Sunday, June 15, 2025

జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ

జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ - 
       
ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును . జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము . దాని ఫలితము రాక్షసులకు పోవును . జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము . 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల . 
                
. జపమాల చేయు విధానం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను . మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను . దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును. మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను . మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును. జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను . దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను . జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను . జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును. 
                 
. ఇప్పుడు మీకు ఏ వస్తువులు కల మాలలతో జపము చేసిన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చునో మీకు తెలియచేస్తాను . రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును. పద్మమాలిక సర్వబీష్ట సిద్ది , పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము , పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం , ఉశిరిక గింజల మాల జ్వరశాంతి , పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును. ఔదుంబర మూలికామాల సర్వసిద్ది , తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను . హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది , మణులతో చేసిన మాల సామ్రాజ్యము , స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట , పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం , రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును. 
               
. జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లకు ఏమి ఫలమో ఆ విధముగా చేయవలెను . ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను . మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును. బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది . చూపుడువేలు ఉచ్చారణ కొరకు , కనిష్ఠఅంగుష్ఠములు మరణము , చూపుడు వ్రేలు శత్రునాశనము , మధ్యవ్రేలు రోగహరి , ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ , అంగుష్ఠము మోక్షమును ఇచ్చును. 
     
  
. జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను . 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు. ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును . 
            

Wednesday, June 11, 2025

ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స గురించి వివరణ -

ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స గురించి వివరణ - 

   ఆయుర్వేద చికిత్స పద్దతిలో ఔషధాలను 5 రకాలుగా ప్రయోగిస్తారు . దీనికే "పంచకర్మ " అని పిలుస్తారు . వాటి గురించి మీకు వివరిస్తాను . 

    పంచకర్మములు 5 రకాలు అవి 

  స్నేహన విధి , స్వేదన విధి , వమన విధి , విరేచన విధి , నస్య విధి . 

 * స్నేహన విధి - 

       తైలాదులను లేపనం చేయుట , చరుముట , రాయుట మొదలైనవి దీనికి లేపనవిధి అని మరొక పేరు కలదు . 

 * స్వేద విధి - 

       బాగా చెమట పట్టునట్లు వేడినీళ్ల యొక్క ఆవిరి పట్టుట . దీనికి కుంభాసేకమనియు పేరుతో కూడా పిలుస్తారు . తరువాత కాలంలో " టర్కిష్ బాత్ " అని వ్యవహరిస్తున్నారు . 

 * వమన విధి - 

     వాంతి అగునట్లు ఔషధములను పుచ్చుకొనుట .

 * విరేచన విధి - 

     జీర్ణాశయమును , ప్రేవులను శుద్ది చేసుకొనుట కొరకు , లోపలి పేరుకొని పోయిన దుష్టపదార్ధమును బయటకి వెడలగొట్టుటకు విరేచనాలు అయ్యే ఔషధాలను సేవించి జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకొనుట . 

 * నస్య విధి - 

      కొన్ని రకాల మూలికల యొక్క రసములను నాసికా రంధ్రముల యందు పోయుట . లేక నాసికా రంధ్రముల నుండి లోపలికి పీల్చు విధానం . 

      

మణిపూరక చక్రం.

మణిపూరక చక్రం.
 
మనవ శరీరం లొ ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది నాభి కి కుడివైపు ఒక అంగుళం దూరం లొ వెన్నుని ఆనుకొని ఉంటుంది. ఇది గతి తప్పినా అనగా సరిగ్గా శక్తి సంచాలనం చేయక పోయినా లేక స్థితి తప్పినా అనగా ఉండాల్సిన చోట ఉండకుండా కొంచెం కదిలినా శక్తి హీనం అయినా మనిషి చాలా రోగాలుకి గురి అవుతాడు.

మణిపూరక చక్రం పరీక్ష - 
 
 మణిపూరక చక్రం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి 2 పరిక్షలు ఉన్నాయి .
 
* పరగడుపున అనగా ఏమీ తిననప్పుడు వెల్లికిలా పడుకొని నాభిలో వేలుపెట్టి కొద్ది గా అదిమితే గుండె చప్పుడు లాంటిది వినపడుతుంది.అలా వినపడితే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.

 * నాభి స్థానం నుండి కుడి ఎడమ స్థనగ్రముల వరకు దూరాలు కొలవండి. ఈ రెండు దూరములు సమానం గా ఉంటే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.
 
మణిపూరక చక్రం కదలడానికి గల కారణాలు - 
 
     మూలాధారం నుండి ప్రారంబించి ఆ చక్రాలు ఒక నిర్ణిత స్థానం లొ ఉంటాయి. ఈ చక్రాలు ఒక నిర్ణీత స్థానం లొ వెన్నుని ఆనుకుని ఉంటాయి.వీటి సంభందం శరిరం లొని నాడీ కేంద్రాలతో అన్నిటితో ఉంటుంది . ఈ నాడి కేంద్రాలలో ని అయస్కాంత శక్తి తగ్గినప్పుడు వాటికి అనుగుణం గా చక్రాల స్థితులలో మార్పు రావోచ్చును కారణం ఇవన్ని జివయస్కాంత శక్తి కేంద్రాలు.కనుక 

 శరీరం లొ జీవయస్కాంత శక్తి తగ్గడానికి గల కారణాలు - 

 * చాలా ఎక్కువ సమయం ఇనప వస్తువులపై కూర్చోవడం.

 * ఎక్కువుగా ఇనప గ్రిల్ల్స్ మొదలయినవి ఉండే ఇంట్లో నివసించడం.

 * అత్యధిక ఉష్ణం కలిగించె ఆహరం తరుచుగా తినడం.

 * అయస్కాంత శక్తి తగ్గిపోయిన స్త్రీ తొ కాని పురుషుడు తో కాని సంభందం పెట్టుకొవడం.

 * ఉప్పు, కారం లు అదికం గా తినడం

 * మాంసాహారం హద్దు దాటి తినడం .
 
* ఎక్కువ సమయం స్కూటరు, కార్ మొదలయిన వాహనాలు గాని లేక రోడ్ రోలర్ , ప్రొక్లియన్ వంటి వాహనాలు నడపడం.

 * అయస్కాంత విదుతయస్కాంత యంత్రాలకు సంభందించిన ఉద్యోగాలు.

 * చాలా శక్తి వంతమైన విధ్యుత్ తో నడిచే యంత్రాల వద్ద పని చేయడం .
 
మణిపూరక స్థానభ్రంశం వలన కలుగు రోగాలు - 

 " ఉదార విథానం " ( Diaphram ) అనేది కడుపుని పై భాగాన్ని వేరు చేస్తూంది .ఈ ఉదార వితానం క్రింది భాగం లొ ముఖ్యం గా నాభి నుండి క్రిందికి గల భాగం లొ ఏ రోగమైన రావొచ్చు. 
 
* జీర్ణకోశ వ్యాదులు , అల్సర్, apendisitees , డయారియా , డిసెంత్రీ , లైంగిక సమస్యలు, నడుంనొప్పి, పైల్స్ , phiistula , కడుపు నొప్పి ఇటువంటివి రావొచ్చు.
 
 మణిపూరక చక్రం శక్తి హీనం అయ్యి స్థానబ్రంశం పొందినా కాలేయం పాంక్రియాస్ పాడు అయ్యి మదుమేహం రావొచ్చు .పెద్ద ప్రేవులలో, పురీష నాళం కాన్సర్ రావొచ్చు .
 
మణిపూరక చక్రాన్ని సరి చేయు విధానం -

. వెల్లికిలా పడుకోండి . నాభి పైన ఒక రూపాయి బిళ్ళ ఉంచండి.దానిపైన ఒక కొవ్వొత్తి ఉంచండి.దానిపై ఒక స్టీల్ గ్లాస్ బోర్లించి పట్టుకోండి.వేడి వలన గ్లాస్ లొ ప్రాణ వాయువు
 ఖర్చు అయిపోయి శూన్యం ఏర్పడుతుంది.లేదా వాయువు వ్యాకోచించి ఒత్తిడి ఎర్పడుతుంది. ఆ వత్తిడి వలన మణిపూరక చక్రం సరి అయిన స్థానం లొ కి వస్తుంది. ఈ ప్రక్రియను నాలుగు , అయిదు సార్లు చేసి మణి పూరకానికి పైన చెప్పిన పరీక్షలు నిర్వహించాలి. అది సరి అయిన స్థానానికి వచ్చినపుడు గుండె చప్పుడు వినిపిస్తుంది.

 * అరచేతి కేంద్ర స్థానాన్ని గాని అరకాలి కేంద్ర స్థానాన్ని బొటన వ్రేలితో నొక్కండి.(sound వినపడే వరకు ) .

 * వెల్లికిలా పడుకొని గాలి పీల్చి కడుపుని ఉబ్బించి పెట్టండి అలా మణిపూరక చక్రం తన స్థానం వచ్చె వరకు చేయండి .

 * సూర్య యంత్రం మెడలో ధరించండి.
 
* సూర్య నమస్కారాలు చేయండి .

 * కుడి చేతి మద్య వేలికి మాణిక్యం ధరించండి. 
  
            

Sunday, June 8, 2025

కులముతో పనిలేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు.

కులముతో పనిలేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 
(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 
~~~~~~~~
1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..
4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 
6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 
వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 
8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
ఇంకా 
1.ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
2.ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు
1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 
4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)
7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 
8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).
9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*
తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి
ఇదే మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.

శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
.

Monday, June 2, 2025

వరసగా వచ్చు ఎక్కిళ్లు హరించుటకొరకు అద్భుత యోగాలు

వరసగా వచ్చు ఎక్కిళ్లు హరించుటకొరకు అద్భుత యోగాలు - 

 * నల్లేరు కాడలు తెచ్చి కుమ్ములో ఉడకబెట్టి రసముపిండి ఆ రసము 5ml తేనే 5ml కలిపి పూటకొక సారి రోజూ రెండుసార్లు తీసుకున్న యెడల ఎక్కిళ్లు హరించును 

 * నెమలిపింఛం కాల్చి మసిచేసి ఆ మసి , తేనె , తమలపాకులరసం సమభాగములుగా కలిపి పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి మూడుపూటలా ఇచ్చుచుండిన యొడల ఎక్కిళ్లు హరించును . 

• శోంఠి , తేనె కలిపి ఒక చిన్న ఉసిరి కాయ అంత ఉండ చేసి బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేయుచున్న ఎక్కిళ్ళు తగ్గును. 
    

Tuesday, May 27, 2025

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

 * అన్నం అగ్నిదీపనం చేయును .

 * మలమూత్ర విసర్జనకారిగా ఉండును.

 * చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.

 * బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును. 

 * బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును. 

 * పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .

 * బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును . 

 * మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి. 

 * అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .

 * రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .

 * వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధారుడ్యం కలుగచేయును . పథ్యకరం అయినది. దాహాన్ని తగ్గించును . 

 * శరీరానికి కాంతిని ఇచ్చును. మూత్రవృద్ధి చేయును . తేలికగా ఉండును. ముడిబియ్యపు అన్నం అగ్నిదీప్తి కలిగినవారికి మంచి శ్రేష్ఠమైనదిగా 
ఉండును . 

 * సన్నరకం బియ్యపు అన్నం దీపనకారిగా ఉండి దోషములను పోగొట్టును . ప్రశస్తమైనది , రోగములను హరించును .

 * మినపపప్పు గాని నువ్వుల గాని చేర్చి వండిన అన్నమును పులగం అందురు. బలమును కలుగచేయును . మలమును బంధించును . పెసరపప్పు , కందిపప్పు , శనగపప్పు వగైరా బియ్యముతో చేర్చి వండిన అన్నం శుక్రమును మరియు బలమును పెంచును . పుష్టిని కలిగించును. మలమును విసర్జింపచేయును . వాతాన్ని హరించును . పిత్తమును మరియు కఫాన్ని పెంచును.త్వరగా జీర్ణం అవ్వకుండా ఉండును.

 * పాలలో బియ్యం , చెక్కర వగైరా కలిపి వండినదానిని పాయసం అనియు క్షీరాన్నం అనియు పరమాన్నం అని కూడా అంటారు. పాయసం త్వరగా జీర్ణం కాదు. బలమును , ధాతుపుష్టిని చేసి మలమును బంధించును . 

      ఇప్పుడు పప్పుల గుణములు కూడా మీకు వివరిస్తాను. 

      పెసరపప్పు వాతమును , కడుపు ఉబ్బరమును కలిగించును. పొట్టు తీసిన పెసరపప్పు మధురంగా ఉండును. దేహకాంతిని కలుగచేయును . గుల్మము , ప్లీహము,కాస , అరుచి , పిత్తము , ప్రమేహరోగము , గళ రోగమును హరించును .

            కందిపప్పు రుచిగా ఉండి మలబద్దకం, కుష్టు , జ్వరం , అతిసారమును హరించును . శనగపప్పు కడుపుఉబ్బరం కలుగచేయును . ఉలవపప్పు కఫపిత్తరోగములను , గుల్మొదరం , మూలవ్యాధి , వాతం , క్రిమిరోగం , కాసరోగం , ఆమవాతంను హరించును . అలసందపప్పు 
మధురంగా ఉండును. బలమును వృద్దిచేయును.

      కొందరు పొట్టుతీసిన పెసరపప్పు , పొట్టుతీయని కందిపప్పు విషతుల్యం అందురు. కారము మరియు కమ్మదనం కలిగిన పదార్థముల యందు పైత్యమును , పులుసు , వగరు కలిగిన పదార్థముల యందు శ్లేష్మము , తీపు మరియు చప్పదనం కలిగిన పదార్థముల యందు వాతము కలదని ఋషుల యొక్క అభిప్రాయం . కావున శరీరతత్వము మరియు రోగమును గుర్తించి పథ్యం పెట్టవలెను.
 
 
 

అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు .

అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు . 

  గాలులు లొని రకాలు - 

     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 

  దక్షిణ దిక్కు గాలులు - 

    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 

  నైరుతి గాలులు - 

      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 

  పడమర గాలులు - 

     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 

  వాయువ్య దిక్కుల గాలులు - 

   
     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 

  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు - 

     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 

   ఆగ్నేయ గాలులు - 

  
       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.

కసవింద

కసవింద - 
 
తెలుగు - కసవింద . 
  
 సంస్కృతము - కాసమర్ధ . 
  
 హింది - కసౌందీ . 
 
 లాటిన్ - Cassia occidentalis linn . 
 
 కుటుంబము - Caesalpinaceae . 
  
 రూపలక్షణాలు - 
    
కసవింద చెట్టు క్షుపజాతికి చెందినది . గజము ఎత్తువరకు పెరుగును . ఇది సన్నని , వెడల్పు ఆకుల బేధము కలిగి ఉంటుంది . ఆకులు 3 అంగుళముల పొడవు కలిగి 2 అంగుళముల వెడల్పు కలిగి మిరపకాయలను పోలి ఉండును . దీని కాయలు ఉలవకాయల వలే సన్నముగా 5 నుంచి 6 అంగుళముల పొడవుగా ఉండును. దీని ఆకు కొంచము నలుపురంగుగా పొడవుగా కొనగలిగి ఉండును . పసుపుపచ్చని అందమైన పూతలు పూయును . బీజములు గుండ్రముగా , బల్లపరుపుగా , నునుపుగా ఉండును . ఇది సర్వత్రా జలము గల భూముల యందు ఉండును కొన్ని ప్రదేశాలలో గుబురుగా ఒకేచోట ఎక్కువుగా ఉండును . 
  ఈ కసవిందలో 3 రకాలు కలవు . అవి 
  
    * కసవింద సాధారణమైనది . 
    * కమ్మ కసవింద . 
    * కొండ కసవింద లేదా తీట కసవింద . 
        
. పై మూడింటిలో కొండ కసవిందకు ముండ్లు గల ఆకులు ఉండటం మూలన తీట కసవింద అని కూడా పిలుస్తారు . ఇది మామూలు కసవింద మాదిరి పొదలా పెరగక నేలను పాకి అల్లుకొనును . 
  
. గుణగణములు - 
     
  కసివింద ఎక్కువ చేదు , కొంచం మధురంగా ఉండును . వేడిగా , జీర్ణకారిగా , కంఠమును శుభ్రపరచునదిగా , కఫము , వాతము , అజీర్ణము , దగ్గును , పిత్తమును హరించునదిగా ఉండును . త్రిదోషములను హరించు శక్తి కలిగినది . విషములను పొగొట్టును . గాయములను , చర్మవ్యాధులను , నేత్రరోగములను , గడ్డలను పోగొట్టును . వాతసన్నిపాతములను హరించును . ఉదర రోగములను హరించును . అతిమూత్రవ్యాధి నివారణ అగును . 
           
. కసవిందాకు కూర కొంచము చేదుగా , వెగటుగా ఉండును . వేడిని , పిత్తమును కలిగించును . కఫవాతములను , నులిపురుగులు పడుటను , ఆయాసముతో కూడిన దగ్గులను , చర్మవ్యాధులను పోగుట్టును . ఆకలిని కలిగించును . ఇందులో కమ్మ కసవిందకు కూర తియ్యగా , రుచిగా ఉండును . వాతములను పోగొట్టును . పొత్తికడుపును శుభ్రపరచును . రక్తపిత్తములను , క్రిమిరోగమును పోగొట్టును . మంచి వీర్యవృద్ధిని ఇచ్చును . 
        సాధారణముగా కసవిందకాయలు లేతవి వండుకొని తినినచో కొంచం వేడిచేయును . కాని శ్వాసకాసలు , వాతములు , జ్వరముల యందు పథ్యముగా ఉపయోగించదగినది . కొండకసవింద , కమ్మ కసవింద కాయలు మాత్రం కూరకు ఉపయోగించరాదు . వాతరోగము అత్యంత తీవ్రముగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు . 
     
. కమ్మ కసవింద రసము , చూర్ణము సాధరణ కసవింద వలె చేదుగా ఉండక తియ్యగా ఉండును . దీని ఆకును కూరగా కాని లేదా పులుసుకూరగా గాని వండి తినుదురు . ఇది రుచిగా , స్వాదుగా ఉండును . కొండ కసవింద ఆకుల రసముగాని , కషాయము గాని జ్వరములను , సన్నిపాతములను , ఉదరరోగములను నశింపచేయును . వేరుచెక్క విషజ్వరాలను హరించును . ఇది రుచికి కారముగా ఉండి అగ్నిదీపనమును కలిగించును . దీని వ్రేళ్ళు , కాయలు వేసి కాచిన తైలము మర్దించిన వాతపునొప్పులు నెమ్మదించును . నీళ్ల విరేచనములు పోగొట్టు గుణము కలిగినది . దీని రసపు మోతాదు 3 తులముల ఎత్తు , కషాయం మోతాదు 5 తులముల ఎత్తు వరకు ఇవ్వవచ్చును . సాధరణ కసవింద చూర్ణం లోపలికి పుచ్చుకునే మోతాదు 2 నుంచి 4 చిన్నముల ఎత్తు వరకు ఉండవచ్చు . 
  
 ఔషధోపయోగములు - 
  
 * వాతనొప్పుల నివారణ కొరకు - 
       
. కసవిందాకు రసాన్ని నువ్వులనూనెతో కలిపి తైలపక్వము చేసి కీళ్లపై వ్రాసిన వాతనొప్పులు తగ్గును . 
 
 * పక్షవాత నివారణ కొరకు - 
      
. కసవింద ఆకు రసాన్ని వెన్నతో కలిపి మర్దించిన నరాల బలహీనత తగ్గి పక్షవాతం వలన పడిపోయిన అవయవం తిరిగి స్వాధీనంలోకి వచ్చును . 
 
 * గజ్జి నివారణ కొరకు - 
       
. కసవిందాకు రసము ఒంటికి రాసుకున్న గజ్జి తగ్గును . అంతే కాకుండా ఎలర్జీ , దద్దుర్లు తగ్గును . 

  * విరిగిన ఎముకలు అతుక్కునుటకు - 
     
. కసవింద ఆకులను కోడిగుడ్డు సొనతో నూరి పట్టువేసిన విరిగిన ఎముకలు అతుక్కునును . 

  * బోదకాలు నివారణ కొరకు - 
       
. కసవింద వేరుని అవునేతితో కలిపి తాగిన బోదకాలు తగ్గును . 
       కసవింద వేరు పై బెరడును నూరి ఒక చెంచా మోతాదులో రోజుకి రెండుసార్లు సేవించిన బోదకాలు నయం అగును . 
 
 * చుండ్రు , పేలు నివారణ కొరకు - 
      
. కసవింద ఆకు రసాన్ని తలకు పట్టించి మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన పేలు , చుండ్రు తగ్గును . 
 
 * దగ్గు , ఆయాసం నివారణ కొరకు - 
     
. కసవింద ఆకు రసాన్ని 1 నుంచి 2 చెంచాలు రోజుకి 2 లేదా 3 సార్లు సేవించిన దగ్గు తగ్గును . కసవింద గింజల చూర్ణాన్ని కాఫీలా కాచుకొని తాగుచున్న ఆయాసము తగ్గును . 
 
 * కండ్లకలక నివారణ కొరకు - 
     
. కసవింద ఆకులను కండ్లపైన వేసి ఉదయం , సాయంత్రం కట్టు కట్టుచున్న కండ్లకలక నివారణ అగును . 
 
 * సోరియాసిస్ , సిబ్బెము నివారణ కొరకు - 
       
. కసవింద వేరును పుల్లని పండ్లరసముతో గాని లేదా పుల్లటి మజ్జిగతో గాని లేదా పులిసిన గంజితో మెత్తగా నూరి పూసిన సోరియాసిస్ , సిబ్బెము , తామర , గజ్జి నయం అగును . 

  * అతిమూత్రం నివారణ కొరకు - 
      
. కసవింద గింజల చూర్ణము 1 గ్రాము 1 స్పూన్ తేనెతో కలిపి ఉదయం , సాయంత్రం తీసుకున్న అతిమూత్రం తగ్గును . 
 
 * నులిపురుగుల నివారణ కొరకు - 
     
. కసవింద ఆకులను శుభ్రపరచి నీడన ఎండించి మెత్తని చూర్ణం చేసుకుని ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం 2 గ్రాముల మోతాదులో తీసుకొనుచున్న కడుపులో నులిపురుగులు నశించును . ఆయసం , దగ్గు , చర్మరోగాలు కూడా నశించును . 
       

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .

 కొర్రలు యొక్క ఉపయోగాలు -

 * కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

 * శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

 * కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

 * శరీరం నందు వేడిని కలిగించును.

 * జ్వరమును, కఫమును హరించును .

 * జీర్ణశక్తిని పెంచును.

 * రక్తమును వృద్దిచేయును.

 * నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

 * అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

 * గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

 * కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .

 * కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .

 * కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

   సామలు యొక్క ఉపయోగాలు - 

 * సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 

 * చలవ , వాతమును చేయును . 

 * మలమును బంధించును . 

 * శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 

 * ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.

 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 

  రాగుల యొక్క ఉపయోగాలు - 

 * వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 

 * రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 

 * శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 

 * మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 

 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 

 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 

 * కఫాన్ని పెంచును. చలవ చేయును . 

 * శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

 * ఆకలిదప్పికలను అణుచును.

 * విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 

 * రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

 * రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 

 * మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

 * రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 

 * రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.
 
 
   

సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -

సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -

      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు "సిద్మ కుష్టు" దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "
వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 

             ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. 

నేను బతికే ఉన్నాను*

*నేను బతికే ఉన్నాను*

*ఒక పార్టీకి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒక వృద్ధుడు కర్ర సహాయంతో వేదికపైకి వచ్చి తన సీట్లో కూర్చున్నారు.*

*హోస్ట్ అడిగారు, "మీరు ఇంకా డాక్టర్‌ దగ్గరకు తరచుగా వెళ్తారా?"*

*వృద్ధుడు అన్నాడు, "అవును, తరచుగా వెళ్తూ ఉంటాను!"*

*హోస్ట్ ప్రశ్నించారు, "ఎందుకు?"*

*వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "రోగులు తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ జీవించగలుగుతాడు!"*

*ప్రేక్షకులు ఈయన మాటలకి జోరుగా చప్పట్లు కొట్టారు.*

*తర్వాత హోస్ట్ మళ్లీ అడిగాడు: "మీరు ఫార్మసీకి కూడా వెళ్తారా?"*

*వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, "కచ్చితంగా! ఎందుకంటే, ఫార్మసిస్ట్ కూడా బ్రతకాలి కదా!"*

*దీనికి ప్రేక్షకులు మరింత ఎక్కువగా చప్పట్లు కొట్టారు.*

*హోస్ట్ తర్వాత అడిగాడు, "అయితే, మీరు ఫార్మసిస్ట్ ఇచ్చిన మందులు తాగుతారా?"*

*వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "లేదు! తరచూ వాటిని పారేస్తాను, ఎందుకంటే నాకు కూడా బ్రతకాలి అని ఉంటుందిగా!"*

*దీంతో ప్రేక్షకులు మరింత పెద్దగా నవ్వారు.*

*చివరగా హోస్ట్ అన్నాడు: "మీరు ఈ ఇంటర్వ్యూకు వచ్చినందుకు ధన్యవాదాలు."*

*వృద్ధుడు తల అంగీకారంగా ఊపుతూ అన్నాడు, "మీకు స్వాగతం! ఎందుకంటే, మీరుకూడా బ్రతకాలిగా!"*

*దీంతో ప్రేక్షకుల నవ్వులు ఆగలేదు, సంతోషంతో కేకలు వేయడం కొనసాగించారు.*

*హోస్ట్ మళ్లీ అడిగాడు, "మీరు మీ వాట్సాప్ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉంటారా?"*

*వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "అవును! నేను అప్పుడప్పుడు మెసేజెస్ పంపుతుంటాను, ఎందుకంటే నేను కూడా బ్రతికే ఉన్నానని అందరికీ తెలియాలి! లేదంటే, గ్రూప్ అడ్మిన్ నన్ను తొలగించేస్తాడు!"*

*ఈ జోక్ ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందిందని చెబుతారు, ఎందుకంటే అందరూ బ్రతకాలి!*

*కాబట్టి, నా ప్రియమైన మిత్రులారా, చిరునవ్వుతో ఉండండి, మీకు నచ్చినవారికి సందేశాలు పంపుతూ, స్పందిస్తూ ఉండండి!*

*సంప్రదింపులో ఉండండి!*
*మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, మానసికంగా ప్రశాంతంగా ఉన్నారని అందరికీ తెలియజేయండి!*😁

శ్రీ హనుమాన్ జన్మదినం

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*

_*రేపు శ్రీ హనుమాన్ జన్మదినం , వైశాఖమాసం దశమి తిథి , పూర్వాభాద్రనక్షత్రము*_

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.

*జననం*

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. 

హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. 

అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. 

అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. 

ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.

ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. 

హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.    
                                     *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయ స్వామి.
4. పంచముఖాంజనేయ స్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయ స్వామి.
7. చతుర్భుజాంజనేయ స్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి
తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!

దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.

*ఆయన అష్టసిద్ధులు*

1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.

2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.

3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.

4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.

5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.

6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.

7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.

8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.


*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?*

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. *'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా'* అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*

శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం

శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''

అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

*ఆచరణ:* భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.

*అభిషేకం*

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.

*ఆచరణ :* మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి

*మంగళ వార సేవ*

మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.

*శనివార సేవ*

హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.

*పంచ సంఖ్య*

హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.

*హనుమాన్ జన్మదినం*

హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమంతుని జన్మదినం కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.

*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*

*ఆచరణ :* సంవత్సరంలో ఈ ఒక్క జన్మదినం నాడైనా భక్తులను మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*

రావి చెట్టు (అశ్వద్థవృక్ష) మహిమ*

*రావి చెట్టు (అశ్వద్థవృక్ష) మహిమ*

*దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం) ఒకటి.*
```
అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. అందువల్లనే ‘అశ్వత్థ నారాయణుడు’ అనే పేరు కూడా ఆయనకు ఉంది. 

సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురా ణాలు చెబుతున్నాయి.

ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు.

కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు.

స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్రవస్త్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది.

ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం.

బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి.

నోటిపూత పోవును. రావి చెక్కకషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపును.

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్థమే నారాయణ స్వరూపము.

ఆ వృక్షం యొక్క మూలము – బ్రహ్మ, దాని మధ్య భాగమే – విష్ణువు, దాని చివరి భాగము – శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.

ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి.

అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్థ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అది ఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.```


*ప్రదక్షణ మరియు పూజించు విధానము :*```

ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి ఈ క్రింది అశ్వత్థ వృక్ష స్తోత్రమును పఠించాలి. ```


*అశ్వత్ధవృక్ష స్తోత్రం....*```

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః

అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. 
గురు, శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షం లో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు.

ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.

మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్థ వృక్షానికి నమస్కరించాలి.```


*అశ్వత్ధ వృక్ష పూజా ఫలము :*
```
అశ్వత్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి. బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.

శనివారంనాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.```

*అశ్వత్థ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం:*

*కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకోయమః*
*శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః*```

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షనీడలో స్నాన మాచరించిన మహాపాపములు తొలగును.

అశ్వత్థ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది.

అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాలు వారికి స్వర్గం లభిస్తుంది.

జ్యేష్ట మాసం విశిష్టత..?ఈ మాసం ఏ దేవుడికి ఇష్టమైన మాసం..?*

*జ్యేష్ట మాసం విశిష్టత..?ఈ మాసం ఏ దేవుడికి ఇష్టమైన మాసం..?*

*జ్యేష్ట మాసం విశిష్టత*

జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది.
ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం.

జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.

జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది.

జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు.

జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి.సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.

*జ్యేష్టమాస ఫలములు :-*
పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ పాపాలను పరిహరించుకోవడానికి దైవసేవలో తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను ... మరెన్నో విశేషాలను సంతరించుకుని, పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ వుంటుంది.

సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి*

**సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి*

*తప్పక చదవాలి*

*1. అజీర్ణే భోజన విషం.*

గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం

*2. అర్ధరోగహరి నిద్ర.*

సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..

*3 ముద్గదాలి గదవ్యాలి.*

అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 

*4. భగ్నాస్థి-సంధానకరో లశునః.*
 వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.. 

 *5. అతి సర్వత్ర వర్జయేత్.*
 రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా ఉండండి. 

 *6. నాస్తి మూలమనౌషధం.*
 శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. 

 *7. న వైద్యః ప్రభురాయుషః ।*
 ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు. (వైద్యులకు పరిమితులు ఉన్నాయి.) 

 *8. చింతా వ్యాధి ప్రకాశాయ ।*
 ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.. 

 *9. వ్యామశ్చ శనైః శనైః.*
 ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.
 (వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) 

 *10. అజవత్ చర్వణం కుర్యాత్.*
 మీ ఆహారాన్ని మేక లాగా నమలండి.
 (ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. 
 లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 

 *11. స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।*
  స్నానం కుంగుబాటు
( డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది.
  చెడు కలలను దూరం చేస్తుంది.. 

 *12. న స్నానమాచరేద్ భుక్త్వా.*
 ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయ కూడదు. (జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). 

 *13. నాస్తి మేఘసమం తోయం.*
 స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 

 *14. అజీర్ణే భేషజం వారి.*
 అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.

 *15. సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।*
 ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. 
 అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.

 *16. నిత్యం సర్వ రస భక్ష్యః ।।*
 మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
 (అనగా: ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు (ఆస్ట్రింజెంట్) మరియు ఘాటు (పంజెంట్). 

 *17. జఠరం పూరాయెదర్ధం అన్నార్, భాగం జలేన్ చ ।*
 *వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్ ।।*
 మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, 
పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.

 *18. భుక్త్వా శతపథం గచ్ఛేద్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।*
 ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. 

 *19. క్షుత్సాధుతాం జనయతి ।*
 ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది..
 ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 

 *20. చింతా జరా నామం మనుష్యాణాం* 
 ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. 

 *21. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్ ।*
 ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా). 

 *22. సర్వధర్మేషు మధ్యమామ్.*
 ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్లడం మానుకోండి

 *ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు.*

 *దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి.*

Monday, May 19, 2025

ఔషధాలు లేని జీవితం‼️

*‼️ఔషధాలు లేని జీవితం‼️*

*1.* త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.
*2.* ఓం జపించడం ఔషధం.
*3.* యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.
*4.* ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.
*5.* ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.
*6.* సూర్యకాంతి కూడా ఒక ఔషధం.
*7.* కుండ నీరు తాగడం కూడా ఔషధమే.
*8.* చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.
*9.* ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.
*10.* ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.
*11.* ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.
*12.* సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.
*13.* కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.
*14.* నవ్వు మరియు జోకులు ఔషధం.
*15.* సంతృప్తి కూడా ఔషధం.
*16.* మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.
*17.* నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.
*18.* నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.
*19.* అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.
*20.* ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.
*21.* అందరితో కలిసి జీవించడం ఔషధం.
*22.* తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.
*23.* మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.
*24.* సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.
*25.* ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.
*26.* *చివరగా...* ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.

🪷 ప్రకృతి యొక్క *"గొప్పతనాన్ని* అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.

*ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.*🙏🙏
......... మీ.......
*ఆత్మబందువులం* మేము *యోగసాధకులం*

Thursday, May 15, 2025

భారతీయులు ఎందుకు రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఎక్కువగా వాడుతున్నారు?

---
భారతీయులు ఎందుకు రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఎక్కువగా వాడుతున్నారు?

1. ఎందుకు సన్‌ఫ్లవర్ ఆయిల్‌కి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది?

హార్ట్‌కు మంచిదని అపోహ: సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఎక్కువగా ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయన్న పేరుతో ఒకప్పుడు ‘హార్ట్ హెల్తీ’ ఆయిల్‌గా ప్రచారం జరిగింది.

ఇండస్ట్రీ ప్రభావం: రిఫైండ్ ఆయిల్ కంపెనీలు భారీగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో దీనిపై విశ్వాసం పెరిగింది.

ధర తక్కువగా ఉండటం: కోల్డ్ ప్రెస్ ఆయిళ్లతో పోలిస్తే, రిఫైండ్ ఆయిల్స్ చౌకగా, సులభంగా లభ్యమవుతాయి.

ఆహార సంబంధి అవగాహన లోపం: చాలా మంది సనాతన పద్ధతుల మీద అవగాహన లేకుండా ఆధునిక ప్రక్రియలతో తయారైన ఆయిల్స్‌ను వాడుతున్నారు.
---

2. సన్‌ఫ్లవర్ ఆయిల్ మానవులకు ఎందుకు అనుకూలం కాదు?

ఒమెగా-6 అధికంగా ఉండడం: ఒమెగా-6 అధికంగా తీసుకోవడం శరీరంలో ఇన్ఫ్లమేషన్ (ఉరిమి) పెంచుతుంది. ఇది హార్ట్ డిసీజ్, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది.

తీవ్రంగా ప్రాసెస్ చేయడం: రిఫైనింగ్ సమయంలో అధిక వేడి, రసాయనాలు (హెక్సేన్), డియోడరైజేషన్ వంటివి ఆయిల్‌లోని సహజ పోషకాలను నాశనం చేస్తాయి.

ఆక్సిడేషన్ ప్రమాదం: సన్‌ఫ్లవర్ ఆయిల్ అధిక వేడితో వాడినప్పుడు విషపూరిత పదార్థాలు (అల్డిహైడ్స్) విడుదల చేస్తుంది.

ఫ్యాట్ బ్యాలెన్స్ లోపించడం: మన శరీరానికి ఒమెగా-3 & ఒమెగా-6 మధ్య సరైన నిష్పత్తి కావాలి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దీనిని పాడు చేస్తుంది.
---

3. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను యూరప్‌లో నిషేధించారా?

పూర్తిగా నిషేధించలేదు, కానీ నియంత్రణలు ఉన్నాయి: కొన్ని రకాల సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై (విషపూరిత పదార్థాల వల్ల) యూరప్‌లో కఠిన నియమాలు ఉన్నాయి.

రెగ్యులేషన్ కఠినంగా ఉంటుంది: యూరోప్‌లో రిఫైనింగ్ ప్రాసెస్‌, ట్రాన్స్ ఫ్యాట్స్, అల్డిహైడ్స్ పరిమితి మీద గట్టి నియమాలు ఉంటాయి.

పరిపక్వతతో మారుతున్న అభిరుచి: అక్కడి ప్రజలు ఇప్పుడు ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, నేయి వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలవైపు మారుతున్నారు.
---

సారాంశం:

రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అధికంగా వాడటం ఆరోగ్యానికి హానికరం. భారతీయుల వంటశైలికి, శరీర నిర్మాణానికి అనువైనవి కోల్డ్ ప్రెస్ Groundnut, Nuvvula (Sesame), Avalu (Mustard) ఆయిల్స్ మాత్రమే.


PS Cold Pressed Oils – ఆరోగ్యంగా ఉండటానికి సహజ ఆయిల్స్‌ను వాడండి!

దేశీ వరి రకాలు

[15/05, 20:47] +91 99899 84347: ధూదేశ్వర్ అనే దేశీయవరివిత్తనం. గాలులకుపడిపోని సన్నరకం. పంటకా లం110నుండి120రోజులు..ఈరైసు తెలుపు, బాలింతస్ర్రీలకుశక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధికఫోషకాలుఅంది,పాలుపెరగడానికితోడ్పడి తద్వారా పిల్లలకురోగనిరోధకశక్తిపెరుగుతుంది..ఖరీదు 100/రూపాయలు. కావలసినవారుఎమౌంట్ చెల్లించి స్ర్కీన్ ఛాట్ పంపించగలరు. నాఫోన్ఫే అడపావెంకటరమణ 9989984347
[15/05, 20:47] +91 99899 84347: ఇంద్రాణి అనే దేశీయ వరిరకం. సువాసన గల రకం పంటకాలం120 నుండి130రోజులు పాయసం, పులిహూర, పలావ్, దద్దోజనానికి అనుకూలమైనది.ఖరీదు120/రూ,, లు,, కావలసినవారు ఎమౌంట్ చెల్లించి స్క్రీన్ ఛాట్ పంపించగలరు. నాఫోన్ ఫే 9989984347
[15/05, 20:47] +91 99899 84347: ధూదేశ్వర్ అనే దేశీయవరివిత్తనం. గాలులకుపడిపోని సన్నరకం. పంటకాలం 110నుండి 120 రోజులు...ఈరైసు తెలుపు, బాలింతస్ర్రీలకుశక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధికఫోషకాలుఅంది,పాలుపెరగడానికితోడ్పడి తద్వారా పిల్లలకురోగనిరోధకశక్తిపెరుగుతుంది.ఖరీదు 100/రూపాయలు. కావలసినవారుఎమౌంట్ చెల్లించి స్ర్కీన్ ఛాట్ పంపించగలరు. నాఫోన్ఫే అడపావెంకటరమణ 9989984347
[15/05, 20:47] +91 99899 84347: రత్నఛూడి అనే దేశీయవరివిత్తనం. సన్నరకం.పంటకాలం125నుండి 135రోజులు.. బియ్యం తెలుపు, అధికఫోషకవిలువలుకలిగి, కండపుష్ఠి, శరీరదారుడ్యంకలిగి బలాన్ని కలిగి రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలోసైనికులకుఆహారంగా వాడేవారు. ఖరీదుకిలో120/రూపాయలు. కావలసినవారు ఎమౌంట్చెల్లించి స్ర్కీన్ ఛాట్ పంపించగలరు. నాఫోన్ఫే అడపావెంకటరమణ 9989984347
[15/05, 20:47] +91 99899 84347: కుజీపటాలియా
అనే దేశియ విత్తనం. సన్నరకం, పంటకాలం110నుండి 120రోజులు..గాలులకు పడిపోదు. కొవ్వురహితమరియుసోడియం లేనివి, తక్కువకేలరీలుకలిగివుండి, గ్లూకోజ్ పధార్థంతక్కవగావుండి, రోగ నిరోధక శక్తి పెరుగు తుంది.దీనిఖరీదు100/రూపాయలు.కావలసినవారు ఎమౌంట్ చల్లించి స్ర్కీన్చాట్ పంపించగలరు.నాఫోన్ ఫే నెంబరు
అడపా వెంకటరమణ 9989984347
[15/05, 20:47] +91 99899 84347: కేత్రీ మహరాజ్ సెంటెడ్ వెరైటీ.గింజపొడవు. పంటకాలం120నుండి 130రోజులు. ఇది పాయసం, థద్యౌజనం,పులిహూర పలావ్ కి అనుకూలమైనది.ఖరీదు120రూ,, లు..విత్తనం కావలసినవారు ఎమౌంట్ చెల్లించి స్ర్రీన్ ఛాట్ పంపించగలరు. నాఫోన్ఫే అడపావెంకటరమణ... 9989984347
[15/05, 20:47] +91 99899 84347: మైసూరుమల్లిగ దేశీయవరివిత్తనం. గాలులకు పడిపోదు, సన్ననిగింజ.. పంటకాలం110నుండి120రోజులు.ఈరైసు తెలుపురంగులో ఉంటుంది, ఎదిగేపిల్లలకు అవసరమైన అధికపోషకాలు, ప్రొటీన్స్ లభించే గుణంకలిగివుంటుంది. ఖరీదు100/రూపాయలు. కావలసినవారు పైకం చెల్లించి స్ర్కీన్ఛాట్ పంపించగలరు. నాఫోన్ఫే అడపావెంకటరమణ 9989984347......
[15/05, 20:47] +91 99899 84347: ""ఘని""అనే దేశీయ వరిరకం. చిన్నగింజ. పంటకాలం120నుండి130రోజులు. రిచ్ పైబర్, రిఛ్ కాల్సియం గలది. స్పాండిలైటిస్,మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహర ఔషధం.కిలో ఖరీదు130/రూపాయలు.

శరీరాన్ని నమ్ముకోవడం కాదు... ఆరోగ్యాన్ని గుర్తించుకోవడమే నిజమైన జ్ఞానం*

*💚శరీరాన్ని నమ్ముకోవడం కాదు... ఆరోగ్యాన్ని గుర్తించుకోవడమే నిజమైన జ్ఞానం*

*💗ముందుమాట*  
మన శరీరం అనేది ఒక అద్భుతమైన దేవాలయం వంటిది. అయితే చాలామంది తమ యువస్థితిని నమ్ముకొని శరీరాన్ని హేతుబద్ధంగా పాడుచేసే అలవాట్లు పెంచుకుంటారు. చిన్న వయసులో ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే, ఆ తర్వాత వారసత్వంగా వచ్చే వ్యాధులు, జీవిత నాణ్యతను నాశనం చేస్తాయి. ఇది *
*🤎తప్పనిసరిగా నివారించదగిన సమస్య* అని గుర్తించాలి. ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం జీవిత విజయం కోసం ఎంతో అవసరం.

*1.❤‍🔥శరీరాన్ని దుర్వినియోగం చేయకండి*  
చిన్న వయసులో శక్తివంతంగా కనిపించే శరీరాన్ని తప్పుడు అలవాట్లతో నాశనం చేస్తే, మిగిలింది నష్టమే. పోషకాహారానికి బదులుగా జంక్ ఫుడ్ తీసుకోవడం, నిద్రలేమి, మద్యం, పొగత్రాగటం వంటి చర్యలు శరీరాన్ని నాశనం చేస్తాయి. ఇవి ప్రారంభంలో ఫలితాలు చూపకపోయినా, భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తీసుకొస్తాయి. అందుకే శరీరాన్ని సేవకుడిగా చూసుకోవాలి, బానిసగా కాదు. శరీరాన్ని ప్రేమిస్తే ఆరోగ్యం మనదవుతుంది.*

*2. 🩵యవ్వనాన్ని నమ్మి నిర్లక్ష్యం వద్దు* 
యవ్వనంలో శక్తి, వేగం ఉండటమే కాదు – బాధ్యత కూడా ఉండాలి. "ఇప్పుడేం కాదు, తరువాత చూస్తాం" అనేది అతి పెద్ద తప్పు. చిన్న వయసులోనే ఆరోగ్య చింతన ప్రారంభమైతే, పెద్ద వయసులో ఆపదలు దూరంగా ఉంటాయి. ఎక్కువమంది యువత 'ఇంకా నాకు ఏమీ కావాలి?' అనుకుంటారు, కానీ జీవనశైలిలో తప్పిదాల వలన శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక, శారీరక సమస్యలకు దారి తీస్తుంది. యువత ఓర్పు, శ్రద్ధతో జీవించాలి.*

*3.🧡ఆహారపు అలవాట్లు కీలకం* 
తినే ఆహారం మన ఆరోగ్యానికి మూలాధారం. ప్రాసెస్డ్, ఆయిలీ, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం శరీరానికి వ్యతిరేకం. శక్తి కోసం తినే ఆహారమే చివరికి వ్యాధుల మూలంగా మారుతుంది. మన తాతముత్తాతలు తినే సహజ ఆహారాలు, కాలచక్రానికి అనుగుణంగా ఉండేవి. కూరగాయలు, తీపి తక్కువ ఆహారం, తక్కువ ఉప్పు ఉపయోగించడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యాన్ని రక్షించగలదు.*

*4.💖 వ్యాయామం లేకపోతే సమస్య* 
రోజూ తక్కువసేపైనా వ్యాయామం చేయడం అనివార్యం. శరీరం కదలకపోతే రోగాలకు తలుపులు తెరవడం లాంటిది. చిన్నగా మొదలై పెద్ద సమస్యలుగా మారే వ్యాధులన్నీ అలసత్వమే కారణం. ప్రాణాయామం, నడక, యోగా మొదలైనవి ఆరోగ్యానికి వరం వంటివి. వీటిని చిన్న వయసులో అలవాటు చేసుకుంటే శక్తి, శాంతి రెండూ కలుగుతాయి. శరీరం కదలాలి, మనసు తేలికపడాలి.*

*5. 💛మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం* 
కేవలం శరీరమే కాదు – మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. చిన్న విషయానికి బాధపడటం, ఒత్తిడిలోకి వెళ్లిపోవడం వయసుతో సంబంధం లేదు. మనోధైర్యం కోల్పోతే శరీరవ్యాధులు కూడా వేగంగా వస్తాయి. ధ్యానం, విశ్రాంతి, గమనికలు వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సానుకూలంగా ఆలోచించాలి, తప్పులను ఒప్పుకొని మెరుగుపడాలి. మనశ్శాంతి కూడా ఆరోగ్యానికి భాగమే.*

*6. 💜నిర్లక్ష్యానికి ప్రతిఫలం భయంకరం*  
చిన్న నిర్లక్ష్యం కూడా కొన్నేళ్ల తర్వాత ప్రాణాంతకంగా మారవచ్చు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు మొదలైనవి కొన్ని అలవాట్లే కారణం. అయితే చాలా మంది ఆరోగ్య సమస్యలు వచ్చాకే చింతించటం ప్రారంభిస్తారు. దీన్ని నివారించాలి అంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవడం ఒక రకమైన అజ్ఞానం. అలాంటి నిర్లక్ష్యమే చివరకు బాధనిస్తుంది.*

*7. 🩷నిద్రను తక్కువ అంచనా వేయవద్దు*  
శరీరానికి విశ్రాంతి అవసరం, అది నిద్ర ద్వారానే వస్తుంది. రోజూ 7-8 గంటల నిద్ర లేనివారిలో మానసిక ఒత్తిడి, శారీరక అలసట పెరుగుతాయి. నిద్రలేమి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి జీర్ణక్రియకూ ప్రభావం కలుగుతుంది. ముఖ్యంగా యువత రాత్రిళ్లు గడిపే అలవాటు ఆరోగ్యానికి శత్రువవుతుంది. నిద్రను సమయానికి తీసుకోవడం ఆరోగ్య రక్షణకు ఒక ఉపాయంగా భావించాలి. నిద్రలోనే శరీర పునరుద్ధరణ జరుగుతుంది.*

*8. 🖤ఆరోగ్య పరీక్షలు నిర్లక్ష్యం చేయవద్దు*  
యువస్థితిలో ఆరోగ్య సమస్యలు కనిపించకపోవచ్చు, కానీ లోపల శరీరం ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఏడాదికి ఒక్కసారి సర్వే చేయించుకోవడం వల్ల ముందుగా సమస్యలు గుర్తించవచ్చు. కేవలం అనుమానం ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం సరైంది కాదు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది దీర్ఘకాలిక ఆరోగ్యానికి అవసరం. రక్త పరీక్షలు, బీపీ, షుగర్ వంటి ప్రాథమిక పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. జాగ్రత్తతో పరీక్షలు చేయించుకోవడం అనేది బుద్ధిమంతుల చర్య.*

*9. 🩵మరియు నీటి తాగుడును నిర్లక్ష్యం చేయవద్దు*  
శరీరంలోని 70% నీటే అయినా, చాలామంది తాగటాన్ని విస్మరిస్తారు. తక్కువ నీరు తాగడం వలన డీహైడ్రేషన్, మలబద్దకం, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోజుకి కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేయాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిని తాగటం చాలా మేలు చేస్తుంది. మలమూత్రాలు సరిగా వెళ్లాలంటే శరీరానికి తేమ అవసరం. నీటితోనే ఆరోగ్యం బలపడుతుంది.*

*10. ❤️స్మార్ట్‌ఫోన్లు - నిదానంగా కీడు తెచ్చే శత్రువు*  
మొబైల్స్ కారణంగా నిద్రలేమి, కన్నుల సమస్యలు, మెదడు అలసట వచ్చేస్తున్నాయి. యువత గంటల కొద్దీ స్క్రీన్ ముందు గడిపే అలవాటు మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది. ఎల్లప్పుడూ నోటిఫికేషన్లు చూసే అలవాటు వల్ల ఒత్తిడి పెరుగుతుంది. రోజుకి కనీసం కొన్ని గంటలు మొబైల్‌కు విరామం ఇవ్వాలి. స్మార్ట్‌ఫోన్‌ను జాగ్రత్తగా వాడితే మేలు – లేకపోతే ముప్పు. డిజిటల్ డిటాక్స్ ఆరోగ్యానికి మంచిదే.*

*💞💚ముగింపు*  
*మన శరీరం పట్ల అవగాహన ఉండటం ఒక ఆధునిక ధర్మం. యువత తమ శక్తిని నమ్ముకోవచ్చు, కానీ దానితో పాటు ఆరోగ్యాన్ని రక్షించే జ్ఞానం కూడా అవసరం. అనారోగ్యం వచ్చిన తరువాత ఆలోచించడం కన్నా, ముందే ఆలోచించటం శ్రేయస్కరం. మానవ జీవితంలోని గొప్ప సంపద ఆరోగ్యం మాత్రమే. దాన్ని నిర్లక్ష్యం చేయకండి, సంరక్షించండి. ఆరోగ్యంగా జీవించడం జీవిత విజయానికి మొదటి మెట్టు!💚💞*

Tuesday, May 13, 2025

అగ్నిహోత్రం అని పిలువబడే వేద అగ్ని కర్మ (హోమం)లో రాగి అగ్నిహోత్ర కిట్

*అగ్నిహోత్రం అని పిలువబడే వేద అగ్ని కర్మ (హోమం)లో రాగి అగ్నిహోత్ర కిట్ ఉపయోగించబడుతుంది.*
A copper Agnihotra kit is used in the Vedic fire ritual (Homa) known as Agnihotra.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*ఇది వ్యక్తికి మరియు పర్యావరణానికి వివిధ ప్రయోజనాలను కలిగిస్తుందని నమ్ముతారు.*
It is believed to bring multiple benefits to both individuals and the environment.

*కిట్‌లోని రాగి పిరమిడ్ కుండ వైద్యం చేసే కంపనాలను ఉత్పత్తి చేయడానికి చాలా అవసరం.*
The copper pyramid vessel in the kit is essential for generating healing vibrations.

*ఫోర్కులు, స్పూన్లు మరియు ప్లేట్లు వంటి ఇతర రాగి ఉపకరణాలను కర్మ సమయంలో నిర్దిష్ట నైవేద్యాల కోసం ఉపయోగిస్తారని శ్రీ శ్రీ పబ్లికేషన్స్ తెలిపింది.*
Sri Sri Publications mentions that copper forks, spoons, and plates are used during rituals for offering specific materials.

*అగ్నిహోత్ర రాగి కిట్ ముఖ్యాంశాలు* | Key Features of the Agnihotra Copper Kit:

- *రాగి పిరమిడ్ కుండ:* | Copper pyramid pot
*ఇది కిట్ యొక్క ప్రధాన భాగం, అగ్నిహోత్ర అగ్ని నిర్మాణానికి కీలకం.*
This is the central component of the kit, essential for structuring the Agnihotra fire.

*ఇది అగ్ని నిల్వ కోసం పాత్రగా పనిచేస్తుంది.*
It acts as the sacred fire holder during the ritual.

- *రాగి ఉపకరణాలు:* | Copper accessories
*బియ్యం మరియు నెయ్యి నైవేద్యాల కోసం ఫోర్క్, కొలతల కోసం చెంచా, మద్దతు కోసం పలక వంటివి ఉంటాయి.*
Includes a fork for offering rice and ghee, a spoon for accurate ghee measurement, and a plate to support the pyramid.

- *అగ్నిహోత్రం యొక్క ప్రయోజనాలు:* | Benefits of Agnihotra:
*గాలి మరియు పరిసరాల శుద్ధి, ప్రతికూల శక్తి నివారణ, ప్రాణ శక్తి వృద్ధి వంటి ఫలితాలు నమ్మబడుతున్నాయి.*
Believed to purify air and surroundings, neutralize negative energy, and enhance life-force energy (prana).

- *ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:* | Spiritual significance
*అగ్నిహోత్రం వేద సంప్రదాయంలో గాఢంగా పాతుకుపోయిన పవిత్ర క్రతువు.*
Agnihotra is a sacred rite deeply rooted in Vedic tradition.

*ఇది సాధకులను సహజ లయలతో అనుసంధానిస్తుంది.*
It aligns the practitioner with the natural rhythms of the universe.

- *ఆధునిక శాస్త్రం మరియు అగ్నిహోత్రం:* | Modern science and Agnihotra
*రీసెర్చ్ గేట్ నివేదికల ప్రకారం, అగ్నిహోత్రం వాతావరణ, నీరు, నేల శుద్ధికి సహాయపడుతుంది.*
According to studies on ResearchGate, Agnihotra can help purify air, water, and soil.
🤝🌾🤝🌾🤝🌾🤝🌾🤝🌾

Friday, May 9, 2025

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .

 కొర్రలు యొక్క ఉపయోగాలు -

 * కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

 * శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

 * కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

 * శరీరం నందు వేడిని కలిగించును.

 * జ్వరమును, కఫమును హరించును .

 * జీర్ణశక్తిని పెంచును.

 * రక్తమును వృద్దిచేయును.

 * నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

 * అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

 * గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

 * కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .

 * కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .

 * కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

   సామలు యొక్క ఉపయోగాలు - 

 * సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 

 * చలవ , వాతమును చేయును . 

 * మలమును బంధించును . 

 * శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 

 * ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.

 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 

  రాగుల యొక్క ఉపయోగాలు - 

 * వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 

 * రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 

 * శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 

 * మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 

 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 

 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 

 * కఫాన్ని పెంచును. చలవ చేయును . 

 * శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

 * ఆకలిదప్పికలను అణుచును.

 * విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 

 * రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

 * రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 

 * మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

 * రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 

 * రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.
 
 
   
  
        

Tuesday, May 6, 2025

ఆడవారు ముక్కుపుడక ఎందుకు ధరించాలి

ꕥ┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈ꕥ
     ఓం నమో భగవతే వాసుదేవాయ
ꕥ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ꕥ
                    *ముక్కు పుడక*
  ﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
*ఆడవారు ముక్కుపుడక ఎందుకు ధరించాలి......!!!*
*మంగళసూత్రంలా ముక్కెర కూడా?!*

*ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి….* 

*సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.*

*ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.* 

*అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.* 

*మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.*

*ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ.* 

*భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.* 

*దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.*

*అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు.* 

*తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.*
  ﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
                 *ధర్మో రక్షతి రక్షితః*
ꕥ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ꕥ
     || *ఓం మధుసూదనాయ నమః* ||
ꕥ┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈ꕥ

*దేశి వరి రకాలు వాటి* *ప్రాముఖ్యత.*

ప్రకృతి ప్రసాదించిన కొన్ని దేశవాళీ వరి విత్తనాలు వాటి ప్రాముఖ్యత గురుంచి తెలుసుకుందాం 

 *దేశి వరి రకాలు వాటి* *ప్రాముఖ్యత.* 

 *రక్త శాలి:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

 *కర్పూకవుని:* 

ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.

 *కుళ్లాకార్:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ ఆహార పంట బియ్యం.

 *పుంగార్:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది మరియు ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది,శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది.ఇది100% మహిళలకు మంచిది.

 *మైసూర్ మల్లిగా:* 

ఈ రైసు తెలుపు రంగులో ఉంటుంది.ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు,ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.పిల్లలకు మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

 *కుజిపాటలియా,* సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు: 

ఇవి తెలుపు,సన్న రకాలు.ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి.తక్కువ కేలరీలు కలిగి వుంటాయి,గ్లూకోజ్ పదార్థంలు తక్కువగా ఉంటాయి,రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.


 *రత్నచోడి* 

ఈ బియ్యం తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి. కండపుష్టికి మరియు శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడేవారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


 *బహురూపి,* 

గురుమట్టియా,వెదురు సన్నాలు: తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి.కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి.మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి.బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతాయి.

 *నారాయణ కామిని:* 

ఈ రైసు తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 *ఘని:* 

ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


 *ఇంద్రాణి* 

 ఈ బియ్యం తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము. కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్లు కూడా తినవచ్చు. గుల్ల భారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 *ఇల్లపు సాంబ:* 

 ఈ రైసు తెలుపు, సన్నరకం,ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *చిట్టి ముత్యాలు:* 

 ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదంలకు,పులిహారమునకు,బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *దేశీ బాసుమతి:* 

ఈ రైసు తెలుపు,పొడవు రకము,సువాసన కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది.

 *కాలాజీరా:* 

ఈ రైస్ తెలుపు రంగులో ఉంటుంది.ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

 *పరిమళ సన్నము* 

,రాంజీరా,రధునీ పాగల్,గంధసాలె,తులసీబాసో,బాస్ బోగ్, కామిని బొగ్: ఇవన్నీ తెలుపు రకము. సుగంధభరితమైన బియ్యం.ఇవి ప్రసాదంలకు, పులిహారములకు,పాయసములకు చాలా బాగుంటాయి.రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.

 *దూదేశ్వర్,అంబేమెహర్* 

(scented వెరైటీ ): ఈ రైసు తెలుపు,బాలింతల స్త్రీలకు పాలు పెరగడానికి తోడ్పడుతాయి.తద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తల్లి పిల్లలకు అధిక పోషకాలు అందుతాయి,తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

 *కుంకుమసాలి:* 

ఈ రైసు తెలుపు,రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *చికిలాకోయిలా:* 

ఈ రైసు తెలుపు,సన్న రకము, దీని వల్ల లాభం కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు,డైలీ కిడ్నీ డయాలసిస్ వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.కిడ్నీకి సంబంధించిన సమస్యల నుండి ఇబ్బంది పడకుండా సహాయపడుతుంది.

 *మడమురంగి* 

 ఈ రైసు ఎరుపు,లావు రకము.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్,ఐరన్, జింక్,కాల్షియం ఉంటాయి.వర్షాకాలంలో అడుగు పైన ముంపును కూడ తట్టుకునే రకము. మంచి దిగుబడిని కూడా ఇస్తుంది.ఇది తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు.

 *కెంపు సన్నాలు:* 

ఈ రైసు ఎరుపు, సన్నరకం,ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్,కాల్షియం,జింక్,ఐరన్,అధిక పోషకాలు ఉంటాయి,రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *కాలాబట్టి* 

,కాలాబట్,,బర్మా బ్లాక్,మణిపూర్ బ్లాక్: ఇవి నలుపు రంగులో ఉంటాయి.ఇవి అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగినవి. ఈ రైస్ వలన కలిగే లాభాలు,క్యాన్సర్ మరియు డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారిన నుండి రక్షణ కల్పిస్తుంది.ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.ఈ బియ్యంలో విటమిన్ బి,ఇ,నియాసిన్,కాల్షియం,మెగ్నీషియం,ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు,పీచు పదార్ధాలు అధికము.ఈ బియ్యంలో ఆంకోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడమే గాక రోగనిరోధక ఎంజైములను క్రియాశీలకము చేస్తుంది. మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

 *పంచరత్న:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది,ఇది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది.అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.ఇది కూడా వండర్పుల్ రైస్.

 *మా పిళ్లేసాంబ:* 

ఈ రైసు ఎర్రగా ఉంటుంది.గర్భాధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు చాలా ఉపయోగం.రోజు ఇరువురు కనీసం 5నుండి6 నెలల వరకు తిన్నచో గర్భాధారణ జరుగును. ఇది ప్రాక్టికల్గా నిరూపించబడినది.దీనివలన కండ పుష్టి, దాతు పుష్టి ,వీర్య పుష్టి కలుగును. ఇమ్యూనిటీపవర్ కూడా పెరుగును.


 *నవార* 

ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.ఈ విత్తనం త్రేతాయుగము నాటిది. షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది. మరియు మోకాళ్ళు,మోచేతి కీళ్ళ నొప్పులు,నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యంను వండి బాడీ మసాజ్ లో వాడుతారు పక్షపాతం ఉన్నవారికి. ఈ బియ్యాన్ని ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. ఇది అన్ని వయసుల వారూ తినవచ్చును.ఒక పూట మాత్రమే తినవలెను. ఈ రైస్ యొక్క ప్రత్యేకత బియ్యం నుండి కూడా మొలకలు వచ్చును. ఇది వండర్ఫుల్ రైస్.

 *రాజముడి:* 

ఈ రైస్ తెలుపు ఎరుపు కలిగి ఉంటుంది.దీనిని ప్రాచీన కాలంలో మైసూర్ మహారాజుల కోసం ప్రత్యేకముగా పండించిన బియ్యముల్లో ఇది ఒకటి.దీనికి ప్రత్యేకస్థానం ఉంది.ఈ రైస్లో డైటరీ ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ ,జింక్,ఐరన్ అధికంగా ఉంటాయి. అందువలన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు ప్రీరాడికల్స్ నుండి నిరోధిస్తుంది.శరీరము అశ్వస్థత నుండి కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం యొక్క ఆకృతిని పెంచడానికి సహాయపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

Monday, May 5, 2025

పిల్లలను మొబైల్ ఎడిక్షన్ నుండి తప్పించడానికి

*పిల్లలను మొబైల్ ఎడిక్షన్ నుండి తప్పించడానికి కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి శ్రీ మహాలక్ష్మీ ఆరోగ్యవనం సలహాలు* :
 * *సమయ పరిమితులు విధించండి* :
 పిల్లలు మొబైల్ ఫోన్‌ను రోజులో ఎంత సమయం ఉపయోగించవచ్చో స్పష్టమైన నియమాలు పెట్టండి. భోజనం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు మరియు నిద్రపోయే ముందు మొబైల్ వాడకాన్ని నిషేధించండి.
 * *మొబైల్ లేని సమయాలు మరియు ప్రదేశాలు* :
 ఇంట్లో కొన్ని సమయాలు (ఉదాహరణకు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్నప్పుడు) మరియు కొన్ని ప్రదేశాలు (ఉదాహరణకు, భోజనాల గది, పడకగది) మొబైల్ రహితంగా ఉంచండి.
 **ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ప్రోత్సహించండి* : 
పిల్లలను ఆటలు ఆడటానికి, పుస్తకాలు చదవడానికి, కళలు మరియు చేతిపనుల్లో పాల్గొనడానికి, లేదా ఇతర అభిరుచులను కొనసాగించడానికి ప్రోత్సహించండి. వారిని బయటకు తీసుకెళ్లి ఆడుకోనివ్వండి.
 * *కుటుంబ సమయాన్ని పెంచండి* : 
పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపండి. వారితో మాట్లాడండి, కలిసి ఆటలు ఆడండి లేదా ఇతర సరదా కార్యకలాపాలలో పాల్గొనండి. ఇది వారికి మొబైల్ యొక్క అవసరాన్ని తగ్గిస్తుంది.
 *మంచి రోల్ మోడల్‌గా ఉండండి* : 
మీరు కూడా మీ మొబైల్ వినియోగాన్ని తగ్గించుకోండి, ప్రత్యేకంగా పిల్లల ముందు. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు కాబట్టి, మీరు తక్కువగా ఫోన్ వాడితే వారు కూడా దానిని అనుసరించే అవకాశం ఉంది.
 * *మొబైల్‌లోని ఫీచర్లను ఉపయోగించండి* :
 చాలా మొబైల్ ఫోన్‌లలో స్క్రీన్ టైమ్ లిమిట్ మరియు యాప్ వినియోగాన్ని నియంత్రించే ఫీచర్లు ఉంటాయి. వాటిని ఉపయోగించి పిల్లల మొబైల్ వాడకాన్ని పర్యవేక్షించండి మరియు నియంత్రించండి.
 * *ఓపెన్ కమ్యూనికేషన్:* మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లలతో మాట్లాడండి. వారికి అర్థమయ్యేలా చెప్పండి మరియు వారిని భయపెట్టకుండా జాగ్రత్త వహించండి.
 * *నిలకడగా ఉండండి:* మీరు పెట్టిన నియమాలను స్థిరంగా పాటించండి. మొదట్లో పిల్లలు వ్యతిరేకించవచ్చు, కానీ మీరు దృఢంగా ఉంటే వారు క్రమంగా అలవాటు పడతారు.
 * *సహనం వహించండి* : మొబైల్ ఎడిక్షన్ ఒక్క రోజులో పోదు. దీనికి సమయం మరియు సహనం అవసరం. పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండండి మరియు వారి ప్రయత్నాలను గుర్తించండి.
  *అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి* : మొబైల్ ఎడిక్షన్ తీవ్రంగా ఉంటే మరియు మీరు దానిని నియంత్రించలేకపోతే, మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
గుర్తుంచుకోండి, పిల్లలకు మొబైల్ ఫోన్‌ను పూర్తిగా దూరం చేయడం కంటే, దానిని ఆరోగ్యకరమైన మరియు సమతుల్య మార్గంలో ఉపయోగించడం నేర్పించడం చాలా ముఖ్యం.
ధన్యవాదములు 🙏

Sunday, May 4, 2025

ప్రాణాయామం మస్తిష్కంపై ప్రభావం*

*ప్రాణాయామం మస్తిష్కంపై ప్రభావం* 

విజ్ఞానపరంగా (Scientific View):

1. ఆక్సిజన్ మేటబాలిజం మెరుగవుతుంది:
ప్రాణాయామం వల్ల శ్వాసతంత్రం సమర్థంగా పనిచేస్తుంది. మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా చేరి, న్యూరాన్ల క్రియాశీలత పెరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మరుగుపరుస్తుంది.
2. స్ట్రెస్ హార్మోన్‌లు తగ్గుతాయి:
ప్రాణాయామం సమయంలో కార్టిసోల్ (stress hormone) స్థాయి తక్కువవుతుంది. దీనివల్ల ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.
3. నాడీ వ్యవస్థపై ప్రభావం:
ఇది సింథటిక్ (Sympathetic) మరియు పరాసంపత్తి (Parasympathetic) నాడీవ్యవస్థ మధ్య సమతుల్యతను తీసుకొస్తుంది. ఇది శరీరాన్ని విశ్రాంతి, పునరుత్పత్తి స్థితిలోకి తీసుకెళ్తుంది.
4. మెదడు తరంగాలు (Brain Waves):
ప్రాణాయామం ఆల్ఫా, థీటా తరంగాలను ప్రేరేపిస్తుంది. ఇవి ప్రశాంతత, అంతర్ముఖతకు సంకేతాలు. దీని వల్ల నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది.
ఆధ్యాత్మిక దృష్టికోణం (Spiritual View):
1. నాడుల శుద్ధి:
ప్రాణాయామం ద్వారా ఇడా, పింగల, సుషుమ్న నాడులు శుద్ధి అవుతాయి. ఇది చైతన్య శక్తి కేంద్రీకృతమయ్యే మార్గాన్ని తెరుస్తుంది.
2. చక్రాల ఉద్దీపన:
అజ్ఞా చక్రం, అనాహత చక్రం వంటి శక్తికేంద్రాలు ప్రాణాయామం వల్ల మెల్లగా చైతన్యంగా మారతాయి. ఇది అంతర్గత విజ్ఞానాన్ని పెంచుతుంది.
3. ధ్యానానికి సిద్ధత:
శ్వాస నియంత్రణ వల్ల మనస్సు శాంతిగా, స్థిరంగా మారుతుంది. ఇది ధ్యానం మరియు ఆత్మసాక్షాత్కారానికి బలమైన పునాది.

Thursday, May 1, 2025

నిల్వ పచ్చళ్ళు అనారోగ్యమా? ఔషధమా?

నమస్తే అండీ🙏 

నిల్వ పచ్చళ్ళు అనారోగ్యమా? ఔషధమా? 

మీ అరోగ్యము కోసం, 2 నిమిషాలు... 

పూర్వం, అంటే 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇంటిలో సుమారుగా, పచ్చడి  అన్నం 70 శాతం, కూర అన్నం 30 శాతంగా తినేవారు. అయినా వారు చాలా చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించి ఉన్నారు. దీనికి గల కారణం, వారు పచ్చడిలో వాడిన  పదార్థముల ఔషధీ గుణాలు. 

పచ్చడిలో కచ్చితంగా అన్నీ న్యాచురల్ (ప్రకృతి వ్యవసాయం) పదార్ధములు మాత్రమే వాడాలి. కారం ,పసుపు,మెంతిపిండి, ఆవపిండి ,సముద్రపు ఉప్పు,  గానుగ నూనె మరియు ఇంగువ లు అనేక అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న పదార్థములు. 

పచ్చడికి సంబందించిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.... 

కారము: ఇది రక్తనాళాలు గడ్డకట్టకుండా కాపాడి, రక్తప్రసరణ సవ్యంగా జరుగుటకు దోహదం చేయును.  తద్వారా గుండెకు సంబంధించిన రోగములు రాకుండా కాపాడును.దీనిలో విటమిన్ ఎ, బి,సి పుష్కలంగా ఉంటాయి. 

పసుపు:.మన భారతీయ సనాతన సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.దీనిలో కుర్కుమిన్ అనే ఒక రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే  గుణం ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తుంది. 

గానుగ నూనెలు: గానుగ నూనెలలో( పల్లి నూనె&నువ్వుల నూనె) ఉండే ఎంజైమ్స్,లిపిడ్ గుణాలను శరీరము మెరుగ్గా సంగ్రహించే విధముగా చేస్తుంది.. 

మెంతిపిండి: జీర్ణవ్యవస్థను సక్రమంగా చేసి క్లోమము సక్రమంగా వృద్ధిచేస్తుంది. 

సముద్రపు ఉప్పు: నాన్ అయొడైజ్డ్ సాల్ట్ :పచ్చడి నిల్వ సామర్థ్యం చాలా చక్కగా ఉంటుంది. అంతే కాకుండా మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే వ్యవస్థ ఉంటుంది. మన శరీరానికి కావల్సిన అత్యంత శక్తివంతమైన అటువంటి కొన్ని సుగుణాలు పొటాషియం లాంటివి దీంట్లో మెరుగ్గా ఉంటాయి.(అయోడిన్ ఉప్పు ఆరోగ్యానికి ఎంతో హానికరం.థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులకు ఇదే ప్రధాన కారణం.మార్కెట్ లో సాధారణంగా మనకు దొరికేది అయొడైజ్డ్ ఉప్పు కావున, దానిని వాడకూడదు)

ఇంగువ: ఇది తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణమై, రక్తంలో శక్తిగా మారుటకు ఉపయోగంగా ఉంటుంది. 

పచ్చడి లో వాడే ఆహార పదార్ధములలో ఇన్ని ఔషధీ గుణాలు ఉన్నప్పటికీ, వాటిని పండించే విధానం లో విపరీతమైన విషపూరిత రసాయనాలు వాడడం వలన, శరీర ఆరోగ్య వ్యవస్థను కాపాడవలసిన ఆహార పదార్థాలు, మన ఆరోగ్యాన్ని విపరీతంగా నిర్వీర్యం చేస్తున్నాయి. 

ఉదాహరణకి ఒక మిరపపంట కాలవ్యవధిలో, అంటే తొమ్మిది నెలల వ్యవధిలో, సుమారుగా 40 సార్లు పురుగు మందులు వాడతారు. 

అందువలన మనము పచ్చడి ద్వారా ఆరోగ్యాన్ని పొందాలంటే, ఖచ్చితముగా విష రసాయనాలు వాడకుండా పండించిన పదార్థాలు  మాత్రమే వాడాలి. 

ఒక సంవత్సరంలో ఒక కుటుంబం మొత్తానికి కావలసిన కారము మరియు పసుపు సుమారుగా 3నుంచి 5 కేజీలు మాత్రమే . 


Tuesday, April 29, 2025

గాయత్రీ మంత్రమనేది

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

  కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

 నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

 

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

 

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

 ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

 గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

 1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

 2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

 3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

 4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

 5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

 7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

 8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

 9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

 10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

 11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత 
 “న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

 
యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

From Whatsapp

Friday, April 25, 2025

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 
  
•. పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని - 
      
సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.
  
• పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం -
     
      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 
        
. ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .
           
. వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి . 


గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .

గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .
    
వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవు ని తల్లిలా భావించిన మన పూర్వికులు పూజించుట యే కాకుండా ఆవు కు సంబంధించిన వుత్పత్తులలోని గొప్పతనాన్ని తెలుసుకుని గ్రంధస్తం కూడా చేశారు అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. కొన్ని పురాతన గ్రంథాల నుండి ఆ వివరాలు సేకరించాను అవి మీకు తెలియచేస్తాను 

• ఆవుపాలు  

  ఇవి మధురంగా సమ శితోష్ణము గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

 • ఆవుపెరుగు -  

గర్భిణి స్త్రీకి వరం .  
                   వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

 • ఆవు వెన్న - 
              
ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

 •. ఆవునెయ్యి - 
             
. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

 • ఆవుపేడ - 
             
  ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.
 
• గుధస్తానంలో తిమ్మిరి కొరకు - 
             
ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .
 
• వంటి దురదలకు - 
               
 అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి . 

 • కడుపులోని క్రిములకు - 
              
 20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.
                  ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .
 
• ఆవుముత్రం - 
 
  ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి . 

 • గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

 * వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.
 
* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

 * ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

 * ప్రతిరోజు ఉదయమే గోమూత్రమును 30 గ్రా మోతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.