్వం శరీరానికి బలం, స్థిరత్వం, నిర్మాణం ఇస్తుంది. అన్నం, గోధుమ, రాగి, జొన్న, బంగాళాదుంప, వేరుశనగ వంటి భూభాగంలో పెరిగే ఆహారాలు ఇందులోకి వస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి, బలం, నిండిన అనుభూతి కలుగుతుంది. అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది, కాబట్టి పరిమాణం ముఖ్యం.

2) *నీటి తత్త్వం (Water Element) – శరీర ద్రవాల సమతుల్యం*  
శరీరానికి హైడ్రేషన్ ఇచ్చే అన్ని ఆహారాలు ఈ తత్త్వంలో పడతాయి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, కీరా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ తత్త్వం రక్త ప్రసరణ, చర్మ కాంతి, జీర్ణం కోసం అవసరం. తక్కువైతే డీహైడ్రేషన్ వస్తుంది.

3) *అగ్ని తత్త్వం (Fire Element) – జీర్ణశక్తి + వేడి*  
ఈ తత్త్వం శరీరంలో జీర్ణశక్తి, శక్తి ఉత్పత్తి మరియు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మిరపకాయ, అల్లం, మసాలాలు, తేనె, కుంకుమపువ్వు వంటి పదార్థాలు అగ్ని తత్త్వాన్ని పెంచుతాయి. ఇవి శరీరాన్ని తేలికగా ఉంచుతాయి మరియు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎక్కువైతే వేడి, యాసిడ్ సమస్యలు వస్తాయి.

4) *గాలి తత్త్వం (Air Element) – కదలిక, ఊపిరితిత్తుల శక్తి*  
ఈ తత్త్వం మనం ఊపిరి పీల్చే విధానం, రక్త ప్రసరణ, శరీర చలనం మీద ప్రభావం చూపుతుంది. ఆకుకూరలు, మొలకలు, తేలికపాటి పండ్లు, వేపిన శెనగలు, కందిపప్పు వంటి పదార్థాలు గాలి తత్త్వాన్ని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని తేలికగా, చురుకుగా ఉంచుతాయి. ఎక్కువైతే గ్యాస్, ఊబకాయం, నరాల బలహీనత వస్తాయి.

5) *ఆకాశ తత్త్వం (Space Element) – శరీర ఖాళీల నియంత్రణ*  
శరీరంలో స్థలం, ఖాళీలు, మానసిక స్థిరత్వం ఈ తత్త్వం మీద ఆధారపడి ఉంటాయి. కొబ్బరి నీరు, తేలికపాటి పండ్లు, మిలెట్స్, కీరా, బాదం, వాల్‌నట్స్ ఆకాశ తత్త్వాన్ని సమతుల్యం చేస్తాయి. ఇవి మనసును ప్రశాంతం చేస్తాయి. అధిక ఆకాశ తత్త్వం ఆకలి తగ్గడం, బలహీనతకు దారితీస్తుంది.

6) *పూర్ణాన్నాలు పంచభూతాల సమతుల్యాన్ని ఇస్తాయి*  
బియ్యం, రాగి, జొన్న, క్వినోవా, ఓట్స్ వంటి పూర్ణ ధాన్యాలు ఐదు తత్త్వాల్లో బ్యాలెన్స్ కలిగిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి మరియు నిద్రమత్తు లేకుండా శక్తినిస్తాయి.

7) *పండ్లు – నీరు + గాలి తత్త్వాల ఆధారం*  
పండ్లలో నీరు అధికం, తేలికగా జీర్ణమయ్యేవి. కాబట్టి ఇవి నీరు, గాలి తత్త్వాల సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ రెండు రకాల పండ్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.

8) *కూరగాయలు – గాలి + భూమి తత్త్వాలు*  
పచ్చి కూరలు గాలి తత్త్వాన్ని పెంచుతాయి, వేరుజన్య కూరగాయలు భూమి తత్త్వాన్ని పెంచుతాయి. రెండు రకాలూ శరీరానికి అవసరం. ఇవి శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.

9) *పప్పులు – భూమి + అగ్ని తత్త్వాలు*  
పప్పులు బలం, ప్రోటీన్, జీర్ణశక్తి ఇస్తాయి. అధిక అగ్ని తత్త్వం ఉన్నవారికి తక్కువగా తినటం మంచిది. శాకాహారులకి ఇది ప్రధాన ప్రోటీన్ వనరు.

10) *పాలు – భూమి + నీటి తత్త్వాలు*  
పాలు శరీరానికి చల్లదనం, బలం ఇస్తాయి. రాత్రి గోరు వెచ్చని పాలులో తుమ్మెర కలిపితే అగ్ని తత్త్వం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది.

11) *మసాలాలు – అగ్ని తత్త్వాన్ని పెంచేవి*  
మసాలాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి మరియు జీర్ణక్రియను చురుకుగా చేస్తాయి. కానీ ఎక్కువైతే ఆమ్లత్వం వస్తుంది కనుక పరిమాణం ముఖ్యం.

12) *కొబ్బరి – నీరు + ఆకాశ తత్త్వాలు*  
కొబ్బరి నీరు, కొబ్బరి పాలు శరీరానికి చల్లదనం, తేలికనిచ్చే ఆహారం. ఇది శరీర వేడి తగ్గించి నాడీవ్యవస్థను ప్రశాంతం చేస్తుంది.

13) *నూనెలు – భూమి + అగ్ని తత్త్వాలు*  
తక్కువ మోతాదులో నూనె శరీరానికి అవసరం. నూనెలో ఉన్న భూమి + అగ్ని తత్త్వాలు కీళ్ళను లూబ్రికేట్ చేస్తాయి. అధికంగా తీసుకుంటే అగ్ని తత్త్వం పెరిగి acidity, బరువు పెరుగుదలకు దారితీస్తుంది.

14) *ప్రోటీన్ ఫుడ్స్ – భూమి తత్త్వం బలోపేతం*  
పప్పు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహారం శరీర నిర్మాణానికి అవసరం. ఇవి పెరుగుదల, మరమ్మత్తు, బలం కోసం ముఖ్యమైనవి.

15) *మిలెట్స్ – పంచభూతాల సమతుల్యం*  
జొన్న, రాగి, కొర్ర వంటి మిల్లెట్స్ శరీరానికి బలం, నీరు, శక్తి అన్నిటినీ సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం.

*ముగింపు:*  
పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యం కోసం చాలా కీలకం. శరీరంలో భూతాలు బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు జీర్ణం మెరుగుపడుతుంది, నిద్ర బాగుంటుంది, రోగాలు దూరంగా ఉంటాయి. ప్రతి రోజు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తత్త్వాలు ఉన్న ఆహారం తీసుకుంటే జీవితం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.

అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!*

*అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!*

వందల ఏళ్లుగా హిందూ జాతి ఆత్మాభిమానంతో పోరాడుతున్న అయోధ్య భవ్యమందిరం పూర్తయింది… ప్రాణప్రతిష్ఠ సమయానికి కేవలం గ్రౌండ్ ఫ్లోర్, గర్భగుడి మాత్రమే సిద్ధం కాగా… మిగిలిన అన్ని దశల నిర్మాణాలూ పూర్తయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది… నిర్మాణ పరిపూర్ణతను చాటిచెప్పే ధర్మధ్వజం ఎగురవేతను మోడీ చేతుల మీదుగా ఈరోజు నిర్వహించారు…

అసలు ఏమిటి ఆ ధర్మధ్వజం..? కాషాయ రంగులో (Saffron) ఉంటుంది, ఇది హిందూ ధర్మంలో పవిత్రత, త్యాగం, ఆధ్యాత్మికతకు చిహ్నం…


ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. శిఖరం పైన ఉన్న ధ్వజస్తంభం దాదాపు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని కారణంగా జెండా మొత్తం 191 అడుగుల ఎత్తులో ఎగురుతుంది… జెండా సుమారు 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది… ఇది ప్యారాచూట్ గ్రేడ్ నైలాన్, సిల్క్ వంటి మన్నికైన వస్త్రాలతో తయారు చేయబడింది, దీనివల్ల ఇది గాలి, వర్షం, తీవ్రమైన సూర్యకాంతిని తట్టుకోగలదు… దీన్ని చేతితో ఎంబ్రాయిడరీ చేశారు…

జెండాపై ఉన్న చిహ్నాలు, వాటి అర్థాలు

ధర్మధ్వజంపై మూడు ప్రధాన చిహ్నాలు ఉన్నాయి… సూర్యుడు… ఇది శ్రీరాముని సూర్యవంశ (సూర్య రాజవంశం) వంశానికి చిహ్నం… సూర్యుడు శాశ్వత శక్తి, దివ్య తేజస్సు, ధర్మం, జ్ఞానాన్ని సూచిస్తాడు…

‘ఓం’ చిహ్నం… హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇది దైవం మొదటి అక్షరం… బీజాక్షరం… ఇది సనాతన ధర్మంలోని శాశ్వత చైతన్యాన్ని, సత్యాన్ని సూచించే పవిత్రమైన ధ్వని… కోవిదార వృక్షం (కల్పవృక్షం) ఇది వాల్మీకి రామాయణం, హరివంశ పురాణంలో ప్రస్తావించబడింది… ఇది అయోధ్య రాజ చిహ్నంగా గౌరవించబడింది… సంక్షేమం, శ్రేయస్సుకు ప్రతీక…

ప్రస్తుతం మొదటి అంతస్తు, ఇతర ముఖ్య నిర్మాణ పనులన్నీ పూర్తి చేశారు… ఇందులో ఆరు అనుబంధ దేవాలయాలు… మహాదేవ్, గణేశ్ జీ, హనుమాన్ జీ, సూర్యదేవ్, మా భగవతి, మా అన్నపూర్ణలకు అంకితం చేయబడ్డాయి…

రామాయణంతో సంబంధం ఉన్న ఏడుగురు ప్రముఖుల పేరిట, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఏడు మండపాలు కూడా పూర్తయ్యాయి… ఇవి మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజ్, శబరి, అహల్యలకు అంకితం చేయబడ్డాయి…

మిగిలినవి… సంత్ తులసీదాస్ మందిరం… ప్రాంగణంలో జటాయువు, ఉడుత విగ్రహాలను ఏర్పాటు చేశారు… ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు, 10 ఎకరాల పంచవటి ప్రాంతంలో ల్యాండ్‌స్కేపింగ్ (పచ్చదనం) పనులు పూర్తయ్యాయి…

భక్తుల దర్శనానికి సంబంధం లేని కొన్ని పనులు ఇంకా జరుగుతున్నాయి… 3.5 కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడ (Boundary Wall), ట్రస్ట్ కార్యాలయం, అతిథి గృహం (Guest House), ఆడిటోరియం మొదలైనవి…

గుడి నిర్మాణం ఒకెత్తు.., అయోధ్యను ఓ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడానికి తగిన మౌలిక వసతుల నిర్మాణం మరో ఎత్తు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వసతులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి…

అంతర్జాతీయ విమానాశ్రయం (మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్), పునరుద్ధరించబడిన రైల్వే స్టేషన్ (అయోధ్య ధామ్ జంక్షన్) తో పాటు, భక్తులు, పర్యాటకుల కోసం అయోధ్యలో అనేక వేల కోట్ల రూపాయల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది…

 మెరుగైన రోడ్లు , కనెక్టివిటీ… 

అయోధ్య పట్టణంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రద్దీని తగ్గించడానికి (Decongest) చారిత్రక మార్గాలను విస్తరించి, కొత్త రోడ్లుగా అభివృద్ధి చేశారు…

రాం పథ్ (Ram Path): ఇది సహదత్‌గంజ్ నుండి కొత్త ఘాట్ వరకు విస్తరించి, పట్టణంలో కీలకమైన కనెక్టివిటీని అందిస్తుంది…
భక్తి మార్గ్ (Bhakti Path): అయోధ్య ప్రధాన రహదారి నుండి హనుమాన్ గర్హి మీదుగా శ్రీరామ జన్మభూమి ఆలయం వరకు భక్తులు సులభంగా చేరుకోవడానికి ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు…
ధర్మ మార్గ్ (Dharma Path): ఇది NH-27 నుండి నయా ఘాట్ వరకు కలుపుతుంది…
అయోధ్య బైపాస్ ప్రాజెక్ట్: 67.57 కి.మీ. పొడవు గల ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు, లక్నో, బస్తీ, గోండా వంటి ముఖ్య జిల్లాలను కలుపుతూ అయోధ్య నగరంలో సరకు రవాణా రద్దీని తగ్గిస్తుంది…
రవాణా, పార్కింగ్… 

ప్రపంచ స్థాయి బస్ టెర్మినస్: భక్తులు, సందర్శకుల సులభ రాకపోకల కోసం సుమారు ₹400 కోట్ల వ్యయంతో కొత్త బస్ టెర్మినస్‌ నిర్మాణం…
బహుళ అంతస్తుల పార్కింగ్ (MLCP): పర్యాటకుల వాహనాల కోసం మహర్షి అరుంధతి పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌తో సహా అనేక కొత్త పార్కింగ్ ప్రదేశాలు ప్రారంభించబడ్డాయి…
సరయూ నది, ఘాట్ల అభివృద్ధి…

ఘాట్ల పునరుద్ధరణ: గుప్తార్ ఘాట్, రాజ్‌ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల పునరభివృద్ధి పనులు జరుగుతున్నాయి…
రామ్ కీ పౌడీ: సరయూ నది ఒడ్డున ఉన్న ‘రామ్ కీ పౌడీ’ ప్రాంతానికి కొత్త రూపు ఇచ్చి, దాన్ని పర్యాటక ఆకర్షణగా మార్చారు…
క్రూయిజ్ కార్యకలాపాలు: సరయూ నదిలో క్రూయిజ్ (Cruise) కార్యకలాపాలు… అనేక ప్రైవేటు హోటళ్లు…

Wednesday, November 12, 2025

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తాటి బెల్లం శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ముఖ్యమైన ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ నుంచి రక్తహీనత నివారణ వరకు అనేక ఉపయోగాలు ఉన్నాయి.

### ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

- తాటి బెల్లంలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, మలబద్ధకం, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి.
- ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి; హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి.
- బ్రాహ్మణాలైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని విషపదార్థాల నుంచి కాపాడుతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి.
- లివర్‌ను, శ్వాసకోశాన్ని, ప్రేగులను డిటాక్సిఫై చేస్తుంది, శరీరం శుద్ధి అవుతుంది.
- ముగాబద్ధకం, నెలసరి సమస్యలు, మైగ్రేన్, శరీరం వేడి వంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
- చిన్నపిల్లల నోటి పూత, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.
- శరీరానికి తక్కువ చక్కెరతో శక్తిని అందిస్తుంది, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
- చర్మానికి ఆరోగ్యం, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
- నాడీ వ్యవస్థ నియంత్రణ, శరీరిణి వేడి తొలగించడం, శక్తినిచ్చే గుణాలు చాలా ఉన్నాయి.

### వాడకంలో జాగ్రత్తలు

- తాటి బెల్లం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు; అనేక స్టడీస్ మేరకు పరిమిత మోతాదులో ఉపయోగించాలి.

### పొడిపిచ్చిన తాటి బెల్లం ఉపయోగాలు

- టీ, కాఫీ, పండ్ల రసాలు వంటి వాటిలో రెగ్యులర్ షుగర్ బదులుగా వాడుకోవచ్చు.

తాటి బెల్లాన్ని రోజూ పరిమితంగా తీసుకుంటే శరీర ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు తన ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

Friday, November 7, 2025

ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు గురించి విశేషాలు -

ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు గురించి విశేషాలు -

 
జననం - క్రీ .పూ 1000 సంవత్సరం .
 జన్మస్థలం - వారణాసి .
 తండ్రి - విశ్వామిత్రుడు .
 గురువు - ధన్వంతరి . 
 రచనలు - సుశ్రుత సంహిత .
       
          ప్రాచీన వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు , ప్రముఖుడు . ప్రపంచంలో సాటిలేని మేటి శస్త్రచికిత్స నిపుణుడు ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో నిష్ణాతుడు . ఇతని కాలం నాటికే అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాడే వైద్యరంగంలో భారతదేశం నేటి ప్రపంచం కన్నా ఎంతో ముందు ఉన్నది. దీనికై ఎంతోమంది భారతీయ వైద్యశాస్త్రవేత్తలు ఈ వైద్యరంగానికి ఎనలేని సేవలు చేశారు .
               
       ప్రపంచం వైద్యశాస్త్రం గురించి కళ్లు తెరవకముందే వైద్యశాస్త్రాన్ని ప్రకాశింపచేసినది భారతీయులే . శస్త్రచికిత్సా రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు ఉపయోగించడంలో సుశ్రుతుడు ఆద్యుడు అని చెప్పవచ్చు. దాదాపు 101 రకాల శస్త్రచికిత్సా పరికరాలను సుశృతుడు వివిధ సందర్భాలలో ఉపయోగించేవాడు . తెగిపోయిన అవయవాలను తిరిగి వాటి స్థానంలో అతికించడంలో సుశ్రుతుడుని మించినవారు మరొకరు లేరు .
       
         మొట్టమొదట శవపరీక్ష నిర్వహించింది కూడా ఈయనే . శవాన్ని పరిశీలించడం ఆ మరణం ఏ విధముగా సంభవించిందో నిర్ధారించడంలో సుశృతుడు కడు నిష్ణాతుడు . అదేవిధముగా చెడు రక్తాన్ని శరీరం నుండి తొలగించడంలోనూ , ఆరోగ్యవంతమైన రక్తాన్ని శరీరానికి అందించడంలోనూ , మూత్రనాళాల్లో , మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ మరియు అనేక నిగూడ మరియు భయంకర రోగాలను అనతికాలంలో అతి సునాయాసముగా నయంచేయడంలో సుశ్రుతుడుది అందవేసిన చేయి .
                  
     సుశృతుడు రాసిన సుశ్రుత సంహిత నందు శల్యతంత్రం ( శస్త్రచికిత్స , సర్జరి ) గురించి మరియు అష్టాంగ వైద్యవిధానం గురించియు మరింకెన్నో విషయాలకు సంబంధించిన పలువివరాలను క్షుణ్ణంగా ఈ గ్రంథంలో సుశృతుడు వివరించిన కారణంగా ఈ గ్రంథం ప్రమాణ గ్రంధంగా గ్రహింపబడుతుంది. సుప్రసిద్ధ రససిద్ధుడు ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథం ప్రశస్తమైనది అని ప్రస్తుతించాడు . ఈ గ్రంథాన్ని క్రీ . పూ 800 వ సంవత్సరం నందు అరబ్ భాషలోకి అనువదించుకొని వెళ్లి వారివారి ప్రాంతాలలో వైద్యశాస్త్ర అభివృద్ది చేసుకున్నారు . రోమన్లు కూడా భారతీయ మౌళిక ఔషధవిధానాన్ని అనుసరించారు. 
        
     ఇప్పుడు మీకు ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు సర్జరీ చేసే విధానం గురించి మీకు వివరిస్తాను.
 
    ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 
      
    చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 
         
        ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.
       
      ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభముగా చెసెడివారు .