Wednesday, April 16, 2025

అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలను వ్యాపింప చేయండి )

వైబ్రేట్ హైయర్ 
( అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలను వ్యాపింప చేయండి )

 *తక్కువ వైబ్రేషన్ కలిగి ఉండటానికి కారణాలు:* 
 భయం, అనుమానం
 ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత.
 అసూయ, కోపం
 ద్వేషం, దురాశ
 అటాచ్మెంట్ లేదా నొప్పి

 * కాబట్టి ...... తక్కువ వైబ్రేషన్ మన రోగనిరోధక శక్తిని బలహీనపరచకుండా ఉండటానికి, అధికంగా కంపించేలా మనం అర్థం చేసుకోవాలి.
 నేడు భూమి యొక్క ఫ్రీక్వెన్సీ 27.4 హెర్ట్జ్. కానీ చాలా తక్కువ వైబ్రేట్ చేసే ప్రదేశాలు ఉన్నాయి:
 ఆస్పత్రులు
 సహాయ కేంద్రాలు.
 జైళ్లు
 భూగర్భO మొదలైనవి.
ఈ ప్రదేశాలలో కంపనం 20hz లేదా అంతకంటే తక్కువకు పడిపోతుంది.

 తక్కువ వైబ్రేషన్ ఉన్న మానవులకు, వైరస్ ప్రమాదకరంగా మారుతుంది.
 నొప్పి- 0.1 నుండి 2హెర్ట్జ్ 
 భయం- 0.2 నుండి 2.2 హెర్ట్జ్.
 చికాకు - 0.9 నుండి 6.8 హెర్ట్జ్.
 శబ్దం - 0.6 నుండి 2.2 హెర్ట్జ్.
 అహంకారం - 0.8 హెర్ట్జ్.
 ఆధిపత్యం - 1.9 హెర్ట్జ్.

 క్రింద ఇవ్వబడిన ప్రవర్తన కారణంగా అధిక కంపనం ఫ్రీక్వెన్సీ వస్తుంది : -
 ఔదార్యం - 95hz
 కృతజ్ఞత - 150 హెర్ట్జ్
 కరుణ -150 హెర్ట్జ్ లేదా అంతకంటే ఎక్కువ.
 అన్ని జీవులకు ప్రేమ మరియు కరుణ యొక్క ఫ్రీక్వెన్సీ - 150 Hz మరియు అంతకంటే ఎక్కువ. 
 *నిష్కామ ప్రేమ, విశ్వం పట్ల ప్రేమ యొక్క ఫ్రీక్వెన్సీ 205hz కంటే ఎక్కువ* 
 
* వైబ్రేట్ హయ్యర్ !!! *
 అధికంగా కంపించడానికి మాకు ఏది సహాయపడుతుంది?
 ప్రేమించడం, నవ్వడం, ఆశీర్వదించడం, ధన్యవాదాలు, ఆడటం, పెయింటింగ్, పాడటం, నృత్యం, యోగా, ధ్యానం, ఎండలో నడవడం, వ్యాయామం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మొదలైనవి.
  భూమి మనకు ఇచ్చే ఆహారాలు: విత్తనాలు-ధాన్యాలు-తృణధాన్యాలు-చిక్కుళ్ళు-పండ్లు మరియు కూరగాయలు-
 తాగునీరు: అధికంగా కంపించడానికి మాకు సహాయపడండి ..... !!!

 * *ప్రార్థన యొక్క కంపనం ఫ్రీక్వెన్సీ ఒక్కటే 120 నుండి 350 హెర్ట్జ్ వరకు ఉంటుంది ** 
 కాబట్టి పాడండి, నవ్వండి, ప్రేమించండి, ధ్యానం చేయండి, ఆడుకోండి, కృతజ్ఞతలు చెప్పి జీవించండి!
 _ * *అధికంగా వైబ్రేట్ చేద్దాం ... !!! * _* 
 ఈ సమాచారాన్ని నేచురోథెరపిస్ట్ డాక్టర్ హర్షల్ సాంచెటి, నాసిక్ రచన చేసి, సవరించారు.
 ఈ సమాచారం యొక్క అసలు మూలం * పవర్ Vs ఫోర్స్ * పుస్తకం నుండి
 * డేవిడ్ ఆర్ హాకిన్స్ డాక్టోరల్ థీసిస్ * ఆధారంగా.🙏🙏🙏

Tuesday, April 8, 2025

సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా!!!*

*సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా!!!*
 🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷

#అని చాలా మంది స్త్రీలకు కలిగే అనుమానం.

🌷🌼🌷#గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది. 

🌷🌼🌷సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు #ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి.

 🌷🌼🌷#ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, #దండకములు చెప్పించాలి.

🌷🌼🌷#ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు.

🌷“#దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం!
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!!
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్!
#జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!!
#సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!🌷

🌷🌼🌷#ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము.

🌷🌼🌷 #కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు.

🌷🌼🌷#దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు -

🌷🌼🌷#ప్రత్తివత్తుల దీపారాధన:- దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. 

🌷🌼🌷#అరటినార వత్తుల దీపారాధన:- కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -

🌷🌼🌷#తామరతూడు వత్తుల దీపారాధన: - ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -

🌷🌼🌷#జిల్లేడు వత్తుల దీపారాధన :- విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -

🌷🌼🌷#పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తుల #దీపారాధన: -                 
 అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది. -

🌷🌼🌷#కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన :- దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది. -

🌷🌼🌷#పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.
🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు .....🙏🏼🙏🙏🏻

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు .....🙏🏼🙏🙏🏻

మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలనుధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలనుధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩

Sunday, April 6, 2025

గుడిలో చేసే ప్రార్ధన

*🌹గుడిలో చేసే ప్రార్ధన 🌹*
*🍃🌾గుడి మండపంలో_*
*కొంతసేపు కూర్చుని ఒకచిన్నప్రార్ధన*
*‌మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు ‌దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు* 
*వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ_ అది ఏమిటంటే*..!

*🍁🌾"అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం*
*దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం 🙏

*🌺🌾మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ* *రెండు చేతులను*
*జోడించి కళ్ళు తెరిచి *ప్రశాంతమైన మనసుతో*
*దర్శనం చేసుకోండి*

*🍁🌾దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక_*
*గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని* *అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు* *తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి*

*" 🌺🌾అనాయాసేన మరణం "*
*నాకు నొప్పి లేక బాధ కానీ లేనిమరణాన్ని ప్రసాదించు*

*"🍁🌾 వినా ధైన్యేన జీవనం "*
*నాకు ఎవరి మీదా* *ఆధారపడకుండా*,
*నేను జీవితంలో ఎవరి* *ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు*

*" 🌺🌾దేహాంతే తవ సాన్నిధ్యం* "
*మృత్యువు నావద్దకు* *వచ్చినప్పుడు నేను*
*నిన్ను దర్శించుకునే విధంగా దీవించు*

*"🍇దేహిమే పరమేశ్వరం"*

*🌺🌾ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను*

*1. 🍁అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ *ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన * *మార్గంలోకి తీసుకు వెళ్ళు*

*2. 🍁ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ* ....
*నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు* *కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు*
*ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.*

*3. 🍁 నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా*
*ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు*.

*🌺🌾ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన* *విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో* *అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే* *ప్రసాదిస్తాడని మరువకండి*.

*🌺🌾దీనినే దర్పణ దర్శన పప్రక్రియ* 
*ఏమనస్సనే దర్పణం లో దర్శించి*, 
*ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ* 🙏

కలువలకు కమలాలకు తేడా ఏమిటి?*

*కలువలకు కమలాలకు తేడా ఏమిటి?*

కలువ పువ్వు తామర పువ్వు

"కలువ కు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం" అయితే చాల మంది కలువకూ-కమలానికి తేడా లేదను కుంటారు. ఏది నిజం. కవిగారు ప్రాస కోసం వర్ణించారా? కాదు కాదు. కలువ పువ్వు రాత్రి వికసిస్తుంది. కమలము పగలు వికసిస్తుంది. కలువలకు చంద్రుడు, కమలానికి (పద్మానికి) సూర్యుడు భౌతికంగా ఎంతో దూరం. అయినా వాటి మధ్య ఉన్న అనుబంధం గొప్పది. ఎందువలన అంటే, ఆ పుష్పాలు సూర్య చంద్రుల స్నేహ కిరణాలు సోకి విరిసి మురిసిపోతాయి. కమలం, పద్మం, తామర పువ్వు ఒకటే. కలువలు నీటిలో పుడతాయి. కమలాలు బురదలో పుడతాయి. అయితే సుమతీ శతకం లో బద్దెన కవి "కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్" అని అన్నాడు. కమలానికి సూర్యుడు ఎంత మిత్రుడైనా వాటిని నీటిలోంచి బయటకు తీస్తే సూర్య రశ్మిని తాళలేక వాడి పోతుంది. అలాగే 'తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట తథ్యము" అన్నది కూడా ముమ్మాటికీ నిజం. 'కుముదము' లేదా 'కువలయము' అంటే తెల్ల కలువ; ఏనుగు అని కూడా ఇంకొక అర్థం. కలువను ఉత్పలము అని కూడా అంటారు. నీలోత్పలము అంటే ముదురు నల్ల కలువ లేదా నీలి రంగు కలువ.

       పంకం (బురద) లో పుడుతుంది కనుక కమలాన్ని 'పంకజ' అంటారు. బురదలో పుట్టినా పద్మానికి ఆ బురద అంటదు. స్వచ్చంగా ఉంటుంది. అందుకే కమలం మన జాతీయ కుసుమం అయ్యింది. కమలం మరియు తామర పువ్వు ఒకటే. భగవద్గీత లో "తామరాకు మీద నీటి బొట్టులా" ఉండగలిగే వానిని స్థిత ప్రజ్ఞుడు అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశించాడు.  

      మన పురాణములలో ఎన్నో పుష్పాల వర్ణన వుంది. అలాగే పుష్పాలతో పురాణ పురుషులను వర్ణిస్తారు. ఉదాహరణకు పద్మం తో లక్ష్మీ దేవికి, విష్ణువుకు సంబంధం వుంది. పద్మం లో పుట్టినది కనుక లక్ష్మిని 'పద్మజ' అంటాం. 'జ' అంటే పుట్టినది అని అర్ధం. పద్మం బొడ్డులో పుట్టిన వాడు పద్మనాభుడు (విష్ణువు) లేదా పంకజ నాభుడు. నీటికి ఉన్న పర్యాయ పదాలు నీరు, జలము, వారి తద్వారా ఇందులో పుట్టిన పద్మాన్ని వరుసక్రమం లో నీరజ, జలజ, వారిజ అని అనవచ్చు. సరసు లో పుడితే సరసిజ. వారిజవైరికులేశ = వారిజ (కమలం) - వైరి (శత్రువు); వారిజ వైరి = కమలానికి శత్రువు (సూర్యుడు); వారిజవైరి కులం = సూర్య వంశం; వారిజ వైరి కులేశ = సూర్య వంశ ప్రభువు; శ్రీ రాముడు సూర్య వంశస్థుడు

భక్తి అంటే ఏమిటి?

*భక్తి అంటే ఏమిటి?*
               
*భక్తి అంటే ఏమిటి? అందులోని రకాలెన్ని?*

*భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. అసలు భక్తి ఎన్ని రకాలు, ఎటువంటి భక్తిని కలిగి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం…*
 
*1. శ్రవణ భక్తి :*
*సత్‌పురుషుల వాక్యాలు, సత్‌గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీని వల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు.*
 
*2. కీర్తనా భక్తి :*

*భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో మోక్షం పొందారు.*
 
*3. స్మరణ భక్తి :*
*భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామ స్మరణం, రూప స్మరణం, స్వరూప స్మరణం అని మూడు రకాలు ఉన్నాయి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.*

*4. పాదసేవన భక్తి :*
*భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్రసేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.*

*5. అర్చన భక్తి :*
*ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.*
 
*6. వందన భక్తి :*
*వందనం అంటే నమస్కరించడం. తనయందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోదించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.*
 
*7. దాస్య భక్తి :*
*ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు.*
 
*8. సఖ్య భక్తి :*
*సఖ్యం అనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.*
 
*9. ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి :*
*ఆత్మనివేదనమనగా భగవంతుడు తప్ప ఇంకెవరూలేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తి పొందారు.*

Tuesday, April 1, 2025

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*

*🚩సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*

*ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.*
*ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు."* 

*అవేమిటంటే:-*

*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో).

*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).

*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.
ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).

*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.

*👌మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత.*