Thursday, July 31, 2025

బాంబూ రూల్" జీవన సందేశము*

🌄😌🙏 *మహా శుభోదయము,*
💮🏵️🥀🌷🌼🌻🌸

🪴 *"బాంబూ రూల్" జీవన సందేశము*
🪷 *ఇది కేవలం ఒక మొక్క ఎదిగే విధానాన్ని తెలిపే విషయం కాదు. ఇది మన జీవిత ప్రయాణానికి ఓ గొప్ప ప్రేరణ, ఓర్పు, పట్టుదల, శ్రద్ధ, ఆత్మవిశ్వాసము, మరియు నిరంతర కృషి యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే ఒక గొప్ప జీవన తత్వము.*

🎋 🪴 *బాంబూ రూల్ – సారాంశ వివరణ*
🌱 *బాంబూ మొక్కను నాటిన తర్వాత మొదటి ఐదు సంవత్సరాలు, అది నేలపై కనబడే విధంగా అస్సలు పెరగదు. కానీ అదే సమయంలో అది భూమిలో లోతుగాను, బలంగాను వేర్లను విస్తరిస్తుంది.*

🪴 *ఈ దశలో, బాంబూ మొక్క భవిష్యత్తులో తన అభివృద్ధి కోరకు గట్టి పునాదులను నిర్మించుకుంటుంది. ఇది మన జీవితాలలో ఆధారభూతమైన శ్రమ, నిశ్ఛలత, పట్టుదల, ధైర్యము, ఓర్పు ఎంత అవసరమో తెలిపే ఉదాహరణ.*

🎋 *ఐదేళ్ల నిర్భాగ్యమైన ఎదురుచూపుల తర్వాత, బాంబూ మొక్క కేవలం 90 రోజుల్లోనే 80–90 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. ఇది మన గోప్యమైన శ్రమకు వచ్చే ఫలితాలను, అనూహ్యమైన అభివృద్ధిని సూచిస్తున్నది.*

📜 *బాంబూ రూల్ యొక్క మూల సందేశము*
💐 *"విజేతలు తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరుత్సాహము చెందకుండా, బలమైన పునాదులను నిర్మించుకుంటారు. బాంబూ మొక్కలాగే, నిశ్శబ్దంగా ఎదుగుతూ చివరికి అందరినీ ఆశ్చర్యపరుస్తారు."*

🪴 *బాంబూ రూల్ నుండి మనము నేర్చుకోవాల్సిన జీవన పాఠాలు:*
✅ *ఓర్పు: పని చేసిన వెంటనే ఫలితాలు కనిపించకపోయినా, మనము పని మీద నమ్మకాన్ని ఉంచాలి.*
✅ *పట్టుదల: ఏమి జరిగినా మధ్యలో ఆగకుండా ముందుకు సాగాలి.*
✅ *ఆత్మవిశ్వాసము: మనలో జరుగుతున్న అభివృద్ధిని విశ్వసించాలి.*
✅ *నిరంతర కృషి: రోజూ కొద్దిగా అయినా మన లక్ష్యం వైపు ముందుకు సాగాలి.*

 🪷 *ప్రయోజనాలు మరియు అన్వయము:*
 🪴 *వ్యాపార రంగమునందు ప్రారంభంలో లాభాలు రాకపోయినా, బలమైన సేవా ప్రాతిపదిక, నెట్‌వర్క్ మరియు విశ్వసనీయతను పెంచుకోవడము ద్వారా భవిష్యత్తులో అభివృద్ధి సాధ్యమే.*

🪴 *వ్యక్తిత్వ వికాసమునందు, మనము చేరుకోవలసిన లక్ష్యం యొక్క జ్ఞానము, ఆధ్యాత్మికత, ధ్యానము మరియు యోగా వంటి అంశాలలో నిరంతర సాధన ద్వారా మనలో అంతర్గత బలాన్ని పెంపొందించుకోవచ్చును.*

🪴 *సామాజిక అంగీకారము విషయంలో, మన ప్రయత్నాల పట్ల మొదట ఇతరులు ఆసక్తి చూపకపోవచ్చును. కానీ ప్రేమతో, అంకితభావంతో పనిని చేస్తూ పోతే, అందరి ఆమోదం స్వయంగా లేదా అప్రయత్నంగా వస్తుంది.*

📌 *ముగింపు సందేశము:*
🪴 *బాంబూ రూల్ అంటే: "అంతర్గతంగా బలంగా తయారై, అసాధారణంగా ఎదగడం"*

🧘‍♂️ *ఇది మనలో ఆత్మవిశ్వాసము, సహనము, స్థిరత, లక్ష్యము పట్ల నిరంతర కృషి మరియు నైతికవిలువలను పెంచే గొప్ప జీవన సూత్రము.*

 🪴 *ఈ రోజు నుండి మనం కూడా బాంబూ మొక్కలాగే ఓర్పుతో, విశ్వాసముతో, ఉత్సాహముతో నిరంతరము కృషి చేస్తూ లక్ష్యము దిశగా ప్రయాణించి, అభివృద్ధి చెందుదాము*.

🪷 *"ఓం యద్భావం తద్భవతి"*

🕉️ *సనాతన ధర్మ భారత మాతాకీ జై*
💪 *స్వాస్థ్య భారత మాతాకీ జై*
 🌏 *విశ్వగురు భారత మాతాకీ జై*

🪷 *"సనాతన ధర్మమే ప్రాణము – ఆరోగ్యమే ఆధారము – విశ్వగురుతత్వమే మనందరి లక్ష్యము."*

 🌏 *ఓం జో శ్రీ అచ్యుతానంద యోగము, ("5D" నేటి తరానికి అనుగుణముగా నవీకరించబడిన యోగ శాస్త్రాలు మరియు సాధనలు), శ్రీ సౌభాగ్య నగరము (Hyd), తెలంగాణా.*

🙏💚 *ధన్యవాదములు* 🌸🌱

  🌏 *అంతా సరిగానే ఉంది*
     *ఓం శాంతిః శాంతిః శాంతిః* 
🙌 *ఓం తధాస్తు, తధాస్తు, తధాస్తు.*
🪷🌼🌻🌸🌺🏵️💐

మన జీవన వికాసము – నాలుగు మానసిక స్థాయిలు:*

😌🙏 *Great morning,*

🌟 *మన జీవన వికాసము – నాలుగు మానసిక స్థాయిలు:*

🌻 *జీవితంలో మనము ఎదుర్కొనే Comfort Zone → Fear Zone → Learning Zone → Growth Zone అనే నాలుగు దశలు మన వికాసాన్ని నిర్ణయిస్తాయి. ఈ దశల పరిణామము ద్వారా మనము సాధారణ స్థితిలోనుంచి అసాధారణ వ్యక్తిత్వ స్థితికి ఎదగగలము.*

🟦 *1. సౌకర్య పరిధి (Comfort Zone) అంటే ఏమిటి?*
✅ *ఇది మనకు ఆశ్రయము, మన నియంత్రణలో ఉండే స్థితి.*

🌹 *కొన్ని సంవత్సరాల నుండి అలవాటైన పనులు, పాత ఆలోచనలు, భద్రతభావముతో నిండి ఉంటుంది.*

🔍 *మన అనుభూతి: చాలా సులువు, శాంతమైనది, కానీ... ఎటువంటి వికాసం లేకుండా నిశ్చలంగా ఉంటుంది.*

⛔ *దుష్పరిణామాలు: మన అభివృద్ధికి అడ్డుకట్ట, జీవితానికి నిస్సారతను, మరియు భవిష్యత్తులో "మనము ఎందుకు ప్రయత్నించలేకపోయా ము?" అనే విచారమును కలిగిస్తుంది.*

🚪 *ముందుకు సాగాలంటే: మనము సౌకర్యపు గడిలో ఉన్నామా? అని ఆత్మపరిశీలన చేయాలి*

🌹 *“ఈ స్థితి నన్ను నిజంగా అభివృద్ధి చేస్తుందా?” అని ప్రశ్నించుకోవాలి*

🌹 *చిన్న చిన్న అసౌకర్యాలను అంగీకరించాలి – అదే మొదటి అడుగు*

🟥 *2. భయ పరిధి (Fear Zone) అంటే ఏమిటి?*
✅ *సౌకర్యపు పరిధిని విడిచిన వెంటనే మనం చేరే దశ*
🌹 *భయము, అనిశ్చితి, ఆత్మవిశ్వాసలోపము ఈ దశలో చాలా సహజము*

🔍 *మన అనుభూతి: “మన వల్ల కాదు” అనే అనుమానము, ఇతరుల అభిప్రాయాలపై భయము మరియు తిరిగి సౌకర్య పరిదధిలోకి వెళ్ళాలనిపించటము.*

⛔ *ప్రమాదం: భయమే మన వికాసానికి మొదటి అడ్డుగోడ అవుతుంది. మన కలలను వదులుకోవడానికి కూడా కారణం అవుతుంది*

🚪 *ముందుకు సాగాలంటే: భయాన్ని అంగీకరించి ధైర్యంగా ముందడుగు వేయాలి, మనకు మద్దతు ఇవ్వగల వారితోనే కలిసి ముందుకెళ్ళాలి మరియు మనము “ఎందుకు? లేదా అవసరమా?" అని మనసులో ప్రశ్నించుకొని, లక్ష్యము కొరకు పని చెయ్యాలి.*

🟨 *3. అభ్యాస పరిధి (Learning Zone)అంటే ఏమిటి?*
✅ *భయాన్ని ఎదుర్కొన్న తరువాత చేరే దశ*

🌹 *ఇక్కడ మనం నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటాము మరియు గత తప్పుల నుంచి కూడా ఎదుగుతాము.*

🔍 *మన అనుభూతి: ఉత్సాహభరితంగా, సవాళ్లతో కూడినదిగా ఉంటుంది మరియు స్వీయ అవగాహన పెరుగుతుంది*

✅ *ప్రయోజనాలు: మన సౌకర్య పరిధి అంతరించిపోతుంది, నూతన నైపుణ్యాలు, విజ్ఞానము పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసము మరింతగా బలపడుతుంది*

🚪 *ముందుకు సాగాలంటే: నిత్యం కొత్త విషయాలను నేర్చుకునే అలవాటును పెంచుకోవాలి, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి మరియు చిన్న చిన్న విజయాలకు కూడా ఆనందించే గుణమును పెంచుకోవాలి.*

🟩 *4. వికాస పరిధి (Growth Zone) అంటే ఏమిటి?*
✅ *ఇది లక్ష్య స్పష్టత, ధార్మిక జీవన దిశ మరియు సంతృప్తిని కలిగించే దశ. ఇదే మన యొక్క "అసలైన స్థితి” కి చేర్చే దశ*

🔍 *మన అనుభూతి: ఆత్మబలము, ఆశయము, ఆనందము, సేవభావము, ఇతరులకు స్ఫూర్తి మరియు ఇతరులను ప్రభావితము చేయగల స్థితి*

✅ *ప్రయోజనాలు: స్పష్టమైన ఆలోచనా దృక్పథముతో కూడిన జీవనము, ఆత్మసంతృప్తితో కూడిన నిర్ణయాలు, నిరంతర వ్యక్తిత్వ వికాసము అనేది ఒక గొప్ప జీవనశైలి అవుతుంది*

🔄 *గమనిక: ఈ దశకు చేరుకున్న తరువాత కొత్త సవాళ్ళతో మరోసారి కొత్త అభ్యాస దశ కూడా ప్రారంభమవుతుంది. ఇదే అసలైన అభివృద్ధి.*

🔄 *ప్రతి దశలో నుండి ముందుకు ఎలా సాగాలి?*
🌸 *సౌకర్య పరిధి నుండి భయ పరిధికి మారడానికి గాను చిన్న చిన్న సవాళ్లను స్వీకరించాలి, అవసరం లేని అలవాట్లను విడిచిపెట్టాలి.*

🌸 *భయపరిధి నుండి అభ్యాస పరిధిలోనికి ధైర్యంతో ముందుకు సాగాలి, మద్దతును పొందాలి, ఎందుకు చేస్తున్నామో గుర్తించాలి.*

🌸 *అభ్యాస పరిధిలో నేర్చుకున్న దానిని వికాస పరిధిలో పూర్తిగా ఉపయోగించి, లక్ష్యాన్ని స్పష్టంగా ఏర్పరచుకోని, కృషి చెసి, విజయాన్ని పొందాలి.*

🌿 *మన అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతము చేసే కొన్ని పద్ధతులు:*
📝 *1. దినచర్య మరియు ఆత్మపరిశీలన: “నేడు మేమేమి నేర్చుకున్నానము?”, “ఎక్కడ? ఎప్పుడు? ఏవిధంగా అభివృద్ధిని, మేము నివారించాము?” అని ప్రశ్నించుకోవాలి.*

🎯 *2. వికాస లక్ష్యాలు: ప్రతి వారానికి, ప్రతి నెలకు స్మార్ట్ గా స్పష్టమైన లక్ష్యాలను, కాల పరిమితితో ఏర్పాటు చేసుకోవాలి.*

🤝 *3. బలమైన మద్దతు వలయము: మనకు ధైర్యమును, స్పూర్తిని ఇచ్చే వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవాలి.*

🧠 *4. మైండ్‌సెట్ మార్పు: "తప్పయితే ఏమవుతుంది?" అనేదానికి బదులుగా "వృద్ధి అయితే ఏమవుతుంది?" అనే దృక్పథమును అలవాటు చేసుకోవాలి*

💬 *స్ఫూర్తిదాయకమైన వాక్యము: "గొప్పగా జీవించాలంటే, జీవితాన్ని గొప్పగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఎదో ఒక దశలోనైనా, జీవితాన్ని ధైర్యముతో మొదలు పెట్టకపోతే గొప్పవాళ్ళవ్వలేరు."*

🌸 *ముగింపు సందేశం: మన యొక్క వికాసము, శక్తి, విజయము మరియు జీవన పరిపూర్ణత అనేది సౌకర్యవంతమైన పరిధిని దాటి, భయాన్ని ఎదిరించి, నిరంతరము కొత్త వాటిని అభ్యసిస్తూ, వికాస పథములో ముందుకు సాగడములోనే ఉంది.* 🌱

🪷 *"ఓం యద్భావం తద్భవతి"*

🕉️ *సనాతన ధర్మ భారత మాతాకీ జై*
💪 *స్వాస్థ్య భారత మాతాకీ జై*
 🌏 *విశ్వగురు భారత మాతాకీ జై*

🪷 *"సనాతన ధర్మమే ప్రాణము – ఆరోగ్యమే ఆధారము – విశ్వగురుతత్వమే మనందరి లక్ష్యము."*

 🌏 *ఓం జో శ్రీ అచ్యుతానంద యోగము, ("5D" నేటి తరానికి అనుగుణముగా నవీకరించబడిన యోగ శాస్త్రాలు మరియు సాధనలు), శ్రీ సౌభాగ్య నగరము (Hyd), తెలంగాణా.*

🙏💚 *ధన్యవాదములు* 🌸🌱

  🌏 *అంతా సరిగానే ఉంది*
     *ఓం శాంతిః శాంతిః శాంతిః*
🙌 *ఓం తధాస్తు, తధాస్తు, తధాస్తు*. 
    🪷🌼🌻🌸🌺🏵️💐

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .
 
. భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .
సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

. పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .

 • శరీర పరీక్ష నేర్చుకునే విదానము.- 
  పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.

• చేదన కర్మం - 
    
. సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .

•. బేధ్య కర్మం - 
   
. నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .
• లేఖ్య కర్మం - 
   
. రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .

 •. వేద్య కర్మం - 
      
. మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .

•. ఏష్య కర్మం - 
 
. పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .

• ఆహార కర్మం - 
   
. పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.

 • విశ్రావ్య కర్మం - 
  
. విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .

• సీస కర్మం - 
          
. మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .

 •. స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -
  
. కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.
 
•. శస్త్ర చికిత్స చేయు విదానం -
  
. శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

 •. శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-

 * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)
 * యంత్రములు - ( surgical applinces)
 
 * క్షారము - ( Alkali) .
 * అగ్ని - ( Fire for cauterisation) .
 * జలూక - ( Leeches) .
 * శలాక - ( Probe or direetor ).
 
 * జాంబ వోష్ణము -( Cavtersing 
Inusruments) .
 * పిచువు - (Cotton) .
 
 * ప్లోతము - ( Lint) .
 
 * సూత్రము - (Thread) .
 
 * పట్టము - ( Tow ).
 
 * తేనే - ( Honey) .
 
 * నెయ్యి - ( Ghee) .
 
 * కొవ్వు.
 
 * పాలు.
 
* నూనే .
 
* తర్పణం - ( powederd wheat soaked in 
water ) .

 * కషాయం - ( Decoctions) .
 
* అలేపము - ( Medicated Plasters) .

 * కల్కము - ( Paste) .

 * చన్నీళ్ళు.

 * వేడి నీళ్ళు .
 
* కవలిక - ( Splints) .

 * వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).

 * స్పటికం - ( Lens) .

 * కురువింద రాళ్ళు .

 * అయస్కాన్థములు .

 * గాజు తునకలు.

 * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చేయు పదార్దం.
          
. ఈ విధంగా మన పూర్వీకులు వివిధ రకాల వస్తువులు ఉపయోగించి అత్యద్భుతంగా శస్త్రచికిత్సలు చేసేవారు .

 

Tuesday, July 29, 2025

108. ఏమిటి ఈ సంఖ్య

🙏🏻శుభోదయం,హరిఓం🙏🏻
        *అష్టోత్తర శతం*                 
*108. ఏమిటి ఈ సంఖ్య? ఏదైనా మంత్రం చదివితే, 108 సార్లు అంటారు. ప్రదక్షిణాలు చేసినా, 108 సార్లు చేస్తే మంచిదంటారు. ఇది చాదస్తమా? సాంప్రదాయమా? లేక, ఈ అంకె వెనక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నెంబర్ 108. అవును. దిమ్మతిరిగే పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ళ క్రితమే ఎలా చేశారు? అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్ 108. ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? అంటే, చదువు రానివారు కూడా 108 చేస్తే మంచిది అంటారు. రుద్రాక్ష, తులసి, ఇలా ఏ మాల తీసుకున్నా,, 108 పూసలు ఉన్నాయా? అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతాం. "ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచిది" అంటాడు పురోహితుడు. ఏమిటి ఈ 108? కొందరు దేవుడిని నమ్ముతారు. కొందరు నమ్మరు కూడా. కానీ, అందరూ నమ్మేది సైన్స్. కనుకే* *అందరూ నమ్మే పరిశోధనలు చేశారు భారతీయు ఋషులు. అవి అలాంటి ఇలాంటి పరిశోధనలు కాదు, అందుకు సరైన ఉదాహరణ ఈ 108. ఈ 108 వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది. ఈ భూమి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఖగోళం అనే వృత్తంలో సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం 108.*

 *వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు ఓ రెండు మూడు వందల ఏళ్ళ క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం. కానీ, వేదాల్లో ఈ డిస్టెన్స్ లు ఎప్పుడో చెప్పేసారు. ఎలా అంటే, 108 తో.. భూమికి, చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును. మనం నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు, అన్నిటి దూరాలు ఈ 108తో లింకప్ అయి ఉన్నాయి. ప్యూర్ ఎస్ట్రనామికల్ సైన్స్. ఊహించారా? 108 వెనక ఇంతకథ ఉందని.. ఇవన్నీ కాకి లెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్దపెద్ద కంప్యూటర్లతో, మిషన్లతో, శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేద కాలంలో భారతీయ ఋషులు 108 కోడ్ తో చెప్పిన ఈ డిస్టెన్స్ కి కరెక్ట్ గా సరిపోయాయి. మరి ఎవరు గొప్ప? ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్ లోనే ఫిలాసఫీ ఉంది. సైన్స్ ఉంది.*

*ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్యగ్రంథం. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 107+1 మర్మ స్థానాలు ఉంటాయి. ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేస్తే శక్తి ఉత్పత్తి కేంద్రాలు.*

 *మర్మకళ అని ప్రాచీన కేరళ వద్ద కళ ఒకటి ఉంది. వాళ్లు మన మర్మాల మీద దాడి చేసి ఆ పార్టులు పనిచేయకుండా చేయగలరు.*

 *శ్రీ చక్రం వినడం వినడమే కానీ, శ్రీ చక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది., శ్రీ చక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108. పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ. శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం అది. శ్రీ చక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం.*

*జ్యోతిష్య శాస్త్రం కొంతమందివల్ల అది మూఢనమ్మకమనే మచ్చ పడింది. కానీ, జ్యోతిష్యం అంటే కంప్లీట్ సైన్స్. కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. దీనికి 108కి సంబంధమేంటి? అంటే, మనిషిలోని బిహేవియర్లకు సూచికలు. ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు 27 నక్షత్రాలు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం, ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో, వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అశ్విని, భరణి 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు 27 నక్షత్రాన్ని ఈ నాలుగు పాదాలతో గుణిస్తే, అక్కడ 108 వస్తుంది. ఇందులో 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా రాశులు మళ్ళీ 12 ఉంటాయి.*

*ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్లు 108 ఉంటాయని చెబుతోంది.*

*మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతి రోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో పదివేల ఎనిమిది వందల సూర్యాంశ, అంటే ప్రాణశక్తి. పదివేల ఎనిమిది వందల సార్లు చంద్రాంశ. అంటే, మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ అనుకోవచ్చు. ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్ డయాక్సైడ్ ని వదలడం అన్నమాట. పదివేల ఎనిమిది వందలని అంటే 108 వందలే కదా.*
*భరతుని నాట్య శాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్య భంగిమలు 108 ఉంటాయి. ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది. నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108.*
*మన ఉపనిషత్తుల సంఖ్య 1080. మన ఇంట్లో, ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి అంటాం. అంటే, 108 నామాలను జపించాలని.*
,*ఇలా, మన శాస్త్రాలన్నీ మొత్తం 108తో ముడిపడి ఉన్నాయి. అందుకే, ఆ నెంబర్ కి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యతనిచ్చారు.*
*మరి, ఈ సైన్సు సామాన్యులకు చేరేదెలా? విద్యార్థి లేని విద్యకు విలువలేదు. తాము కనుక్కున్న ఈ అంశాలు నిత్యం ప్రజల మధ్య నలగాలి. మనం ఉంటున్న భూమికి, అంతరిక్షానికి ,సృష్టికి, సృష్టికర్తకు ఉన్న ఈ 108 సంబంధం తరతరాల విద్యగా మారాలి. అందుకే వైదిక విధానంలో 108 కి ప్రాధాన్యత ఇచ్చారు .*

*పూజ చేస్తే 108 పూలు, జపం చేస్తే 108 పూసల మాల, ప్రదక్షిణలు చేస్తే 108. ఇలా ప్రతి దైవికాంశలో 108 అనే సంఖ్య నలిగేలా చేశారు. అప్పట్లో ఈ 108 గురించి పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు ఈ సైన్సు వండర్ ను చెప్పేవారు కరువయ్యారు. ఈ 108 సంఖ్యను బౌద్ధులు, జైనులు, సిక్కులు, వీరు కూడా దైవికంగానే భావిస్తారు.*

 *తపస్సులో 108 మానసిక స్థాయిలు ఉంటాయి. మనలోనే ఉన్న దేవుడిని గుర్తించడానికి మనలో ఉన్న ఆత్మ 108 మెట్లు దాటాలని బౌద్ధుల నమ్మకం. అది మన 108 వెనుక ఉన్న రహస్యాలలో ఒకటి.*

Monday, July 28, 2025

ఈరోజు గొప్ప నాయకత్వ లక్షణాల గురించి తెలుసుకుందాము

😌🙏 *అద్భుతమైన శుభోదయము,* 
🌹💐🌺🌸🪷🌻

🌟 *ఈరోజు గొప్ప నాయకత్వ లక్షణాల గురించి తెలుసుకుందాము*
🌹 *నాయకత్వము అనేది పదవి, అధికారము లేదా నియంత్రణ మాత్రమే కాదు, నాయకత్వము అంటే- సేవ, ప్రేరణ మరియు అంతర్గత విలువలపై నిబద్ధత.*

🪷 *ఒక నిజమైన నాయకునికి ఉండవలసిన 10 ముఖ్యమైన లక్షణాలు:*
*1. స్వీయ అవగాహనా శక్తి:*
🌹 మన బలాలు, బలహీనతలు, భావోద్వేగాలు, లక్ష్యాలపై స్పష్టత.
🌻 *అభ్యాసము:* ప్రతిరోజూ ధ్యానము, డైరీ రాయడము, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము.
🪷 *“నాయకత్వము అనేది, స్వీయ నిర్వహణతోనే మొదలవుతుంది.”*

*2. దృష్టి మరియు స్పష్టత:*
🌹 స్పష్టమైన లక్ష్యం మరియు దిశ కలిగి ఉండడము.
🌻 *అభ్యాసము:* మనము “ఎందుకు” (Why) అని స్పష్టంగా రాసుకోని, దానిపై దృష్టిని పెట్టి, పనిచేద్దాము.
🪷 *“మనకే స్పష్టంగా దారి తెలియకపోతే – ఇతరులను ఎలా నడిపించగలము?”*

*3. సానుభూతి (Empathy)*
🌹 ఇతరుల భావాలను అర్థము చేసుకోవడము.
🌻 *అభ్యాసము:* శ్రద్ధగా వినడము, ప్రశ్నలను అడగడము, ఇతరుల భావాలకు స్థానం ఇవ్వడము.
🪷 *“మనకెంత తెలుసు, మనమెంత గొప్ప వారమో అనే దాని కన్నా – మనము ఎంత శ్రద్ధగా ఉన్నామో, దానిని మాత్రమే ప్రజలు గుర్తిస్తారు.”*

*4. నైతికత (Integrity)*
🌹 నిజాయితీగా, విశ్వసనీయంగా, విలువలతో జీవించడము.
🌻 *అభ్యాసము:* ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాము, పొరపాట్లును ఒప్పుకోని, నిజాయితీగా ఉందాము.
🪷 *“మనలోని నైతికత అనేది మౌనంగానే మనలో నాయకత్వాన్ని స్థాపిస్తుంది.”*

*5. భావోద్వేగ మేధస్సు (EQ)*
🌹 అవసరము లేని చోట మన స్వంత భావాలను నియంత్రించుకోవడము, ఇతరుల భావాలను చక్కగా అర్థం చేసుకోవడము.
🌻 *అభ్యాసము:* స్పందించే ముందు బాగా ఆలోచించడము, మన భావాలను గుర్తించి, ప్రశాంతంగా స్పందిద్దాము.
🪷 *“ఎవరైతే ముందుగా వారి లోపలి ప్రపంచాన్ని చక్కగా నడిపించగలరో, అలాంటి వారే బయట ప్రపంచాన్ని కూడా చక్కగా నడిపించగలరు.”*

*6. ధైర్యము మరియు స్థైర్యము (Resilience)*
🌹 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని తిరిగి ఎదగడము.
🌻 *అభ్యాసము:* గతంలో మనకు తగిలిన ఎదురుదెబ్బలను మరియు వాటిని ఎలా గెలిచామో గుర్తు చేసుకోని, దృఢమైన మనోభావాలను పెంపొందించుకుందాము.
🪷 *“ఎదురుదెబ్బలు గొప్ప నాయకులను కూల్చలేవు, సరికదా మరింత బలంగా మారుస్తాయి.”*

 *7. నిర్ణయాలు తీసుకునే శక్తి (Decisiveness)*
🌹 స్పష్టంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగడము.
🌻 *అభ్యాసము:* హృదయముతో విని, నిజాలను తెలుసుకోని, త్రికరణ శుద్ధితో చర్యలను చేపట్టుదాము.
🪷 *“మన యొక్క అవినీతి కంటే కూడా మన అలసత్వమే, మనలోని నాయకున్ని పూర్తిగా చంపేస్తుంది.”*

*8. ప్రభావవంతమైన సంభాషణ (Communication)*
🌹 స్పష్టంగా మాట్లాడటము, శ్రద్ధగా వినటము, సంబందాలను బలంగా ఏర్పరచుకోవడము.
🌻 *అభ్యాసము:* శ్రద్దగా విని, సరళంగాను మరియు ప్రేమతోనూ వాస్తవాలను చెప్పుదాము.
🪷 *“మన ఆలోచనలు మరియు భావాలు ఇతరులకు వినిపించడమే కాదు, బాగా అర్థమయ్యే విధంగా చెప్పుదాము.”*

*9. ప్రేరణా శక్తి (Inspiration)*
🌹 కేవలం మాటలతోనే కాదు – చేతలతో కూడా ప్రజలను ప్రేరేపించడము.
🌻 *అభ్యాసము:* మనలోని ఉత్తేజకరమైన ఆలోచనలను ఇతరులతో పంచుకుందాము, ఇతరులను మెచ్చుకుందాము, మరియు ఆదర్శవంతముగా జీవిద్దాము.
🪷 *“నాయకత్వము అనేది తన చుట్టూ వారి జీవితాలను ప్రభావితము చెయ్యాలి, అంతేగాని ఆదేశించడము కాదు.”*

*10. నిత్య విద్యార్థి మనస్తత్వము (Lifelong Learning)*
🌹 ప్రతిది చాలా ఆసక్తిగా నేర్చుకోవడము, మార్పులను అంగీకరించడము.
🌻 *అభ్యాసము:* పుస్తకాలను చదవడము, వర్క్‌షాప్‌లల్లో పాల్గొనడము మరియు ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడము.
🪷 *“ఎప్పటికీ నిత్య విద్యార్థులైన వారు మాత్రమే నిజమైన నాయకులు.*

💡 *మనము ఒక గొప్ప నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి సలహాలు:*
🌱 *చిన్నగా పనిని ప్రారంభించి, ప్రతి నిత్యము శ్రద్దగా ప్రాక్టీస్ చేద్దాము.*

🌟 *ప్రతి రోజూ చెయ్యవలసిన అభ్యాసాలు:* 1. ✍️ 5 నిమిషాలు డైరీ రాసి, నేడు మనము కొత్తగా నేర్చుకున్నదేమిటో గుర్తించుకుందాము. 2. 🙏 అంతర్గత స్థిరత కోరకు ధ్యానము లేదా ప్రార్థనను చేద్దాము 3. 👂 మాటలను మధ్యలోనే నిలిపి వేయకుండా, పూర్తిగాను మరియు శ్రద్ధగాను విందాము. 4. 🤝 వీలైతే ఎవరికైనా సరే ఒక మంచి మాట చెప్పి, ప్రేరణను కలిగిద్దాము. 5. 📚 పుస్తకాలను చదవడము ద్వారా, వీడియోలను చూడడము ద్వారా లేదా జీవితము నుండి
ప్రతిరోజూ కొత్తది కనీసం ఒక్కటైనా నేర్చుకుందాము.

🌈 *బాగా గుర్తుంచుకుందాము:*
🪷 *"నాయకత్వము" అనేది పదవి కాదు, లేదా పదవిలో ఉన్నప్పుడు మాత్రమే జీవించే విధానము కాదు, "నాయకత్వము" అనేది ప్రతిరోజూ లేదా జీవించి ఉన్నంత వరకు మన జీవన విధానములో ఒక భాగముగా చేసుకుందాము.*

🪷 *మనము, ఒక తల్లి, తండ్రి, గురువు, టీచర్, మేనేజర్, వ్యాపారవేత్త లేదా విద్యార్థి అయినా సరే, ఈ గుణాలను నిత్య అభ్యాసము ద్వారా, స్పందించే నాయకత్వము నుండి సృజనాత్మకమైన గొప్ప నాయకులుగా మారుదాము.*


Sunday, July 27, 2025

చిట్టి చిట్కాలు. - నా అనుభవ యోగాలు -

చిట్టి చిట్కాలు. -  నా అనుభవ యోగాలు  -

*.  పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం  - 
    
.       పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది . 
         
 ఇది నేను ప్రయోగించిన యోగం . 

*.  గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు  - 
       
.  ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి. 
                  
.       ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది .
           
 దీనిని సామాన్య పరిభాషలో "రణపాల " అని పిలుస్తారు .

*.     అమీబియాసిస్ వ్యాధి నివారణ కొరకు - 
   
.     తులసి దళాలు , వాయువిడంగాలు సమ బాగాలుగా దంచి 2 పూటలా పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే అమీబియాసిస్ హరించిపోతుంది.
 
గమనిక  -  వాయువిడంగాలు మీకు ఆయుర్వేద పచారి షాపుల్లో దొరుకుతాయి.

*.  తియ్యటి కంఠస్వరం కొరకు  - 
   
.         రోజు రెండు పూటలా పూటకు 5 గ్రాములు దోరగా వేయించిన శొంటి పొడి , పటికబెల్లం పొడి 5 గ్రాములు , తేనె 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా సేవిస్తూ ఉంటే గొంతు బాగుపడి తియ్యటి కంఠస్వరం వస్తుంది.  

గోరుచుట్టుకు నేను ప్రయోగించిన రహస్య సిద్ద యోగం  - 
      
.        చాలా మంది గోరుచుట్టు రాగానే నిమ్మకాయ కి రంధ్రము చేసి వేలికి తొడుగుతారు . మరికొంతమంది గేద పేడ వేసి కట్టడం మరియు ఉల్లిగడ్డ వేసి కడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం మరియు తీవ్రమైన బాధని కలుగచేస్తుంది . క్రమేణా రక్తం , చీము బయటకి వెలువడి శస్త్రచికిత్స కూడా అవసరం అగును. 
        
ఇటీవల ఒక వ్యక్తి గోరుచుట్టు తో తీవ్రవేదనతో నన్ను కలిశాడు . అతనికి నేను చేసిన చికిత్స వివరాలు తెలియచేస్తున్నాను .
    
.       మొదట 100 గ్రాములు గుల్లసున్నం తీసుకుని సీసాలో వేసి నీరుపోసి బాగా కలిపాను. కొంతసేపటికి సున్నం అంతా కిందికి చేరుకొని పైన తేరుకున్న నీటిని వేరొక సీసాలో పోసి ఆ నీటికి సమానంగా ఆముదం ఆ నీరు గల సీసాలో పోసి బాగా కదిపాను . 15 నిమిషముల తరువాత నీరు మరియు ఆముదం కలిసి తెల్లని రంగు గల ద్రవం ఏర్పడినది . 
                
.       ఆ ద్రవాన్ని దూదిపైన వేసి వాపు ఉన్నంతవరకు రాసి కట్టుకట్టాను . కేవలం 3 రోజుల్లో గోరుచుట్టు కరిగిపోయింది. బాధ కూడా తగ్గిపోయింది . 
      
.    నిమ్మకాయ సరాసరి గోరుచుట్టు ఉన్న వేలికి పెట్టరాదు . నిమ్మకాయలో సున్నం మరియు పసుపు కలిపిన పారాణి ముద్ద పెట్టిన తరువాతే నిమ్మకాయ పెట్టండి . లేదా నిమ్మకాయ లేకుండా ఆ పారాణి ముద్దని కట్టండి. 
   
.        

పురుషుడు ఎలా ఉండాలో

*స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లోకి రాలేదు!*

*కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః* 
*(కామందక నీతిశాస్త్రం)*

*1. కార్యేషు యోగీ :*
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!

*2. కరణేషు దక్షః :*
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.

*3. రూపేచ కృష్ణః:*
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.

*4. క్షమయా తు రామః:*
ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

*5. భోజ్యేషు తృప్తః:*
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా)భుజించాలి.

*6. సుఖ దుఃఖ మిత్రం:*
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

*ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.*

Friday, July 25, 2025

Fairness gel

Fairness gel
MEN AND for women.

*Face glow: external usage* :--

1,విటమిన్ "ఇ"లోజెల్:10గ్రా
2, బాదాం ఆయిల్   :10 గ్రా
3, ఆలివ్ ఆయిల్     : 10గ్రా
4, గ్లిజరిన్               :10గ్రా
5, రొజ్ వాటర్         :10గ్రా
6, అలొవెరా జెల్     :200గ్రా

ఈ అన్నీ తీసుకొని ఒక గాజు కప్ లో వేసి భాగా కలిపి గాజు సీసాలో స్టోర్ చేసుకొని రోజూ తగినంత తెల్లవారి రాత్రి పూసి ఉదయం ముఖం కడుక్కోవాలి...

ముఖం కాంతివంతంగా తయారవుతుంది....


నొప్పులకు చికిత్స

నొప్పులకు చికిత్స

మెకాళ్ల నొప్పులకి నొప్పులకి నడుము నొప్పికి  : ఇంటిలో చేసుకొనే చిట్కా


వాము               200గ్రా
జిలకర                200గ్రా
పాత చింతపండు   20గ్రా
మంచి ఆముదం    20గ్రా 
బాదం పప్పు         200గ్రా
జీడిపప్పు             200గ్రా
ఎండుద్రాక్చ            200గ్రా
ఎండుఖర్జూరం        200గ్రా

ఈ అన్ని వస్తువులు కలిపి బాగా దంచి రోజు ఉదయం రాత్రి  బోజనం  తర్వాత   నిమ్మకాయ సైజ్ తీసుకొని పాలల్లొ తినాలి ఇలా తిన్న ఒక గంట వరకు మరేమీ తీసుకొకూండా వుండాలి, 

నొప్పులున్న అందరూ చేయాల్సిన పత్యం : food restriction for those who are having pains.

పత్యం: అరటికాయ, బంగాళ దుంపలు, చేమదుంపలు, చిలగడదుంపలు, చెరుకుపాలు, చికెన్, కుందేలు మాంసము, గుమ్మడికాయ, అరటిపండు, మెక్కజొన్నలు,  మెదలైనవాత వస్తువులు లేదా వాయు వస్తువులు తీసుకోకూడదు


పొడి దగ్గు తగ్గడానికి*

పొడి దగ్గు తగ్గడానికి*

పొడి దగ్గు తగ్గడానికి తేనె, ఉప్పునీటితో పుక్కిలించడం, ఆవిరి పట్టడం, మరియు వేడి పానీయాలు తాగడం వంటివి ఇంటి నివారణలు ఉపయోగపడతాయి. అయితే, పొడి దగ్గు తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.
పొడి దగ్గు అనేది గొంతులో చికాకు లేదా చర్మం వలన ఏర్పడే దగ్గు. ఇది సాధారణంగా శ్లేష్మం లేదా కఫం లేకుండా ఉంటుంది. పొడి దగ్గుకు అనేక కారణాలు ఉండవచ్చు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, చికాకు కలిగించే పదార్థాలు లేదా కొన్ని మందులు కూడా కారణం కావచ్చు.
పొడి దగ్గు తగ్గడానికి కొన్ని ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి:

*🔶తేనె*

తేనె దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గొంతును ఉపశమనం చేస్తుంది మరియు
 చికాకును తగ్గిస్తుంది
 

*🔶ఉప్పునీటితో పుక్కిలించడం*

వెచ్చని నీటిలో ఉప్పు కరిగించి పుక్కిలించడం గొంతు చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. 
*🔹ఆవిరి పట్టడం*
వేడి నీటి ఆవిరిని పీల్చడం గొంతును తేమగా ఉంచడానికి మరియు చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. 
*🔶వేడి పానీయాలు*
వేడి నీరు, హెర్బల్ టీలు లేదా స్పష్టమైన సూప్ లు తాగడం గొంతును ఉపశమనం చేస్తుంది. 
ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం:
నీరు, రసాలు మరియు ఇతర ద్రవాలు త్రాగడం ద్వారా గొంతును తేమగా ఉంచుకోవచ్చు. 
*🔷విశ్రాంతి*
పొడి దగ్గు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. 
ఒక వారం కంటే ఎక్కువ కాలం పొడి దగ్గు తగ్గకపోతే లేదా ఇతర లక్షణాలు ఉంటే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.



వాత, పిత్త మరియు కఫ అనే మూడు దోషాలు:-



వాత, పిత్త మరియు కఫ అనే మూడు దోషాలను ఈ ఆయుర్వేద నివారణతో సమతుల్యం చేసుకోండి... చివరి వరకు చదవండి

వాత, పిత్త మరియు కఫ అనే మూడు దోషాలు:-

పోస్ట్‌ను రెండుసార్లు జాగ్రత్తగా చదవండి

శరీరం 3 దోషాలతో నిండి ఉంటుంది

#వాత (గ్యాస్) - సుమారు 80 వ్యాధులు

#పిత్త (ఎసిడిటీ) - సుమారు 40 వ్యాధులు

#కఫ (కప్పు) - సుమారు 28 వ్యాధులు

ఇక్కడ త్రిదోషాల యొక్క ప్రధాన లక్షణాలు మాత్రమే చెప్పబడతాయి మరియు ఆ వ్యాధులను ఇంటి నివారణల ద్వారా సులభంగా నయం చేయవచ్చు

నేను చెబుతున్నట్లుగా అన్ని జాగ్రత్తలు పాటిస్తాను

💙పెద్ద ప్రేగులో చెత్త ఉన్న వ్యక్తి మాత్రమే అనారోగ్యానికి గురవుతాడు

💙ఎనిమా అనేది పెద్ద ప్రేగును శుభ్రపరిచే మరియు ఏదైనా వ్యాధిని నయం చేసే పద్ధతి

💚ప్రపంచంలోని అన్ని వ్యాధులు ఈ మూడు దోషాల క్షీణత వల్ల సంభవిస్తాయి

వాత (#గ్యాస్) అంటే గాలి:-💛

-- శరీరంలో గాలి ఎక్కడ ఆగి తగిలినా నొప్పి వస్తుంది, నొప్పి ఉంటే గాలి మూసుకుపోయిందని అర్థం చేసుకోండి
-- కడుపు నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, మోకాలి నొప్పి, ఛాతీ నొప్పి మొదలైనవి.
-- త్రేనుపు కూడా వాయు దోషమే
-- మైకము, భయము మరియు ఎక్కిళ్ళు కూడా దాని లక్షణాలు

కారణం:-
°°°°°°°°°°°°°°°
-- ఏదైనా పప్పు దినుసుల వంటి వాయువును ఉత్పత్తి చేసే ఆహారం వాయువు మరియు యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది
-- యూరిక్ ఆమ్లం ఆగిపోయిన చోట, ఆ ఎముకల ద్రవం తగ్గుతుంది, ఎముకలు అరిగిపోవడం ప్రారంభమవుతుంది, అవి శబ్దం చేయడం ప్రారంభిస్తాయి, వైద్యులు దీనిని గ్రీజు పోయిందని లేదా స్లిప్ డిస్క్ లేదా స్పాండిలైటిస్ లేదా గర్భాశయం మొదలైనవి అంటారు.
-- మొలకెత్తిన ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ చేసే కణాలను మరమ్మతు చేయడానికి మాత్రమే ప్రోటీన్ అవసరం
-- శుద్ధి చేసిన పిండి మరియు పిండిని ఊక లేకుండా తినడం
-- గ్రామ్ పిండి ఉత్పత్తులను తినండి
-- పాలు మరియు దాని నుండి తయారైన ఉత్పత్తులను తినండి
-పేగుల బలహీనత, కాదు వ్యాయామం

నివారణ:-
°°°°°°°°°°°°°°
--అల్లం తినండి, ఇది వాయువును తొలగిస్తుంది, రక్తాన్ని పలుచన చేస్తుంది మరియు కఫాన్ని కూడా తొలగిస్తుంది, రాత్రిపూట గోరువెచ్చని నీటితో అర టీస్పూన్ ఎండు అల్లం తీసుకోండి
--వెల్లుల్లి ఏదైనా వాయువును తొలగిస్తుంది,

మీకు ఛాతీలో నొప్పి అనిపిస్తే, వెంటనే 8-10 వెల్లుల్లి రెబ్బలు తినండి, ఇది అడ్డంకి నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది
--వెల్లుల్లి కఫ వ్యాధులు మరియు TBని కూడా నయం చేస్తుంది
--శీతాకాలంలో ఉదయం మరియు సాయంత్రం 2-2 లవంగాలు, వేసవిలో ఉదయం మరియు సాయంత్రం 1-1 లవంగాలు తీసుకోండి మరియు దానిని ఒంటరిగా తినకండి, పచ్చి కూరగాయలు లేదా రసం, చట్నీ మొదలైన వాటిని ముక్కలుగా కోసి జోడించడం ద్వారా తినండి
--మెంతులు కూడా అల్లం మరియు వెల్లుల్లి లాగానే పనిచేస్తాయి

సహజ చికిత్స:-

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వేడి మరియు చల్లటి వస్త్రాన్ని పూయండి, ఇప్పుడు ముందుగా ఆ భాగాన్ని తాకండి, అది వేడిగా ఉంటే చల్లగా వర్తించండి మరియు ఆ భాగం చల్లగా ఉంటే వేడిగా లేదా చల్లగా లేకపోతే వేడిగా మరియు చల్లగా, ఒక నిమిషం వేడిగా మరియు చల్లగా, ఒక నిమిషం వేడిగా మరియు చల్లగా వర్తించండి

దగ్గు(#దగ్గు):-

-- నోరు మరియు ముక్కు నుండి వచ్చే శ్లేష్మం దాని ప్రధాన లక్షణం
-- జలుబు, ఫ్లూ, దగ్గు, TB, ప్లూరిసి, న్యుమోనియా మొదలైనవి దీని ప్రధాన లక్షణాలు
-- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఉబ్బసం మొదలైనవి లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం

కారణం:-
°°°°°°°°°°°°°°
-- నూనె మరియు జిడ్డుగల పదార్థాలను అధికంగా తీసుకోవడం
-- పాలు మరియు దాని నుండి తయారైన ఏదైనా ఉత్పత్తి
-- చల్లటి నీరు మరియు రిఫ్రిజిరేటర్ తినవలసినవి
-- దుమ్ము, పొగ మొదలైన వాటిలో ఎక్కువసేపు ఉండటం
--సూర్యరశ్మిని పీల్చుకోకండి

నివారణ:-
°°°°°°°°°°°°°°°
--విటమిన్ సి తీసుకోండి, ఇది కఫానికి శత్రువు, ఇది ఆమ్లా లాగా టాయిలెట్ ద్వారా కఫాన్ని తొలగిస్తుంది
--వెల్లుల్లి, ఇది కఫాన్ని కరిగించి చెమట రూపంలో తొలగిస్తుంది
--BP ఉంటుంది సాధారణంగా ఉంటుంది
--రక్త ప్రసరణ బాగానే ఉంటుంది
--మీకు మంచి నిద్ర వస్తుంది
--అల్లం కూడా ఉత్తమ కఫ నివారిణి

సహజ చికిత్స
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
--ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి పుక్కిలించండి
--గోరువెచ్చని నీటిలో మీ పాదాలను ఉంచి కూర్చోండి, 2 గ్లాసుల సాదా నీరు త్రాగండి మరియు తలపై చల్లని గుడ్డను ప్రతిరోజూ ఉంచండి 10 నిమిషాలు ఇలా చేయండి
--ప్రతిరోజూ 30-60 నిమిషాలు సూర్యరశ్మిని తీసుకోండి

పిత్త (#ACIDITY):-కడుపు వ్యాధులు

--వాత దోషం మరియు కఫ దోషంలోని అన్ని వ్యాధులు మినహాయించబడ్డాయి మరియు అన్ని ఇతర వ్యాధులు పిత్త వ్యాధులు, బిపి, చక్కెర, ఊబకాయం, ఆర్థరైటిస్ మొదలైనవి.
--కడుపులో మంట, మూత్ర విసర్జన తర్వాత మంట, మలవిసర్జన చేసేటప్పుడు మంట, శరీర చర్మంలో ఎక్కడైనా మంట వంటి శరీరంలో ఎక్కడైనా మంట
--పుల్లని త్రేనుపు
--లో భారంగా ఉండటం శరీరం

కారణం:-
°°°°°°°°°°°
--వేడి మసాలాలు, ఎర్ర మిరపకాయలు, ఉప్పు, చక్కెర, ఊరగాయలు
--టీ, కాఫీ, సిగరెట్లు, పొగాకు, మద్యం
--మాంసం, చేపలు, గుడ్డు
--రోజంతా ఎల్లప్పుడూ వండిన ఆహారాన్ని తినడం
--కోపం, ఆందోళన, కోపం, ఒత్తిడి
--మందులు తీసుకోవడం
--మల విసర్జన ఆపడం
--13 వేగాస్ తుమ్ములు, అపానవాయువు మొదలైన వాటిని ఆపడం.

నివారణ
°°°°°°°°°°°°°
--పెరుగు పాలను త్రాగండి, వేడి పాలలో నిమ్మకాయను కలిపి పాలు పెరుగుగా చేసి, ఆ నీటిని వడకట్టి త్రాగండి, ఇది అన్ని కడుపు వ్యాధులకు దివ్యౌషధం, అన్ని రకాల జ్వరాలను కూడా నయం చేస్తుంది
--దానిమ్మ రసం, గోరింటాకు రసం, క్యాబేజీ రసం వంటి పండ్లు మరియు కూరగాయల రసాలు
--నిమ్మకాయ నీరు తినండి

సహజమైనది చికిత్స
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
--తడి గుడ్డతో కడుపు చల్లబరుస్తుంది
--వెన్నుపాము చల్లబరుస్తుంది, ఈ వెన్నుపాము వేడి కారణంగా పక్షవాతం వస్తుంది, తడి గుడ్డతో వెన్నుపాముపై కట్టు వేయండి
--వ్యాయామం చేయండి, యోగా చేయండి.
--గాఢ నిద్ర తీసుకోండి.

రక్తం పాడైనదని తెలిపే లక్షణాలు:

మనిషి శరీరంలో రక్తం పాడైనదని (impure blood or Rakta Dushthi) గుర్తించడానికి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇవి శరీరంలో లోపాలు, జీవనశైలి, ఆహారం వల్ల కలుగుతాయి.


🔍 రక్తం పాడైనదని తెలిపే లక్షణాలు:

1. చర్మ సమస్యలు – మొటిమలు (Pimples), చర్మం మీద పుండ్లు, చుండ్రు, అలర్జీలు.

2. రక్తపిత్త లక్షణాలు – మంట, మూర్చ, అధిక చెమట.

3. నెగెటివ్ లక్షణాలు – అలసట, బలహీనత, మానసిక అలసట.

4. జబ్బులు – పిన్నలు, సోరియాసిస్, ఎక్జిమా.

5. మూత్రంలో మార్పులు – రంగు, వాసన, మంట.
6. శరీర బరువు తగ్గడం లేదా పెరగడం అనియంత్రితంగా.

7. తలలో మంట లేదా చర్మంపై వేడి అనిపించడం.
8. నాలుకపై తెల్లటి పూత (white coating).

🌿 ఆయుర్వేదంలో రక్త శుద్ధి (Blood Purification) చిట్కాలు:

✅ 1. రక్త శోధక ఔషధాలు:

మంజిష్ఠ (Manjistha) – రక్తాన్ని శుభ్రపరిచే శ్రేష్ఠ ఔషధం.

నిమ్మ (Neem) – రక్తశుద్ధి, చర్మ వ్యాధుల నివారణకు.

గుడూచి,/తిప్పతీగ (Giloy) – ఇమ్యూనిటీ బలోపేతం చేస్తుంది.

కరెకు మీన్ (పసుపు) యాంటీసెప్టిక్, యాంటీఆక్సిడెంట్.

త్రిఫలా చూర్ణం – శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.

✅ 2. ఆహార సూచనలు:

పచ్చకూరలు, ఆకుకూరలు అధికంగా తినాలి.

నీరు ఎక్కువగా త్రాగాలి (3-4 లీటర్లు).

జంక్ ఫుడ్, స్పైసీ, ఆయిల్ ఫుడ్, మాంసాహారం తగ్గించాలి.

తాటి ముంజలు, బీలాలు, ద్రాక్ష, జామ వంటి ఫలాలు మంచివి.

✅ 3. ఆచరణీయ మార్గాలు:

ప్రతిరోజూ ఉదయం ఉష్ణ జలం త్రాగడం.

శరీరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం.

వ్యాయామం, యోగా (ప్రాణాయామం, anulom-vilom).

మనస్సును శాంతంగా ఉంచుకోవడం – ధ్యానం ద్వారా.

❗గమనిక:

అన్ని లక్షణాలు ఒకేసారి ఉండకపోవచ్చు. మీరు చర్మ సమస్యలు లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఖర్జూరం తినడం వలన బోలెడు ప్రయోజనాలు మీకు తెలుసా?*


*====================*
* *ఖర్జూరం తినడం వలన బోలెడు ప్రయోజనాలు మీకు తెలుసా?*
*####################
ఖర్జూరం, రుచికరమైనది మరియు శక్తివంతమైనది. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
ఖర్జూరం యొక్క కొన్ని ముఖ్యమైన విశిష్టతలు:
శక్తిని అందిస్తుంది:
ఖర్జూరంలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి, ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. 
జీర్ణక్రియకు సహాయపడుతుంది:
ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. 
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
ఖర్జూరంలో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 
ఎముకలను బలోపేతం చేస్తుంది:
ఖర్జూరంలో కాల్షియం, భాస్వరం మరియు మెగ్నీషియం ఉంటాయి, ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఖర్జూరంలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
రక్తహీనతను తగ్గిస్తుంది:
ఖర్జూరంలో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. 
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి:
ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. 
చర్మ ఆరోగ్యానికి మంచిది:
ఖర్జూరంలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 
ఖర్జూరం యొక్క ఈ లక్షణాల కారణంగా, ఇది ఒక ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా పరిగణించబడుతు

 ఖర్జూరం వల్ల కలిగే లాభాలు (Benefits of Dates in Telugu):
ఖర్జూరం (Dates) ఒక ఆరోగ్యకరమైన, శక్తివంతమైన, పోషకాహార ఫలంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
✅ ఖర్జూరం వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు:

1. శక్తి పెరుగుతుంది:

సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్) ఉన్న కారణంగా తక్షణ శక్తిని ఇస్తుంది.

ఉదయం ఖాళీ కడుపుతో తింటే శరీరానికి మంచి శక్తి వస్తుంది.
2. జీర్ణక్రియ మెరుగవుతుంది:

అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.

పేగుల శుభ్రతకు సహాయపడుతుంది.
3. గుండె ఆరోగ్యం:

పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు గుండెను బలంగా ఉంచుతాయి.

రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
4. ఎముకలకు బలం:

కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ K ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడటం) నివారణలో ఉపయోగపడుతుంది
5. రక్తహీనత తగ్గిస్తుంది:

ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత (అనిమియా) సమస్యకు ఉపయోగపడుతుంది.
6. ఇమ్యూనిటీ పెరుగుతుంది:

ఖర్జూరంలో విటమిన్ C, B6 మరియు యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
7. గర్భిణీ స్త్రీలకు మంచిది:

ప్రసవ సమయంలో శక్తిని ఇస్తుంది.

గర్భకాలంలో ఐరన్ అవసరాన్ని నింపుతుంది.
8. మేధా సామర్థ్యం మెరుగవుతుంది:

నాడీ సంబంధిత ఆరోగ్యానికి ఖర్జూరం సహాయపడుతుంది.

మెదడు ఫంక్షన్ మెరుగుపడుతుంది.
9. చర్మ ఆరోగ్యం:

విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచుతాయి.

స్త్రీలకు వక్షోజాల దృఢత్వం మరియు సౌందర్యం, :--

Breast size increase and for fitness, : Breast enlargement remedy : 


స్త్రీలకు వక్షోజాల దృఢత్వం మరియు సౌందర్యం, :-----‘

* స్త్రీలకు అత్యంత అందం స్థన సౌందర్యమే ఇతరుల చూపులు ఆకట్టుకునేలా స్త్రీలకి దేవుడు ఇచ్హిన వరం కాని ఈ సౌందర్యం లోపించినప్పుడు వారికి అత్యంత బాదకు గురిఅయ్యి, పదిమంది లో తిరుగుటకు చాల బాదపడుతుంటారు.
 ఈ క్రింది యొగం చెసుకొని మికు కావల్సిన పరిమాణం పొందగలరు, ఈ యొగం పాటించెటప్పుడు మీరు రిసల్ట్ నెల నెలా కొద్దిగా మీ స్తనాలు పెరగడం చుస్థారు. ఇలా మీకు నచ్హిన పరిమాణం వచ్చె వరకు వాడవచ్చు ఈ యొగం వల్ల ఎటు వంటి దుస్థ్పలితాలు లెవు మంచి పలితాలు మాత్రం వున్నయి.


గజపిప్పళ్లు : 100గ్రా
వజ : 100గ్రా
చెంగల్వ కొస్టు : 100గ్రా
అశ్వగంద : 100గ్రా 

 పై అన్ని మందులు మంచి నాన్యమైన మూలికలు తీసుకొని, బాగా దంచి, పలుచని వస్త్రంలొ జల్లించి ఒక పాత్రలొ వెసి ఈ మొత్తం మందుకు రెండింతలు గెదె వెన్న((( మాములుగా శాస్త్రం ప్రకారం సమానంగా వెయాలి కాని నా అనుభవంలో సమానంగా వేస్తే అది గట్టిగ ముద్దలా అవును అందుకె రెండింతలు వెసుకొవాలి))) తీసుకొని 
పై మిస్రమంలొ కలుపుకొని రోజు ఆడవారి వక్చొజాల పైన పూసుకొని పైన ఒక మెత్తని పాత బట్ట వెసి లెదా తమలపాకులు వెసి లొ దుస్థులు దరించాలి.


ఈ యొగం చేస్తూ లోనికి కింది యెగం తినాలి.

1 అస్వగంద 100గ్రా
2, నెలతాడి 100గ్రా
3, శతావరి 100గ్రా
4, తామరపప్పు 100గ్రా
5, సఫేద్ ముస్లి 100గ్రా

పై అన్ని మంచి నాన్యతవి తీసుకొచ్చి, బాగా దంచి అందులో పటిక బెల్లం వెసుకొని రోజు ఉదయం రాత్రి 1 స్పూన్ బొజనానికి ముందు తీసుకొవాలి. ఇలా చెయడం వల్ల లొపలినుంచి మికు కండరాల శక్థి వచ్హి మి యొక్క వక్షోజాల పరిమానం కచ్హితంగా పెరుగును.

Monday, July 21, 2025

విటమిన్ D



*దేశ వాలి ఆవు నెయ్యి లో ఉండే పోషక విలువలు మొదలగు అంశాలు...*
ఇంతకు ముందు చాలా అంశాలు తెలుసుకున్నాం.ఈరోజు ..

*విటమిన్ D*
సహజం గా ఉదయం పూట ఎండ నుండి శరీరం తీసుకుంటుంది.మన శరీరం లో కాల్షియం తయారీకి ఈ విటమిన్D చాలా అవసరం.ఇది తగిన మోతాదు లో లేనపుడు
ఎపుడు అలసటగా వుండటం,నడుము లో నొప్పి,కాళ్ళు,చేతులు బాగా లాగటం,ఎముకలు బలహీనం గా ఉండటం ఇలా కొని లక్షణాలు కనిపిస్తాయి.సాధారణం గా విటమిన్D లెవెల్ 30 ఉండాలి.20 కంటే తక్కువ ఉంటే సమస్యలు మొదలు అవుతాయి.ఒక సర్వేలో తేలిన విషయం ఏమిటంటే భారత్ లో ప్రతి సంవత్సరం చాలా వేగంగా ,ముఖ్యం గా స్కూల్ పిల్లలు ఐటీ ఉద్యోగులు లోఎక్కువ వస్తుంది.20% వరకు స్కూల్ పిల్లలో ఈ లోపం ఉంది అని సర్వే చెబుతుంది.

*విటమిన్ D లోపం రావటానికి గల కారణాలు..*
మారిన మన లైఫ్ స్టైల్. పట్టణాలలో పెరిగిన అపార్ట్ మెంట్స్, సరైన ఎండ ఇంట్లోకి రాకపోవడం,ఈ మధ్యల చాలా మంది ఎక్సర్సైజ్ లు కొరకు జిమ్ కి వెళ్తున్నారు. అక్కడ ఉదయం పూట ఎండ తగలదు.ఇంకా ఇపుడు ఏసీ జిమ్ లు కూడా వచాయి. ఎక్కడికి వెళ్ళినా ఏసీ కారులోనే ప్రయాణం. ఆఫీసు లో కూడా ఏసీ నే ఇంకా అందరి కి అర్థం అయి ఉంటుంది.కారణాలు.

*పరిష్కారం..*
రోజు కాసేపు ఉదయం పూట ఎండలో నిలబడటం..సముద్రపు చేప అయిన సల్మాన్ చేపలో కూడా విటమిన్ డి లభిస్తుంది.ఈ చేప ఆయిల్ కూడా లభిస్తుంది.దీని తో టాబ్లెట్ లు కూడా చేస్తున్నారు.మరి మేము వెజిటేరియన్ అంటారా పుట్ట గొడుగులు లో కూడా కొంత శాతం ఉంటుంది. మన దేశీ ఆవు నెయ్యి లో కూడా పుష్కలంగా ఉంటుంది. 
ఆవు మోపురం లో సూర్య కేతి నాడి ఉంటుంది అది సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీ గ్రహించి పాల ద్వారా మనకు ఇస్తుంది.అందుకే పాలు బంగారు వర్ణంలో ఉంటాయి.

మానవ శరీరం లో ఎలాంటి సమస్య వచ్చిన శరీరానికి కావలసిన పోషకాలు ఇస్తే శరీరం తనకు తానే రిపేరు చేసుకొనే గుణం ఉంది. జీవితాంతం ఉదాహరణ కు బీపీ,షుగర్,మోకళ్ల నొప్పులు,థైరాయిడ్,ఇలా చాలా రకాలు ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి వచి హాస్పిటల్ కి వెళ్తే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే.... కారణం ఒక సారి ఆలోచించండి..
వైద్యం చేస్తే రోగాలు తగ్గాలి కానీ......
. ఇది మీ ఆలోచనకే వదిలేస్తునను...

నాకు ఒక మిత్రుడు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది.
*ఆసలు వ్యాధులు ఎలా మొదలు అవుతాయి*.అని అడిగినపుడు చెప్పిన విషయం. మీకు అర్థం అయ్యేలా సింపుల్గా నలుగు మాటలో చెబుతాను.

మన శరీరం లో రక్తనాళాలు ఉంటాయి.దీని వద్ద కొని పొరలు ఉంటాయి.వీటిని *ఎండో తీలియమ్ (endothelium)* అంటారు.ఇది ఎపుడైతే పాడవుతుందో ఇక మనకు సినిమా మొదలు అవుతుంది. ఈ పొరలు దెబ్బతిని గట్టి పడినపుడు రక్తం లో వేడి పెరిగి రక్త ప్రసరణ పై ప్రభావం చూపుతుంది దీనినే మనం *బ్లడ్ ప్రెజర్ (బీపీ)* అని పిలుస్తాము. ఉదాహరణ కు మన పొలం లో పెద్ద మోటార్ పేటి చిన పైపులు వేస్తే ఏమవుతుంది. ప్రేజర్ పెరిగి పైపులు పగిలిపోతాయి.అలాగే మన రక్త నాళాలు కూడా.

ఇంకా రెండవ విషయం *endothelium* డ్యామేజి అయినపుడు ఇన్సులిన్ సరిగా ఉత్పతి అవదు.ఒక వేళ అయిన శరీరం సరిగా తీసుకోదు.దీని వలన *డయాబెటిస్* వస్తుంది. అందుకే షుగర్,బీపీ లు అక్క చెల్లెలు లాంటివి.ఒకరు వస్తె ఇంకొకరు రావాల్సిందే..
ఇంకా మన పెద్ద అన్నయ గురించి తెలుసుకుందాం..

*Endothelium* గట్టి పడినపుడు శరీరం లో ఉన్న కొవ్వు పదార్థాలను తీసుకొని హార్డినరీ నాళాలను బ్లాక్ (మూసివేయడం) చేయడం వలన గుండెపోటు కారణం అవుతుంది.
ఇపుడు అందరికి కొంచం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను.. 
వీటి అన్నిటికి కారణం మన ఆహారం లో మార్పు రావటం.
ఇకపై ఫాస్ట్ ఫుడ్,జంక్ ఫుడ్,ప్యాక్డ్ ఫుడ్,కూల్ డ్రింక్స్ వదిలేసి చక్కగా ఇంట్లో వండిన ఆహారం లో కమ్మగా రెండు నేతి చుక్కలు వేసుకొని తింటే సరి.

ఒక మిత్రుడు వాట్స్ అప్ లో ఒక మెసేజ్ పెట్టారు.
ఆవులకు ఏదైనా హెల్త్ సమస్య వచ్చినపుడు ఆవులకు,గేదెలకు,కోళ్లకు రాక రకాల ఇంజెక్షన్స్ , మందులు ఇస్తారు కదా, అలాంటపుడు ఆ పాలు ఎన్ని రోజులు మనం వాడకూడదు అని. నాకు ఈ విషయం పై అంత అనుభవము లేదు. తెలిసిన మంచి అనుభవము కలిగిన మిత్రులు డాక్టర్ సాయి గారిని ఆడిగినపుడు వారు తెలిపిన కొని విషయాలు క్రింద పోటో ను పేటను చూడండి.పశు వైద్యం లో సాయి గారు ఎంతో అపారమైన అనుభవజ్ఞులు..వారి అనుభవాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.

మిగతా విషయాలు రేపు.
రేపటి అంశం లో *ఆవు నెయ్యి లో వున ఇంకొనీ పోషకాల గురించి,సంప్రదాయ పద్ధతిలో ఆవు నెయ్యి తయారీ విధానం.నెయ్యి తయారీలో వాడే పాత్రలు,నెయ్యి కాసే విధానం* మొదలగు అంశాలు..

            

Thursday, July 17, 2025

ప్రోస్టేటు గ్రంథి వాపు గురించి వివరణ -

ప్రోస్టేటు గ్రంథి వాపు గురించి వివరణ  - 
      
మూత్రకోశ ద్వారమున ఒక చిన్న గ్రంథి ఉన్నది. దీనిని ప్రొస్టేటు గ్రంథి అంటారు. దీనికి కామగ్రంధి అని మరొక పేరు కూడా కలదు. దీని ముఖ్యమైన పని ఏమిటంటే సంభోగ ప్రారంభములో ఇది ఒక పలచటి ద్రవాన్ని , చివరి దశలో చిక్కటి పాల వంటి ద్రవాన్ని ప్రసరింపచేస్తుంది . దీని వలన సంభోగం చివరి దశలో వీర్యము పురుషావయవము గుండా స్త్రీ యోనిలోకి ప్రవేశించగలదు. కాని కొన్ని కారణాల వలన ఈ గ్రంథి వాచి వ్యాధిని కలిగిస్తుంది . ఈ వ్యాధి 45 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువుగా వస్తుంది. 
 
*  లక్షణాలు  - 
      
.      ప్రొస్టేటు గ్రంథి వాచుట వలన మూత్రనాళము యొక్క ద్వారము నొక్కబడును . తత్ఫలితముగా మూత్రవిసర్జన సమయాన మంట , నొప్పి కలుగును. పదేపదే మూత్రవిసర్జన చేయరావలసివచ్చును . మూత్రం ధారాళముగా వెలువడదు. నెమ్మదిగా వెలువడును. ఇంతేకాక పొత్తికడుపు , నడుము , గజ్జల యందు కొద్దిగా నొప్పి ఉంటుంది. 
  
ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు  - 
 
*  అధిక నూనె , నెయ్యితో చేసిన ఆహారపదార్థాలు సేవించటం . 

 *  ఒక గ్రాము వీర్యములో 7 mg జింక్  ఉంటుందని కనుగొనబడినది. కావున ఆహారంలో జింక్ లోపము వలన గాని అధికసంభోగము వలన గాని జింక్ నష్టం అగుట వలన ప్రోస్టేట్ గ్రంథి వ్యాధికి గురగును.

  నివారణా మార్గాలు  - 
       
     ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం శరీరం నందలి జింక్ పరిణామము పైన ఆధారపడి ఉండును. జింక్ ఎక్కువ కలిగిన ఆహారపదార్థాలు అయిన wheat germ brewers yeast , pumpkin seeds ప్రతిరోజూ వాడాలి . లేదా విటమిన్లు , ఖనిజలవణాలు మరియు జింక్ అధికంగా కలిగిన ఔషధాలు సేవించవలెను . 
             
 ఆరోగ్యరీత్యా సంభోగం విషయములో మితముగా ఉండటం మంచిది . ఆయుర్వేదం ప్రకారం "సంగమం దినత్రయంచ " అనే సూత్ర ప్రకారం మూడురోజులకు ఒకసారి భార్యాభర్తలు  కలియుట మంచిది . 
     
.         ప్రొస్టేట్ గ్రంధిని ఆరోగ్యముగా ఉండుటకు , సక్రమముగా పనిచేయుటకు సూర్యనమస్కారములు , ఆసనాలు వేయుట చాలా అవసరము . ఈ ఆసనాలు గ్రంథిని ఉత్తేజిత పరిచి దాని ఆరోగ్యం పెంచును .  


Wednesday, July 16, 2025

అనారోగ్య సమస్యలకు నెయ్యి వాడే విధానం*..



*దేశ వాలి ఆవు నెయ్యి..*
*నెయ్యి లో ఉండే పోషకాలు,ఉపయోగాలు.*
*అనారోగ్య సమస్యలకు నెయ్యి వాడే విధానం*..

ఇంతకు ముందు భాగంలో నెయ్యి మనకు ఎలా దూరమైంది,దానికి గల కారణాలు,నెయ్యి విశిష్టత నీ తెలిపే కొన్ని గ్రంథాల పేర్లు,నెయ్యి లో రకాలు,నెయ్యి లో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ పేర్లు తెలుసుకునం.
ఇంకా ఈ రోజు అంశం లో కి వెళ్దాం..

*యావత్ జీవేత్ సుఖం జీవేత్,* 
*రుణం కృత్వా ఘృతo బిబెత్*
ఆయుర్వేదం లో చెప్పిన ఒక మంచి మాట. జీవితం మొత్తం సుఖంగా ఉండాలి అంటే,అప్పు చేసి అయిన kiఆవు నెయ్యి తినాలి.
ఇలా ఎందుకు చేపారో అని చివర్లో అర్థం అవుతుంది.

*ఆవు నెయ్యి పసుపు రంగులో ఉండటానికి కారణం బీటాకేరోటిన్.*
నెయ్యి లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలుపుష్కలంగాఉన్నాయి

మీకో చిన్న చిట్కా చెబుతాను..మీకు ఎప్పుడైనా దెబ్బలు (గాయాలు) తగిలితే వెంటనే కొంచం ఆవు నెయ్యి లో తేనె కలిపి రాయండి. శరీరం పై కాలినమచ్చలు,గాయాల వలన ఏర్పడిన మచ్చలు కూడా తోలిగిపోతాయి. కొని పరిశోధనలో తేలిన విషయం. ఇంత అద్భుతం గా పని చేయటానికి పైన చెప్పిన యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం ప్రధాన కారణం.ఇంకా అసలు విషయం కి వెళ్దాం. నెయ్యి లో ఉండే పోషకాలు ఏమిటి?

ఒకపుడు పెద్దలు,పురాణాలు,గ్రంథాలు చెప్పిన మాటలు వినేవారు, జనరేషన్ మరి టెక్నాలజీ మారిన ఈ యుగంలో లో వున నేటి తరానికి NO పెద్దలూ,పురాణాలు.పెద్దల మాటలు ఈ కాలం లో చద్ది అన్నం ముటలే. ఈ బిర్యానీ యుగం లో చద్ది అన్నం కి విలువ ఎక్కడిది.చద్ది అన్నం లా చలువ చేసేది మన ఆయుర్వేదం ,చెప్పే మాటలు నమ్మే కాలం పోయింది.
ఇపుడున టెక్నాలజీ తో ఎన్నో విషయాలు తెలుసుకో గలుగుతునం. మన పరంపర శాస్త్ర విజ్ఞాననీ ఈ టెక్నాలజీ లతో శోధించి ఆసలు నిజాలు బయటకి తీయ గలిగితే మన దేశ ఆభివృద్ధి ని ఆపేది ఏదీ లేదు. మారుతున్న కాలానికి ఆధ్యాత్మికత తో కాకుండా సైన్స్ తో కలిపి చెబితేనే అర్థం అవుతుంది.
ఈ టెస్టింగ్స్ అన్ని కూడా చాలా ఖర్చు తో కుడుకునవి. మన వద్ద ఉన్న వస్తువు ఎంత నాణ్యమైనదో తెలియాలి అంటే టెస్ట్ చేయక తప్పదు.
 మేము చేయించిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన అంశాలు పోషక విలువలు క్రింద ఇవ్వడం జరిగింది. 

100 గ్రాముల నెయ్యి లో*     

         *Lab Report*
Omega 3Fatty Acid 0.25
Omega 6Fatty Acid 2.30
omega 9Fatty Acid 17.48
Vitamin E 0.044.
Vitamin D <10.0.
vita min k <50.
vitamin A 1.03.
(Energy 897.84. RDA%44.89)
Carbohydrates <1.0.
Protein <0.5.
Cholesterol. 162-47.
(Saturated fat. 76.663.
RDA-22. RDA%-348.47).
Sodium <0.5
 RDA- 2000.
Trans fat <0.10 
RDA 2.
PUFA 2.602.
MUFA 21.675.
Unsaturated fat 23.097.

పైన తెలిపిన పోషకాలు అన్ని ఆవు లలో ఒకే రకం గా ఉండవు. జాతి,ఆది తినే గడ్డి,మనం ఇచే పోషకాలు,ఆది తిరిగే వాతావరణం, ప్రాంతం ఇలా చాలా అంశాలపై ఆధార పడి వుంటుంది. నేను గమనించిన దాంట్లో గుజరాత్ కి చెందిన గిర్ ఆవుల పాలలో, నెయ్యి లో పోషకాల శాతం ఎక్కువ.

ఇపుడు పైన ఉన్న పోషకాలు మనకు ఎలా ఉపయోగ పడతావో చూదాం.. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను..ఈ విషయం లో ఎంతో అనుభవం ఉన్న వారు కుడా మన గ్రూప్స్ లో వున్నారు..మీ అనుభవాలు పంచుకోగలరు..

*Omega 3 fatty acid* వ్యాధి నిరోధకతను పెంచుతుంది. 
(ఇమ్మ్యూనిటి బాగా ఆభివృద్ధి చేస్తుంది.)
ఎసిడిటీ,గ్యాస్టిక్ లను తగిస్తుంది.
గుండె కు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
నెయ్యి లో వుండే *బ్యూటరేట్* అనే రసాయనం వలన శరీరం లో వుండే వాపును తగిస్తుంది.మా అమ్మ గారికి మోకాళ్ళ నొప్పులు,మరియు కాళ్ళు విపరీతం గా వాయటం జరుగుతుండేది.వాడినా 15 రోజులకి కాలు వాపు తాగింది. నొప్పులు కూడా ఇంతకు ముందు అంత లేవు.ఈ బ్యూటరేట్ గుండె సంబంధిత సమస్యలను తగిస్తుంది.

*కంజి గ్రేటెడ్ లినోలిక్ ఆసిడ్* ఉండటం వలన శరీరం లో ఉన్న చేడు కొలెస్ట్రాల్ ను తగిస్తుంది.శరీర బరువు(ఉబకాయం) తగ్గుతుంది.గత మూడు నెలల్లో నేను 2.5కేజీ ల బరువు తగ్గటం జరిగింది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి గేదె నెయ్యి బరువును పెంచుతుంది. ఆవు నెయ్యి కేవలం శరీరం లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మాత్రమే తీసివేస్తుంది. లావు ఎక్కడం అనేది కొలెస్ట్రాల్ వలన జరిగే ఒక ప్రక్రియ. 

ఈమధ్యనే ఒక సర్వే తేలిన విషయం ఏమిటంటే భారతదేశం లో సుమారు 40 కోట్లమంది ఊబకాయం(obecity) తో బాధపడుతున్నారని తేలింది. సాగం రోగాలకు ఇదే కారణం.దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇదో పెద్ద సబ్జెక్ట్.

డయాబెటిస్ ను కలిగించే ట్రైగ్లిజరైడ్స్ ను అదుపులో ఉంచుతుంది. ఈ షుగర్ వ్యాధి గురుంచి ఇంకో సందర్భం లో వివరంగా తెలుసుకుందాం.ఒక మిత్రుని సహకారం తో కొని ప్రయోగాల తరువాత ఒక మెడికేటెడ్ గృతం చేయడం జరిగింది.చాలా మందికి ఇవ్వటం జరిగింది.results చాలా బాగునవి.ఇంకా మెరుగైన ఫలితాలకు ప్రయత్న చేస్తున్నాం.

*విటమిన్ K* చర్మం మృదువుగా ఉంటుంది. ముడతలు పడకుండా,యవ్వనం గా ఉండటానికి ఉపయోగపడుతుంది. గాయాలు తొందరగా మానటానికి ఉపయోగ పడుతుంది.

*Vitamin A*
పాల లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ A మారుతుంది.రోగ నిరోధక శక్తి పెంచుతుంది.శరీరం లో ఉండే చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గిస్తుంది.కీళ్ల సమస్యలు తగ్గిస్తుంది.ముఖ్యం గా మెదడు చురుకుగా ఉండటానికి ఇది ఎంతో కీలకమైంది.నెయ్యి లో బీటకేరోటిన్ తో పాటు *లూటిన్* అనే పోషకం ఉంటుంది.సాధారణం గా ఈ లూటిన్ పాలకూర,క్యారెట్ 
లలో ఉంటుంది.అందుకే కంటికి మంచిది అని చెప్తారు.
మెదడు లో కణాల ఆభివృద్ధికి 
జ్ఞాపక శక్తికి,ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి నెయ్యి అనేది పిల్లల కి ముఖ్య ఆహారం గా ఉండాలి.

నెయ్యి లో వుండే shart chain fatty acids, omega 3 fatty acids, DHA, EPA, వలన మెదడు చురుకుగా ఉండటానికి పని చేస్తుంది.
అందుకే *ఆయుర్వేదం లో నెయ్యి ని* 
*మేధ్యా రసాయనం అంటారు*.
అంటే మేధస్సు ని పెంచేది అని అర్థం.
సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాళ్లకి ఇది అత్యంత అవసరమైన ఆహారం.
ఒక చిన్న సూచన ఇంత గొప్ప ఔషధం లాంటి నెయ్యి లో ఎంతో కల్తీ జరుగుతుంది.కల్తీ తో పాటు అచ్చం ఆవు నెయ్యి రంగు,వాసన లా ఉండటం కొరకు కొన్ని రకాల కెమికల్స్ కూడా కలుపుతున్నారు.on line prouduts తో జాగ్రత్త.మీకు అందుబాటులో ఉండే గోశాల కు వెళ్ళి చూసి ,ఇంకా వీలు ఐతే అక్కడే కూర్చుని నెయ్యి కాయించి తీసుకోండి.లేదా నమ్మక మైన వారి వద్ద తీసుకోండి.
 

              

Monday, July 14, 2025

నెయ్యి లో ఉండే పోషకాలు*



*4 వ భాగం*

ఈ రోజు అంశం 
*దేశీ వాలి ఆవు నెయ్యి..*
*నెయ్యి లో ఉండే పోషకాలు*
*వాటి ఉపయోగాలు*
*నెయ్యి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది*
*ప్రతి రోజు ఎంత మోతాదు లో వాడాలి*
*వివిధ ఆనరోగ్య సమస్యలకు నెయ్యి వాడే విధానం*
*నెయ్యి ఎన్ని రకాలు..*
*ఆయుర్వేదం లో నెయ్యి విశిష్టత*

మృత్యువుని దరిచేరనివ్వని దానిని *అమృతం* అంటారు.మరి ఈ భూలోకం లో మానవులకు ఇచ్చిన అమృతమే ఆవు నెయ్యి.అందుకే ఆవుని గోమాత అని పిలిచేది పూజించేది.ఈపాటికే మీ మనసులో అనిపించవచ్చు వీడికి కూడా గోభక్తి పిచ్చి పీక్స్ వెళ్ళి ఆవు అమృతం ఆవకాయ ఏదేదో చెబుతున్నాడు అన్ని. కొద్దిగా ఓపికతో అంత చదివితే మీకే అర్థం అవుతుంది. ఇంత కాలం మనం ఎలాంటి ఆహారానికి దూరం గా ఉన్నామో, ఇంత విలువైన దాని మనం ఎందుకు గుర్తించ లేదు అని.
నా కూడా ఒక సంవత్సరం క్రితం వరకు పైన చెప్పిన భావననే ఉండేది.ఈ మధ్య కాలంలో జరుగుతున గో సంరక్షణ వాటిపై జరుగుతున అరాచకాలు, వాటిని కాపాడటానికి మహానుభావులు చేస్తున ప్రయత్నాలు కూడా నా ఆలోచనలో మార్పు కి ఒక కారణం. ఆసలు ఆవు పాలు,నెయ్యి ఇతర పదార్థాల లో ఏమి అంశాలు ఉనవి అనే దానితో నా ప్రయాణం మొదలు అయింది.అందరూ చెప్పేవి కాకుండా ఇపుడు వున సైన్స్ ఏమి చెబుతుంది అని చాలా స్టడీ చేశాను.ఇంకా చేస్తూనే ఉన్నను.చాలా విషయాలు అర్థం అయినవి.ఇంకోచం లోపలికి వెళ్తే ఆయుర్వేదం లో ఆవు నెయ్యి గురించి ఏమి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.
 జీవితం లో మనకు అనుకోకుండా చేసిన కొన్ని పనులు మనకు అపుడపుడు చాలా ఉపయోగ పడతాయి.కరోనా సమయంలో కాళిగా వున్నపుడు కొంతమంది మిత్రులతో మాట్లాడుతునపుడు వృక్ష ఆయుర్వేదం గురించి చర్చ వచి దానిపై ఒక సంవత్సరం పై స్టడీ చేసి ఎన్నో ప్రయోగాలు చేసిన అనుభవం ఇపుడు ఉపయోగ పడింది. కరోనా సమయం అందరికి తెలిసిందే కదా ఒక రీసెర్చ్ మరియు ప్రయోగాలు చేయాలి అంటే డబ్బు తో కూడిన విషయాలు. ఇంట్లో వాలు ఇప్పుడు ఇది అవసరమా మీకు ....అని
ఇది చెబుతుంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది నాకు. 20 సంవత్సరాలక్రితం నేను రాక రకాల పనులు చేసేవాడిని, ఏది నచ్చేది కాదు అలా జీవితం లో ఓ 40ఫీల్డ్స్ మారి ఉంటాను. ఆపుడు మా అమ్మ నాన్న లు,బంధువులు చాలా తిట్లు తిట్టే వారు.నాకు చాలా కోపం వచ్చేది.ఏదో ఒక పని పై ద్యాస పెట్టాడు, రోజుకో కొత్త పని చేస్తాడు, ఇలా చేస్తే జీవితం లో బాగు పడవు అని.
నాకు చిన్నతనం నుంచి ఒక అలవాటు ఉంది.నచ్చని పన్ని నీ చేయడం అన్న ఒక వయసు వచ్చిన తర్వాత ఒకరి కింద పని చేయడం అంటే నచ్చేది కాదు.అపుడు *మా అమ్మమ్మ ఒక విషయం చెప్పింది. జీవితం లో నీకు నచ్చింది చెయ్యి*,*ఎవరు ఏమి అన్న పటించుకొకు*, *నీవు చేసిన ప్రతి పని నీ జీవితం లో ఎక్కడో ఒక దగ్గర కచ్చితం గా ఉపయోగ పడుతుంది* అన్ని. ఇది అంత ఎందుకు చెబుతాను అంటే ఏదో చేయాలి అనుకుంటాం అందరికి చెబుతాం ఎవరో ఏదో ఒకటి అంటారు ఇంకా ఆ పని అంతే. మీ విషయం లో మీ పిల్లల విషయం లో నచ్చింది చేయండి చేయనివండి.పోయేది ఏమి లేదు. వచ్చే ఓ గొప్ప అనుభవం ముందు.*అనుభవంతో కూడిన విద్యా, విజ్ఞానం ఏపటికైన నిన్ను రాజుగానే నీలా బెడుతుంది* అని నా అభిప్రాయం.. ఏంటి రా బాబు ఈ సోది అనుకోవద్దు ఇది నేను నేర్చుకున పాఠం. ఎ ఒకరికైనా ఉపయోగ పడవచ్చని అనుకుంటున్నాను.
ఇక అసలు విషయం కి వద్దము..

*ఆసలు అమృతం లాంటి నెయ్యి నీ విషం గా ఎవరు మార్చారు,అందుకు గల కారణాలు...*
భారతదేశ సంస్కృతిలో ఆవు నెయ్యికి చాలా ప్రాధాన్యం ఉంది. ఏ పవిత్ర కార్యమైన పూజకైనా నెయ్యి ఉండాల్సిందే ముఖ్యంగా యజ్ఞ యాగాదుల్లో ఈ నెయ్యి లేనిదే ఏది జరగదు. భోజనంలో నెయ్య లేకుండా భోజనం చేయకూడదని పెద్దలు చెప్పేవారు. భారతీయ జీవన విధానాన్ని శాసించిన ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. నెయ్యికి జీవని గుణం ఉంటుందని ఆరోగ్యం మేరుగుపడుతుందని, పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయని, శారీరక బలం పెరుగుతుందని, ఆయుర్వేదం నెయ్యి గురించి చెప్పడం వలన శతాబ్దాలుగా భారతీయులు నెయ్యిని వెన్నని తమ ఆహారంలో ఒక భాగంగా వాడుతూ వచ్చారు.
  1970 తర్వాత యురోపియన్ దేశాలలో గుండె జబ్బుల పై పరిశోధనలు జరిగి దానికి గల కారణాలు తెలియజేశారు. వారి దేశాల్లో లభించే చీజ్, మరియు జంతువుల కోవ్వుల నుండి తీసే పదార్థాలను తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఎందుకంటే ఆ దేశాలలో ఇవే ముఖ్యమైన ఆహారం . వారికి నెయ్యి గురించి గానీ తయారు చేసే విధానం గాని తినే అలవాటు గాని ఏమీ లేదు.మన డాక్టర్స్, శాస్త్రవేత్తలు వాటిని ప్రామాణికం గా తీసుకొని నెయ్యి వలన శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు వస్తాయని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏ శాస్త్రీయ ప్రమాణం లేకుండా ఏ రీసెర్చ్ లేకుండా తొందరపడి చేసిన ఒక తప్పు అని నా భావన.అది ఇప్పటికీ మారలేదు, గానుగ నుండి వచ్చే నూనెలు వాడకం కూడా ఈ ప్రచారం వలనే తగ్గిపోయి రిఫైన్డ్ ఆయిల్ వాడకం పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో వీటి పై పరిశోధనలవల ప్రాధాన్యత తెలిసి తిరిగి వాడటం మొదలుపెట్టారు.
మన సాంప్రదాయ పద్ధతుల్లో చేసిన నెయ్యి వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆయుర్వేదంలో నెయ్యి తయారీ వాడే విధానం గురించి చాలా వివరంగా చెప్పారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు.....

*ఆయుర్వేదంలో నెయ్యి విశిష్టతను తెలియజేసే కొన్ని గ్రంథాలు* 
సుశ్రుత సంహిత.
భావప్రక్ష. 
చరక సంహిత. 
క్షేమకుతూహలం. 
 రజనీ ఘాoటూ.
హరిత సంహిత. 
భోజన కుటుహలం. 
అష్టాంగ హృదయం.

*ఆయుర్వేదంలో తెలపబడిన కొన్ని ఘృత లు*
ఘృతం అంటే నెయ్యి అని అర్థం.
 *1.కళ్యాణకఘృతం.*
*2.సరస్వతీఘృతం.*
*3.కుష్ముండఘృతం.*
*4.బ్రహ్మీఘృతం.*
*5.సుకుమారఘృతం.*
*6.ఆశ్వగంధఘృతం.*
*7.మహతిక్తాఘృతం.*
*8.పంచనింభదిఘృతం.*
ఇలా చాలా రకాలు ఉన్నాయి. పైనవి అన్ని ఆయుర్వేదం లో వన మూలికలతో నెయ్యి నీ కలిపి చేసిన ఔషధాలు. 
సింపుల్ గా చెప్పాలి అంటే మెడికేటెడ్ (గీస్) నెయ్యి.


*నెయ్యిలో ఉండే కొని మంచి* *ఫ్యాటీ యాసిడ్స్*

బ్యూట్రిక్ ఆమ్లం,కాప్రోయిక్ ఆమ్లం,కాప్రిక్,లారిక్,మిరిస్టిక్,
పెంటా డికనోయిన్,పాలింటిక్, హెప్టాడికనోయిన్,స్టిమిరిక్,
మీరీ స్టోలిక్, పాల్మీ టోలిక్, ఒలిక్,లీనో లేయిక్,లీనో లెనిన్, CLA ఇలా ఎన్నో మంచి చేసే ఆమ్లాలు ఆవు నెయ్యి లో కలవు. పైన తెలిపిన ఈ ఆసిడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఏది ఎలా పనిస్తుంది అనేది ముందు ముందు తెలుసుకుందాం...

మిగతా విషయాలు అని రేపు తెలుసుకుందాం..చాలా ముఖ్యమైన అంశాలు..*ఆసలు నెయ్యి లో ఉండే పోషకాలు, మేము చేక్ చేసిన ల్యాబ్ రిపోర్ట్స్ ఏమి వచాయి*.ఇంకా ఎన్నో ఆసక్తి కర విషయాలు...

      

ఏసిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ?

ఏసిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ?
.
1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి.
.
2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.
.
3. ఊదలు (Barnyard Millet): లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.
.
4. సామలు (Little Millet): అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.
.
5. అండు కొర్రలు (Browntop Millet): జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు,
.ఊబకాయ నివారణ.
.
.

ఏ ఆహార పదార్థ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్ల నిష్పత్తిని బట్టి నిర్ణయింపబడుతుంది. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉండే రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క ఈ సిరిధాన్యాలలో ఈ నిష్పత్తి 5.5 నుంచి 8.8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 385 ఉంటుంది. ముడి బియ్యం, గోధుమలలో కూడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా లేదు.
.

.
సిరిధాన్యాల వాడుటకు ముఖ్య సూచనలు:
.

.
ఒక్క అండు కొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి.
మిగతా సీరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.
.
సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.
.
ఈ సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు.
.
దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలుగదు.
.
ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడాలి.
.
అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలు పెట్టాలి.
.

.
వీటితోపాటు కషాయాలు కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యనుబట్టి ఈ సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చును. ఉదాహరణకు, ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పైన వివరించిన పట్టికలో సూచించిన విధంగా వారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకుని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి.
.
ఉదాహరణకు, సుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఆ సమస్యతో పాటు ప్రాస్యేటు సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్కరోజు తినాలి.
.
వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు, పంచదార, కాఫీ, టీ, అయొడైజ్డ్ సాల్ట్, మాంసాహారం, రిఫైన్ ఆయిల్స్ తప్పనిసరిగా మానివేసి, దీనిని ఒక జీవన విధానంగా చేసుకోవాలి.
.
పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చును. సముద్రపు ఉప్పు గానుగ నూనె వాడుకోవాలి..
.
వీటితో పాటు కొన్ని రకాల ఆకు కషాయాలు తీసుకుంటే ఇంకా మంచిది.
.
మహిళల సమస్యలకు గోంగూర ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది.
.
రోగ నిరోధకశక్తి పెంపొందించకోవడానికి గరికే కషాయం పనిచేస్తుంది. కొత్తిమీర, పుదీనా, నిమ్మగడ్డి ఆకుల కషాయాలు ఎవరైనా వాడవచ్చును.
.
ఏ కషాయమైనా ఒకవారం మాత్రమే వాడాలి. ఒకదాని తరువాత ఒకటి వాడుకోవాలి. సుగర్ ఉన్న వారికి దొండ ఆకుల కషాయం, దాల్చిన చెక్క కషాయం మంచివి. ఇవి పరగడుపున తీసుకోవాలి.
.
కషాయం తయారు చేసే విధానం:
.
రాగి పాత్రలో ఉంచిన 150-200 మి.లి. నీరు తీసుకుని, (రాగి పాత్రలలో వేడివంట చెయ్యకూడదు) వేరే గిన్నెలో నీరు మరిగించి, దానిలో మనకు అవసరమైన 5-6 ఆకులు వేసి నాలుగు నిమిషాలపాటు ఉంచి, స్టవ్ కట్టేసిన తరువాత 2 నిమిషాలు మూతపెట్టి, ఆ తరువాత వడగట్టి, ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చెయ్యాలి. ఉదయం పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలి.
.
రక్తహీనతకు 3 రోజులు అరికెలు. 3 రోజులు సామలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3 రోజులు ఒక్కొక్క సిరిధాన్యాం 3 పూటలు తినాలి.
.
దీనితోపాటు పరగడుపున క్యారెట్, ఉసిరి, జామ లేదా బీట్రూట్, రసం తీసుకోవాలి, సాయంత్రం 20 కరివేప ఆకులు, 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి, 15-20 నిమిషాల తరువాత, భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారింపబడుతుంది.
.
ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చును. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చును. పైగా అత్యంత రుచికరంగా కూడా ఉంటాయి. ఈ సిరిధాన్యాలకు 5-6 రెట్లు నీళ్లుపోసి, 4-5 గంటలు నానబెట్టి, ఆ తరువాత గంజిలాగ వండుకుని రోజులో ఎప్పుడైనా, ఏ వయసు వారైనా తీసుకోవచ్చు.
.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు, ఒక రోజు ఊదలు, ఒక రోజు కొర్రలు, ఒకరోజు అండు కొర్రలు వండుకుని మూడుపూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సామలు, తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం ఒక వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుటే 20 వారాలలో అన్నిరకాల మందులు మానివేయవచ్చును.

Saturday, July 12, 2025

మంచి మాటలు

😊🙏💧🌬️ మహోదయము,

👨‍👩‍👧‍👦 మనమందరమును తప్పక తెలుసుకొనవలసిన మరియు ఆచరించవలసిన విషయమును గురించి ఈరోజున తెలుసుకుందాము. 

💐 AC లేదా ఫ్యాన్లను వాడితే శారీరకముగాను, మానసికముగాను, భావోద్వేగపరంగాను, ఆర్థికముగాను మరియు ఆధ్యాత్మికముగాను మనకు కలిగే నష్టాలు: 
❌ 
🧍‍♂️ 1. శారీరక నష్టాలు:
పొడి గాలి వలన చర్మము పొడిబారడము, ముక్కు మరియు గొంతు పొడిభారడము, గొంతులో మంట, శ్వాస సమస్యలు, దద్దుర్లు, అలర్జీలు, దగ్గు, శరీరము లోపల తేమ శాతము తగ్గిపోవడము వలన నిద్ర లేమి.

📌 పిల్లలు, వృద్ధులు, అస్తమా బాధితులకి ఇది ఎంతో హానికరము.

🧠 2. మానసిక నష్టాలు:
మెదడులో తేమ తగ్గడము వలన ఏకాగ్రతలో లోపము, ఆలోచనల్లో అస్పష్టత, మానసిక అలసట, అధిక ఉష్ణోగ్రతల వల్ల మానసిక అలజడి, 
అసహనము, చిన్న చిన్న విషయాలకే కోపము రావడము, శ్వాసలో తగ్గిన ఆక్సిజన్ స్థాయిల వలన స్పష్టమైన ఆలోచనల లోపము.

📌 పొడి గాలి = “నిశ్శబ్దముగా మానసిక ఒత్తిడి” కి కారణము.

💓 3. భావోద్వేగ నష్టాలు:
పొడి వాతావరణము, మనలో మానసిక గట్టితనమును మరియు ఉదాసీనతను పెంచుతుంది. శరీరములో తగినంతగా తేమ లేకపోతే- ప్రేమ, నమ్మకము, ఆప్యాయతలు లోపిస్థాయి. మానసిక ఆస్తిరత మరియు ఒంటరితనము పేరుగుతాయి.

📌 నీరు = జల తత్త్వము, ఇది భావోద్వేగ నిబద్దతకు లేదా స్థిరత్వానికి మూలాధారము.

💰 4. ఆర్థిక నష్టాలు:
గాలిలో తగినంతగా తేమ లేకపోవడము వల్ల చెక్క ఫర్నిచర్, సంగీత పరికరాల పగుళ్లు లేదా పాడవడము జరుగుతుంది. చర్మము, గొంతు, శ్వాస సమస్యల చికిత్సల కొరకు హ్యూమిడిఫైయర్లు కొనాల్సిరావడము మరియు అనవసరమైన ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. 

📌 చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద ఖర్చులను తప్పించుకోనవచ్చును.

🕉️ 5. ఆధ్యాత్మిక నష్టాలు:
శరీరములో తగినంతగా నీరు యొక్క శక్తి ప్రవాహము లోపించడము వలన వాత దోషములు పెరుగుతాయి. వాతము పెరగడము వలన మానసిక అస్థిరత మరియు లోతైన ధ్యాన స్థితి కరువవుతుంది. దైవ ఆరాధనా సమయములో నీటి యొక్క శక్తి తగినంతగా లేకపోవడము వలన ఆధ్యాత్మిక శక్తి ప్రవాహము తగ్గుతుంది. తమోగుణము పెరుగుతుంది.

📌 తగినంతగా నీరు లేకపోవడము = ఆధ్యాత్మిక వృద్ధిలో నెమ్మది

✅ ముగింపు సందేశము:
"నీరు కేవలము శరీరానికి కాదు – మనసుకు, భావాలకు, ఆధ్యాత్మిక శక్తికి కూడా జీవనాధారము. శరీరములో తగినంతగా నీరు లేకపోతే మన ఆరోగ్యము మాత్రమే కాదు – మనః శాంతి, ఆత్మబలము కూడా క్రమ క్రమముగా తగ్గిపోతాయి."

💥 సరళము, సులభమైన పరిష్కార మార్గము: 

💐 AC లు లేదా ఫ్యాన్లు ఉన్న గదిలో నీటి తోట్టెలు (టబ్‌లు) పెట్టడమే పరిష్కారము.

✅ అవును, ఇది సహజమైన మరియు శాస్త్రీయముగా సరైన పద్ధతి. ఇది గదిలో తేమను పెంచి — శరీరానికి, మనసుకు మరియు శ్వాసకు శాంతినిస్తుంది.

🔎 గదిలో నీటి తోట్టెలను పెట్టడము వలన మనకు కలిగే ప్రయోజనాలు:

🌹 AC లు లేదా ఫ్యాన్లు గాలిలోని తేమను తగ్గిస్తాయి, తద్వారా గదిలోని గాలి పొడిగా మారుతుంది.

🌹 AC లేదా ఫ్యాన్ గాలి → నీటి తోట్టెల మీదికి పడితే → నీరు ఆవిరై → గదిలోని గాలిని చల్లగాను మరియు తేమతోనూ ఉంటుంది.

🌟 వివిధ స్థాయిల్లో లాభాలు:

✅🧍‍♂️ 1. శారీరక లాభాలు:
చర్మము, గొంతు, కళ్లు పొడి బారడమును నివారిస్తుంది.

🌹 శ్వాసలో సౌకర్యము, పిల్లలు మరియు వృద్ధులకు ఎంతగానో సహాయకరము.

🌹 జలుబు, దగ్గులు తగ్గుతాయి.
ఘాడమైన నిద్ర శాతము పెరుగుతుంది.

✅ 🧠 2. మానసిక లాభాలు:
తగినంతగా తేమ గల గది, మన మనస్సుకు సాంత్వనను చేకూర్చుతుంది.

🌹 ఆలోచనలల్లో స్పష్టత, ధ్యానము మరియు పఠనమునకు అనుకూలమైన వాతావరణము.

✅ 💓 3. భావోద్వేగపరమైన లాభాలు:

🌹 గాలిలో తగినంతగా చల్లదనము ఉండడము వలన శాంతి, ప్రేమ మరియు భావొద్వేగపరముగా సమతుల్యత.

🌹 పొడి వాతావరణము వల్ల కలిగే చిరాకులు తగ్గుతాయి.

✅ 💰 4. ఆర్థిక లాభాలు:
ఎక్కువ ఖర్చు లేకుండా గదిని శుభ్రముగానూ మరియు చల్లగానూ ఉంచే సనాతన పద్ధతి.

🌹 వేడి గాలికి దెబ్బ తినే వస్తువులను (Wooden furniture, Musical instruments) కాపాడుకోవచ్చును.

🌹 హ్యూమిడిఫైయర్ వంటి సాధనాల ఖర్చు అవసరము లేదు.

✅ 🕉️ 5. ఆధ్యాత్మిక లాభాలు:
నీరు, గొప్ప శుద్ధమైన శక్తిని కలిగిన ఒక శక్తివంతమైన మూలకము.

🌹 గదిలో ప్రాణవాయువు యొక్క స్వచ్ఛత మరియు శాంతియుత వాతావరణము పెరుగుతుంది.

🌹 ధ్యానము, మంత్ర జపము వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనుకూలమైన పరిస్థితులు పెరుగుతాయి.

💡 సూచన: నీటిలో తులసి ఆకులు, కర్పూరము, వివిధ రకాలైన పువ్వులను వాడితే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

🪔 ✅ బహుళ లాభాల కోరకు మనము తప్పక చెయ్యవలసిన పనులు:

🌹 1. ప్రతి రోజు ఒక్కసారైనా నీరును మార్చుదాము. 

🌹 2. నీటిలో తులసి లేదా కర్పూరమును కూడా వేసుకుందాము.

🌹 3. కరెంటు పరికరాలకు దూరముగానూ లేదా తగినన్ని జాగ్రత్తలను తీసుకుందాము.

🌹 4. వాతావరణములోగాని లేదా గదిలో గాని తేమ బాగా ఉంటే, తక్కువగా నీరును వాడుదాము.

🌹 5. ధ్యానము లేదా జప సమయములో నీటికి దగ్గరగా కూర్చుని, చేద్దాము.

😊🙏 🪷 ఆధ్యాత్మిక సందేశము:

💐 “నీరు కేవలము శరీరాన్ని చల్లబెట్టేది మాత్రమే కాదు. నీరు-చైతన్య శక్తిని, స్వస్థతను మరియు శాంతిని కలిగించే పవిత్ర మూలకము. శారీరకముగాను మరియు మానసికముగాను అలసి పోయినా, స్నానము చేసిన తక్షణమే నూతన ఉత్సాహమును పొందడమనేది మనకందరికి బాగా తెలిసిన విషయమే కదా. నీటిని భక్తి శ్రద్ధలతో వాడితే, శారీరక ఆరోగ్యానికి, మనస్సుకు, ఆత్మకు ఆశీర్వాదముగా మారుతుంది.”

*ఓం శాంతిః శాంతిః శాంతిః*

💐 *జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*

మంచి మాటలు

*ఆణిముత్యాలు...!*
             
*తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది!*

*ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు!!*

*అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు!*

*******************


   *తూటాకంటే శక్తివంతమైనది మాట!  ఒక్క మాటతో సంబంధం తెంచు కోవచ్చు!*

     *ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు!*

*************************


      *మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి! కత్తెర లాగ కాదు!!*

     *సూది పని ఎప్పుడూ జోడించడమే! కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే!!*

*అందరిని కలుపుకుంటూ బ్రతకాలి! కత్తెర లాగా విడదీస్తూ కాదు!!*

**************************


     *నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు!*

      *కానీ ప్రపంచాన్ని మార్చేశక్తి నిజానికి ఉంది!!*

************************


   *నీవు సంతోషంగా ఉన్నావంటే  నీకు సమస్యలు లేవని కాదు!*

   *వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం  నీకు ఉన్నాయని!!*

***************************


     *స్నేహితుడిని నీ దుఃఖ సమయము లోను,*
    *యోధుడిని యుద్ధంలోను,*
     *భార్యను పేదరికంలోను,*
     *గొప్పవ్యక్తిని అతని వినయంలోను,  పరీక్షించాలి!*

**************************


    *చేసిన తప్పుకు క్షమాపణ*      
        *అడిగేవాడు ధైర్యవంతుడు!*

   *ఎదుటి వారి తప్పును*
                *క్షమించగలిగిన వాడు*
                           *బలవంతుడు!!*


       *కష్టం అందరికీ శత్రువే, కానీ  కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది!*
.

రోజు అంశం దేశీ ఆవు పాలు



*ఆవు పాలలో ఉండే పోషకాలు.*
*ఆవు పాల వలన కలిగే లాభాలు*

గంగిగోవు పాలు గరిటడైనను చాలు 
కడివేడైననెల ఖరముపాలు..
వేమన గారు చెప్పిన ఈ పద్యం అందరికి తెలిసిందే 

దేశీ ఆవు అయిన గిర్ ఆవు పాల లో ఉండే పోషకాలు.
100 ml లో
*1.క్యాల్షియం. 171.54mg* 
*2.ఫాస్పరస్. 86.83mg*
*3.మెగ్నీషియం 14.15mg* 
*4.విటమిన్A. 93.47iu* 
*5.విటమిన్ B12 0.10mcg* 
*6.జింక్. 0.36mg* 
*7.ప్రోటీన్. 3.15g*
*8.కాలరీస్. 69kcal*

పై విషయాలు మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వున ప్రముఖ ల్యాబ్ రేటర్ లో చెక్ చేసి చెబుతున విషయాలు.
నాకు తెలిసిన కొని ముఖ్యమైన విషయాలు..
ఈ పోషకాలు అన్ని ఆవు జాతుల లో ఒకే రకం గా ఉండవు.వాటికి మనం పెట్టే గడ్డి,మరియు దాన, ఇతర పోషకాలు,వాతావరణ పరిస్థితులు,వాటి ఆరోగ్యం,ఆరు బయట తిప్పడం,వాటి పరిసరాలు పరిశుభ్రం ఉంచడం,వాటికి ఒక రకమైన ఆహ్లాదకర మైన వాతావరం కల్పించడం ఇలా ఎన్నో అంశాలపై పాల నాణ్యత దిగుబడి మరియు పోషకాలు లభ్యత అనేది ఆధారపడి ఉంటుంది.

*ఆవు పాల వలన కలిగే లాభాలు*
పైన చూసిన ఈ పోషకాలు అని మీకు మనం రోజు వాడే టాబ్లెట్స్ పై స్పష్టం గా చూడవచ్చు.
ఆవు పాలను సంపూర్ణ ఆహారగా పిలుస్తారు ఎందుకంటే మనకు కావలసిన అని పోషకాలు దీంట్లో ఉంటాయి కనుక. విటమిన్స్ A,D,E,K , ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని చూద్దాం..

*కాల్షియం:* 
1 ఎముకలు దృఢం గా బలం గా ఉండటానికి , కండరల పనితీరునుమెరుగుపరుస్తుంది.
3. గుండె ను బలంగా ఉంచుతుంది.
4.మరియు రక్తప్రవాహంలో ఇతర ఖనిజాల (పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్) స్థాయిని కంట్రోల్ చేస్తుంది.
5.ప్రతి రోజు మనిషికి 1000 mg వరకు అవసరం.
*విటమిన్ A:* కంటి చూపుకు,చర్మ సంరక్షణకు చాలా ముఖ్యం..వ్యాధి నిరోధక శక్తికి,గర్భం లో వున శిశువు పెరుగుదలకు...
*విటమిన్ బి12:* రక్త కణాల అభివృద్ధి, హిమో గ్లోబిన్ పెరుగుదల ఉంటుంది.ఒక వేళ B12 శరీరంలో తగితే మతి మరుపు పెరిగే అవకాశం ఉంది
*జింక్:* దీని లోపం వలన జుట్టు రాలిపోవడం,శరీరం పొడి బారిపోవడం,చిరాకు పెరగడం,తొందరగా అలసి పోవడం,ఏకువ నిద్ర రావడం .... చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి..

ఇపుడు వస్తున అనారోగ్య సమస్యలకు చాలా కారణాలు ఉన్నవి.నాకు తెలిసినవి కొన్ని..
1. మనం వ్యవసాయం లో వాడుతున యూరియా, పురుగుమందులు, గడ్డి మందులు.వీటి వలన ఆటు భూమి కి సారం పోతుంది మనిషికి ప్రాణం పోతుంది.
2. వాతావరణ కాలుష్యాలు మనం పిలుస్తున గాలి,నీరు అంత కాలుష్యాలతో నిండి పోతుంది. ఉదాహరణ మన రాజధాని డిల్లీ.
3. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు. ప్యాక్డ్ ఫుడ్,జంక్ ఫుడ్ కి మనుషులు బాగా అలవాటు పడ్డారు.
4. నాకు తెలిసి ఈ అనారోగ్య సమస్యలకు సగం కరణం సరైన పోషక ఆహారం తీసుకోక పోవడం.
5. ఇంకో ముఖ్య కారణం కల్తీ మాఫియా.ఉదయం మనం తీసుకొనే టీ పొడి పాల నుండి మొదలై రాత్రి తీసుకునే తాంబూలం వరకు అన్ని కళ్తినే. ఇది కూడా ఒక కారణం..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
సరే ఇక పాల విషయానికి వస్తె ఒకపుడు పాలలో నీళ్లు కలిపి అమ్మే వారు,తరువాత పలచగా ఉంటే అడుగుతున్నారని నీళ్ళు తో పాటు,పాల పౌడర్,తరువాత నూనెలు ఇంకా నాణ్యత పెంచాలి అని యూరియా,తరువాత కొన్ని రకాల కెమికల్స్,ఇంకా ఇపుడు ఈ నాణ్యత సరిపోవడం లేదని పాలే లేకుండా పాలని సృష్టిచేస్తున విశ్వమిత్రులను కూడా ఈ మధ్యన మన టీవీ లలో చూస్తున్నాం.ఇంకా ప్యాకెట్ పాలు వీటి గురించి చెప్పవలసిన అవసరం లేదు.ఇంతకు ముందు పూతన గురుచిచేపుకునం కదా ఈ పూతన కి తోడు ఇపుడు ఈ విశ్వామిత్రులు ఏమి చేయగలం..
ఇలాంటి పాలు తాగినపుడు ముఖ్యంగా చిన్న పిల్లలో బుద్ధి మందగించడం,అధికం గా లావు పెరగడం,ఆర్టిజం,హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వలన చిన్న వయసు లోనే అమ్మాయిలు మెచ్యూర్ కావడం, పెద్దల్లో క్యాన్సర్ , హార్ట్ ఎటాక్, థైరాయిడ్ సమస్యలు శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 
పాలు కొనే ముందు ఒకసారి ఆలోచన చేయండి. దొరికితే మంచి ఆవు పాలు త్రాగండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఒక ఆవుని కొనుక్కోండి. మనం సంపాదించే ఆస్తులకంటే కంటే మన పిల్లల మన ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. 
రేపటి అంశం లో 
*నెయ్యి దాని ప్రాముఖ్యత*
*నెయ్యిలో ఉండే పోషకాలు*
*మన అనారోగ్య సమస్యల నివారణలో నెయ్యి పాత్ర ఏమిటి?*
*నెయ్యి యొక్క విశిష్టతలు*
*సాంప్రదాయక పద్ధతిలో నెయ్యి తయారీ విధానం*
 గురించి తెలుసుకుందాం...

       

Thursday, July 10, 2025

ఈరోజు దేశీ ఆవులు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

.
ఆవులతో అనుబంధం ఉన్న కానీ వ్యవసాయం,దేశీ విత్తనాల పైనే ధ్యాస ఉండేది. 
ఎందుకో తెలియదు కానీ ఒక సంవత్సరం నుండి ఆవులపై ఆసక్తి పెరిగి, వీటిపై దృష్టిపెట్టడం పెట్టిన తర్వాత కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. సుభాష్ పాలేకర్ గారి వలన మొదట ఆవు ప్రాధాన్యం వ్యవసాయం లో వాటి ప్రాధాన్యత తెలిసింది.కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం, మన శాస్త్రాలలో,గ్రంథాల్లో,పెద్దలు చెప్పినవి మొదట్లో అంత నమ్మకం గా అనిపించేవి కావు. ఆవును కేవలం గొప్పగా చూపించాడనికే అనిపించేది. క్రమంగా అర్థం అయింది. పాలు, నెయ్యి, పేడ,మూత్రం కొన్ని అంశాలను సైంటిఫిక్ గా స్టడీ చేయడం,ప్రయోగాలు చేయడం, ఆవుల సంరక్షణ వివిధ రకాల గడ్డి జాతులు, ,పోషకాలు ఇలా ఎన్నో అంశాలు. మొదట్లో ఏముంది లే గడ్డి వేస్తే సరి అనుకున్న. కానీ ఇదో మహా సముద్రం.వ్యవసాయం మాదిరిగానే ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు,సవాల్ లు,మార్కెటింగ్ సమస్యలు..నేను చూసిన ఈ దేశీ ఆవుల డెయిరీ లో నూటికి 50% సక్సెస్ రేటు మాత్రమే ఉంది. చాలా మంది ఆవులు లు పెట్టడం తీసి వేయడం ఎన్నో చూసాను.కారణాలు చాలా ఉన్నాయి. కొత్తగా ఆలోచించి,ఎక్కడ లేని మన వద్దనే దొరికే ,అందరికి అవసరమైన ఒక మంచి నాణ్యమైన ప్రొడక్ట్ మనం సమాజానికి ఇవ్వ గలిగితే వ్యవసాయంలో అయినా డెయిరీ లో అయినా తిరుగుండదు అని నా అభిప్రాయం... సముద్రమంత ఈ గో ప్రపంచం లో నీటి చుక్కంత నా అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

*మొదటి భాగం..*

ఈరోజు దేశీ ఆవులు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 
1. భారతదేశంలో 40 కి పైగా గో జాతులు ఉన్నవి.
2. భారతదేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఆ ప్రాంతానికి అనుగుణంగా ఈ గోజాతులు ఉన్నవి.
3. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వీటికి పేర్లు కలవు. ఉదాహరణకి కొన్ని చూద్దాం.
*అధిక పాల దిగుబడిన కలిగిన జాతులు*
1. సాహివాల్ (పాకిస్తాన్)
2. రెడ్ సింధి (కరాచీ)
3. గిర్ (గుజరాత్)
*పాలకి వ్యవసాయానికి ఉపయోగపడే జాతులు*
1. ఒంగోలు (ఆంధ్ర ప్రదేశ్) 
2. దియోని (మహారాష్ట్ర) 
3. కాంక్రేజ్ (గుజరాత్ కచ్) 
4. థార్ పార్కర్ (పాకిస్తాన్) 
5. హర్యానా (హర్యానా) 
*కరువు ప్రాంతాలకి అనుకూలంగా ఉండే జాతులు*
1. అమృత మహల్ (కర్ణాటక) 
2. హలికర్ (కర్ణాటక) 
3. కిలారి (మహారాష్ట్ర) 
4. కంగాయం (తమిళనాడు) 
5. వేచూర్ (కేరళ) 
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 
మొదటి నుంచి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతీయులకు గోవు అత్యంత పవిత్రమైంది. పాడిపంటలకు చాలా కీలకమైంది. భారతదేశంలో యాంత్రికరణకు ముందు అంటే ట్రాక్టర్లు. ఇవి లేనప్పుడు వ్యవసాయంలో మరియు రవాణా అంతా కూడా ఎద్దులు ఇతర జంతువులపైనే ఆధారపడి ఉండేది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,గేదె మన ప్రాంతానికి చెందినది కాదు కొంతమంది చరిత్రకారులు చెబుతున్నది. మొగలులు భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు వారి వెంట తీసుకురావడం జరిగింది. దీనికి ఒక కారణం ఉంది సైనికుల శారీర ధారుడ్యానికి, బలానికి ఈ పాలను వాడేవారు. కానీ ఇప్పుడు ఈ పాలదే సింహభాగం. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత దేశంలో ఆహార సంక్షోభం వచ్చింది. అంటే తిండి కొరత. దీని నివారించడానికి అప్పటి ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
*1. హరిత విప్లవం 1960.*
(Green revolution)
*2. శ్వేత విప్లవం 1970.*
(White revolution)
దీనివలన జరిగింది ఏమిటి అంటే పంటల దిగుబడి పెంచడం కోసం మనం ఇప్పుడు వాడుతున్న యూరియా, డిఏపీలు, పురుగుమందులు, హైబ్రిడ్ విత్తనాలు రావడం జరిగింది. ఈ హరిత విప్లవ సృష్టికర్త డాక్టర్ స్వామినాథన్.
*2. శ్వేత విప్లవం*
ఈ విప్లవ సృష్టికర్త వర్గీస్ కురియన్. ఈ విప్లవం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో పాల దిగుబడి పెంచడం. దీనిలో భాగంగానే మన వధకు జెర్సీలను హెచ్ఎఫ్ లని తీసుకురావడం జరిగింది. 
ఈ రెవల్యూషన్స్ మరియు యాంత్రికరణ వలన క్రమంగా దేశీ ఆవుల ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. 

*ప్రాముఖ్యత*
1. దేశవాళి ఆవులు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తట్టుకోగలవు.
2. భూమి సారానికి వీటి పేడ, మూత్రం ఎంతో కీలకమైంది. 
3. వ్యవసాయ పనులకు చాలా కీలకం.
4. వీటి పాలు చాలా ఆరోగ్యదాయకం.
మిగతా అంశాలు ముఖ్యమైనవి రేపు తెలుసుకుందాం..ఇవి కేవలం నా అనుభవాలు మాత్రమే.. మీ అనుభవాలు కూడా చేపండి.
  *రేపటి అంశం పాలలో ఉండే పోషకాలు,A 1 మిల్క్ A 2 అంటే ఏమిటి? ఏవీ మంచివి,చెడు ప్రభావాలు , నెయ్యి లో ఉండే పోషకాలు,వాటి ఆవశ్యకత*

      

పాలు ఎన్ని రకాలు


*రెండవ భాగం*

ఇక ఈరోజు అంశంలోకి వచ్చేద్దాం.
 *పాలు ఎన్ని రకాలు?*
 *A1,A2 అంటే ఏమిటి?*
 *వీటిని ఎలా వర్గీకరిస్తారు?*
*ఏ పాలు మంచివి.*
 *ఏ పాలు హాని కలిగిస్తాయి వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి*
 ఈరోజు క్లుప్తంగాతెలుసుకుందాం 

*A1 మరియు A2 పాలు అంటే ఏమిటి?*
మిత్రులందరికీ ఒక సందేహం రావచ్చు పాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా మళ్లీ ఈ A1,A2 ఏంటి అని. చలో ఇక అసలు విషయం తెలుసుకుందాం. పాలలో ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫ్యాట్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మన సినిమాలో హీరో ప్రోటీన్, ఈ ప్రోటీన్ రెండు రకాలు ఒకటి 1.కేసిన్ ప్రోటీన్ 2.వే ప్రోటీన్.
 ఈ ప్రోటీన్ మొత్తంలో 80% కేసిన్ ఉంటుంది.
 తిరిగి ఈ కేసిన్ నాలుగు రకాలుగా ఉంటుంది.
    1 .ఆల్ఫా s1
2. ఆల్ఫా s2 
3. బీటా కేసిన్
   4. గామా కెసిన్. 
పై నాలుగులో బీటా కేసిన అనేది చాలా ముఖ్యమైనది. ఇది మన సెకండ్ హీరో.
 అసలుA1,కిA2 తేడా అంతా ఇక్కడే ఉంటుంది. ఇక మన సినిమాలో ట్విస్ట్ అంతా ఇక్కడ నుండి ఉంటుంది. ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి.
 మన హీరో ప్రోటీన్ గురించి అసలు *ఈ ప్రోటీన్స్ ఎలా తయారవుతాయి.*
 ప్రోటీన్స్ అన్నీ కూడా ఎమినో ఆసిడ్స్ తో తయారవుతాయి ఇక మన సెకండ్ హీరో బీటా కేసిన్ వద్దకు వెళ్దాం.
* *ఈ బీటా కేసిన్ 209 అమినో యాసిడ్స్ తో తయారవుతుంది* 
A1 పాలలో A1 బీటా కేసిన్ ఉంటుంది. 
A2 పాలలో A2 బీటా కేసిన్ ఉంటుంది. 
ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పటికే అర్థం కాక బుర్ర వేడెక్కి ఉంటుంది మిత్రులకి. ఎందుకంటే మనం డాక్టర్లు సైంటిస్టులు కాదు కదా, రోజు ఈ పేర్లు విని ఉండము.
 ఇప్పుడు ఒకసారి సింపుల్ గా క్లుప్తంగా చూద్దాం 
1. పాలుA1,A2 రెండు రకాలు. 
2. పాలలో 80% ప్రోటీన్స్ ఉంటాయి. 
3. ప్రోటీన్స్ రెండు రకాలు 
       1 కేసిన్ 2 వే ప్రోటీన్. 
4. ప్రోటీన్స్ లో 80% కేసీన్ ఉంటుంది (హీరో 1).
5. కేసిన్ నాలుగు రకాలు 1.ఆల్ఫా s1
        2. ఆల్ఫా s2
        3. బీటా కేసిన్ 
        4. గామా కేసిన్ 
6.పై 4 లో బీటా కేసిన్ (హీరో2).
7. ప్రోటీన్స్ అమినో ఆసిడ్స్ తో తయారవుతాయి. 
8. మన హీరో 2 బీటా కెసిన్ 209 అమినో యాసిడ్స్ తో తయారవుతుంది 
9. A1,A2 కి తేడా అంతా మన బీటా కేసిన్ వద్దే ఉంది. 
ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది రాకపోతే ఒకసారి పై 9 పాయింట్స్ చదవండి. ఇప్పుడు మన సినిమా సగం అయింది. ఇంకా అన్ని మర్చిపోయి మన ఇద్దరు హీరోలనే గుర్తు పెట్టుకోండి.
 ఇంతకుముందు
 చెప్పుకున్నట్టు మన సెకండ్ హీరో బీటా కేసిన్ 209 ఎమినో ఆసిడ్స్ తో తయారవుతుంది. ఉదాహరణ 1, 2, 3, 4, 10, 20, 40, 60, 65, 66, 67, 68, 69, 70, 75, 100, 200, 206, 207,208, 209 ఈ రకంగా అమినో ఆసిడ్స్ లింక్ ఉంటుంది.
 ఇకA1,A2 పాలకి తేడా అంతా 67వ అమినో యాసిడ్ వద్ద వచ్చింది.
 మిగతావి అన్ని ఒకే రకంగా ఉన్నవి ఇక్కడే పాలు రెండు రకాలుగా విడిపోయాయి 
*67 వద్ద A1 పాలలో హిస్టరీ అనే ఎమినో ఆసిడ్ ఉంటుంది*.
 
*A2 పాలలో ప్రోలిన్ అనే అమినో ఆసిడ్ ఉంటుంది*.
 
*ఇకA1,A2 పాలు ఇచ్చే పశుజాతులు ఏంటో తెలుసుకుందాం*
 అమ్మ ఇప్పటికే బుర్ర వేడెక్కిపోయింది అని అనిపిస్తుంది కదా ఇంకా ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. 

*A1 పాలు ఇచ్చే జాతులు:* యూరోపియన్ బ్రీడ్స్ అయినా జెర్సీ,HF లలో A1 బీటా కెసిన్ ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే చరిత్ర చాలా పెద్దది సింపుల్గా చెప్పాలి అంటే యూరోపియన్ కంట్రీస్ లో మాంసం కోసం కృత్రిమంగా తయారు చేసుకున్న ఒక పశువు. 
*A2 పాలు ఇచ్చే జాతులు*
మన దేశీ ఆవులు అయినా గిర్,సాహివాల్, కాంక్రేజ్, ఒంగోలు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన దేశీ ఆవులు ఏవైనా కూడా వాటిలోA2 బీటా కేసిన్ ఉంటుంది.

ఇక అసలు విషయంకి వెళ్దాం....

A1 పాలు తాగిన తర్వాత మన శరీరంలో *BCM7* అనే కెమికల్ విడుదల అవుతుంది.
*BCM7 అంటే బీటా కేసో మార్పిన్.* మార్పిన్ అనేది మత్తుమందు లాంటిది.

 దీనివలన పాలు తాగినప్పుడు పిల్లల్లో అయితే ఆర్టిజన్ (మతిమరుపు రావడం) , ఎలర్జీస్, ముక్కు ఎప్పుడు కారుతూ ఉండడం, ఆస్తమా ఇంకో ముఖ్య విషయం ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య షుగర్, చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ఒక రీసెర్చ్ లో చెప్పిన విషయం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది ఈ షుగర్ బాధితులు ఉన్నారు.
Top1- భారత్ లో 21.2 Cr
Top2- చైనా లో 14cr
Top3-అమెరికా లో 4.2 
Top4-పాకిస్తాన్ లో 3.6
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సంవత్సరానికి భారత్ లో36 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కేవలం ఈ షుగర్ మందులది.

! ఈ BCM7 వలన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ మేటబాలిజం ఆల్టర్ అయ్యి అయ్యి డయాబెటిస్ రావడానికి ఎక్కువ కారణం అవుతుంది.
! హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కారణం.
 ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏ పాలు తాగాలి? 
 నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది రాజీవ్ దీక్షిత్ గారు ఈ జెర్సీ, HF ఆవులను పూతనతో పోల్చుతారు, క్షమించాలి వీటిని ఆవులు అని అనకూడదు. పూతన అంటే శ్రీకృష్ణుని బాల్యంలో కంసుడు పంపిన ఒక రాక్షసి కృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలని చూస్తుంది, ఇప్పుడు ఈ పూతన లు మనకు పాలిచ్చి చంపుతున్నాయి. ఇప్పుడు మనం తాగుతున్న పాలు ఏవి అని ఒకసారి ఆలోచించండి. ఇంకా మీరు మీ పిల్లలు ఏ పాలు తాగాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది ఆవుని గోమాత అని ఎందుకు అంటారు.
 రేపటి అంశంలో పాలలో ఉండే పోషకాలు నెయ్యి ఇంకా ఇతర విషయాలు తెలుసుకుందాం.నచ్చితే నలుగురికి షేర్ చేయండి కనీసం ప్రజలకి ఆవు విశిష్టత పాలపై అవగాహన ఏర్పడుతుంది అని నా అభిప్రాయం...
* *అన్ని తెలుసుకున్న తర్వాత మీరే అంటారు" జై గోమాత"** 

         మీ 
శివప్రసాద్ రాజు

Wednesday, July 9, 2025

గురువున్నవాడు భాగ్యశాలి!

*గురువున్నవాడు భాగ్యశాలి!* ✍️

**గురుస్సాక్షాత్ పరబ్రహ్మ!* 
 (సమస్త గురువుల పాదపద్మములకు ఈఅక్షర కుసుమాల మాల అంకితం) 


**మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది...!!!*
ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..!
ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!! 


**ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు...!!!* 
సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు...!!!


**గురువు చూపుయే ఉపదేశం...!!!* 
గురువు జీవితమే ఓ సందేశం...!
గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం...!!
గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం...!!!
శిష్యుడి జీవితం ఓ వాహనం,
గురు కృప అందులోని ఇంధనం...!!! 


**మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం...!!!* 
మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం...!
గురువు సర్వజ్ఞుడు...!!
గురువు దైవజ్ఞుడు...!!!


**మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు...!!!* 
గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు...!
గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని...!!
గరువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి...!!!


**సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే...!!!* 
అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే...!!!


**గురువు నిండు మేఘమై వర్షించగలడు...!!!* 
గురువు చల్లటి చినుకై స్పృశించగలడు...!
గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు...!!
గురువు మహావృక్షమై నీడనీయగలడు. 
గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు...!!!


**కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,* 
బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే...!!!


**గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు...!!!* 
సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు...!!!
సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు...!!!


**గురువున్నవాడు భాగ్యవంతుడు...!* 
గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు...!!
గురువున్నవాడు అదృష్టవంతుడు...!!!✍️
. 🙏

Monday, July 7, 2025

క్షమాపణ

😊🙏 మహోదయము, 

'క్షమాపణ’ గురించి లోతుగా అవగాహనా మరియు బహుళప్రయోజనాలను గురించి తెలుసుకుందాము. 

🌸 **క్షమాపణ యొక్క అసలైన అర్థము ఏమిటి?**

**క్షమించడము** అంటే:
మనలను లేదా ఇతరులను అనవసరముగా నిందించడము, కోపము, లోతైన మానసిక గాయాలు, అసూయ లేదా బాధలతో మన హృదయాన్ని నింపుకోవడము కాకుండా — **మనస్సులో శాంతిని, కరుణను, మరియు స్వీయనియంత్రణతో కూడిన స్వేచ్ఛను ఎంచుకోవడము.**

సంస్కృతములో "క్షమాపణ లేదా క్షమా గుణము" అనే పదములు కేవలము ఓ మంచి లక్షణమలే కాదు — శారీరక, మానసిక, భావోద్వేగ అధమ స్థితి విముక్తికి, మరియు ఆర్థిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీసే ఒక శుద్ధి సాధనము.

"క్షమాపణ లేదా క్షమా గుణము" అంటే: ధైర్యము, సహనము, సహనశక్తి, దయ, దేవగుణము.

🌼 **క్షమాపణ యొక్క ప్రధాన కోణాలు**
       
🌹 *మనము, ఇతరులను క్షమించడము వలన మనలోని నింద, కోపము, విమర్శలను విడిచిపెట్టడముజరుగుతుందిమరియు భావోద్వేగ బానిసత్వము నుండి మనకు విముక్తి కలుగుతుంది.* 

🌹 *మనల్ని మనమే క్షమించుకోవడము వలన మనలోని నిండా స్వభావము, అపరాధ భావము, తక్కువతనాన్ని వదలి వేసి, మనము ఆత్మప్రేమ మరియు ఎదుగుదలకు ద్వారమును చేరుతాము.*

🌹 *మనము ఇతరులను హృదయపూర్వకమైన క్షమాపణ అడగడము వలన తత్సంబంధాలు పెరుగుతాయి లేదా వారి నుండి మనకు ఎలాంటి హాని ఉండదు మరియు మన కర్మలన్ని కూడా పరిశుద్దమవుతాయి.*

🌹 -మనము దైవమును హృదయపూర్వకమైన క్షమాపణ అడగడము వలన భగవంతుని కృపను స్వీకరించడము లేదా ఆహ్యానించడము, ఆధ్యాత్మిక శుద్ధిమరియు శాంతిని పొందుతాము.*
             |
🕊️ *మనల్ని, మరియు ఇతరులను పూర్తిగా మనము క్షమించడము వలన, మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము:*
🌹 -1. శారీరక ఆరోగ్యము:*
* రక్తపోటు తగ్గుతుంది
* నిద్ర మెరుగవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది
* నొప్పుల నివారణకు ఎంతగానో సహాయపడుతుంది

🌹 *2 మానసిక ఆరోగ్యము:*
* భావపరమైన ఉపశమనము కలుగుతుంది 
* మనలోని కోపము, బాధ, ఒత్తిడి తగ్గుతుంది
* మనలో భావజాల స్వేచ్ఛ, మానసిక స్పష్టత కలుగుతుంది

🌹 *3. ఆధ్యాత్మిక స్థాయిలో ఎదుగుదల:*
* కర్మ బంధాలు తొలగిపోతాయి
* స్పందన తరంగాలు (frequency) పెరుగుతాయి
* దైవ కృప ప్రసాదితమవుతుంది

🌹 4. బంధాలలో శాంతి:*
* మనపైన మనకు నమ్మకము పెరుగుతుంది
* మనలో అనురక్తత, కరుణ పెరుగుతుంది
* మనకు తరతరాలుగా వచ్చే బాధలన్నీ నివారణ అవుతాయి  

🌹 *5. అంతర్ముఖ శాంతి మరియు విముక్తి:*
* మనకు ఇతరుల చేసిన తప్పుల్ని మనము మోసే బాధ నుంచి బయటపడతాము
* మనము తేలికగా, ఆనందముగా జీవించగలుగుతాము
* మనలోని అసలైన ఆత్మ స్వరూపముతో మమేకమవుతాము

🧘‍♂️ *"క్షమించటము"ను ఏవిధముగా పూర్తి చెయ్యాలి?*
1. ఆత్మపరిశీలన:
👉 “మేము అంతర్గతముగా ఎవరినైనా నిందిస్తున్నామా? దాని వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి?”
👉 “ఇటువంటి ప్రవర్తన లేదా క్రియలు, మమ్ములను ఎటువంటి ప్రవర్తనకు లేదా గుణములకు ప్రభావితము చేస్తున్నాయి?” అని మనల్ని మనమే ప్రశ్నించుకుందాము?

🌹 *2. కరుణాభావము:*
👉 ఇతరులు మనకు కోపము మరియు బాధలను కలిగించిన సమయములో వారి అజ్ఞానాన్ని, ఆవేదనను అర్థము చేసుకుందాము. "అన్ని అనార్తాలకు మూలము అజ్ఞానము". 

🌹 *3. క్షమాపణ లేఖ:*
👉 మన మనస్సులలో గూడు కట్టు కునివున్న బాధను మరియు వేదనలను తీర్చుకునేందుకు గాను ఒక హృదయపూర్వక క్షమాపణ లేఖను వ్రాద్దాము. ఇది చాలా సులభమైనది, సురక్షితము మరియు శ్రేష్టమైనది. క్షమాపణ లేఖను ఎవ్వరికిని పంపాల్సిన అవసరము లేదు. దానిని శ్రీఅగ్ని దేవుల వారికీ గాని లేదా మాతాశ్రీ గంగమ్మ తల్లికి గాని సమర్పిద్దాము.

🌹 *4. ప్రార్థన లేదా ధ్యానము:*
👉 మనకు శారీరకముగా లేదా మానసికముగా, కష్టములు, నష్టములు మరియు బాధలు కలిగించిన వారికీ శుభములు, మంగళములు మరియు శ్రేయస్సు సమృద్ధిగా కలగాలని ప్రార్థన చేద్దాము మరియు వీలయితే శుభాకాంక్షలు తెలియజేద్దాము. వారిని దైవ దూతలుగా భావిద్దాము. ఎందుకంటే మనలో కష్టములు, నష్టములు మరియు బాధలను తట్టుకొని,నిలబడే శక్తి పెరిగేందుకు వారు ప్రత్యక్షముగాను లేదా పరోక్షముగానూ సంహరించారు, వారికీ ధన్యవాదాలు.   

🌹 *5. విడుదల ప్రకటన:*
👉 "గడచిన దినములల్లో జరిగిన అనవసరమైన సంఘటనలకు మరియు పరిస్థితులకు మేము, పిండ ప్రధానము చేసి, తిలోదకాలు ఇచ్చి వదులుకుంటున్నాము" అని మన హృదయముతో చెబుదాము మరియు ఆరోజు నుండి అలాగే ప్రవర్తించుదాము. మన హృదయముతో "మేము స్వేచ్ఛను ఎంచుకుంటున్నాము అని గట్టిగా చెబుదాము మరియు ఆరోజు నుండి అలాగే ప్రవర్తించుదాము. 

🪷 *ముఖ్యమైన గమనిక:* మనకు అవసరము లేని వ్యక్తులను మరియు పరిస్థితులను మర్యాదగాను మరియు గౌరవముతోనూ సాగనంపుదాము. ఇది చాలాశ్రేష్ఠమైన పద్దతి.

🌺 *ఆధ్యాత్మిక సూక్తి:*
"క్షమించడము అంటే మనలోని ఒక ఖైదీని విడిపించడము — ఆ ఖైదీ కూడా మనమే!"
– శ్రీ లూయిస్ బి. స్మిడ్స్

*శ్రీ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ పరమాతూముల వారి పలుకులు:*
“క్షమాగుణము అనేది దేవగుణాల్లో ఒకటి, ఇది మోక్షానికి దారితీస్తుంది.”
అధ్యాయము 16 దైవాసుర సంపద్విభాగ యోగములోని శ్లోకము 3 — దైవగుణాల వివరములలో ఒక ముఖ్యమైన శ్లోకము:

📜 శ్లోకము (Chapter 16, Verse 3
"తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ||"

📖 *తెలుగు అనువాదము (భావార్థము):*
🌼 ఓ భారత,
"ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్ప బలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత, ప్రేమ (ద్వేషములు లేని వారు, దురభిప్రాయములు లేని వారు), అతిగా గర్వపడని స్వభావము కలవారు" ఇవన్నియు దైవగుణములు, మోక్ష మార్గానికి దారితీసే లక్షణాలు. 

🪷 పైన తెలియజేసిన దైవ గుణములన్నియు సహజముగానే ప్రతి ఒక్కరిలోనూ జన్మతః ఉంటాయి. కానీ కొన్ని మార్చలేని పరిస్థితులు లేదా బలహీనతలు లేదా విధి వలన తాత్కాలికముగా మరుగునపడుతాయి అంతే గాని ఈగుణములు మనలో ఒక్కటి గాని లేవనే నిరాశ లేకుండా ఉందాము. అవన్నీ దాచి పెట్టామంతె.    

🕉️ *ఆధ్యాత్మిక బోధ:*
ఈ శ్లోకములో భగవాన్ శ్రీకృష్ణుల వారు మనకు ఇలా సూచిస్తున్నారు:
👉 మోక్షాన్ని పొందాలంటే మనము తప్పని సరిగా దైవగుణాలను కలిగి ఉండాలి.
👉 క్షమ, శౌచము, నిరహంకారత, ద్వేషరాహిత్యము ఆంటే ప్రేమ వంటి గుణాలు ఉన్నవారే నిజముగా దైవ స్వభావాన్ని ప్రతిబింబిస్తారు.

🪷 *సందేశము:*
👉 *క్షమించటమనేది బలహీనత కాదు — అది గొప్పదైన ఆధ్యాత్మిక ధైర్యము. మనమొకరిని క్షమించినప్పుడు, వారి దుర్మార్గాన్ని మన్నిస్తున్నాము అనే అర్థము కాదు* —
 *"మనలోని మానసిక గాయాలు లేదా బాధలు ఇక నుండి మనలను నియంత్రించవు లేదా బాధ పెట్టవని, మనము తీసుకొనే ఒక శక్తివంతమైన నిర్ణయము." 

🪷 *"సనాతన ధర్మమూ ఆంటే: ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్ప బలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత మరియు ప్రేమ"*


 మర్యాదగాను మరియు గౌరవముతోనూ వదిలించుకుందాము. ఇది చాలాశ్రేష్ఠమైన పద్దతి.

🌺 ఆధ్యాత్మిక సూక్తి:
"క్షమించడము అంటే మనలోని ఒక ఖైదీని విడిపించడము — ఆ ఖైదీ కూడా మనమే!"
– శ్రీ లూయిస్ బి. స్మిడ్స్

శ్రీ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ పరమాతూముల వారి పలుకులు:
“క్షమాగుణము అనేది దేవగుణాల్లో ఒకటి, ఇది మోక్షానికి దారితీస్తుంది.”
అధ్యాయము 16 దైవాసుర సంపద్విభాగ యోగములోని శ్లోకము 3 — దైవగుణాల వివరములలో ఒక ముఖ్యమైన శ్లోకము:

📜 శ్లోకము (Chapter 16, Verse 3
"తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ||"

📖 **తెలుగు అనువాదము (భావార్థము):
🌼 ఓ భారత,
"ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్పబలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత, ప్రేమ (ద్వేషములు లేని వారు, దురభిప్రాయములు లేని వారు), అతిగా గర్వపడని స్వభావము కలవారు" ఇవన్నియు దైవగుణములు, మోక్ష మార్గానికి దారితీసే లక్షణాలు. 

పైన తెలియజేసిన దైవ గుణములన్నియు సహజముగానే ప్రతి ఒక్కరిలోనూ జన్మతః ఉంటాయి. కానీ కొన్ని మార్చలేని పరిస్థితులు లేదా బలహీనతలు లేదా విధి వలన తాత్కాలికముగా మరుగునపడుతాయి అంతే గాని ఈగుణములు మనలో ఒక్కటి గాని లేవనే నిరాశ లేకుండా ఉందాము. అవన్నీ దాచి పెట్టామంతె.    

🕉️ ఆధ్యాత్మిక బోధ:
ఈ శ్లోకములో భగవాన్ శ్రీకృష్ణుల వారు మనకు ఇలా సూచిస్తున్నారు:
👉 మోక్షాన్ని పొందాలంటే మనము తప్పని సరిగా దైవగుణాలను కలిగి ఉండాలి.
👉 క్షమ, శౌచము, నిరహంకారత, ద్వేషరాహిత్యము ఆంటే ప్రేమ వంటి గుణాలు ఉన్నవారే నిజముగా దైవ స్వభావాన్ని ప్రతిబింబిస్తారు.

🪷 చివరి సందేశము:
👉 క్షమించటమనేది బలహీనత కాదు — అది గొప్పదైన ఆధ్యాత్మిక ధైర్యము.
మనమొకరిని క్షమించినప్పుడు, వారి దుర్మార్గాన్ని మన్నిస్తున్నాము అనే అర్థము కాదు —
 "ఈ మానసిక గాయాలు లేదా బాధలు ఇక నుండి మనలను నియంత్రించదు లేదా బాధ పెట్టదని, మనము తీసుకొనే ఒక శక్తివంతమైన నిర్ణయము." 

"సనాతన ధర్మమూ ఆంటే: ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్పబలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత మరియు ప్రేమ"

                    😊🙏
*జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*