Saturday, August 23, 2025

పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు?

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే కారకులు! 
కానీ 90% కారకులు తల్లిదండ్రులే..! అది ఎలాగో తెలుసుకుందాం.

పిల్లల్ని గారాబం మరీ ‘శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు.

ఇప్పుటి తరం 70% పిల్లలు..*తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు. మంచి నీళ్ళు, పాలు,కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.*లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.*కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవమంటే లేవరు.గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.
తిడితే వస్తువులను విసిరి కొడతారు.. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.*

ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.*ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు.20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు.*బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి.. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు.వారిస్తే వెర్రి పనులు..

మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,*కానీ కారణం మనమే..*ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.
గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.*

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది..
కష్టం గురించి తెలిసేలా పెంచండి 
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది సోమరిపోతుల్లా తయారు అవుతున్నారు.*

అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు.*మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.*కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్.*చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం!

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి.*
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు.* 3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు..!5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..!*అందుకే తల్లిదండ్రులు మారాలి.’*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?ఒక్కసారి ఆలోచన చేయండి...

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*
కేవలం గుడికి వెళ్లి…పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు.
పిల్లలకు..
  బాధ్యత 
  మర్యాద
  గౌరవం 
  కష్టం 
  నష్టం 
  ఓర్పు
 సహనం
  దాతృత్వం
  ప్రేమ
  అనురాగం
  సహాయం
 సహకారం
  నాయకత్వం
 మానసిక ద్రృఢత్వం 
  కుటుంబ బంధాలు
 అనుబంధాలు    
 దైవ భక్తి
  దేశ భక్తి
ఈ భావనలు…సంప్రదాయాలు అంటే..!*
కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..*

*మంది కోసం బ్రతకొద్దు! మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.*ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*పూర్తిగా చదివినందుకు ధన్యవాదాలు.

భాద్రపద మాసం విశేషాలు

_*ఈరోజు నుండి భాద్రపద మాసం ప్రారంభం* .


చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం.

ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి , ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి , అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.

భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు , ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని , మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.

భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యంగా ఆచరించవలసినది , బ్రహ్మహణుడికి అరటి పళ్ళు , నెయ్యి , పంచదార , దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం , పాలు , పెరుగు , ఉప్పు , పంచాదారలతో తయారుచేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన , పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

భాద్రపద శుద్ద షష్ఠి - సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం , ఈరోజున సూర్యుడిని ఆవుపాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దం గా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం , దేవ , ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ద ఏకాదశి , దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు , ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు , అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి , ముఖ్యం గా సంధ్యాసమయం లో శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది , ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.

భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి , వ్రతమాచరిస్తే దారిద్ర భాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు , భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు , పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.

భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ , ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ దేవిని పూజించి , ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది.

భాద్రపద కృష్ణ ఏకాదశి అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

భాద్రపద కృష్ణ అమావాస్య మహాలయమావాస్య , ఈ రోజున పితృ తర్పణాలు , దానధర్మాలు చేయడం ఆచారం.

Wednesday, August 20, 2025

చతుర్వర్నాలు

అసలు జనాల జీవితాలను వాడిక్రింద బానిసత్వం లోకి లాకుని ఇవన్ని సమాజం తో చేపించుకుంటూ, ఈ వృత్తులు చేసినోడు శూద్రుడు, వీడు బ్రతకచెడాలి కానీ బ్రతకకూడదు అనీ మనుస్మృతి రాసింది మీరు బానిసలుగా ఉన్న విదేశీ బాపనోడు.

" మీ శూద్ర స్త్రీలు పెళ్లి అయ్యాక 3 రోజులు శారీరకంగా వాడికి సేవ చేస్తే, మీకు పుట్టాబోయే పిల్లలు శూద్ర జన్మ ఎత్తిన నెక్స్ట్ జన్మలో శూద్రులుగా పుటరట మరి ఇది ఓకే నా ఇది అమలుచేసిన ఈ విదేశీ బాపనోడిని ఏమి చేసావ్, (ముస్లిమ్స్ లో మాటాపిచ్చాను తగించాలని ఓట్స్ వేస్తే ఇక దేశం వదిలి రోజు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పైనే.

"నీ పిల్లలు పుడితే వాడికి, నీకుకూడా ఉపనయనం లేదు, మరి ఈ విదేశీ బాపనోడి గ్రంధాల ప్రకారం కనీసం మీకు స్వర్గం కూడా అనుమతి లభించదంట 😂😂 మరి మీ పూజలు, మొక్కులు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, తీర్థయాత్రలు అనీ వ్యర్థం అనీ గీత, ఉపనిషత్స్, వేదం, శివ సంహిత, యోగ సూత్రవళి ఇలా అనీ చెబుతున్నాయి (సర్వమంత్రాన్ పరిత్యజ్య ఇతన్మాంత్ర సడఉపాషత్ ఎతన్ మంత్రం సోహమ్ బావేనా పూజ్యయిథ్ ) మరి దీని ప్రకారం మన విదేశీ బాపనోడే మనలను, మన వేళ్ల సంవత్సరాల పూర్వికుల జీవితాలను నాశనం చేశారు, వాళ్ళ కు కోసిన తదినాలకు, సంవత్సరికాలకు చేసేవి ఏవి మనకు వాళ్లకు 0% వాల్యూ, కానీ వాడు పుట్టుకతో స్టార్ట్ చేసి చచ్చే వరకు నీ డబ్బులు దోబి మల్లీ నిన్ను నీచుడుగా చూస్తూ,,,,,, ఇంత కంటే అజ్ఞానం ఈ ప్రపంచంలో ఎవడు పంచడు ఒక మన విదేశీ బాపనోడు (rss)టేకే దారులు 😂😂😂 ఇది నిజం i will ప్రూవ్ it.

" మరి ఈ విదేశీ బాపనోడు ప్రకారం దేవా హోమాలు (అదే వా్జాపైయం, రాజసూయం, యజ్ఞం, యాగం లలో శూద్రులను, ఆవులను, మేకలను ఇలా 171 జీవులను బలి ఇవ్వాలి మరి ఓకేనా,,,

"మనుస్మృతి ప్రకారం శూద్రుడు ఈ విదేశీ బాపనోడికి నచ్చని పనులు చేస్తే వాడి అంగం తీసి, వాడికి ఏది ఆధారం ఉన్న ఈ విదేశీ బాపనోడికి ఇవ్వాలి,,,, వైష్యుడికి మాత్రం కోరాడ దెబ్బలు, ఫైన్,,, క్షత్రియుడికి మాత్రం ఓన్లీ ఫైన్ (ఎందుకంటే గుద్దమీద తంతాడని, ఐనా రాజుకూడా బాపనోడికి పాపం కోసం ఫైన్ ఇస్తే పోతోంది 😥😥)

"అసలు ఏవృత్తులు ఐనా వీడే చేయాలి అనీ ఎందుకు ఎవరు ఇదేనా చేయొచ్చు ఇది నీదేశం ఒకప్పటి పద్ధతి, ఈ విదేశీ బాపనోడు సింధు సివిలైజషన్ నాశనం చేసి తర్వాత,,, తొలి, మలి వేద కాల్లాలు, 16 మహాజనపదాలు, రాజ్యాలు ఇలా గొప్ప సంస్కృతి నుండి జారీ,,,,, ఇలా చేసాడు మన అనే ఇ దుర్మార్గుడు.

ఇక గొల్ల మనం రూల్లర్స్ నుండి గొర్రెలకు పోయాం, వాడు సంచార, వైశ్య (పడుపు వృత్తులు), అన్నాగరీకులు, పోరాటాలు చేస్తూ అందరిని నాశనం చేసే వెదవలు, ఇక్కడ గంగ, సింధు, మైదానంలో స్థిరపడి, నాగరికత నేర్చుకొని,, తర్వాత,,, ఒంటె ఫస్ట్ తల పెట్టి, తర్వాత కాళ్ళు, తరువాత మొత్తం బాడీ లోపలకు వఛీ మనలను తోస్తుంది అలా,,,,

"ఇక్క మిగతా వృత్తులు అన్నావు గా వాళ్లను మన పూర్వికులు అందరిని అందరు విశ్వ బ్రాహ్మణ అనీ ఈ ప్రపంచానికి ఆదర్శం ఐనా వ్యవస్థ ఉండేది (అంటే చెప్పులుకుటిన, మన దృష్టిలో గొప్ప పని అనుకున్నవి చేసిన వారి అందరు సమాజం పరం గా సేమ్, వాళ్ళ లక్ష్యం మాత్రం ఒకటే అదే మోక్షం, లేదా ముక్తి,,, ఇవి నాశనం చేసి,,, అదే మనోడు ఈ విదేశీ అణగారికుడు అందరిని నాశనం చేసి వాడు బ్రాహ్మణుడుగా మన అనీ గ్రంధాలలో జోపించి,,, బానిసలను చేశాడు,,,, మీరు ఈ దొంగ రాసిన వేదాలు, ఉపనిషత్స్, పురాణ, ఇతిహాసాలు చదివితే చాలు మీరే ఈ లమిడికోడకులను, rss బాపనోడిని వెంటాడి, వేటాడి చంపుతారు,,,

"ఇక అవును మన వాళ్ళ చేత తినిపించి, అసలు వేదాలను తపించి వీడి కల్పిత వేదాలలో ఆవులను,,, నిండు గర్భిణీ అవును ఎలా తింటే రుచిగా ఉంటుందో రాసుకున్న ఈ విదేశీ బ్రాహ్మణ (అవును యుపా స్థంబాలకు నాలుగు కాళ్ళు కటి, కింద మంట పెట్టి బాగా కాల్చి,బ్రతికి ఉన్నదాని గుర్తు పెట్టుకో, దాని కడుపును కొన్ని కొలతలు ప్రకారం చెల్చి ఆ లోపలి పిండాని జాగ్రత్తగా తీసి,,, ఆ దూడ, అవు మాంసలను ఒక క్రమపద్ధతిలో పెట్టాలి ఇది ఆవు ప్రేమ,,, కానీ ఇపుడు, ముస్లిం, క్రిస్టియన్స్, దళిత్స్ ను దెబ్బ కొట్టాలంటే ఆయుధం ఆవు అదే వీడి కుట్ర,,,,,ముస్లిమ్స్ రాకముందు,,, రాష్ట్ర కూట రాజులు ఈ విదేశీ బాపనోడి దొంగ యజ్ఞం లో శూద్రులను, ఆవులను బలి ఇచ్చారు,,, రాష్ట్ర కూట్లు యాదవ్స్ అప్పుడు మరి శూద్రులను ఎలా చేసారో మీ/మా బాపనోడికే తెలియాలి.

"మనుస్మృతి ప్రకారం చనిపోయిన దినాలలో ఆవు, ఎద్దు, చారల జింక, కృష్ణ జింక, చేపలు, పక్షులు, ఉడుము, ఖడ్గ మృగాలా, ఎలా ఒకొక్క దాని మాంసనికి ఒకొక్క లేకనా వాళ్లకు భోజనం దొరుకుతుంది అట ఇక్కడ ఇవి వీడికి ఇస్తే,,,,
""వివరంగా ఇంకా చెప్పలేము గాని చెప్తే సంవత్సరాలు పడుతుంది,,, ఈ rss కుట్రలు తగించుకోండి,,

"మర్వాడీ, గుజరాతి దారుణాలు నెక్స్ట్ మెసేజ్ లో పెడతాను,, అప్పుడు చెప్పు

ఇక ముస్లిమ్స్,,,, వీళ్ళ మత పిచ్చ తగా లని బీజేపీ కి ఓట్ వేస్తే, rss ఏమో దీని అవకాశం గా తీసుకోని మోడీని, దేశాన్ని ఆడిస్తోంది, దేశాన్ని తిరిగి ఈ విదేశీ బాపనోడి కబంద హస్తలలోకి కాబలిస్తోంది,,,,

పిక్క మన రెండో గుండె.

*మన ఆరోగ్యం…!

       *పిక్క మన రెండో గుండె..!*
                ➖➖➖✍️
```
ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెల్సుకుందాం రండి...

మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. 
అవే... మన పిక్కలు. 
గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. 
పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. 
కానీ... కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపునకు అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. 

అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు. 

ఇక భాషాశాస్త్రానికి వద్దాం. గుండెబలం అంటే ఇప్పటివరకూ అర్థం మనోబలం. కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. 
కానీ పిక్క గురించీ, గుండెలా అది నెరవేర్చే విధుల గురించీ వాస్తవం తెలిశాక పిక్కబలమూ ఇంచుమించూ గుండెబలంతో సమానమని మీకు వేరే చెప్పాలా?
 
పిక్కకు ఎందుకీ గుండె డ్యూటీలు...?

మన పిక్కను చూడండి. కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా అనిపించదూ? అనిపించడం ఏమిటి, అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. 
కారణం... గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకుపోవాలి. అలా చేసేందుకు పిక్క ఉపయోగ పడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్‌పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు.```

*పిక్క గుండె డ్యూటీలెలా చేస్తుందంటే...*```

పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) సహాయంతో మూసుకుపోతూ పైవైపునకే రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి.```
 

*ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే...*```

మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి.
``` 
*ఈ సమస్య ఎవరెవరిలో ఎక్కువ?*
 ```
చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి (ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా కదలకుండా ఇంటిపట్టునే ఉండేవారికి)ఎక్కువసేపు అదేపనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు మొదలైనవారికి) స్థూలకాయంతో బాధపడేవారికి గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు.```
 
*సమస్యను అధిగమించడానికి చేయాల్సిందేమిటి?*```

క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది).
మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి. (స్థూలకాయాన్ని తగ్గించుకోండి).
మీ కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి వేసేలా వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి. ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి.
```
*పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలివే...!*```

కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడం మనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావడం చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఏర్పడే పరిణామాలివే...కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపు వేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం)కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటంకాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటంకాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం(డీప్ వీన్ థ్రాంబోసిస్)✍️```
          

Tuesday, August 19, 2025

ఆవు మాంసం తినటం వలన మనిషికి కలిగే రోగాలు

జై గోమాత

ఆవు మాంసం తినటం వలన మనిషికి కలిగే రోగాలు



ప్రాచీన ధర్మశాస్త్రాలలో గోవధాన్ని మహాపాతకంగా చెప్పినా, ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఆవు మాంసం (Beef) తినడం వలన కలిగే వ్యాధులను నిర్ధారించింది.

వేదసూక్తాలు, స్మృతులు, పురాణాలు అన్నీ గోవధను మహాపాపం అని ఖండించాయి. ఉదాహరణకు:

మహాభారతం (అనుశాసన పర్వం, 116వ అధ్యాయం):
 "గోవధః పతతి నరకే" – గోవధకుడు నరకంలో పడతాడు.
మను స్మృతి (5.51):
 "మాంసం మాంసాదినః స్యాత్" – మాంసాహారం వల్ల మాంసం మాంసాన్ని తింటుంది, అంటే జీవిని చంపి ఆహారంగా తీసుకోవడం పాపకార్యం.
గోమాత హింసకుడు కేవలం ఆధ్యాత్మిక శాపానికి గురి కాక, శారీరక వ్యాధులతోనూ క్షీణించి నశించును.

1. హృద్రోగాలు (Heart Diseases)
ఆవు మాంసంలో అధికంగా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ఉంటాయి.
ఇవి రక్తనాళాల్లో కొవ్వు గడ్డలు (plaques) పెంచి, అథెరోస్క్లిరోసిస్ → హృద్రోగాలు, స్ట్రోక్ కలిగిస్తాయి.
2. క్యాన్సర్లు
WHO – International Agency for Research on Cancer (IARC, 2015) ప్రకటన ప్రకారం:
రెడ్ మీట్ (beef, pork, mutton) → Group 2A – probably carcinogenic to humans.
ప్రాసెస్ చేసిన మాంసం (sausages, beef jerky) → Group 1 – carcinogenic.
ముఖ్యంగా పేగు క్యాన్సర్ (Colorectal cancer), కడుపు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ.
3. మధుమేహం (Type-2 Diabetes)
రెడ్ మీట్ ఎక్కువ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.
దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికం.
4. ప్రాణాంతక సంక్రమణ వ్యాధులు
Bovine Spongiform Encephalopathy (BSE – Mad Cow Disease) → ఇది ఆవు మాంసం ద్వారా మనిషికి Creutzfeldt-Jakob Disease (vCJD) అనే మెదడు వ్యాధి కలిగిస్తుంది.
Tapeworm (Taenia saginata) → పాకిన బీఫ్ వల్ల పేగులో పెద్ద పరాన్నజీవులు ఏర్పడి, పోషకాహార లోపం, బలహీనత.
E.coli, Salmonella, Listeria infections → ఆహార విషబాధ, విరేచనాలు, మూత్రపిండ వైఫల్యం.
5. జీర్ణవ్యాధులు
ఆవు మాంసం బరువైన ఆహారం → acid reflux, gastritis, IBS (Irritable Bowel Syndrome) పెరుగుతాయి.
6. కీళ్ల నొప్పులు & వాపులు
అధికంగా బీఫ్ తినడం వలన రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది → గౌట్ (joint swelling, arthritis).
 భగవంతుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఆరోగ్య అభివృద్ధి, ఆదాయాభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆనందం ఇచ్చే గోమాతను హింసించి చంపి అనారోగ్య భారతావని సాధిస్తున్నాం. మన సంపాదన ఆస్పత్రి పాలు చేసుకుంటున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం.

 గోమాత రక్ష సర్వజగద్రక్ష

 ధర్మస్య జయోస్తు

సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .

సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .
  
 వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 
సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 
              
. ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 
          
. ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.
         
. సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో "గృధసీవాతం" అని పిలుస్తారు .
 
 లక్షణాలు - 
    
. నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.
            
. ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .
              
. సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.
  
 సలహాలు - సూచనలు - 
    
. సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 
           
. వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 
         
. సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.
       
           

హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది అనటానికి ఎన్నో ఉదాహరణలు

హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది అనటానికి ఎన్నో ఉదాహరణలు...!!!
1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం. 
2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.
3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం 😘
పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..
4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక,ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..
5. 🌞🌝ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి *సూపర్ నాచురల్ ప్రొటెక్షన్* తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..
 6. 🌞🌞. అగ్ని నుంచి వచ్చే *తేజస్సు* తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..
7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..
8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి 
👉🏻gender transformation.
 9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..
10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..
👉🏻ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?
👉🏻ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా *లక్షల సంవత్సరాల క్రితమే* మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?
👉🏻ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు,.కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?
ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..
కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము*. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని *existency ఉండి తీరుతుంది..
ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, *అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం*, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..
👉🏻భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?
👉🏻భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
👉🏻భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
👉🏻ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)
👉🏻విద్యుత్* మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)
👉🏻విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)
👉🏻భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే
👉🏻గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన
వాల్మీకి మహర్షి మనవాడే
👉🏻రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు
👉🏻కాస్మోలజీ చెప్పిన కపిలుడు
👉🏻అణువులు గురించి వివరించిన కణాదుడు
👉🏻DNA గురించి చెప్పిన బోధిధర్మ
👉🏻మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి
👉🏻మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు
👉🏻సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు...!!!
ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా ఇది నిజం
................... సర్వే జనా సుఖినోభవంతు 🙏🥰🙏

Monday, August 18, 2025

ధాతు పౌష్టిక లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -

ధాతు పౌష్టిక లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -

         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 

  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 

 * శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 

 * నీరసం , నిస్సత్తువ తగ్గును . 

 * శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 

 * గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 

 * నోటివెంట రక్తము పడుట తగ్గును . 

 * శరీరము నందు రక్తము వృద్ది అగును . 

 * రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 

 * థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 

 * మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 

 * ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 

 * ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 

 * కాలేయమునకు బలమును ఇచ్చును. 

 * ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 

 * వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 

 * గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 

 * నరాల సంబంధ దోషాలను నివారించును . 

 * కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 

 * చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 

• చిన్న పిల్లలలో అద్భుతమైన జ్ఞాపకాలు శక్తి, శరీర పుష్టి, రోగనిరోధక శక్తి పెంపోందించును. 

•. మగవారిలో మరియు ఆడవారిలో కలుగు హార్మోన్ సంబంధ సమస్యలకు ఇది అత్యద్భుతముగా పనిచేయును. 

•. నాడీ సంబంధ దోషాలు నివృత్తి అగును. శరీరము నందు వ్యాపించి ఉన్న 72 వేల నాడులు శుద్ధి అగును. 

•. జ్ఞానేంద్రియల శక్తి పెరుగును. 

•. మగవారిలో వీర్యశక్తి పెరుగును. వీర్యకణాల ఉత్పత్తి, శక్తి పెరుగును. 

•. సంసార సంబంధ బలహీనత తగ్గును. 

°. కీల్లానొప్పుల మీద కూడా ప్రభావాన్ని చూపించును.  

పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 

      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 

ముఖ్య గమనిక - 

      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 

          

Tuesday, August 12, 2025

మాట మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది

*మీ మాట మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది*


జీవితంలో మాటకు ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిది. మనం మాట్లాడే విధానం మన గుణాన్ని ప్రతిబింబిస్తుంది. స్నేహమైనా, శత్రుత్వమైనా మాటల వల్లే మొదలవుతాయి. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, ఎదుటివారి మాటలు అంగీకరించకపోవచ్చు, కానీ మన మాటలు మనల్ని వారికి దూరం చేయకుండా ఉండాలి. ముఖ్యంగా సమాజ సేవకులకు, నాయకులకు మాటతీరు చాలా ముఖ్యం. మంచి మాటతీరుకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవేమిటో చూద్దాం.

*1. సత్యమైన మాటే విలువైనది*
మాట సత్యంగా ఉన్నప్పుడు పలికే పలుకులో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. దాపరికం లేకుండా మాట్లాడే మాట స్వచ్ఛమైన జలపాతం లాంటిది. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. ఒకవేళ మాటల వల్ల విభేదాలు వచ్చినా, మన నిజాయితీ, సత్యవాక్కు ఎదుటివారిపై మనపై గౌరవాన్ని పెంచుతాయి. అబద్ధాలు చెబుతున్నామని తెలిస్తే, మన విలువ పాతాళంలోకి పడిపోతుంది.

*2. మృదువైన మాటే మంత్రం*
మంచి చెప్పినా మృదువుగా ఉండాలి. చెప్పిన మాట వినేవారికి అనునయంగా ఉండాలి. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా, మృదువైన, మర్యాదకరమైన మాటలకు వారు ఆకర్షితులవుతారు. అరమరికలు లేకుండా మృదువుగా మాట్లాడి చూడండి. మీరు చెప్పిన మాటే మంత్రంగా మారిపోతుంది.

*3. కవుల, పెద్దల మాట*
మాట ప్రాముఖ్యతను గురించి కవులు, పెద్దలు కూడా ఎన్నో చెప్పారు. భక్త రామదాసు (కంచర్ల గోపన్న) గారు ఇలా అంటారు:

"చెప్పుటకు మాట, పలికిన పల్కుకు, చేసిన క్రియకు నిర్వచనమున్నది."

దీని అర్థం: మనం మాట్లాడే ప్రతి మాటకు, పలికే ప్రతి పల్కుకు, చేసే ప్రతి పనికి ఒక నిర్వచనం, ఒక విలువ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

అలాగే వేమన తన పద్యంలో మాట విలువను ఇలా వివరించాడు:

"మాటకు ప్రాణము సత్యము, మాటకు ప్రాణము మధురము, మాటకు ప్రాణము వినయము, మతిలేని వాని మాటకు లేదు విలువ."

ఒక మాటకు నిజం, తీయదనం, వినయం ప్రాణం లాంటివి. ఈ లక్షణాలు లేకపోతే, తెలివిలేని వాడు మాట్లాడే మాటకు విలువ ఉండదు.

సుమతీ శతకంలో కూడా ఈ విషయాన్ని ఇలా హెచ్చరించారు:

"కఠినమైన పలుకులు కత్తి లాంటివి."

కఠినమైన మాటలు మన మనసును గాయం చేస్తాయి.

*4. మాట మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?*
నిజమే, ఎంతమంది చెప్పినా మాట వల్లే మన విలువ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించడంలో మన విద్యార్హతలు, ప్రతిభతో పాటు మాటతీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మాట ఒకరిని నాయకుడిని చేస్తుంది, లేదా నాయకత్వం నుండి కిందకు పడదోస్తుంది.

కొందరు అహంకారంతో, అధికార దర్పంతో మాట్లాడతారు. తమను ప్రత్యేకమైన మనుషులుగా భావించి ఇతరులను తక్కువగా చూస్తారు. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మాట వల్ల విడిపోయిన బంధాన్ని తిరిగి కలపాలంటే మళ్లీ మాట సహాయమే తీసుకోవాలి.

"కాలు జారితే పర్వాలేదు, నోరు జారవద్దు" అని పెద్దలు చెబుతారు. "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది" అంటారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అయినా, అహంకారం అనే అంధకారంలో పడి వాటిని విస్మరిస్తుంటాం.

వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు మన మాటే. మనం ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది మన వివేకంపై ఆధారపడుతుంది. దాన్ని బట్టే మనం సమస్యలను పరిష్కరించగలుగుతాం లేదా సమస్యలను సృష్టించుకుంటాం.

నెమ్మదిగా చంపేస్తున్న చెడు అలవాట్లు - శాస్త్రీయ కారణాలు.._*

*_💥 నెమ్మదిగా చంపేస్తున్న చెడు అలవాట్లు - శాస్త్రీయ కారణాలు.._*

*_చివరికి చనిపోతాం అని ఒక్కసారిగా కాదు, ప్రతి రోజు కొంచెం కొంచెంగా మనం మమ్మల్ని మేమే ఎలా నాశనం చేసుకుంటున్నామో తెలుసా? మన అలవాట్లే-అవే మమ్మల్ని నెమ్మదిగా చంపేస్తున్నాయి. శాస్త్రం వాటిపై స్పష్టంగా వివరాలు అందించింది._*

*_🪷 ఇప్పుడు చూద్దాం :_* 

 *_1. కదలకపోవడం (Physical Inactivity) :_* 

*_ఎక్కువసేపు కూర్చునే పని, వ్యాయామానికి దూరంగా ఉండడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. దీని ప్రభావంగా గుండెజబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు తలెత్తుతాయి._*

 *_2. ధూమపానం మరియు మద్యపానం (Smoking & Alcohol) :_* 

*_సిగరెట్‌లో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీయగా, గుండెకు రోగాలను కలిగిస్తాయి. మద్యం కాలేయాన్ని, మెదడును నెమ్మదిగా నాశనం చేస్తుంది._*

 *_3. నిద్రలేమి (Sleep Deprivation) :_* 

*_తక్కువ నిద్ర లేదా రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఒత్తిడి పెరిగి, రోగనిరోధక శక్తి తక్కువవుతుంది._*

 *_4. మానసిక ఒత్తిడి (Chronic Stress) :_* 

*_ఒత్తిడివల్ల కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఆందోళన వంటి మానసిక సమస్యలు వస్తాయి._*

 *_5. అధిక చక్కెర సేవనం (Excess Sugar) :_* 

*_చక్కెర ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది ‘హిడెన్ కిల్లర్’ అనిపించుకుంటోంది._*

 *_6. మానసిక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం (Neglecting Mental Health) :_* 

*_నిరాశ, ఒంటరితనం, ఆందోళన వంటివి శారీరక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మానసిక ప్రశాంతత లేకపోతే శరీరం సరిగ్గా పనిచేయదు._*

 *_7. జంక్ ఫుడ్ అధికంగా తినడం (Unhealthy Eating Habits) :_* 

*_బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, సాఫ్ట్ డ్రింకులు వంటి వాటిలో ఉన్న అధిక కొవ్వులు, సోడియం, ప్రిజర్వేటివ్‌లు శరీరాన్ని కాలుష్యంగా మార్చేస్తాయి._*

 *_8. ఎక్కువ స్క్రీన్ టైం (Too Much Screen Time) :_* 

*_మొబైల్, ల్యాప్‌టాప్, టీవీల ముందు గంటల తరబడి గడపడం వల్ల కంటి ఆరోగ్యం, నిద్ర గోచి, మానసిక ఆందోళన సమస్యలు కలుగుతాయి._*

 *_9. ఉదయం అల్పాహారం మానేయడం (Skipping Breakfast) :_* 

*_ప్రధానమైన భోజనం మానేయడం జీవక్రియను మందగిస్తుంది. రోజంతా అలసట, శక్తిలేమి ఎదురవుతుంది._*

 *_10. తగినంత నీరు తాగకపోవడం (Dehydration) :_* 

*_నీరు తక్కువగా తాగడం వల్ల తలనొప్పి, అలసట, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. నీరు శరీరానికి ప్రాణం లాంటిది._*

 *_11. తప్పు భంగిమలు (Bad Posture) :_* 

*_తప్పుగా కూర్చోవడం, నిలబడడం వలన వెన్ను, మెడ నొప్పులు వస్తాయి. దీర్ఘకాలికంగా ఆస్టియోపోరోసిస్‌కు దారి తీస్తుంది._*

 *_12. సోషల్ మీడియా అతి వినియోగం (Social Media Addiction) :_* 

*_ఇతరులతో పోల్చుకునే ఆలోచన, ‘ఫేక్ లైఫ్’ భావన వల్ల అసూయ, మానసిక నిస్పృహ పెరుగుతుంది._*

 *_13. అసహ్యమైన స్నేహాలు (Toxic Friendships) :_* 

*_నమ్మకంగా అనిపించిన వారు చెడు అలవాట్లకు ప్రేరేపిస్తే, అది జీవితాన్ని నశింపజేసే బాంబులా మారుతుంది._*

 *_14. స్వచ్ఛమైన వాతావరణం లేకపోవడం (Lack of Fresh Air & Sunlight) :_* 

*_విటమిన్-డి లోపం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. రోజులో కనీసం 15 నిమిషాలు వెలుతురు, గాలి అవసరం._*

*_🪷 ముగింపు సందేశం :_* 

*_ఈ చెడు అలవాట్లు ఒక్కరోజులో పెద్ద సమస్యలుగా మారవు. కానీ రోజురోజుకీ వీటిని అలవాటుగా మలచుకుంటే అవే మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా చంపేస్తాయి. శాస్త్రం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం జీవించటం ద్వారా ఆరోగ్యవంతమైన, ఉజ్వలమైన జీవితం సాధ్యం!_*

మర్మశాస్త్ర విజ్ఞానం - వివరణ .

మర్మశాస్త్ర విజ్ఞానం - వివరణ . 
       
 మానవ శరీరం నందు ప్రాణాధారములు అగు కొన్ని ముఖ్యస్థానములు కలవు. వీటినే మర్మస్థానములు అని అంటారు. ఈ మర్మస్థానముల గురించి తెలుసుకొనుట వైద్యులకు , వైద్యేతరలకు కూడా చాలా అవసరం . విద్రది వంటి శారీరక వ్రణములు మరియు కొన్నిరకాల వ్యాధులు ముందు ఈ మర్మస్థానములకు కొంతదూరమున పుట్టి అవి మర్మస్థానములకు చేరగానే ప్రాణములు హరించుచున్నవి. శస్త్రాల వలన తగిలిన దెబ్బలు , అనుకోకుండా మర్మస్థానముల యందు దెబ్బలు తగలడం వలన నేత్రములు , చెవులు , ముక్కు మొదలగు జ్ఞానేంద్రియములు చెడి గుడ్డితనం , చెముడు మొదలగునవి కలుగుట , హస్తములు , పాదములు మొదలగు కర్మేంద్రియాలు చెడి సొట్ట , కుంటి మొదలగు దుష్ఫలితాలు కలుగుట , తీవ్రవేదన కలుగుట , కొన్ని అసాధ్యవ్యాధులు సంభవించి చివరకి ప్రాణములు పోవుట సంభవించును . 
            
. వైద్యుడు ప్రధానంగా మర్మవిజ్ఞానం కలిగి ఉండవలెను . ప్రమాదకరమగు వ్యాధి మర్మస్థానము నందు జనించినదా ? లేక మర్మస్థానమునకు చేరనున్నదా ? ప్రాణములు హరించుటకు ఎంత వ్యవధి ఇంకనూ ఉన్నది ? అని తెలుసుకుని శీఘ్రముగా ఫలితాలను ఇచ్చు ఔషధాలను ఉపయోగించి వ్యాధి మర్మప్రదేశమునకు చేరక మునుపే చికిత్స చేసి రోగిని మృత్యువు దరిచేరకుండా కాపాడవచ్చు . కావున వైద్యుడు తప్పకుండా మర్మవిజ్ఞానం తెలుసుకుని ఉండవలెను 
                  
. ఈ మర్మవిజ్ఞానం ప్రధానంగా శస్త్రచికిత్సకు అవసరము . శస్త్రచికిత్స చేయునపుడు మర్మస్థానములను గుర్తెరిగి చేయవలెను . లేనిచో యావజ్జీవితము అంగవైకల్యము లేదా కొద్దిరోజులకు ప్రాణములను హరించు వ్యాధులు , అసాధ్యవ్యాధులు చివరికి మరణమును కలిగించును. ఇవి వెంటనే జరగకపోవటం చేత మరియు మర్మవిజ్ఞానం లేకపోవుట చేత ఈ శస్త్రకర్మ వలన లేక దెబ్బతగులుట వలన లేక పుండు పుట్టుట వలన మరణం సంభవించింది అని వైద్యులు గాని రోగులు గాని భావిస్తారు. నిజానికి అది మర్మస్థాన సంబంధ మరణం అని గుర్తించరు . 
              
. మర్మశాస్త్ర ప్రకారం అకస్మాత్తుగా హస్తపాదములందున్న , అంగుష్ట మధ్యముల యందలి క్షిప మర్మములకు , అరికాలు , అరచేయి మధ్యమము నందు ఉండు తల , హృదయ మర్మములకు దెబ్బ తగిలిన యెడల ఈ 8 మర్మలును కొంతకాలం పిదప ప్రాణాలను హరించును . 15 నుంచి 30 రోజులలో దెబ్బ యొక్క తీవ్రతనుబట్టి ప్రాణాలను తప్పక తీయును . కావున తెలిసిన వైద్యుడు వెంటనే చేతి మర్మకు దెబ్బ తగిలిన మణిబంధము వద్ద , పాదములోని మర్మలకు దెబ్బ తగిలిన చీలమండ వద్దను హస్తపాదములను తీయవలెను అలా చేసిన మాత్రమే కనీసం ప్రాణం అయినను దక్కును . 
           
. మర్మలకు దెబ్బతగలని యెడల ఎంత పెద్దపెద్ద దెబ్బలు పాదములు , తొడలు , భుజములు , పొట్ట , శిరస్సు వంటి వాటికి తగిలినను ప్రాణాపాయం ఉండదు. కాని మర్మకు దెబ్బ తగిలినను దెబ్బ పైకి కనపడనంతటి చిన్నది అయినను ప్రాణములను తీయును . కావున మర్మల పైన దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించవలెను . చికిత్స చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు వ్యాధులను గుర్తించి రోగులను కాపాడవలెను . 
       
. శరీరంలో మొత్తం 107 మర్మలు ఉండును. వీటి గురించి మరొక పోస్టు నందు వివరిస్తాను. నా తరువాతి పోస్టు నందు ఆయుర్వేదం నందు గల "శిరావేధ " అనే ఒక గొప్ప చికిత్స గురించి వివరిస్తాను ఇది ప్రపంచములో ఏ వైద్యవిధానములో లేదు . ఈ వైద్యవిధానము గురించి అత్యంత విలువైన , అరుదైన సమాచారం మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 


Friday, August 8, 2025

వంట పాత్రలు వాటి విశేషాలు



ఇంకా కొన్ని పాత్రలు గురించి మిగిలింది కదా ఈ రోజు వాటి గురించి ఒక చూపు చూద్దాం.
ప్రతి ఇంట్లో 99 శాతం ఈ పాత్ర ల దే సింహభాగం.అంటే మెజారిటీ అని అర్థం.(అపుడపుడు మనం మరచి పోతున మంచి తెలుగు పదాలు కూడా గుర్తు చేసుకుందాం.) అవే స్టిల్ మరియు అల్యూమినియం పాత్రలు. మన వంటింటి హీరో,హీరోయిన్(కథ నాయకుడు,నాయకి).వీరి ఇద్దరిలో మనకి తెలియ కుండా మన వంటింట్లో ఒక పెద్ద విలన్ కూడా వున్నడు. సినిమా అంత ఐ పోయిన తర్వాత విలన్ ఎవరో కామెంట్ చేయండి.

ఈ రోజు స్టీల్ (Steel), అల్యూమినియం పాత్రల గురించి నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు , వాటి చరిత్ర, తయారీ, ఉపయోగం, అలాగే లాభ–నష్టాలు..చెప్పే ప్రయత్నం చేస్తాను ... ఇవి చాలా ముఖ్యమైన విషయాలు.మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో వండే పాత్ర కూడా అంతే ముఖ్యం. ఈ ఆర్టికల్ చదివిన తరువాత మీరే నిర్ణయం తీసుకోండి. ఏ పాత్రలు ఇంటిలో వాడాలి అని. ఈ రెండిటిలో ఎవరికి హీరో పాత్ర(లు) ఎవరికి హీరోయిన్ పాత్ర(లు) ఇవ్వాలో అర్థం కావటం లేదు..

*స్టీల్ పాత్రల చరిత్ర*

 స్టీల్ అనేది ఇనుము (Iron) మరియు కార్బన్ (Carbon) మిశ్రమం. దీని ఉత్పత్తి సుమారు 19వ శతాబ్దం మధ్యకాలంలో Bessemer process అనే విధానంతో విస్తరించింది.

భారతదేశంలో: 20వ శతాబ్దం ప్రారంభంలో స్టీల్ తయారీ కర్మాగారాలు (టాటా స్టీల్ – 1907) ఏర్పడడంతో స్టీల్ పాత్రలు విస్తృతంగా లభించాయి.

వంట గదిలో ప్రవేశం: మొదట్లో మట్టి, కంచు, రాగి, ఇత్తడి పాత్రలే ప్రధానంగా వాడేవారు. కానీ స్టెయిన్‌లెస్ స్టీల్ (Stainless Steel) 1920ల నుండి తుప్పు పట్టదు, మెరుపు తగ్గదు, తేలికగా శుభ్రం అవుతుంది కాబట్టి ఇళ్ల లో కి వేగంగా వచ్చేసింది.

*స్టెయిన్‌లెస్ స్టీల్ తయారీ*

ప్రధాన మిశ్రమం: ఇనుము (Fe) + 10–12% క్రోమియం (Cr) + కొద్దిగా నికెల్ (Ni).

క్రోమియం కారణంగా స్టీల్ రస్ట్ పట్టకుండా ఉంటుంది.

నికెల్ వలన మెరుపు, సాఫ్టుగా ఉండే ఉపరితలం వస్తుంది.

*స్టిల్ పాత్రల స్వభావం*

1. తుప్పు పట్టదు – తేమ, నీరు తగిలినా పాడవదు.
2. రసాయనాలు లేవు – వంటలో ఉన్న ఆమ్లం/ఉప్పు తాకినా రియాక్షన్ తక్కువ.
3. బలంగా, దీర్ఘకాలం ఉపయోగం – పడిపోయినా పగలదు.
4. శుభ్రపరచడం సులభం – సబ్బుతో లేదా డిటర్జెంట్‌తో సులభంగా శుభ్రం అవుతుంది.
5. ఆహారం రుచి మార్చదు – రాగి, అల్యూమినియం లాగా రుచి లేదా రంగు మార్చే అవకాశాలు తక్కువ.
6. వివిధ రకాల వంటకాలకు అనువైనది.
7. మెరుగైన స్టీల్ ఖరీదు ఎక్కువ . 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ధర ఎక్కువ ఉంటుంది.
8. చాలా పాత లేదా నాసిరకం స్టీల్‌లో క్రోమియం, నికెల్ తక్కువ మోతాదులో ఆహారంలోకి వెళ్లే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆమ్లపదార్థాలు (ఉదా: టమోటా పులుసు) వండితే. పాతవి ఉంటే వాడక పోవడం మంచిది.

*5. జాగ్రత్తలు*
ఎల్లప్పుడూ ఫుడ్ గ్రేడ్ (304 లేదా 316 గ్రేడ్) స్టీల్ వాడాలి.

కొత్త పాత్రలు మొదట వేడి నీటిలో ఉప్పు/నిమ్మకాయతో మరిగించి వాడితే లోపల ఉన్న ఫ్యాక్టరీ ఆయిల్ పోతుంది.

స్టీల్ రకాల (Grades) గురించి చెబితే, వాటి తేడాలు లోహ మిశ్రమం, ఉపయోగం, ధర, వాటి మనిక పై ఆధారపడి ఉంటాయి. ఒక సారి వాటి గురించి కూడా చూద్దాం.

*స్టీల్ పాత్రలు రకాలు*
(వంట పాత్రలలో ఎక్కువగా వాడేవి)
రకం / గ్రేడ్ మిశ్రమం లక్షణాలు, వంటకు అనుకూలమా? కదా అనే విషయలు ఒక సారి చూద్దాం.. 

*304 గ్రేడ్* (18/8) 18% క్రోమియం + 8% నికెల్ రస్ట్ పట్టదు, ఆమ్ల పదార్థాలకు సేఫ్, దీర్ఘకాలం బలంగా ఉంటుంది . అత్యంత మంచిది ఫుడ్ గ్రేడ్.అత్యంత అంటే అని పాత్రల కంటే కాదు.ఈ స్టీల్ గ్రేడ్స్ లో ఈ గ్రేడ్ .మనకు ఎపుడు కంచు మాత్రమే అత్యంత మంచిది.
*316 గ్రేడ్* (18/10) 18% క్రోమియం + 10% నికెల్ + మోలిబ్డినం. సముద్ర ఉప్పు, ఆమ్ల పదార్థాల వంటలకు అనుకూలం . ప్రీమియం క్వాలిటీ – పుల్లని వంటకాలకు అనుకూలం.
*430 గ్రేడ్* 16–18% క్రోమియం, నికెల్ లేని తక్కువ ఖరీదు, రస్ట్ నిరోధకత తక్కువ, ఆకర్షణీయ మెరుపు వంటలో కంటే బౌల్స్, ట్రేలకు బాగుంటుంది.
*202 గ్రేడ్* 17–19% క్రోమియం + మాంగనీస్ చౌక, కానీ ఉప్పు/ఆమ్ల వంటల్లో ప్రమాదం ❌ దీర్ఘకాలం వంటకు సేఫ్ కాదు.

*గుర్తించే విధానం*
ఫుడ్ గ్రేడ్ స్టీల్ సాధారణంగా "SS 304" లేదా "18/8" అని ముద్రించబడి ఉంటుంది.

నికెల్ కంటెంట్ ఉన్నవి (304, 316) మెరుగైన బలం మరియు తుప్పు నిరోధకత కలిగి ఉంటాయి.

202 లేదా 430 గ్రేడ్ పాత్రలు చౌకగా ఉంటాయి కానీ ఎక్కువ కాలం ఆహారంతో రియాక్షన్ జరగవచ్చు. కనుక వీటి విషయం లో కొంచం జాగ్రత్తగా ఉండాలి.

మాగ్నెట్ 304, 316 గ్రేడ్ స్టీల్‌కి బాగా అతకదు.

202, 430 గ్రేడ్ స్టీల్‌కి మాగ్నెట్ ఎక్కువగా అతుకుతుంది.

ఇప్పుడు ...

*అల్యూమినియం పాత్రలు (చరిత్ర)*

అల్యూమినియం లోహం 19వ శతాబ్దం మధ్యలో శాస్త్రవేత్తలు Electrolysis పద్ధతిలో తయారు చేశారు.
మొదట్లో అల్యూమినియం చాలా అరుదుగా దొరికేది కాబట్టి బంగారంకంటే ఖరీదుగా ఉండేది.
1886లో Hall-Héroult Process కనుగొనడంతో అల్యూమినియం ఉత్పత్తి చవకగా మారింది.
భారతదేశానికి ఇది బ్రిటిష్ కాలం లో, 20వ శతాబ్దం ప్రారంభంలో వచ్చింది.

అప్పటివరకు రాగి, ఇత్తడి, ఇనుప పాత్రలు వాడుతున్న ప్రజలు, చవకగా ఉండే అల్యూమినియం పాత్రలకు మారారు.
 *అల్యూమినియం పాత్రలు వాడకం వల్ల నష్టాలు.*

టమాటా పచ్చడి, నిమ్మరసం కలిగిన కూర వండితే అల్యూమినియం కరిగి ఆహారంలోకి వెళ్లే అవకాశం ఉంది.
ఒక పరిశోధనలో టమాటా కూర ను అల్యూమినియం పాత్రలో 6 గంటలు ఉంచితే, ఆహారంలో 2 నుండి 6 mg/L అల్యూమినియం పెరిగిందని తేలింది. ఇది తరచుగా జరుగుతూ ఉంటే, సంవత్సరాల తర్వాత శరీరంలో దీని నిల్వ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యం గా పులుపు, వెన్నిగర్ తో చేసే వంటలు అల్యూమినియం పాత్రలో చేయడం నిలవ చేయడం చాలా ప్రమాదం.

*ఏ పరిస్థితుల్లో ప్రమాదం ఎక్కువ?*

1. పాత, గీతలు పడిన అల్యూమినియం పాత్రలు వాడితే.
2. పులుపు కూరలు లేదా పచ్చడ్లు ఎక్కువసేపు అందులో ఉంచితే.
3. వంట చేసిన ఆహారం రాత్రంతా లేదా ఎక్కువసేపు అందులోనే ఉంచితే.

*మనుషులపై ప్రభావం (అధ్యయనాల ప్రకారం)*

మన శరీరం కొంత అల్యూమినియం ను మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది.

సాధారణ వంటలో వచ్చే చాలా తక్కువ మోతాదు ఎక్కువ మందికి వెంట నే హాని చేయదు.కానీ దీర్ఘ కాలంలో మాత్రం చాలా ప్రభావాలు ఎదుర్కోక తప్పదు.

 *దీర్ఘకాలిక వాడకం వలన కలిగే సమస్యలు*

నాడీ సంబంధిత సమస్యలు: కొన్ని పరిశోధనల లో అల్యూమినియం అధికంగా శరీరంలో పేరుకుపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే వ్యాధులతో సంబంధం ఉండొచ్చని సూచిస్తున్నాయి.

ఎముకల బలహీనత: అల్యూమినియం అధిక మోతాదు వలన కాల్షియం నీ శరీరం తీసుకోవడం (Calcium absorption) తగ్గించవచ్చు.

మూత్రపిండ సమస్యలు: Kidney పనిచేయడంలో సమస్యలున్న వారికి అల్యూమినియం బయటకు వెళ్లకుండా పేరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. 

అల్యూమినియం లోహం సాధారణంగా పైపరితలంపై Al₂O₃ (అల్యూమినియం ఆక్సైడ్) పొర ఏర్పరచుకుంటుంది. ఇది రక్షణ పొరలా పనిచేస్తుంది.

కానీ ఆమ్లపదార్థాలు (ఉదా: టమోటా, నిమ్మరసం, పులుసు, చింతపండు) లేదా ఎక్కువ ఉప్పు ఉన్న వంటకాలు వండినప్పుడు ఈ పొర కరుగుతుంది.

అప్పుడు అల్యూమినియం అయాన్లు (Al³⁺) ఆహారంలోకి చేరుతాయి. 
*చేరిన తరువాత ఏమి అవుతుంది?*
గోవింద గో...విందా ..
ఇంకా మీకు అర్థం అయింది అనుకుంటున్నాను. ఇపుడు చేపండి ఎవరు మన వంటింటి విలన్ .
ఇంకా ఎన్నో విషయాలు
 ఉనవి.పైన చెప్పినవి నాకు తెలిసిన కొన్ని మాత్రమే.కనుక మీ వీలును బట్టి ఇంట్లో ఒకో అల్యూమినియం గిన్నె ను బయటకు సాగానంపె పని మొదలు పెటండి. పాలను , నెయ్యి నీ ఎపుడు ఈ పాత్రలో వేడి చేయకూడదు.నిలువ చేయకూడదు.పాల ట్రాన్స్ పోర్ట్ విషయం లో ఈ క్యాన్స్ చాలా మంది వాడతారు. Transport కొంచం ఈజీగా ఉంటుంది అని ఇంకా కొని కారణాల వలన..మనం దీని ఐతే ఇప్పట్లో మార్చ లేము.ఈ విషయం లో అంత ప్రమాదం లేదు అని అనుకుంటున్నాను.ఎందుకంటే ఎక్కువ సేపు క్యాన్ లో ఉంచాం,వేడి లేదు,కనుక. కానీ పెళ్లి లు పంక్షన్ లో మొత్తం అని వీటితోనే వంటలు..ఇంకా ఎక్కువ చెప్పలేను..దీని గురించి.. రాజీవ్ దీక్షిత్ గారు కూడా చాలా సందర్భాల లో వీటి గురించి చెప్పారు.ఇంకో ఆసలు పర్సన్ గురించి చెప్పడం గురించి మరచి పోయాను.ప్రెషర్ కుక్కర్ సమయం వచ్చినపుడు చెబుతాను. దీని గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు మన విజయరాం గారు కూడా చాలా సందర్భాలలో వీటి గురించి చేపి,మీటింగ్స్ ,పెళ్లి లలో ఇత్తడి పత్రాలలో చేయించడం మొదలు పెట్టారు.ఒక మార్పుకు నాంది పలికారు.మార్పు కు శ్రీకారం చుట్టిన గురువు గారికి పాదభివందనలు..మీతో సాగిన 4 సంవత్సరాల ప్రయాణం చిరస్మరణీయం. కొన్ని గొప్ప వారి పరిచయాలు మన జీవితంలో ఎన్నో మార్పులకు,మంచికి కారణం అవుతావి.ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను.లాస్ట్ మంత్ లో ఒక ఆయర్వేదం మీటింగ్ కి మూడు రోజులు నేను నా మిత్రుడు క్రాంతి అన్న వెళ్ళటామ్ జరిగింది. మాకు అక్కడ ఉండటానికి వసతి కూడా ఇచ్చారు.కానీ క్రాంతి అన్నకి కి పక్కనే ఉండే ఒకరు బాగా పరిచయం ఉండటం తో వారి ఇంట్లోనే ఆ రెండు రాత్రులు పడుకునము. వారి పేరు తుమ్మేటి రాగోత్తమ రెడ్డి గారు.చాలా మంది ఇంటి పంట చేసే వారికి బాగా పరిచయం ఉంటుంది.నాకు బాగా పరిచయం లేదు కానీ వారు నన్ను గుర్తుపడతారు.ఆయన ఇంటి పంట గురించి చాలా పుస్తకాలు,వీడియోలు చేశారు. ఇవే కాకుండా చాలా పుస్తకాలు కూడా రాశారు.ఆయన చాలా పెద్ద రచయిత అని అక్కడికి వెళ్ళినపుడు తెలిసింది.ఎన్నో తెలియని విషయాలు వారు చేపడ్డం, సరదాగా రెండు రోజులు గడిసి పోయింది.నేను అపుడు ఒకటి గమనించాను ఆయన ఉదయం 3.30 లేచి 6 వరకు ఫోన్ లో ఏదో టైప్ చేయడం.రెండు రోజులు గమనించాను.వారు ప్రతి రోజు facebook లో గుడ్ మార్నింగ్ అని ఏదో ఒక అంశం పై ఆర్టికల్స్ రాస్తారు అని.ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చి ఫేస్ బుకో లో చూసాను.చాలా ఉన్నాయి.కొన్ని చదివాను.నాకు అనిపించింది మనం కూడా రాస్తే ఎలా ఉంటుంది అని. దేని గురించి రాయాలి అని ఒక ఆలోచన.మన పని గురించి రాస్తే బావుంటుంది అనుకూన.రాయాలి అంటే అనుభవం ఉండాలి కదా ఎలా మొదలు పెట్టాలి ఏమి రాయాలో..ఓ రెండు రోజులు గడిసి పోయినవి.తెలిసిన విషయం చెప్పటానికి అనుభవం తో పని ఏముంది అనిపించింది. అలా మొదలు అయింది ఈ మెసేజ్ ల పర్వం.. కొంత మంది కలయిక పరిచయాలు మనకు తెలియకుండానే చాలా ప్రభావాలు చూపిస్తాయి. అలా నా జీవితం లో చాలా ఉన్నవి.సందర్భం వచ్చినపుడు చెబుతాను.
 
 

Thursday, August 7, 2025

గోమాత లో 33 కోట్ల దేవతలు ఉన్నారా?

జై గోమాత

 గోమాత లో 33 కోట్ల దేవతలు ఉన్నారా?

 ధర్మ ప్రచారకులు అందరూ గోమాత విషయంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని సర్వదేవతా సమాహారం అని వర్ణిస్తూ ఉంటారు. 

 గోమాతను ప్రాణిగా కాకుండా సర్వ దేవత శక్తుల సమ్మేళనమైన జీవశక్తి గా భావించటం ఒక ఆధ్యాత్మికమైన సూత్రం. వేద, పురాణాలు, ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు ఈ భావనకు మూలం.

 33 కోట్లు దేవతలు అంటే 330 మిలియన్లు సంఖ్యా కాదు. ఈ పదబంధాన్ని భాషా ఆత్మకంగా అర్థం చేసుకోవాలి.

ప్రాచీన వేదకాలంలో "త్రయస్త్రింశత్" దేవతలు అని చెబుతారు. అంటే 33 దేవతలు: 

 33 మంది దేవతలు ఎవరు

 అష్ట వసువులు ప్రకృతి తత్వాలు( జల అగ్ని వాయు మొదలైనవి) 8

 ఏకాదశ రుద్రులు ప్రాణ తత్వాలు 11

 ద్వాదశ ఆదిత్యులు కాల తత్వాలు 12 

 అశ్వినీ దేవతలు ఆరోగ్య దేవతలు 2

 ఎనిమిది ప్రకృతి తత్వాలు, 11 ప్రాణ తత్వాలు, 12 కాల తత్వాలు, రెండు ఆరోగ్య దేవతలు మొత్తము 33 రకాల శక్తులు కలిగిన స్వరూపమే గోమాత. విశ్వం నడవడానికి కూడా ఈ 33 రకాల శక్తులు అవసరం. అందుకే గోమాత సర్వదేవతా సమాహారం అయింది. భక్తి పరంగా 33 కోట్ల దేవతలు అని సంబోధిస్తారు. విశ్వశక్తిని తనలో వ్యాపింప చేసుకోవటం వల్ల విశ్వ మాతగా అయింది.

అపస్తంభ స్మృతి, ధర్మశాస్త్రాలు, వాసవ దర్శనం, గోపాళ తపనీ ఉపనిషత్తు వంటి గ్రంథాలలో ఈ విషయాలు తేల్చబడ్డాయి.

గరుడ పురాణం, భవిష్య పురాణం మొదలైన గ్రంథాలు కూడా ఈ గోతత్త్వాన్ని వర్ణిస్తాయి.

గోమాత శరీరంలో దేవతా శక్తులు ఉన్నందున ఆమెను పూజించడం వల్ల అనేక అనుగ్రహాలు కలుగుతాయి.

గోమాతకు విశ్వ రూపం ఉంది. ఆవును పూజించడం అంటే:

ప్రకృతిని పూజించడం
సంపూర్ణ జీవవైవిధ్యాన్ని గౌరవించడం
ఆధ్యాత్మికతకు మూలాధారం
 గోమాత రక్ష సర్వ జగద్రక్ష
 ధర్మస్య జయోస్తు

నిమ్మకాయతో చికిత్స - * అజీర్ణం ( Dyspepsia ) -

నిమ్మకాయతో చికిత్స - 

 * అజీర్ణం ( Dyspepsia ) - 
  
. గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 
 
* మలాశయం బాధ ( Bowel Trouble ) - 
       నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

* స్థూలకాయం ( Obesity ) - 
    
. నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.
 
*. ముఖ సౌందర్యం ( cosmetic ) - 
  
. సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 
 
*. చలి జ్వరం - ( Maleria ) 
     
. నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 
   
. అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.
 
*. రక్తస్రావం - 
    
. శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen 

*. కడుపులో బల్ల పెరుగుట హరించును. 
    
. నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 
  
*. దంతశుద్ధి - 
     
. దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది. 

Wednesday, August 6, 2025

వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -
   
. మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.
 
* ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.
 
* వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .
 
* వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.
 
* వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .
 
* ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .
 
* వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .

 * వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.

 * వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .

 * వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.

 * వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.
 
* వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.
 
* వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.
 
* చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .
 
* వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.
 
* వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.
 
* లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.
 
* వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .
 
* వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.

 * ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .
 
* వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.
 
* పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.
 
* వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.

 * వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.
 
* వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.
 
* నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.

 * వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.