Thursday, January 25, 2024

ఉల్లిపాయతో ఉపయోగాలు -

ఉల్లిపాయతో ఉపయోగాలు - 

  * సిగిరెట్లు , పాన్ పరాగ్ లు అధికంగా వాడటం వలన cancer లు వంటి వ్యాధులకు అద్బుతంగా విరుగుడుగా పనిచేస్తూంది . 

 * పిల్లలు బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఎదగడానికి నీరుల్లి బెల్లం కలిపి తినిపిస్తూ ఉండాలి.

 * రాత్రి పూట నిద్రపట్టక అవస్తలు పడే వాళ్లు పచ్చి నీరుల్లి పాయల రసం 20 గ్రా , పంచదార 10 గ్రా కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే పైల్స్ వ్యాధులు ఆశ్చర్య కరంగా తగ్గుతాయి . 

 * మేహా వాత నొప్పులు తో బాధపడే రోగులు ఆవాల నూనె , నీరుల్లిగడ్డ రసం సమాన బాగాలుగా కలిపి మర్దన చేస్తూ ఉంటే వాతనోప్పులు మాయం అయిపోతాయి . 

 * కుక్క కరిచినప్పుడు వెంటనే ఉల్లిపాయని తేనేతో కలిపి మెత్తగా నూరి కాటు వేసినచోట పట్టువేస్తే విషం హరిస్తుంది .

 * నీరస రోగంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా తేనే కలిపి తాగుతూ ఉంటే మంచిబలం , వీర్యవ్రుద్ది కలుగుతుంది.

 * స్థనాల వాపు , పోట్లుతో బాధ పడే స్త్రీలు ఒక నీరుల్లి గడ్డని కుమ్ములో పెట్టి ఉడికించి స్థనాల మీద వేసి కట్టుకడుతూ ఉండాలి. ఇలా రెండు మూడు సార్లు చేయగానే వాపు , పోటు పోతాయి .

 * మూర్చ వచ్చినపుడు నీరుల్లి రసం 4 చుక్కలు ముక్కులో వేసి నీరుల్లి రసాన్ని అరికాళ్ళకు మర్దన చేస్తే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.

 * కలరా సోకినపుడు వెంటనే 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా నిమ్మకాయ రసం కలిపి అందులో కొంచం పంచదార వేసి తాగుతూ ఉంటే చాలా తొందరగా కోలుకోవచ్చు . 

 * వాంతులు విపరీతంగా అవుతుంటే నీరుల్లి గడ్డని చితగ్గొట్టి వాసన చుస్తూ ఉండాలి. 

 * మూత్రాశయం లొ గాని , మూత్రపిండాల్లో గాని రాళ్లు ఏర్పడిన వాళ్లు ప్రతిరోజు నీరుల్లి రసం 10 గ్రా తీసుకుంటూ ఉంటే రాళ్లు కరిగిపోతాయి. బొట్టుబొట్టుగా పడే మూత్రవ్యాది కూడా పొతుంది.

 * ముక్కునుండి చెడు నీరు , రక్తం ధారాపాతంగా కారుతూ భాద పడేవాళ్లు నీరుల్లి రసాన్ని రెండు ముక్కు రంద్రాల్లో రెండు చుక్కలు వేస్తే వెంటనే రక్తం , నీరు ఆగిపోతుంది . 

 * తేలు కాటుకి నీరుల్లిపాయ రసాన్ని రుద్దితే వెంటనే విషం విరుగుతుంది. 

 * చెవిపోటు వచ్చినపుడు నీరుల్లిపాయల రసం నువ్వుల నూనెలో కలిపి కొంచం గోరువెచ్చ చేసి గోరువెచ్చటి ద్రవాన్ని నాలుగు చుక్కలు చెవిలొ వేస్తే పోటు తగ్గును . 

 * కంటి రోగాలు ఉన్నవాళ్ళు నీరుల్లిరసం తేనే సమబాగాలుగా కలిపి కళ్ళలో రెండు చుక్కలు వేస్తూ ఉంటే కంటి కలకలు , కంటి ఎరుపులు , కంటి మంటలు , కంటి శుక్లాలు హరించి పోతాయి . 

  గమనిక - నీరుల్లిని డైరెక్టుగా అతిగా వాడకూడదు శరీరంలో వేడిని పెంచుతుంది. నీరుల్లి మజ్జిగతో కలిపి మజ్జిగ అన్నంలో వాడటం మంచిది. 

 
  

Tuesday, January 23, 2024

హార్ట్ఎటాక్', పక్షవాతము ఎలా వస్తుంది ? దానికి నివారణ మార్గాలు ఏమిటి?*

✍️ *'హార్ట్ఎటాక్', పక్షవాతము ఎలా వస్తుంది ? దానికి నివారణ మార్గాలు ఏమిటి?*

విన్నపం: పోస్టు చూడగానే అమ్మో... ఏంటి ఇంత ఉంది.. ఇంత మ్యాటర్ ని చదివే అంత ఓపిక మాకెక్కడ ఉంది అని పక్కన పడేయకండి. కొంచెం ఓపిక ఉంచి మొత్తం చదవండి. మీ ఆరోగ్యం కోసమే కదా.. అందులో ఈ సమస్యలు చిన్నవి కాదు కదా. ప్రాణాంతకమైనవి కాబట్టి మొత్తం తెలుసుకోవాలి.

✍️ *వివరణ:*

 👉మన దేహములోని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరాచేయ డానికి సహకరించేది గుండె! 

👉ఈ గుండె పనిచేసే విధానము- పంప్ (నీళ్ళు మొదలగు ద్రవాలను తోడే యంత్రము) లాగా వుంటుంది. 

👉పంపింగ్ మిషన్ వలెనే- గుండెలో కవాటాలు (Valves) వుంటాయి.

👉 అశుద్ధ రక్తాన్ని- శరీర భాగాల నుండి గుండెకు చేర్చే నాళాలను "శిరలు (Veins)"అనీ, గుండెనుండి శరీర భాగాలకు మంచిరక్తాన్ని చేర్చే గొట్టాలను-"ధమనులు(Arteries)" అనీ అంటారు.

👉 రక్తము ద్వారా.... ప్రాణవాయువు(ఆక్సిజన్)ను శరీర భాగాలకు అందించడమూ; అదే విధముగా కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గు పులుసు వాయువు)ను, ఇంకా మిగతా మలినాలను ఊపిరితిత్తు (Lungs)లకూ, మూత్రపిండా(కిడ్నీస్)లకూ చేర వేయడములో ప్రముఖ పాత్ర వహించేవి- ఈ ధమనులు, శిరలే!

👉మానవ దేహము సక్రమముగా పనిచేయడానికి రక్తమెంత అవసరమో.... గుండె సక్రమముగా పని చేయాలన్నా కూడా అంతే రక్తము అవసరమౌతుంది.

👉 గుండె కండరాలకి రక్తాన్ని సరఫరా చేసే నాళాలని "కొరొనరి ఆర్టెరీస్ (Coronary Arteries)” అని అంటారు. 

👉ఏ కారణముచేతనైనా సరే గుండె కండరాలకు రక్తము సరఫరా కాకపోతే.... గుండెలో ఆ ప్రాంతములోని కండరాలు మృతి జెందుతాయి. దీనినే- "గుండెపోటు (హార్ఎటాక్)" అని అంటారు.

👉 ఈ పరిస్థితిలో గుండెలోని.... రక్తము అందని కండరము ఏదైతే వుందో అది పని చేయడం ఆగుతుంది.

👉 గుండె కండరాలకు రక్తాన్ని అందించే పెద్ద నాళానికి ఏ గడ్డ కట్టిన ర క్తమో అడ్డుపడితే.... గుండెలోని కండరాలలో అధిక భాగము చెడిపోతాయి. ఈ విధానాన్నే- "మాసివ్ ఎటాక్ (Massive Attack=అధిక గుండెపోటు)" అంటారు.

👉 ఇదే విధముగా చిన్న ర క్తనాళాలకు గడ్డ కట్టిన రక్తము అడ్డుపడితే- గుండెలో కొద్ది కండరాలు మాత్రమే పనిచేయవు. మిగతా కండరాలు పనిచేస్తాయి కాబట్టి మనిషి బ్రతకడానికి అవకాశం ఏర్పడుతుంది.

👉పై విధముగానే- మెదడుకు రక్తము చేరుటలో అవరోధ మేర్పడి, ఏ కొద్ది క్షణాలు ఆలస్యమైనా- మెదడులోని నాడీ కణాలు కొన్ని చనిపోయి, పక్షవాతము వస్తుంది.

👉 అంటే- గడ్డకట్టిన రక్తము రక్తనాళాలలో ప్రయాణిస్తూ మెదడుకు చేరు రక్తనాళాలకి అడ్డుపడితే పక్షవాతము మరియూ గుండెను చేరే రక్తనాళాలకి అడ్డుపడితే- గుండెపోటు వస్తుంది.

✍️ *గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?*

👉ప్రతిరోజూ.. క్రమము తప్పకుండా కొంతమేరకు అలసిపోయే దాకా- శారీరక వ్యాయామాలు చేస్తూ వుంటే.... గుండెపోటు, పక్ష వాతములకు దూరముగా వుండవచ్చును. 

👉వ్యాయామము వలన రక్తప్రసరణ విస్తారముగా జరగడమే గాక గుండె కండరాలు, శారీరక కండరాలు గట్టిపడతాయి.

👉 అంతేగాక గుండె కండరాలకు కూడా రక్తప్రసారము ఎక్కువగా ఉండటమువలన- గుండె చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకొంటుంది. 

👉ఈ విధముగానే రక్తప్రసారము మెదడుకు అధికముగా ఉండటము వలన- ప్రాణవాయువు తగినంతగా లభిస్తుంది. 

✍️ *వ్యాయామము చేయుటవలన ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.*

👉 వ్యాయామ సమయములో.... కండరాలు కుదించుకుపోయి నపుడు (సంకోచించడము)- కండరాలలోని రక్తమంతా శిరల ద్వారా గుండెను చేరి పరిశుభ్రపడుతుంది. 

👉ఇలా శుభ్రపడిన రక్తమంతా- కండరాలు విస్తరించినపుడు (వ్యాకోచించినపుడు) ఆ కండరాలకు చేరుతుంది. 

👉ఈ విధముగా జరుగుటవలన రక్తములో ఆక్సిజన్ అధికముగా జేరి, శారీరక ఆరోగ్యము మరింత మెరుగుపడుతుంది.

👉క్రమము తప్పకుండా శారీరక వ్యాయామాలు చేసేవారిలో అధిక సంఖ్యాకులు- హృద్రోగ నిపుణులేనని చెప్పాలి. ఎందుకంటే వీరికి తెలిసినంతగా- "వ్యాయామము విలువ" ఇంకెవరికీ తెలియక పోవడమే!

👉వ్యాయామము చేయడమువలన అధిక రక్తప్రసరణ అవసరమౌతుంది. కాబట్టి- రక్తనాళాలు కొద్దిగా సాగి, వాటి చుట్టు కొలత కూడా కొంచెము పెరుగుతుంది. ఈ పరిణామము వలన మామూలుకంటే అధిక స్థాయిలో రక్తము - నాళాలగుండా కండరాలకు సరఫరా ఔతుంది. 

👉శరీరము అలసిపోకుండా- 2 గంటలసేపు వ్యాయామము చేసినా, శరీరము అలసిపోయేటట్లుగా అరగంట సేపు చేసినా ఒకే విధమైన ఫలితము లభిస్తుంది. కాబట్టి- బాగా శ్రమతో కూడిన ఈత, టెన్నిస్, నాట్యములాటి ఆటలు గానీ ఆసనాలు, బాడీ బిల్డింగ్టి వ్యాయామాలుగానీ చేస్తే- గుండె, రక్తనాళాలకు మంచి ప్రయోజనము చేకూరుతుంది.

👉ప్రతిరోజూ క్రమము తప్పకుండా వ్యాయామము చేసే వారి గుండె- వ్యాయామము చేయనివారి గుండెకంటే.... తక్కువ సార్లు కొట్టుకొంటుంది. ఈ విధముగా రోజులో తక్కువ సార్లు గుండె కొట్టుకొనడమంటే.... మంచి కండీషన్ లో గుండె పని చేస్తుందని అర్థము! గుండె ఇలా తక్కువసార్లు కొట్టుకొన్నప్పటికీ.. రక్తము శరీర భాగాలకు సమృద్ధిగానే సరఫరా చేయగలుగుతుంది.

👉వ్యాయామము చేయనివారికి గుండెజబ్బులు రావడము సర్వసాధారణం అయింది.

👉 అంతేగాక పొగ త్రాగడము, మద్యపానము, స్థూలకాయములకంటే- వ్యాయామము చేయక పోవడము వల్లనే.... గుండెజబ్బులు అధికముగా వస్తున్నాయని అనేక పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది.

👉వ్యాయామము చేయడము వలన రక్తములో వుండే గుండెజబ్బులకు కారణభూతమయ్యే- "ట్రై గ్లిసరైడ్స్ (Triglycerides)” మరియు "కొలెస్టరాల్ (Cholesterol)" అనునవి అధిక శాతము తగ్గిపోతాయి.

👉ఒకసారి గుండెపోటు వచ్చి ప్రాణాపాయమునుండి తప్పు కున్నవారు కూడా క్రమము తప్పకుండా వ్యాయామము చేస్తూ వుంటే.... తిరిగి వచ్చే గుండెపోటునుండి రక్షణ ఏర్పరుచుకున్న వారు కాగలరు.

✍️ *గుండెజబ్బులు రాకుండా ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి.?*

👉రక్తములో ట్రై గ్లిసరైడ్స్, కొలెస్టరాల్ లు అధికమైనపుడు.... రక్తనాళాలయొక్క లోపలి రంధ్రాలు సన్నబడిపోయి, గుండె కండ రాలకు కావలసినంత రక్తాన్ని సరఫరా చేయలేవు. 

👉అంటే- ఈ పరిస్థితిలో గుండె అధికముగా పనిచేయవలసిన అవసరము వున్నదన్న మాట! ఈ విధముగానే చిన్న రక్తనాళాలలో కూడా రంధ్రాలు సన్నబడి, రక్తప్రవాహానికి ఆటంకము ఏర్పడవచ్చును. ఇటువంటి పరిస్థితులలోనే- హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయని చెప్పాలి. 

✍️ *ఈ క్రింది కొన్ని అంశాలను గమనించండి:*

👉 మనము నిత్యజీవితములో పాలు, వెన్న, నెయ్యిలాటి జంతు సంబంధమైన క్రొవ్వులలోనూ, కార్బోహైడ్రేట్స్(పిండి పదా ర్థాలు)లోనూ, కొలెస్టరాల్, టైగ్లిసరైడ్స్ అధికశాతము వుంటాయి.

👉 గుండెజబ్బులకు జాగ్రత్తపడువారూ మరియూ గుండెజబ్బులు రాకుండా ముందు జాగ్రత్త కొరకూ వీటి వాడకము బాగా తగ్గించాలి. అంటే.... అధికశక్తి (కాలరీలు) నిచ్చే పదార్థాలకు ప్రతివారూ దూరంగా ఉండాలి.

👉సాధారణముగా చాలామంది "కొంచెము నీరసముగా వుందండీ! అందుకే.... కొద్దిగా 'తేనె'ను- 'గ్లూకోస్'లో కలిపి త్రాగుతున్నాను!" అని అంటూ వుంటారు. వాస్తవానికి ఈ రెండు కూడా గుండెజబ్బుల వారికి నిషేధమే! కారణమేమిటంటే- ఇవి అధిక కాలరీల నిచ్చే పదార్థాలు!

👉కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ లాంటివి శరీరములో అధికముగా తయారైనప్పుడు "ఆర్టీరియో స్క్లెరోసిస్ (Arterio sclerosis=రక్తనాళ కాఠిన్యము)"వస్తుంది. కాబట్టి- మనము జీవితములో క్రొవ్వు పదార్థాలు, పిండిపదార్థాలు తక్కువగా వున్న ఆహారాలను తీసికోవాలి.

👉లావుగా వున్నవారిలోనే కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ లాటివి ఉంటాయనే ఒక అభిప్రాయము వున్నది. ఇది చాలాభాగము యథార్థమైనప్పటికీ- సన్నగా వున్నవారిలో ఈ పదార్థాలు వుండ వనుకోవడము చాలా పొరపాటు. కాబట్టి- ప్రతివారూ తరుచుగా రక్తపరీక్షలు చేసికొంటూ కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎంత శాతము వున్నదో తెలిసికోవడము చాలా మంచిది. 

👉ఇవి ఎక్కువగా వున్నప్పుడు వైద్య సలహాల ననుసరించి- ఆహారములో తగు జాగ్రత్తలను పాటిస్తూ వుంటే.... రక్తములో అధికముగా వున్న కొలెస్ట రాల్, ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించుకొనవచ్చును.

👉ఆహార నియమాలను సక్రమముగా ఆచరించినా, కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ శాతము తగ్గనపుడు.... వైద్య సలహాల ప్రకారము- వారి పర్యవేక్షణలో .... మందులను తప్పనిసరిగా ఉపయోగించాలి.

✍️ *స్థూలకాయము వల్ల గుండెపై ఎలాంటి ప్రభావము చూపుతుంది:*

👉 మామూలుగా వున్నవారికంటే, లావుగా వున్నవారికి గుండె పోటు, పక్షవాతము లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు హెచ్చుగా వుంటాయి.

👉స్థూలకాయుల శరీరభాగాలన్నిటికీ రక్తప్రసారము సక్రమముగా జరగడానికి గుండె అధికముగా శ్రమపడవలసి వుంటుంది. దీని మూలముగా వీరిలో రక్తపోటు (B.P.) పెరిగే అవకాశాలు మెండుగా వుంటాయి. B.P. అధికమైనా గుండెపోటు, పక్షవాతము లాటివి వచ్చే అవకాశమున్నది.

👉 స్థూలకాయము వలన.... సన్నటివారు చేసినంత బాగా వీరు వ్యాయామము చేయలేరు. అంటే లావుగా వుండటమనేది వ్యాయామానికి కూడా.... శత్రువే నన్నమాట! అందువల్లనే వ్యాయామము వలన- గుండెకు, రక్తనాళాలకు జరిగే ఉపయోగము వీరిలో తక్కువగా కనిపిస్తుంది.

✍️ *B.P. గుండెకు కలిగించే హాని:*

👉రక్తములో వున్న కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్ అధికమైనపుడు- రక్తనాళ రంధ్రాల లోపలి గోడలకు ఇవి అంటుకొని మందమైపోయి, రంధ్రాలు సన్నబడతాయి. ఇలా సన్నబడిన రంధ్రాలనుండీ రక్తాన్ని గ్రహించడానికి గాని, పంపడానికి గాని, గుండె అధిక శ్రమ చేయవలసి వుంటుంది. రక్తము ఎంత బలము (Force)గా నెట్టబడుతుందో అనే విషయాన్ని రక్తపోటు (Blood Pressure)ను కొలిచే "స్ఫిగ్మొమానొమీటర్ (Sphygmomano meter)" ద్వారా తెలిసికొంటారు. రక్తనాళాల రంధ్రాలు ఎంత సన్నబడితే- గుండెకు అంత శ్రమ అధికమౌతూ వుంటుంది.

👉 రక్తపోటును మామూలువారు "B.P."అని అంటుంటారు. దీనినే వైద్య పరిభాషలో "హైపర్ టెన్షన్ (Hyper tention)” అంటారు.

👉 వంశపారంపర్యముగా కూడా రక్తపోటు వచ్చే అవకాశమున్నదని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.

👉'బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అంటే.... రక్తపోటు పెరగడము (హైపర్ టెన్షన్) వున్నపుడు కలిగే బాధలు.... బ్లడ్ ప్రషర్ తగ్గడము అంటే... "హైపోటెన్షన్ (Hypotension - Low Blood Pressure)” వున్నపుడు వుండవు. 

👉40, 50 సంవత్సరాలలోపు వయసున్న పురుషులలో 20 శాతము మంది రక్తపోటుతో బాధల ననుభవిస్తున్నట్లుగా వైద్య శాస్త్రవేత్తల విస్తృత పరిశోధనలలో తేలిన అంశము!

👉మామూలుగా ఏదైనా అతి ముఖ్యమైన పని చేసేటపుడు గానీ, కొన్ని ప్రమాదాలు జరిగినపుడు, జరుగుతాయని భావించి నపుడు.... నాడీ ప్రమాణము (Pulse Rate) మామూలుకంటే అధిక ముగా పెరుగుతుంది. 

👉50 సంవత్సరములు దాటిన స్త్రీ పురుషులలో- "డయాస్టాలిక్ ఫ్రషర్ (Diastolic Pressure- హృదయ స్ఫురణము)” నిమిషానికి 100 మించితే మాత్రము- వెంటనే వైద్య పర్యవేక్షణలో వుండి, తగిన మందులు వాడవలసి వుంటుంది.

👉ప్రతి చిన్న విషయానికి కోపము, విసుగు.. ప్రతి సంఘటనకు భయపడటము, ప్రతి చిన్నపనికి నిస్సత్తువతో అలసిపోవడము, పనిలో ఏకాగ్రత లోపించడము, తలనొప్పి, నిద్రలేమి లాటి లక్షణాలను రక్తపోటు పెరిగినవారు అనుభవిస్తూ వుంటారు. 

👉రక్త పోటు పెరిగిన ప్రతివారిలోనూ ఈ బాధలన్నీ కనిపించాలనే నియమమేమీ లేదు. వీటిలో ఏ ఒక్క లక్షణము కనిపించినా వెంటనే వెద్యుని పర్యవేక్షణలో రక్తపోటు ఎంత ప్రమాణములో వున్నదో చూపించుకోవటము మంచిది. 

👉రక్తపోటు పెరిగిందని తేలినపుడు వీరికి ముందుగా మందులు ఉపయోగించకుండా.... ఆహార విహారాలలో కొన్ని మార్పులను సూచించి పంపుతారు వైద్యులు ! ఈ మార్పులవలన- ఆశించిన ప్రయోజనము కలగకపోతే.... సంబంధిత ఔషధాలను వాడి, B.P.ని మామూలు ప్రమాణానికి తీసికొని రావడము జరుగుతుంది.

👉వైద్య సలహాలను ఆచరించుటలో అశ్రద్ధ చేసినా, వైద్య సలహాలు తీసికోకపోయినా అధిక రక్తపోటు వలన అనేక అనర్థాలు చవి చూడవలసి రావచ్చును.

 ఉదాహరణకు:- దీని ప్రభావము గుండెమీద- గుండెపోటు రూపములోనూ, మెదడుమీద పక్ష వాతము రూపములోనూ చూపించే ప్రమాదమున్నది. కొన్నిసార్లు వీటివలన హఠాత్మరణాలు సంభవించిన సంఘటనలుకూడా మనలో కొంతమందికి ప్రత్యక్షానుభవముండే వుంటుంది.

✍️ *ధూమపానము కారణంగా గుండెజబ్బులు:*

👉ధూమపానప్రియులకు, గుండెజబ్బులకు చాలా దగ్గర సంబంధాలున్నాయని చెప్పవచ్చును.

👉 ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్)తో మరణించేవారిలో అధిక సంఖ్యాకులు ధూమపాన ప్రియులే! అదే విధముగా గుండెజబ్బులతో మరణించేవారిలో.... అధిక సంఖ్యాకులు- ధూమపానము అలవాటున్న వారేనని చెప్పవచ్చును.

👉ధూమపానమువలన- చిన్న రక్తనాళాలలో రక్తము గడ్డ కట్టే అవకాశాలు అధికముగా వున్నాయి.

👉పొగాకు సంబంధమైన చుట్ట, బీడి, సిగరెట్ లాటి పొగలో.... "కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxid)" అనే పదార్థము వుంటుంది. ఈ పదార్థము- రక్తములో కలసి, "కార్బాక్సి హెమోగ్లోబిన్ (Carboxyhemoglobin)' అనే రూపములో వుంటుంది. దీనివలన రక్తము గ్రహించవలసిన మేరకు ప్రాణవాయువును గ్రహించలేదు. ఈ పరిస్థితులలో- శరీరానికి ఆవసరమైన ప్రాణవాయువును అందించడానికి.... గుండె విపరీతమైన శ్రమ పడవలసి వుంటుంది.

👉సంపూర్ణ ఆరోగ్యాన్ని అభిలషించే ప్రతివారు - ధూమపాన వ్యసనాన్ని క్రమక్రమముగా దూరము చేసికోవలసిన అవసరం ఎంతైనా వున్నది. 

✍️ *మానసిక ఒత్తిడుల వలన గుండెపోటు:*

👉 గుండెజబ్బులకు కారణమైన అనేక అంశాలలో మానసిక ఒత్తిడులు కూడా చాలాభాగము కారణము వహిస్తాయని చెప్పవచ్చును. 

👉గుండెపోటు ఒక్క సారిగా రాదు. దీనికి 6 నెలల ముందు నుండి రక్తనాళాలలో విపరీత మార్పులు కనిపించి, ఆ తరువాతనే- గుండెకు సంబంధించిన కొన్ని అనర్థాలు కనిపిస్తాయి.

👉గుండెజబ్బులు రావడానికి- మానసిక ఒత్తిడులకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది.

👉మానసిక ఒత్తిడి అధికమైనపుడు- "ఎడ్రినల్ హార్మోన్లు" అధికముగా జనించి, రక్తములో కలుస్తాయి. వీటి ప్రభావముతో- "ఫాటీ యాసిడ్స్ (Fatty Acids= క్రొవ్వు ఆమ్లాలు)" అధికమై, రక్తనాళ రంధ్రాల లోపలి గోడలకు అంటుకొని.... రంధ్రాల వైశాల్యము తగ్గిపోయి, సన్నగా ఔతాయి. దీనితో- గుండెకు సరిపోయే రక్తము అందక.... గుండెపోటు వచ్చే ప్రమాదమున్నది.

👉మన జీవిత విధానాన్ని ఏమాత్రము మార్చుకోగలి గినా.... మానసిక ఒత్తిడులు, ఆందోళనల నుండి చాలావరకు తప్పుకోవచ్చు.

👉కొంతమంది- "నిన్న అలా జరిగినది! రేపు కూడా అదేవిధముగా జరగదని గ్యారంటీ ఏమిటి?" అని- ఊరకనే మానసిక ఆందోళనలను పొందుతూ వుంటారు. ప్రతివారు ఇలాటి ఆందోళనల నుండి దూరముగా వుండటము ఎంతో అవసరము.

👉 "నిన్న జరిగినట్లే- రేపు ఎందుకు జరగాలి? నిన్నటి అనుభవముతో- రేపు జాగ్రత్తగా వుండాలి!" అనే ఆత్మవిశ్వాసము పెంచుకొని, జీవితాన్ని వ్యథాభరితము కాకుండా చూసుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించిననాడు.... మానసిక ఒత్తిడులు, ఆందోళనలు లాంటివి దరి చేరవు.

✍️ *శవాసనముతో... మానసిక, శారీరక ఆరోగ్యము!*

👉మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము మొదలగు వాటిని పొందడానికి- "యోగాసనాలు" చాలావరకు సహకరిస్తాయని చెప్పవచ్చును.

👉 ముఖ్యముగా గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు సక్రమముగా పనిచేయడానికి- "శవాసనము" చక్కగా సహకరిస్తుంది. 

👉ఈ ఆసన సాధన వలన- శరీరానికి, గుండెకు కావలసినంతవరకు రక్త ప్రసరణ జరిగి, మానసికోత్సాహము అభివృద్ధి జెందుతుంది. ఇంకా- శారీరక విశ్రాంతి కూడా లభిస్తుందని చెప్పవచ్చును.


Monday, January 22, 2024

అయోధ్య గుడి చరిత్ర

బాబ్రీ, అయోధ్య రామ మందిరం పూర్తి కథ! 
బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరం వరకూ జరిగిన సంఘటనలు 
బాబ్రీ మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది. అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి.. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు, కోల్పోయిన ప్రాణాలు.. పోరాటాలు వంటి పూర్తి వివరాలు మీ కోసం.  


అయోధ్య మందిరానికి మొట్టమొదటి పునాది:
అయోధ్య.. ఈ పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యుధ్ నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెబుతారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్ళకు విశ్వామిత్రుడు వచ్చి రాముడ్ని తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రావణ సంహారం, రామావతారం చాలించడం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో.. రాముడి కుమారుల్లో ఒకరైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3 వేల సీతారామాలయాలు ఉండేవని చెబుతారు. అయితే సామాన్య శక పూర్వం 5వ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని.. వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెబుతారు. అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు ఆ మందిరాలు పూజలతో కళకళలాడేవి. 

1034: అయోధ్యపై సాలార్ మసూద్ ఘాజి దాడికి యత్నం
సాలార్ మసూద్ ఘాజి.. ఇతను మహ్మద్ గజినీ మేనల్లుడు. అనేక సార్లు సోమ్ నాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహ్మద్ గజినీ మేనల్లుడే ఈ సాలార్ మసూద్ ఘాజి. ఢిల్లీ, మీరట్, బులంద్ షహర్, బుదౌన్, కన్నాజ్ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి చేరుకున్నాడు. బహ్రైచ్ మీద దాడి చేసి అయోధ్య చేరుకోవాలనుకున్నాడు మసూద్ ఘాజి. లక్ష 30 వేల మంది సైన్యంతో సాలార్ మసూద్ ఘాజీ బహ్రైచ్ పై దాడికి యత్నించాడు. ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజా సుహేల్ దేవ్.. పక్క రాజ్యాల రాజులతో కలిసి.. సాలార్ మసూద్ కి చెందిన లక్ష 30 వేల మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు. దీంతో భయపడి ఆఫ్ఘన్ కి పారిపోయే ప్రయత్నం చేశాడు సాలార్ మసూద్ ఘాజి. సాలార్ మాసూద్ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరీ తల నరికాడు. ఆ తర్వాత సాలార్ మసూద్ ఘాజి శవాన్ని బహ్రైచ్ లోనే సమాధి చేశారు. శత్రువైనప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేవారు. 


1526: అయోధ్యలో కాలుమోపిన బాబర్ 
1526లో బాబర్, ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం మొదలైంది. దీని పేరు పానిపట్టు యుద్ధం. 1526లో జరిగిన యుద్ధం మొఘలుల పరిపాలనకు నాంది పలకగా.. 1556లో జరిగిన రెండో యుద్ధం మొఘలుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది. మూడవ యుద్ధం 1761లో జరిగింది. ఇది మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమయ్యింది. అయితే బాబర్, లోడీ మధ్య యుద్ధం తర్వాత అంటే 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. 

1528: అయోధ్య రామ మందిరాన్ని కూల్చమన్న బాబర్?
babur


ప్రభుత్వ గెజిట్‌లలో దీని ప్రస్తావన ఉంది. దీని ప్రకారం 1528వ సంవత్సరంలో అప్పటికి అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాఖీకి ఆదేశాలు ఇచ్చాడు బాబర్. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాఖీ. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీదు అయ్యింది. ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మొఘలుల పాలన సాగింది. అయితే గుజరాత్ క్యాడర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిషోర్ కునాల్ రాసిన ‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో రామ మందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు. దీని ప్రకారం.. రామ మందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని.. ఔరంగజేబు పాలనలో 1660లో జరిగింది. ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీదు కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు క్లెయిమ్స్ లో ఏది నిజమో తెలియదు కానీ మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు. ఎప్పుడైతే రాజా జై సింగ్ వచ్చాడో.. అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది.

1717: బాబ్రీ మసీదు స్థలాన్ని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన రాజా జై సింగ్: 

అది 1717వ సంవత్సరం. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత రాజ్ పుత్ వంశానికి చెందిన.. రాజా జై సింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జై సింగ్.. మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కానీ తాను అనుకున్నది జరగలేదు. దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబుత్ర అనే పేరు మీద వేదిక కట్టి దాని మీద సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు పూజలు చేసుకునేవారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు. 


1855: హనుమాన్ గర్హి ఆలయం వద్ద ఘర్షణలు
garhi temple

1855లో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్ని ముస్లింలు మరియు బైరాయ్ ల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదుని కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు. అయితే నవాబ్ వాజిద్ అలీ షా జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. 

1859: కంచెతో మసీదుని, మందిరాన్ని వేరు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం
1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని నమ్మారు. అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. 

1885: రామ మందిర నిర్మాణం కోసం మొట్టమొదటి పిటిషన్ 
1885లో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్.. మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబుత్ర నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

మార్చి 1934: బాబ్రీ మసీదుపై దాడి 
attack on babri masjid

1934లో షాజహాన్ పూర్ లో గోహత్య వార్త వైరల్ అవ్వడంతో మతపరమైన అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మసీదుని మరమ్మత్తు చేయడం జరిగింది.   

1938-1947: మసీదు తమదే అంటూ క్లెయిమ్ చేసుకున్న సున్నీ, షియాలు 
బాబ్రీ మసీదు ఉన్న 2.77 ఎకరాల స్థలం తమదే అంటూ షియా మరియు సున్నీ వక్ఫ్ బోర్డులు స్థానిక కోర్టులో క్లెయిమ్ చేశాయి. బాబర్ సున్నీ అయినందున.. ఆ భూమి సున్నీల ఆస్తి సున్నీ వక్ఫ్ బోర్డు తెలపడంతో స్థానిక కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

డిసెంబర్ 22, 1949: మసీదులో వెలసిన రాములోరు
1949లో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ వేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని.. కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు. 

డిసెంబర్ 26, 1949: మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించమన్న నెహ్రూ
nehru

అప్పటి ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి.. అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకి సంబంధించి నివేదికలు అందాయి. అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్ లాల్ నెహ్రూ.. లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్‌ కు ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్ లో ఇలా ఉంది. “అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను తీవ్రంగా కలత చెందాను. ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నా” అంటూ పంత్ కి రాసిన టెలిగ్రామ్ లో పేర్కొన్నారు. అయితే తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నెహ్రూ.. మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది హిందూ, ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లకు దారితీస్తుందని ఉద్దేశంతో అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ కే.కే. నాయర్ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం వివాదాస్పద స్థలంగా ప్రకటించి మసీదు గేటుకి తాళం వేసింది. (ఆ తర్వాత కే.కే. నాయర్ భారతీయ జన్ సంఘ్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. భారతీయ జన్ సంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలతో విలీనం అయ్యింది. దీంతో జన్ సంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత బీజేపీగా మారింది.)

జనవరి 7, 1950: నెహ్రూ రాసిన మరో లేఖ
నెహ్రూ 1950 జనవరి 7న గవర్నర్ జనరల్ గా ఉన్న సి రాజగోపాలాచారికి లేఖ రాశారు. అందులో ఇలా ఉంది. “నేను గత రాత్రి అయోధ్య గురించి పంత్ జీకి ఒక లేఖ రాసి లక్నో వెళ్తున్న వ్యక్తికి ఇచ్చాను. ఆ తర్వాత పంత్ తనకు ఫోన్ చేశాడు. పంత్ చాలా ఆందోళన చెందుతున్నట్టు.. అయోధ్య విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నట్టు చెప్పాడు” అని ఆ లేఖలో ఉంది. 

ఫిబ్రవరి 5, 1950: అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తానన్న నెహ్రూ
1950 ఫిబ్రవరి 5న పంత్ కి మరో లేఖ రాశారు. అందులో ఇలా ఉంది. “ప్రియమైన పంత్ జీ.. అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తాను. దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా కాశ్మీర్ కి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తానని మీకు తెలుసు. అవసరమైతే నేను అయోధ్య వెళ్తానని.. మీరు ఆఖరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పాను. నేను అయోధ్య రావాలని మీరు అనుకుంటే చెప్పండి. నేను బిజీగా ఉన్నప్పటికీ అయోధ్య వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటా” అని ఉంది. అయితే అయోధ్యలో పరిస్థితి మారలేదని పంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదు. 

మార్చి 5, 1950: జిల్లా మెజిస్ట్రేట్ కే.కే. నాయర్ పై నిందలు
1950 మార్చి 5న నెహ్రూ రాసిన లేఖలో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కే.కే. నాయర్ ని నిందించినట్టు ఉంది. అయితే తాను మసీదు లోపల ఉన్న విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నారు. విగ్రహాలను తొలగించేందుకు అంగీకరిస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు. 

1950: తొలిసారిగా కోర్టులో వేయబడిన రెండు పిటిషన్లు
hashim ansari

1950లో హషిమ్ అన్సారీ అనే వ్యక్తి.. మసీదు గేట్లు ఓపెన్ చేయాలని, నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని.. ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు. గోపాల్ సింగ్ విశారద్, మహంత్ పరమహంస రామచంద్ర దాస్ లిద్దరూ కూడా ఫైజాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఇది వివాదాస్పద స్థలం మీద వేయబడ్డ రెండో పిటిషన్. మసీదు లోపల రామ జన్మభూమి స్థలంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం నిషేధించింది కోర్టు.     

1959: హిందూ, ముస్లిం మధ్యలో మూడో వర్గం
మహంత్ భాస్కర్ దాస్ నేతృత్వంలో నిర్మోహి అఖారా సంస్థ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది వివాదాస్పద స్థలం మీద వేసిన మూడవ పిటిషన్. ఆ మసీదు ఉన్న స్థలం మీద పూర్తి హక్కు తమదే అంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకులు అక్కడ పూజలు చేసుకుంటున్నారని సదరు సంస్థ చెప్పుకొచ్చింది. నిర్మోహి అఖారా అనేది వైష్ణవ్ భైరాగి సాంప్రదాయంలో ఒక భాగం. అఖిల భారతీయ అఖారా పరిషత్ చేత గుర్తింపు పొందిన సంస్థ ఈ నిర్మోహి అఖారా. రామనంది వరగీస్ తో చేయబడిన పంచాయతీ మఠం ఈ నిర్మోహి అఖారా. 1400ఏడీ నుంచే అయోధ్యలో ప్రజా మతంగా ఉందని నిర్మోహి అఖారా చెబుతుంది. ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్ వేసింది. 

1961: మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కు కోసం పిటిషన్
ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది నాల్గవ పిటిషన్. ముస్లింలు మళ్ళీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కును పునరుద్ధరించాలని కోర్టును కోరారు. 

1964: విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు
హిందువులను ఏకం చేయడం కోసం.. హిందూ ధర్మ రక్షణ కోసం 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. దీన్ని ఎమ్.ఎస్. గోల్వాకర్, ఎస్.ఎస్. ఆప్టేలు స్థాపించారు. 

ఏప్రిల్ 6, 1980: బీజేపీ పార్టీ ఆవిర్భావం
భారతీయ జన్ సంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలతో విలీనం అయ్యింది. దీంతో జన్ సంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపించబడింది. 

1981: సెంట్రల్ వక్ఫ్ బోర్డు పిటిషన్
ఉత్తరప్రదేశ్ కి చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసింది. 

1983: దేవుడి లాయర్  
ayodhya ram mandhir story

అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి, సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ 1983లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్లి అక్కడ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ సేకరించారు. 

1984: రామజన్మభూమి విముక్తి కోసం కమిటీ ఏర్పాటు
ఎల్.కే. అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మ స్థలానికి విముక్తి కల్పించి.. మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. 

ఏప్రిల్ 1984: రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్
1981లో మీనాక్షిపురంలో 400 నుంచి 800 మంది దళిత కుటుంబాలు ఇస్లాంలోకి మతం మారిన దానికి ప్రతిస్పందనగా విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంసద్ ను నిర్వహించింది. విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ అశోక్ సింఘాల్ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్ ఎక్కువైంది. 

సెప్టెంబర్ 25, 1984: రథయాత్ర
1984 సెప్టెంబర్ 25న బీహార్ లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి శ్రీరామ్- జానకి రథయాత్ర చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లో మరో ఆరు యాత్రలు చేపట్టారు. 

1984 నవంబర్: బలహీనపడిన రామజన్మభూమి ఉద్యమం
ఇందిరా గాంధీ హత్య తర్వాత 9వ లోక్ సభ జనరల్ ఎన్నికలు జరిగాయి. 541 సీట్లకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ.. రామజన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది.  

ఏప్రిల్ 2, 1985: మహ్మద్ అహ్మద్ ఖాన్, షాబానో బేగం కేసుతో మలుపు
మహ్మద్ అహ్మద్ ఖాన్, షాబానో బేగం కేసులో ఆమెకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పును ముస్లిం నేతలు ఖండించారు. 

ఫిబ్రవరి 1, 1986: మసీదు లోపలికి హిందువులకు అనుమతి
ayodhya ram mandhir story

1986లో 2.77 ఎకరాల భూమిలో ఉన్న రామ్ చబుత్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రకారం.. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు అప్పట్లో బలంగా నమ్మరు. తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవడంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్లు అయ్యింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధాని మంత్రిగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు, పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి. కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను, ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. . 

మే నెల, 1986: షాబానో కేసుతో అయోధ్య ఉద్యమానికి బలం 
ayodhya ram mandhir story

1986 మే నెలలో షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడాకుల మీద ముస్లిం మహిళలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ 1986 చట్టాన్ని పాస్ చేసింది. ఇక ఇదే ఏడాదిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవడం.. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గడం వంటి అంశాలు అయోధ్య ఉద్యమంలో పాల్గొనేందుకు బీజేపీ పార్టీకి బలంగా సహకరించాయి. అప్పటి వరకూ బలహీనంగా ఉన్న బీజేపీకి షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా బలాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఎల్.కే. అద్వానీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.        

జూలై నెల, 1989: ఆ స్థలం రాముడిదే.. ఇవిగో ఆధారాలు
ayodhya ram mandhir story

అది 1989వ సంవత్సరం. విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి డియోకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు. 1983లో జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. 1989 జూలై 1న అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనను రామ్ లల్లా (రాముడి) మిత్రుడిగా నియమించాలని లక్నో బెంచ్ ను కోరారు. అప్పటి నుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా, భక్తుడిగా ఉన్నారు. ఈయన వేసిన పిటిషన్ తో పాటు అయోధ్య రామ జన్మస్థలం తరపున వేసిన పిటిషన్స్ అన్నిటినీ జూలై 1996లో కోర్టు కలిపేసింది.  

ఆగస్టు 14, 1989: కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
1989 ఆగస్టు 14న బాబ్రీ మసీదుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.  

నవంబర్ 9, 1989: రామ జన్మభూమి స్థలంలో పడిన తొలి పునాది రాయి
ayodhya ram mandhir story

అప్పటి జనరల్ ఎలక్షన్స్ లో 89 సీట్లు గెలుచుకోవడంతో దేశంలో మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, సీపీఐ(ఎం) మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ డిమాండ్ ని నెరవేర్చింది. రామ జన్మభూమి స్థలంలో పునాది రాయి వేయడానికి విశ్వ హిందూ పరిషత్ కి అనుమతి ఇచ్చింది. నవంబర్ 9న రామ మందిరం కోసం వివాదాస్పద స్థలంలో.. విశ్వ హిందూ పరిషత్ ఆ ల్యాండ్ లో పునాదులు వేస్తూ ఒక ఉద్యమానికి తెరలేపింది.

సెప్టెంబర్ 25, 1990: ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో రథయాత్ర
1990 సెప్టెంబర్ 25న బీజేపీ నేత ఎల్.కె. అద్వానీ సోమ్ నాథ్ లో రథయాత్ర ప్రారంభించారు. 

అక్టోబర్ 30, 1990: బీజేపీ కరసేవకుల మీద పోలీసుల కాల్పులు
1990 అక్టోబర్ 30న పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీదు ల్యాండ్ లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది కరసేవకులు మరణించారు. ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో వరుస మత ఘర్షణలు చెలరేగాయి. రథయాత్ర తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది ప్రభుత్వ పతనానికి దారి తీసింది.    

1991: బాబ్రీ మసీదుకు హాని జరగదని హామీ ఇచ్చిన బీజేపీ సీఎం
లోక్ సభ జనరల్ ఎలక్షన్స్ లో 121 సీట్లు గెలుచుకుని దేశంలోనే రెండవ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఫామ్ చేసింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఎన్నికయ్యారు. అప్పుడు బాబ్రీ మసీదుకి ఎలాంటి హాని జరగదని కళ్యాణ్ సింగ్ వాగ్దానం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 

డిసెంబర్ 6, 1992: బాబ్రీ మసీదు మీద దాడి 
ayodhya ram mandhir story

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు వద్ద ర్యాలీని చేపట్టాలని బీజేపీ నాయకులు ఫిక్స్ అయ్యారు. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు మసీదు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ల్యాండ్ లోపలికి ఎవరినీ ఎంటర్ అవ్వకుండా పోలీసులు బారికేడ్ల చుట్టూ నిలబడ్డారు. ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు.. లక్ష 50 వేల మంది విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ కరసేవకులతో బాబ్రీ మసీదు ల్యాండ్ వద్ద ఒక మహా ర్యాలీని చేపట్టాయి. దీంతో పోలీసులకు అంతమందిని అడ్డుకోవడం కష్టమైంది. ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి బీజేపీ నాయకులు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇచ్చారు. ఆ ప్రసంగాలకు ప్రభావితమైన భజరంగ్ దళ్, శివసేన కార్యకర్తలు.. బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. బారికేడ్లను దాటుకుంటూ మసీదు పైకి ఎక్కి మరీ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక బాబ్రీ మసీదు మీద దాడి జరిగిన రోజు సాయంత్రం కరసేవకులు.. అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో 18 మంది ముస్లింలు మరణించారు. 23 మసీదులతో సహా దాదాపు చాలా మంది ముస్లింల ఇళ్ళు, దుకాణాలు తగులబడ్డాయి. ముంబై సహా దేశంలోని పలుప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయ్యిందని భావించిన కళ్యాణ్ సింగ్.. బాబ్రీ మసీదు కూల్చిన రోజునే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నాయకులైన అద్వానీ, ఉమాభారతి, ఎం.ఎం. జోషిల మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. అయోధ్యలో రామ మందిరం కట్టాలన్న హిందువుల ఆశయానికి ఆయనొక ఐకాన్ గా పరిగణించబడ్డారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయ్యిందని పదవికి రాజీనామా చేశారు.

డిసెంబర్ 8, 1992: పాకిస్తాన్ లో హిందూ ఆలయాల కూల్చివేత
పాకిస్తాన్ లోని ముస్లింలు 30కి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు. భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక రోజంతా కార్యాలయాలు, పాఠశాలలు మూసివేసింది. 

డిసెంబర్ 16, 1992: లిబర్హాన్ కమిషన్ నియామకం
1992లో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు.. బీజేపీ మద్దతుదారులే బాబ్రీ మసీదుని కూల్చారని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేశారు. ఇక ఇదే సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టేందుకు పీవీ నరసింహారావు ప్రభుత్వం ‘లిబర్హాన్ కమిషన్’ ని నియమించింది. దీనికి జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్షత వహించారు. అయోధ్యలో మసీదుని కూల్చి వేయడానికి దారితీసిన సంఘటనలు, పరిస్థితులు వంటి విషయాలను నిర్ధారించడం మాత్రమే లిబర్హాన్ కమిషన్ కి అందిన ఆదేశాలు. 

మార్చి నెల, 1993: బొంబాయిలో బాంబ్ బ్లాస్ట్ లు
బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. ఉగ్రవాదులు బొంబాయి అంతటా బాంబు పేలుళ్లకు శ్రీకారం చుట్టారు. 

ఏప్రిల్ 3, 1993: ఎల్.కే. అద్వానీపై ఛార్జ్ షీట్
ayodhya ram mandhir story

బాబ్రీ మసీదు చుట్టూ ఉన్న 67.703 ఎకరాల భూమిని కేంద్రం స్వాధీనం చేసుకునే దాని కింద ఉన్న అయోధ్యలో నిర్దిష్ట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టంలోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఇస్మాయిల్ ఫారూకీ ఒక వ్రాతపూర్వక పిటిషన్ వేశారు. ఇక ఇదే ఏడాది లిబర్హాన్ కమిషన్ తమ పరిశోధనను ప్రారంభించింది. ఈ కేసుని సీబీఐ తీసుకుని.. బీజేపీ నాయకుడు ఎల్.కే. అద్వానీపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మసీదు కూల్చివేత ఘటనలో 19 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా మసీదు కూల్చివేయడానికి కుట్ర పన్నినట్లు సీబీఐ తేల్చింది.    

అక్టోబర్ 24, 1994: నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు
ఇస్మాయిల్ ఫారూఖీ వేసిన పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు.. మసీదు అనేది ఇస్లాంలో అంతర్భాగం అయినది కాదు కాబట్టి నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అని తెలిపింది. అలానే మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ ని బాధ్యుడిని చేస్తూ ఒక రోజు జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించింది. 

1998: బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు
1998వ సంవత్సరంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.     

2001: ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ
మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ మరోసారి వివాదాస్పద స్థలంలో హిందూ ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసింది.

మే నెల, 2001: అద్వానీ వంటి లీడర్లపై కుట్ర ఆరోపణలను ఉపసంహరించుకున్న స్పెషల్ సీబీఐ కోర్టు
అద్వానీ, ఎం.ఎం. జోషి, ఉమా భారతి, బాల్ ఠాక్రే వంటి వారిపై వేసిన ఛార్జ్ షీట్స్ ని, కుట్ర ఆరోపణలు, విచారణను స్పెషల్ సీబీఐ కోర్టు ఉపసంహరించుకుంది.  

జనవరి నెల, 2002: మసీద్, మందిర్ వివాదానికి పరిష్కారం కోసం చర్చలు 
2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. మసీదు, మందిర్ వివాదానికి పరిష్కారం కోసం హిందూ, ముస్లిం నాయకులతో మాట్లాడాలని అనుకున్నారు. అందుకోసం ప్రధాని కార్యాలయంలో ఒక సెల్ ని ఏర్పాటు చేసి శత్రుఘ్న సింగ్ ను నియమించారు. 

ఫిబ్రవరి 2002: అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాం.. మేనిఫెస్టోలో బీజేపీ హామీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ తమ మేనిఫెస్టోలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని హామీని చేర్చింది. విశ్వ హిందూ పరిషత్ కూడా రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి మార్చి 15న గడువు తేదీగా నిర్ధారించింది. మార్చి నెలలో వందలాది మంది వాలంటీర్లు అయోధ్యలో కలిశారు. అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా గోద్రాలో హిందూ కార్యకర్తలతో వస్తున్న రైలు మీద దాడి జరిగింది. ఈ దాడిలో 58 మంది మరణించారు. మార్చిలో జరిగిన గోద్రా రైలు ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్లలో వెయ్యి నుంచి 2 వేల మందిలో ఎక్కువగా ముస్లింలు మరణించారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆగస్టు నెల, 2003: మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం
మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఒక నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు ఖండించారు. 

సెప్టెంబర్ నెల, 2003: మసీదు కూల్చివేతకు కారణమైన వారిపై విచారణ
బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రేరేపించిన ఏడుగురు హిందుత్వ నాయకులపై విచారణ జరగాలని సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ మసీదు కూల్చివేత సమయంలో అక్కడే ఉన్న అద్వానీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు.

నవంబర్ నెల, 2004: మసీదుపై దాడిలో నిర్దోషిగా అద్వానీ
మసీదుపై దాడిలో అద్వానీ పాత్రను నిర్దోషిగా పేర్కొంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోర్టు మరోసారి తీర్పునిచ్చింది.

జూలై నెల, 2005: రామ జన్మభూమి కాంప్లెక్స్ పై ఉగ్రవాదుల దాడి
అయోధ్య రామ జన్మభూమి కాంప్లెక్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుమానితులుగా ఉన్నారు. అయితే భద్రతా లోపానికి కేంద్రమే బాధ్యత వహించాలని.. విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తొగాడియా యూపీఏ ప్రభుత్వాన్ని నిందించారు. తవ్విన ఆధారాలను నాశనం చేయడానికే ఈ దాడి చేశారని విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ అన్నారు.

జూన్ నెల, 2009: ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నియమించిన లిబర్హాన్ కమిషన్.. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్ కి సమర్పించింది. 100 మందికి పైగా సాక్షులను విచారించిన అనంతరం 17 ఏళ్ల తర్వాత కమిషన్ నివేదికను సమర్పించింది. దేశంలో ఇన్నేళ్ల పాటు విచారణ సాగిన కమిషన్ ఇదే. ఈ నివేదికలో అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమా భారతి, విజయరాజి సిందియా వంటి బీజేపీ నేతలు దోషులుగా ఉన్నారు. అలానే గిరిరాజ్ కిషోర్, అశోక్ సింఘాల్ వంటి వీహెచ్పీ లీడర్స్, శివసేన అధినేత బాల్ థాక్రే, మాజీ ఆర్ఎస్ఎస్ లీటర్ కే.ఎన్. గోవిందాచార్య వంటి వారు దోషులుగా ఉన్నారు. ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉన్నాయని.. అయితే మసీదు కూల్చివేత అనేది ప్రణాళికబద్ధంగా జరగలేదని నివేదికలో పేర్కొంది. 

సెప్టెంబర్ నెల, 2010: బాబ్రీ మసీదు స్థలాన్ని ముగ్గురూ పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు
అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ స్థలంలో రెండు వంతుల భూమిని హిందువులను రిప్రజెంట్ చేసే విశ్వ హిందూ పరిషత్, నిర్మోహి అఖారా సంస్థ వారు పంచుకోవాలని.. మిగతా మూడవ వంతు భూమిని సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఈ స్థలానికి జాయింట్ టైటిల్ హోల్డర్స్ గా ప్రకటించింది. దీంతో హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. 

మే నెల, 2011: అలహాబాద్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు
2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ, ముస్లింలు అప్పీల్ చేయడంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.

మే నెల, 2014: కేంద్రంలో అధికారంలోకి బీజేపీ 
కేంద్రంలో బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.

ఫిబ్రవరి 26, 2016: మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని పిటిషన్
2016 ఫిబ్రవరి 26న బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

జూలై 20, 2016: హషీన్ అన్సారీ మరణం
బాబ్రీ మసీదు కేసులో మసీదు తరపున తొలి పిటిషన్ వేసిన హషీన్ అన్సారీ 95 ఏళ్ల వయసులో మరణించారు.

మార్చి నెల, 2017: ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం
ayodhya ram mandhir story

అన్ని పార్టీలు ఈ అయోధ్య స్థల వివాదానికి సంబంధించి సున్నితమైన, సెంటిమెంటల్ మేటర్ లో పరిష్కారం తీసుకొచ్చేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జే.ఎస్. ఖేహర్ సూచించారు. ఇక ఇదే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. హిందూ యువ వాహిని సంస్థ వ్యవస్థాకుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఏప్రిల్ నెల, 2017: రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు
అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతి సహా ఇతర బీజేపీ సభ్యులు, కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేరపూరిత అభియోగాలను ఉపసంహరించుకోలేమని.. ఆ అభియోగాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలానే ఈ విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్నో ట్రయల్ కోర్టుని సుప్రీంకోర్టు కోరింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కళ్యాణ్ సింగ్ ని మినహాయించింది. ఎందుకంటే ఆయన రాజస్థాన్ కి గవర్నర్ గా ఉన్నారు. ఈ విచారణ సమయంలో శివసేన లీడర్ బాల్ ఠాక్రే సహా పలువురు అసలు నిందితులు మరణించారు.  

మే 30, 2017: కోర్టులో హాజరైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి
అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి మీద సీబీఐ స్పెషల్ కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రలో భాగమైనందుకు వారిని కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరయ్యింది. 

జూలై నెల, 2017: మొదలైన రామ మందిర నిర్మాణ పనులు 
బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే రాళ్లతో ట్రక్కులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించాయి.     

ఆగస్టు నెల, 2017: జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు
అయోధ్య ల్యాండ్ వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

ఆగస్టు 8, 2017: అభ్యంతరం లేదన్న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు
అయోధ్య వివాద స్థలానికి కొంత దూరంలో సహేతుకంగా అనిపించే ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశంలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ కి చెందిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.

నవంబర్ 24, 2017: అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలి
వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని.. వేరే ఇంకేదీ నిర్మించకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

నవంబర్ 20, 2017: లక్నోలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదన్న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు
అయోధ్యలో రామ మందిరం లక్నోలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. 

డిసెంబర్ 1, 2017: 32 మంది పిటిషన్
2017 డిసెంబర్ 1న 32 మంది పౌర హక్కుల కార్యకర్తలు 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ల్యాండ్ ని 3 భాగాలుగా విభజిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్నే సవాలు చేస్తూ 32 మంది పిటిషన్ వేశారు. 

మార్చి 14, 2018: అన్ని మధ్యంతర పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
2018 మార్చి 14న పౌర హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2016లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ సహా అన్ని మధ్యంతర పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పక్షాలుగా జోక్యం చేసుకోవాలని కోరింది.    

జూలై 6, 2018: యూపీ ప్రభుత్వం ఆరోపణలు
1994 నాటి తీర్పును మరలా పరిశీలించాలని కొంతమంది ముస్లిం గ్రూప్ లు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.   

జనవరి 8, 2019: ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు
బాబ్రీ మసీదు ల్యాండ్ ఇష్యూ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

నవంబర్ 9, 2019: చారిత్రాత్మక తీర్పు
ayodhya ram mandhir story

అనేక వాదనలు, విచారణల అనంతరం సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్రం మూడు నెలల్లో ఒక ట్రస్టుని ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పజెప్పడం జరుగుతుందని తెలిపింది. సున్నీ వక్ఫ్ బోర్డుకి మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పుని ఇచ్చింది.    

ఆగస్టు 5, 2020: రామ మందిర శంకుస్థాపన
ayodhya ram mandhir story

సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం రామ మందిర ట్రస్టుని ఏర్పాటు చేసింది. ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది. ఆగస్టు 5 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ భూమి పూజ ఉంటుందని రామ మందిర ట్రస్టు ప్రకటించినట్టుగానే భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ అయోధ్య భూమి పూజకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మోదీ రామ మందిర శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. 

జనవరి 22, 2024: నెరవేరిన 500 ఏళ్ల నాటి హిందువుల కల..  
ayodhya ram mandhir story

జనవరి 22న ప్రధాని మోదీ.. నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరంలోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో మరోసారి ముఖ్య భూమిక పోషించనున్నారు. 

ఇదే బాబ్రీ, అయోధ్య రామ మందిరం పూర్తి చరిత్ర!
సారాంశం:
అయోధ్యలో ఎప్పటి నుంచో రామ మందిరం ఉందని.. బాబర్ రామ మందిరాన్ని కూల్చి మసీదు కట్టించాడని హిందువుల వాదన. అలా ఏం లేదు.. రామ మందిరం కూల్చలేదని ముస్లింల వాదన. దీంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ 2.77 ఎకరాల స్థలం ముగ్గురికీ సమానంగా చెందుతుందని.. ముగ్గురూ సమానంగా పంచుకోండని చెప్పింది. ఈ తీర్పు ఎవరికీ నచ్చలేదు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ల్యాండ్ మీకే చెందుతుందని ఎవరు నిరూపించుకుంటే ఆ స్థలాన్ని వారికే ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ల్యాండ్ గురించి వాస్తవాలు తెలియడానికి ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ని నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి తన వాదనలు వినిపించింది. మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని అయితే దాన్ని కూల్చి మసీదు కట్టారనడానికి ఆధారాలు లేవని తెలిపింది. అయితే స్థలం లోపల కాంపౌండ్ లో ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థన చేసుకుంటున్నట్లు సాక్ష్యం ఉందని, అలానే మసీదులో ముస్లింలు ఎప్పటి నుంచో ప్రార్థనలు చేసుకుంటున్నట్లు కూడా సాక్ష్యం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇక ఆ స్థలం శ్రీరాముడికి చెందినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, ముస్లింలు ప్రార్ధన చేసుకునే మసీదుని కూల్చేశారనే దానికి కూడా సాక్ష్యం ఉందని తెలిపింది. ఈ సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల భూమి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చునని తీర్పు ఇచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దానికి గుడిని కట్టే బాధ్యతను, తర్వాత ఉండే మెయింటెనెన్స్ ని అప్పగించాలని కోర్టు వెల్లడించింది. ముస్లింల ప్రార్థన చేసుకునే మందిరాన్ని కూల్చివేశారు కాబట్టి అయోధ్యలోనే ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. ఇక నిర్మోహి అఖారా సంస్థకు ఆ ల్యాండ్ మీద ఎటువంటి హక్కు లేదని.. ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు కనుక ట్రస్టులో వారికి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

Friday, January 12, 2024

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం .

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 

     కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 

           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు . అవి 

    1 . కోష్ఠశ్రీత కామల .
 
    2 . శాఖాశ్రీత కామల .

    3 . కుంభ కామల 

      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 

  వ్యాధి లక్షణాలు -

     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 

  1 . కళ్లు పసుపు రంగులో ఉంటాయి.

   2 . శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 

   3 . అన్నం తినాలనిపించదు.

   4 . వాంతులు అవుతాయి.

   5 . కొంతమందిలో దురద వస్తుంది . 

   
  పాటించవలసిన ఆహారనియమాలు -

    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.

  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం - 

 * నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.

 * నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 

 * తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 

 * ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 

 * కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 

 * త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.

 * చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.

        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 

 
  

Wednesday, January 10, 2024

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు .

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 

     
      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 

     ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 

  ఏకమూలికా ప్రయోగాలు - 

 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 

 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 

 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 

 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 

 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 

 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 

 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 

 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 

 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 

 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 

 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 

 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 

 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 

 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 

 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 

 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 

 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 

 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 

 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 

 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 

 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 

 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 

 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 

 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 

 * మద్యము శోకము నందు శ్రేష్టం . 

 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 

 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 

 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 

 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 

 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 

 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 

 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 

 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 

 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 

 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 

 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 

 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 

 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 

 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 

 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 

 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 

 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 

 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 

 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 

 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 

 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 

 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 

 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 

 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 

 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 

       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 

   

అభ్యంగనం ( మసాజ్ ) వలన ఉపయోగాలు -

అభ్యంగనం ( మసాజ్ ) వలన ఉపయోగాలు - 

      శరీరానికి ప్రతిదినం ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం తప్పనిసరి అని ఆయుర్వేదం తెలియచేస్తుంది. ఇది ఒక రకమైన వ్యాయామం వంటిది. దీనివలన ముసలితనం త్వరగా దరిచేరదు. ఒళ్లునొప్పులు ఉండవు. కళ్ళకి తేటదనం వస్తుంది. శరీరానికి నునుపుదనం , బలం కలుగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. మంచినిద్ర పడుతుంది. శ్రమని తట్టుకొనే శక్తి పెరుగును . 

             శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకొనుటకు ఆయుర్వేదం అనేక రకాల తైలాలను సూచించింది. ఇప్పుడు మీకు శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వలన ఉపయోగాల గురించి మీకు వివరిస్తాను. 

  ఉపయోగాలు - 

 * తైలముతో శరీరానికి మసాజ్ చేయడం వలన చర్మానికి కాంతి వచ్చును. 

 * కండరాలు బలంగా తయారగును. 

 * కండరాలకు , టిష్యులకు మంచి పోషణ అందుతుంది.

 * రక్తప్రసరణ బాగా ఉంటుంది. రక్తప్రసరణ బాగా జరగడం వలన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది . 

 * శరీరంలో వ్యర్ధాలు బయటకి వస్తాయి. 

 * శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగును . 

 * శరీరం తేలికగా , ఉత్సాహంగా ఉంటుంది. 

 * శరీరంలోని అన్ని జాయింట్లలో పట్టుకుపోవడం తగ్గి అన్నివైపులకు తిరగడానికి వీలుగా ఉంటుంది. 

 * మసాజ్ శరీరంలో దృఢత్వాన్ని పెంచుతుంది.

 * వెన్నుముక కు చాలా మంచిది . వెన్నుముక నుంచి వచ్చే స్పైనల్ నెర్వ్స్ కు సంబందించిన అవయవాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది. 

 * శరీరంలోని ఎలక్ట్రో మేగ్నటిక్ శక్తి సక్రమంగా ప్రవహించడానికి మసాజ్ దోహదం చేస్తుంది.

       పైన చెప్పిన విధముగా ఎన్నొ ఉపయోగాలు ఉన్నాయి. మసాజ్ చేసుకొనే సమయములో అరికాళ్ళు మర్దన చేసుకోవడం మర్చిపోవద్దు. 

   
  

గొంతు సంబంధ సమస్యలకు నివారణా యోగాలు -

గొంతు సంబంధ సమస్యలకు నివారణా యోగాలు -

 * శొంటి కొమ్మును చూర్ణం చేసి తేనెతో కలిపి సేవించిన గొంతు నొప్పి తగ్గును.

 * తేనెలో కొంచం మిరియాల చూర్ణం వేసి తీసుకుంటే బొంగురుపోయిన గొంతు మాములుగా అగును.

 * మామిడి ఆకుల కషాయం అరకప్పు తీసుకుని అందులో చెంచా తేనె కలుపుకుని తాగాలి . అలా ఉదయం , సాయంత్రం రెండుపూటలా మూడు రోజుల పాటు తీసుకున్న గొంతు బొంగురు పోవును . 

 * ముల్లంగి రసాన్ని పూటకు పావుకప్పు తీసుకుంటున్న గొంతు బొంగురు పోవును . 

 * చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్నను గొంతు బొంగురు పోవును . 

 * రాత్రి సమయం నందు నిద్రించుటకు పూర్వం ఒక గ్లాసు వేడివేడి పాలలో ఒక చిన్న స్పూన్ మిరియాల చూర్ణం కలుపుకుని తాగుచున్న గొంతులో రొంప, గొంతు బొంగురు పోవును .

 * గొంతులో మంట, నుస ఉంటే లవంగ మొగ్గ నోటిలో వేసుకొని రసం మింగుచున్న తగ్గును.

 * చిన్నపిల్లలకు గొంతులో మంట, నుస ఉంటే వారితో అప్పుడప్పుడు లేత కొబ్బరి తినిపిస్తున్న తగ్గును.

 * గొంతులో టాన్సిల్స్ వాపు వచ్చినపుడు ఉల్లిగడ్డ దంచి ఆ రసం పైన పూయుచున్న వాపు తగ్గును.

 * లేత కొబ్బరి వేర్ల కషాయం కాని మెంతుల కషాయం తో పుక్కిలిస్తున్న గొంతు మంట తగ్గును.

 * టాన్సిల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు తాంబూలం లో వాడే కాచు చూర్ణం చేసి పూటకు పావు స్పూన్ చూర్ణం కొంచం తేనెతో కలిపి లోపలికి తీసుకోవాలి లేదా అరకప్పు నీటిలో కలిపి తాగాలి ఇలా రోజు చేయుచున్న టాన్సిల్స్ వాపు క్రమక్రంగా తగ్గును.

  

విషములు వాని లక్షణములు -

విషములు వాని లక్షణములు - 

 మహా విష సర్పములు - 

 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.

 స్థాన విధి దోషము - 

 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.

 నక్షత్ర దోషము - 

 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .

 విష సాధ్య లక్షణములు - 

  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 

 తేలు విషము - 

  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 

 గర విష లక్షణము - 

 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 

 పెట్టుడు మందు లక్షణము - 

 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 

 విషాన్న లక్షణము - 

 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 

 విషము కలిపిన కూరలు - 

 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 

 విషాన్న పరీక్ష - 

  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 

  

నిద్ర - నియమాలు -

నిద్ర - నియమాలు -

      మానవుడు ఆరోగ్యముగా ఉండవలెను అనిన ఆహారం మరియు నిద్ర ఇవి రెండు ముఖ్యమైనవి . నిద్ర వలన శ్రమ , అలసట తొలగిపోవును . నిద్ర సరిగ్గా పోనిచో శరీరం అశక్తతో నీరసంగా తయారగును. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం అయినది. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రించవలెను. నిద్రను రెండురకాలుగా విభజించవచ్చు. అవి  

              1 . గాఢనిద్ర.

              2 . కలతనిద్ర .

 గాడనిద్ర - 

       మైమరచి , బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రించుట . దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం , విశ్రాంతి లభించి మానవుడు దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలడు.

 కలతనిద్ర -

        మనుష్యుడు నిద్రించునప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలియుచుండును. ఎవరైనా బిగ్గరగా మాట్లాడటం , శబ్దము చేసిన వెంటనే మెలుకువ వచ్చును. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.

 నిద్ర నియమాలు -

 * కొన్నాళ్ళు జబ్బు పడి లేచినవారు , జ్వరముతో బాధపడువారు , నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పినది.

 * జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని మరలా నిద్రించినచో జ్వరం వెంటనే తిరగబెట్టును. కావున వైద్యుడు చెప్పిన నియమాల ప్రకారమే నిద్రించవలెను.

 * ఎదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేసినచో రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకొకుండా నిద్రించవలెను.

 * ఏప్రిల్ మరియు మే నెలలలో అనగా గ్రీష్మఋతువు నందు ఎండలు అధికంగా పగలు నిద్రించుట పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యం కలిగించును.

 * సాయంత్రం సమయంలో టీ మరియు కాఫీని తాగడం ఆపినచో రాత్రి సమయం నందు చక్కటి నిద్రపట్టును .

 * ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్ అంటూ విషపదార్థం శరీరంలోని నరములకు ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.

 * నిద్రించుటకు ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెలికిలిగా పడుకొని ధ్యానం చేయుట ద్వారా మంచి నిద్రపట్టును . మధ్యలో మెలకువ వచ్చిన ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవలెను .

 * పొలం పనిచేయువారు మరియు ఫ్యాక్టరీ పనిచేయువారు సాయం సమయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించవలెను.

 * శారీరక శ్రమ లేనివారు చన్నీటి స్నానము చేయవచ్చు . గదిలో తక్కువకాంతి ఇచ్చే బల్బ్ లను ఉంచరాదు.

 * ఉదయం నిద్రలేచే ముందు మంచం పైన అటూఇటూ నాలుగు నుంచి అయిదు సార్లూ పొర్లి చేతులు , కాళ్లు విదల్చవలెను.

 * నిద్ర లేచించిన వెంటనే కాళ్లు , చేతులు వేళ్లు మెటికలు విరవడం వలన శరీర అవయవాలు శక్తిని పుంజుకోనును.

  
  

ప్రాచీన భారతం నందు రసౌషదాల ఉపయోగం మరియు రసవాద విద్య -

ప్రాచీన భారతం నందు రసౌషదాల ఉపయోగం మరియు రసవాద విద్య - 

    రసవాదవిద్య ఈ పేరు వినుటకు కొంత విచిత్రంగా మరియు కొత్తగా అనిపించవచ్చు. వేమన గురించి తెలిసిన వారికి ఈ విద్య బాగా పరిచయం. నా స్నేహితుల్లో కొంతమంది కూడా దీనిని సాధించుటకు నల్లమల అడవులలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు . అంతకు ముందు రసౌషదాలు మరియు రసవాదం గురించి కొంత వివరణ ఇచ్చాను . ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

            క్రీస్తుశకం 3 , 4 శతాబ్దాలు కాలంనాటి వాగ్బాటాచార్యుని కాలం వరకు రసౌషదాలు అంతగా ప్రాచుర్యంలో లేవు . అసలు ముందు మీకు రసౌషదాలు అంటే ఏమిటి ? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు ? అనే విషయాలు మీకు తెలియచేస్తాను . అందరూ ఆయుర్వేదం అంటే మూలికలు , చూర్ణాలు , కషాయాలు అని మాత్రమే అనుకుంటారు . కాని ఆయుర్వేదం లో చాలా తక్కువ మందికి తెలిసిన మరొక విభాగం ఉంది. అదే "రసౌషద" విభాగం. ఈ విభాగంలో పాదరసం , బంగారం , వెండి , అభ్రకం , వజ్రం వంటి లోహాలని ఉపయోగించి వాటిని సరైన పద్దతిలో పుటం పెట్టి వాటి యొక్క లోహాలక్షణాలని పోగొట్టి శుద్ది చేసి ఔషదాలుగా మార్పుచేయడమే రసౌషద విధానం . ఈ విధానం లో పాదరసాన్ని శుద్ది చేసి రోగి అవసాన దశలో ఉన్నప్పుడు శుద్ధ పాదరసాన్ని సరైన మోతాదులో ప్రయోగిస్తే అల్లోపతి వైద్యవిధానంలో వాడే ఇంజక్షన్ కంటే వేగం గా పనిచేసి రోగి యొక్క ప్రాణాన్ని నిలబెట్టును. నేను తయారుచేసే ఔషధాలలో భస్మాలు వాడినపుడు చాలా వేగవంతమైన ఫలితాలు చూశాను . 

                 ఇప్పుడు మీకు రసవాదం గురించి తెలియచేస్తాను . ఈ విద్య అత్యంత ప్రాచీన విద్య . మీరు ఒక విషయం గమనించండి ప్రాచీన కాలంలో ఇప్పటిలా పెద్ద పెద్ద గనులు బంగారం కోసం తవ్వలేదు . మరి అంత బంగారం ఎలా వచ్చింది ? దానిలో చాలా వరకు రసవాద విద్య ద్వారా తయారు చేయబడినది. నేను అంతకు ముందు మీకు రసవాదం గురించి తెలియచేసిన విషయాలు లో కొన్ని విషయాలు మరలా ఒక్కసారి మీకు గుర్తుచేస్తాను. తెలంగాణా లో వరంగల్ మరియు కరీంనగర్ ప్రాంతాలలో పెద్ద కొండలపై కొన్ని చోట్ల చాలా పాత కోటలు ఉన్నాయి. కొన్నిచోట్ల అవి చెట్లతో పూర్తిగా కప్పబడి దగ్గరకి వెళ్లేంత వరకు అక్కడ కోట ఉందని తెలీదు . ఆ కోటల యొక్క భూగర్భ గదుల్లో పెద్ద పెద్ద కుండలలో 3 రకాల రంగుల్లో మెత్తటి పొడి ఉంటుంది. వాటిని నేను కూడా చూశాను. వాటిలో మొదటిది ఇటుకరాయి రంగులో ఉంటుంది. రెండొవది బూడిద రంగులో మూడొవది సిమెంట్ రంగుతో ఉంటుంది. ఆంద్రప్రదేశ్ లో ద్రాక్షారామం ఏరియాలో కూడా ఇలాంటి కుండలు ఉన్నాయి. ఇవి తెల్లమొదుగ, ఎర్రచిత్రమూలం మరియు నల్లవావిలి చెట్ల నుంచి మరియు వాటి రసాల నుంచి శాస్త్రోక్తంగా తయారుచేసిన భస్మాలు . వీటిని ఉంచిన సమీపంలో ఎక్కడో ఒకచోట ఒక మట్టిపాత్రలో ఒక పసరు ఉంటుంది. ఈ మూడు చూర్ణాలను సరైన పాళ్ళలో తీసుకుని ఆ మట్టిపాత్రలో ఉన్న పసరు కలపడం వలన స్వర్ణం లభిస్తుంది అని కొన్ని గ్రంథాలలో ఉంది. అది ఏ విధంగా చేయాలో అదే స్థలంలో రహస్యంగా ఉంచబడిన రాగిరేకులో పొందపరచబడి ఉంటుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను . రసవాద విద్య కోసం ప్రయత్నించినవాడు ఆ విద్య సాధించడంలో విఫలం అయినా ఒక గొప్ప వైద్యుడు మాత్రం కాగలడు .  

            భస్మాలలో రాజు వంటిది స్వర్ణభస్మం చిన్నపిల్లలకు మనం అన్నప్రాసన చేసేప్పుడు స్వర్ణప్రాసన అని ఉంగరాన్ని నాలుకకు నాకిస్తాం . దాన్నే మనం స్వర్ణ ప్రాసన అని మురిసిపోతాం . కాని అది ఎంతమాత్రమూ కాదు. నిజమైన స్వర్ణప్రాశన అంటే సరైన స్వర్ణభస్మంని లొపలికి ఇవ్వడం ముందు గుండుపిన్ను మొన చివర భాగముని తేనెలో మంచి తరువాత ఆవునెయ్యిలో మంచి చివర కొనభాగం స్వర్ణభస్మానికి ఆనించి రవ్వ అంత మోతాదులో నాలిక పైభాగాన రాయాలి .ఈ విధంగా ప్రతిరోజూ రెండు పూటలా శిశువుకి ఇస్తుంటే ఎదిగే కొద్ది ఆ శిశువు అమిత బలవంతుడు అయ్యి బ్రహుస్పతి అంత గొప్ప ఏకసంథాగ్రాహి అవుతాడు. స్వర్ణభస్మ సేవన చేయువానికి విషము కూడా ఎక్కదు. 

             ఈ రసవాదం , రసౌషధాలకు మూల పురుషుడు సిద్దనాగార్జునుడు అని చెప్తారు. నిత్యనాధ సిద్దుడు రాసిన రసరత్నాకరం అను గ్రంథం నందు ఈ రసవాదం , ఔషదాలు , రత్నాలని భస్మాలుగా చేయుట మొదలగు వాటి గురించి చక్కని వివరణ ఉన్నది. 

   మన ప్రాచీనులు ఈ రసాలని మూడు రకాలుగా వర్గీకరణ చేశారు . అవి 

  * మహారసములు .
  
  * ఉప రసములు .

   * సాదారణ రసములు . 

        పైన చెప్పిన వాటిలో అని రకాల ఖనిజాలను చేర్చి వాటిని వాటి యొక్క లక్షణాలుగా విభజించారు . 

         ఈ రసాలపై అదుపు సాధించిన వాటిని "రససిద్ధులు" అని పిలుస్తారు . ఈ రససిద్ధులలో సిద్ధ నాగార్జునుడు అగ్రగణ్యుడు. ఈ రకంగా మనదేశం నందు మొత్తం 27 మంది ప్రాచీన సిద్దులు ఉండేవారు అని తెలుస్తుంది. ఈ రససిద్దులు కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీరు ముఖ్యంగా శైవసాంప్రదాయం పాటిస్తారు . వీరికి మహత్తు ఉన్ననూ వీరు ప్రదర్శించరు. వీరికి వచ్చు ప్రధాన విద్యలు అగ్నిలో దూకుట , అందులోనే కూర్చొనుట, కోరిన రూపం దరించుట , అదృశ్యం అగుట, బంగారం ద్రవ్యముగా మార్చుట దీనినే రసవాదులు "స్వర్ణదృతి " అని అంటారు. తామ్రమును అనగా రాగిని బంగారంగా మార్చుట, గంధకం (సల్పర్ ) నుంచి తైలం తీయుట , పాదరసాన్ని గులికలా చేసి బంధించుట దానిద్వారా ఆకాశయానం చేయుట ఇటువంటి ప్రక్రియల ను చేయువారిని సిద్దులు అందురు. 

             ఇటువంటి రససిద్ధులకు దక్షిణభారత దేశంలో తమిళనాడు ప్రసిద్ది. తమిళనాడులో ఎక్కువుగా రసాలను ఉపయోగించి వైద్యం చేసేవారు ఎక్కువ. నేను కూడా మొదట్లో మా పూర్వీకుల నుంచి వచ్చిన మూలికల వైద్యాన్ని మాత్రమే అనుసరించేవాడిని.వాటితోనే ప్రయోగాలు చేసేవాడిని. రసౌషదాల గురించి కనీసం ఆలోచించేవాడిని కాదు. ఒక స్నేహితుడిద్వారా కొంత రసౌషద పరిచయం కలిగింది. ఇప్పుడు నేను మూలికలతో పాటు స్వర్ణ భస్మం , అభ్రక భస్మం , రజత భస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకభస్మం , కాంత భస్మం వంటి రసౌషదాలను విరివిగా వాడుతున్నాను . ఖరీదు ఎక్కువ అయినను కూడా ఫలితం తొందరగా వస్తుంది. ఈ రసౌషదాలలో పాదరసం ప్రధానం అయినది. కొంతకాలం క్రితం సోమలత చెట్టు ని ఉపయోగించి కాయసిద్ది అనగా ముసలితనం రాకుండా నిలుపుచేసి నిత్యయవ్వనుడిగా ఎలా ఉండాలో మీకు వివరించాను .అది మూలికా విధానంలో అదే విధమైన ఫలితాన్ని రసౌషదాలలో ప్రధానం అయిన పాదరసం ఉపయోగించి కూడా అదేవిధమైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ రసవిద్యకు ప్రధానంగా నలందా విశ్వవిద్యాలయం , విక్రమశిలా విద్యాపీఠం , నాగార్జునకొండ ప్రధానమైన కేంద్రాలుగా ఉండేవి .ఖిల్జీ ప్రభువు ఈ విద్యాలయాలను ద్వంసం చేయడం మూలాన ఈ రససిద్దులు దేశం నలువైపుల పారిపోవలసి వచ్చింది. వీరిలో అధికం టిబెట్ దేశమునకు వెళ్లిరి. అందువలనే తాంత్రికులకు టిబెట్ దేశం ప్రసిద్ది . ఈ సిద్ధసాంప్రదాయం నందు జాతి ,కుల,మత భేదములు ఉండేవి కావు దానివలన అప్పటి బ్రాహ్మణులు శుచిగా శుద్ధిగా చేయవలసిన మంత్రభాగం ఆచరిస్తూ ఈ తంత్రభాగాన్ని తిరస్కరించారు.

           ఈ సిద్దులు కొంతమంది మనమధ్యనే తిరుగుతుంటారు . ఈ రససిద్ధులే తరువాత ధాతువాదులుగా , రసవాదులుగా పిలవబడిరి . ఈ విద్యని అరబ్ దేశం నందు " కిమియాగరి" అని పేరు కలదు . ఈ పదమే తరువాతికాలంలో " కెమిస్ట్రీ " గా రూపాంతరం చెందినది. అసలు రసవిధానం మొదట వైద్యం కోసమే ప్రవేశపెట్టబడినది. రససిద్దులకు లోహాన్ని శుద్ధిచేయటం , దేహాన్ని శుద్ధిచేయడం అనగా దేహంలోని టాక్సిన్స్, వ్యర్థాలను పూర్తిగా బయటకి పంపే విధానం . ఈ లోహశుద్ధి పాదరసాన్ని పరీక్షించుట ద్వారా తెలియును . అనగా ఒక ఖనిజం (మెటల్) ను తీసుకుని దానియందు పరమాణువులు రెండోవదగు ఉచ్చ తరగతికి చెందిన ఖనిజం ( metal) గా మార్చు శక్తి పాదరసంకి కలదు. రససిద్దులు పాదరసం శివుని వీర్యంగా, గంధకం పార్వతీదేవి రజస్సుగా వారు భావిస్తారు. ఈ పాదరసంతో చేయు చికిత్సలకు ప్రత్యేక నియమనిబంధనలు అవసరంలేదు . అదే మూలికల చికిత్స చేయునప్పుడు శరీరశుద్ధి చేయవలెను ప్రధమంగా వంటి కొన్ని నియమాలు కలవు.  

         ఇలా రసౌషదాల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ , క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు ఈ రసౌషదాలు చక్కని పరిష్కారం . క్యాన్సర్ సమస్యకి వాడే ఔషధాల్లో వజ్రభస్మం వాడటం వలన రోగి తొందరగా కొలుకుంటాడు.

           

పిరమిడ్లు గురించి సంపూర్ణ వివరణ - 1 .

పిరమిడ్లు గురించి సంపూర్ణ వివరణ - 1 .

     కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద కొన్ని వందలాది సంస్కృతులు , నాగరికతలు ఈ భూమి మీద జనించాయి అలానే అదృశ్యం అయ్యాయి .ఇవి ప్రకృతి సిద్ధ అనర్ధాల వలన మరికొన్ని స్వయంకృతాపరాధాల వలన కాలగర్భములో కలిసిపోయాయి . ఇటువంటి మహాన్నత సంస్కృతులలో " ఈజిప్టు నాగరికత " చాలా ముఖ్యమైనది . ఈ ఈజిప్టు సంస్కృతి ఎన్నో రహస్యాలతో ముడిపడి ఉంటుంది . ఈ రహస్యాలలో ముఖ్యమైనది "పిరమిడ్లు " వీటి గురించి ఇప్పటికి పరిశోధకులు ఎంతలా పరిశోధించినా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది .

       ఈ పిరమిడ్ల చరిత్ర గురించి నేను అనేక రకాల పుస్తకాలు చదవడం జరిగింది . నేను తెలుసుకున్న ఎన్నో అమూల్యమయిన విషయాలలో అత్యంత ముఖ్యమైనవి మీకు తెలియచేయడం కోసమే ఈ ఆర్టికల్ రాస్తున్నాను .

      ఈజిప్టు లోని కైరో నగరానికి 16 కిలోమీటర్ల దూరములో 13.1 ఎకరాల విస్తీర్ణములో భూమ్యాకాశాలను కలుపుతున్నట్లు " గ్రేట్ పిరమిడ్ " సాక్షాత్కరిస్తుంది . ప్రపంచములోని ఏడు వింతలలో ఇది ఒకటిగా ఖ్యాతిగడించింది . సుమారు 4000 సంవత్సరాల క్రితం ఈజిప్టు దేశములో నిర్మాణం అయిన గ్రేట్ పిరమిడ్ తో పాటు చిన్నవి , పెద్దవిగా కనిపిస్తున్న మరో ముప్పై పిరమిడ్లు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి . ఇందులో కొన్ని గ్రేట్ పిరమిడ్ కి ముందు నిర్మాణం అయినవి కూడా ఉన్నాయి . మొదటి పిరమిడ్ క్రీస్తు పూర్వం 2650 వ సంవత్సరం నాటిది అని చరిత్రకారుల అంచనా ! అసలు మొత్తం ఈజిప్టులో 70 పిరమిడ్లు ఉండేవని కాలగమనములో ప్రకృతి వైపరిత్యాలు , దుండగుల దాడుల్లో కొన్ని నశించి చివరికి 30 మాత్రం మిగిలాయి . 

    ప్రపంచములో పలుప్రాంతాలలో ఈ పిరమిడ్ల నిర్మాణం జరిగింది . చైనా , అమెరికా , ఫ్రాన్స్ , దక్షిణ ఆఫ్రికా , ఆస్ట్రేలియా , మెక్సికో , సైబీరియా , పెరూ దేశాల్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి . మన భారత దేశములో హిమాలయ పర్వతాల్ని కూడా తెల్ల పిరమిడ్లు గా భావించే పరిశోధకులు ఉన్నారు . ముఖ్యముగా కైలాస పర్వతాన్ని గ్రేట్ పిరమిడ్ గా వ్యవహరిస్తారు . ప్రపంచములో విశాల ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉన్న పిరమిడ్ పేరు " క్విట్జల్ కోయాటి " ఇది మెక్సికోలో ఉంది . 117 అడుగుల ఎత్తులో 45 ఎకరాల విస్తీర్ణములో నిర్మింపబడిన పిరమిడ్ ఇది . ఇది క్రీస్తు శకం 100 వ సంవత్సరం నాటిది . ఈజిప్టు గ్రేట్ పిరమిడ్ కంటే పది లక్షల క్యూబిక్ గజాలు ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది . ఇతర దేశాలలో పిరమిడ్ల కంటే ఈజిప్టు దేశములోని పిరమిడ్లు ఏంతో విలక్షణం అయినవి మరియు రహస్యాలతో కూడుకొని ఉన్నవి .

       పిరమిడ్లలోని మిస్టరీస్ మరియు వాటి గురించి మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు సంపూర్ణముగా వివరిస్తాను .

 

ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు -

ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు - 

     "అన్నం పరబ్రహ్మ స్వరూపం" కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .

  భోజన నియమాలు - 

 * భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను 
ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి 12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .

 * తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు . 

 * ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.

 * ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .

 * ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు . 

 * పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.

 * భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను . 

 * ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను . 

 * రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా 
ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .

 * భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . " నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి " అన్నది నీతిశాస్తం వివరించింది.

 * మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .

 * ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .

 * ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం "ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి " అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది. 

 * రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును 

 * చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు . 

 * మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు. 

 * మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు 
అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.

 * ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా 
భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం . 

 * భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .

 * ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం . 

 * ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .

 * ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను . 

 * బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.

 * వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది . 

 * కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును. హృదయ రోగములను నిగ్రహించును.

  * స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును . 

 * అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును. 

 * గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు . 

 * అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును . 

 * మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.

 * మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.

 * రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.

 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .

 * తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు .