Monday, March 31, 2025

ప్రాచీన భారతీయ వేదాలలో వివరించిన ధనుర్విద్య గురించి సంపూర్ణ వివరణ - 1

ప్రాచీన భారతీయ వేదాలలో వివరించిన ధనుర్విద్య గురించి సంపూర్ణ వివరణ - 1

        మన ప్రాచీన యుద్ధవిద్యలలో ధనుర్విద్యకు ప్రముఖస్థానం కలదు. ఈ విద్యకు సంబంధించిన చాలా గ్రంథాలు మరియు తాళపత్రాలు బ్రిటిష్ వారు మనదేశము నుండి తరలించుకొనిపోయి బ్రిటిషు మ్యూజియం నందు ఉంచటం జరిగిందని "మేడం బ్లావేట్స్కి " రచించిన " THE SECRET DOCTRINE " అనే గ్రంథము నందు వివరించారు . ఇలాంటి కారణాల వలన ఈ ధనుర్విద్య గురించిన విజ్ఞానం మరుగునపడిపోయింది. ఇలా మరుగునపడిపోయిన ధనుర్విద్య గురించి కొంతవరకైనా మీకు తెలియాలి అనే సదుద్దేశముతో నేను చదివిన కొన్ని ప్రాచీన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయుటకు ఈ పోస్ట్ పెడుతున్నాను . 

          ఇప్పుడు మనకి లభ్యం అవుతున్న గ్రంథాలలో ఈశాన సంహిత శస్త్రాలు మరియు అస్త్రాలు గురించి తెలియచేస్తుంది . ఈ ధనుర్వేదమును ఉపదేశించిన వాడు మహర్షి విశ్వమిత్రుడు . ఈశాన సంహిత యందు ధనుర్విద్య గురించి 20 ,000 శ్లోకాల రూపంలో శివుడు పార్వతికి సంగ్రహముగా వివరించాడు. దీనిలో నాలుగు విభాగాలుగా అస్త్రములు తెలుపబడినవి. అస్త్రమును తయారుచేయు ధాతువులు , ద్రవ్యములు , ఈ అస్త్రమును తయారుచేయువాడికి ఉండు లక్షణములు . అస్త్రములను తయారుచేసే విధానములు ఇందులో తెలుపబడినవి .  

              ఈశాన సంహిత యందు ఉమామహేశ్వర సంవాదం అను భాగములో వివిధ అస్త్రములును ప్రయోగించు పద్దతులు , ఒక్కో అస్త్రప్రయోగానికి కావలిసిన అస్త్ర మంత్రములు , ఆ మంత్రములను జపించే విధానం , దానికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా సంగ్రహముగా తెలుపబడినది .  

. పరశురాముడు రచించిన " శాండిల్యభాష్యం " లో దీక్షాపాదము , సంగ్రహ , సిద్ధిపాదాలు అని అధ్యాయాల రూపంలో అనేక విశేషాలు కలవు. ఇది కేరళ రాష్ట్రంలో తాళపత్రాల రూపంలో కలదు. అంతే కాకుండా పంజాబులోని ప్రాచీన తాళపత్రాల పట్టికలో ఈ ధనుర్వేదాన్ని తెలిపే గ్రంథాల వివరాలు ఇంకొన్ని ఇవ్వబడ్డాయి. అందులో " శివ ధనుర్వేదం " , మనుసార్ణ , చతుష్టష్టికళ సంగ్రహం , యమళాష్టకం మాత్రమే కాక వైశాలాక్షం అనే పేరుతో 10,000 శ్లోకములు కల్గిన గ్రంథము కూడా తెలుపబడింది. ఇవే కాకుండా మరికొన్ని గ్రంథాల పేర్లు కూడా తెలియచేస్తాను . 

     * వశిష్ట సంహిత . 

     * సారంగధరుని విరచింతామణి . 

     * కోదండ మండనము . 

     * హరిహర చతురాంగం . 

     * రాజ - విజయం . 

     * భోజుని ధనుస్సంహిత .  

          పైన చెప్పినవే కాకుండా విశ్వమిత్ర సంహితము , లోహార్ణవము , లోహరత్నాకరము , సోవనేశ్వరుని " అభిలాషితార్ధ చింతామణి " , బసవేశ్వరుని " శివతత్వ రత్నాకరం " వంటి గ్రంథముల యందు కూడా ధనుర్విద్యకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. వరాహమిహిరాచార్యుడు వ్రాసిన బృహత్సంహిత అన్న విజ్ఞానసర్వస్వము లో కూడా అస్త్రములు తయారుచేసే పద్దతి , రకరకాల కత్తులు శూలాలు , వివిధ ఆయుధాలు తయారుచేసే పద్దతి వర్ణించాడు. 

              ధనుర్వేదము నందు రథములు , ఏనుగులు , కాల్బలములు నడిపించే పద్దతి , సైన్యమును నిలబెట్టే వ్యూహరచన వర్ణించబడినవి. వేదవ్యాస మహర్షి మహాభారతములో భీష్మద్రోణ పర్వాలలో ముఖ్యముగా చక్రవ్యూహము , క్రౌంచవ్యూహము వంటి అనేక సైనిక విన్యాసాలు వర్ణించాడు . పైన చెప్పిన గ్రంధములే కాకుండా ఇంకా ఎన్నో విలువైన గ్రంథములు విదేశాలకు తరలిపోయాయి . మరికొన్ని తాటిఆకులపై రాసి ఉండి సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వలన కాలగర్భములో కలిసిపోయాయి. బ్రిటిషు లైబ్రరీ నందు ఆగ్నేయాస్త్రము గురించి తెలియచేసే ఒక ప్రాచీన వ్రాతపతిని చూసినట్లు "మేడం బ్లావట్స్కి " తన గ్రంధములో రాశారు . 

            అదేవిధముగా ధనుర్వేదము గురించి తెలియచేసే ఇతర గ్రంధములలో ద్రోణాచార్యుడు రచించిన ధనుశ్శాస్త్రము , బసవేంద్రుడి శివతత్వ రత్నాకరం లొని ప్రకరణము , ధనుర్వేద సంహిత , రేవంత్తోత్తరము , భోజరాజీయము , అశ్వలక్ష్మణ సారము మొదలయిన ప్రాచీన గ్రంధములే కాక కొన్ని మహాపురాణాలలో కూడా ఈ ధనుర్విద్య గురించి వివరించబడినది. వాల్మీకి రామాయణములో బాలకాండలో అస్త్రవిద్య వివరాలు తెలుపబడినవి . 

        ధనుర్విద్యకు పదకొండు ఏకాదశ ఉపవిద్యలు ఉండును. అవి 

  * విలువిద్య .
 
  * అస్త్రవిద్య . 

  * మల్ల శాస్త్రం ( కుస్తీ లేక బాక్సింగ్ ) . 

  * అశ్వ శాస్త్రం . 

  * గజ శాస్త్రం . 

  * ఖడ్గ ధారణము . 

  * వ్యూహ శాస్త్రం ( సేనలను నిలబెట్టు వ్యూహాలు )

  * సేనా శాస్త్రం ( ఆర్మీ ట్రైనింగ్ ) . 

  * రధ - శిక్షణ శాస్త్రం . 

  * వాహనారోహణము .  

         పైన చెప్పిన 11 రకాల విద్యలు ధనుర్విద్యకు ఉపవిద్యలుగా పరిగణించబడుతున్నాయి. 

           

Sunday, March 30, 2025

లిపిడ్ ప్రొఫైల్**

**లిపిడ్ ప్రొఫైల్**  
*అద్భుతంగా వివరించబడింది*  
ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు.  

**మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.** ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్*. వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు. ప్రధాన సహచరుడు *ట్రైగ్లిసరైడ్*. వారి పని ఏమిటంటే, రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం, మార్గాలను అడ్డుకోవడం.  

*హృదయం* ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్. అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి. ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.  

కానీ మన శరీర-పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.  
*HDL* మంచి పోలీస్, ఇబ్బంది కలిగించేవారిని అరెస్ట్ చేసి జైలులో (కాలేయం) ఉంచుతాడు. కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది.  

అయితే, ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు, *LDL*, అతను శక్తి కోసం ఆశించేవాడు.  
*LDL* ఇబ్బంది కలిగించేవారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు.  

మంచి పోలీస్ *HDL* కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు, పట్టణం గందరగోళంగా మారుతుంది. అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు?  

*మీరు ఇబ్బంది కలిగించేవారిని తగ్గించి, మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా?*  

**నడవడం ప్రారంభించండి!** ప్రతి అడుగుతో, మంచి పోలీసులు *HDL* పెరుగుతారు, మరియు ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, మరియు LDL* తగ్గుతారు.  

మీ పట్టణం (శరీరం) తిరిగి దీప్తిని పొందుతుంది. మీ హృదయం, సిటీ సెంటర్, ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్‌లు (హృదయ బ్లాక్) నుండి సురక్షితంగా ఉంటుంది. మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.  

*కాబట్టి, మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి!*  
*ఆరోగ్యంగా ఉండండి... మరియు*  
*మంచి ఆరోగ్యాన్ని పొందండి*  

ఇది మంచి *HDL* ను పెంచడానికి మరియు చెడ్డ *LDL* ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం. *ప్రతి నడక అడుగు HDL ను పెంచుతుంది. అందువల్ల, నడవండి, నడవండి మరియు నడవండి.*  
*సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్*  

### **తగ్గించాల్సినవి:**  
1. ఉప్పు  
2. చక్కెర  
3. బ్లీచ్ చేసిన పిండి  
4. పాల ఉత్పత్తులు  
5. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు  

### **కావలసిన ఆహారాలు:**  
1. కూరగాయలు  
2. పప్పులు  
3. బీన్స్  
4. గింజలు  
5. గుడ్లు  
6. కోల్డ్ ప్రెస్డ్ నూనె (ఆలివ్, కొబ్బరి, ...)  
7. పండ్లు  

### **మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:**  
1. మీ వయస్సు  
2. మీ గతం  
3. మీ ఫిర్యాదులు  

### **ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి:**  
1. మీ కుటుంబం  
2. మీ స్నేహితులు  
3. మీ సానుకూల ఆలోచనలు  
4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు  

### **అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:**  
1. ఎప్పుడూ నవ్వండి / చిరునవ్వు  
2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి  
3. మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి  

### **అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు:**  
1. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి  
2. అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి  
3. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి  
4. అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి  
5. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి  
6. సానుకూలంగా ఉండి, ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి  

*మీ స్నేహితులు ఈ వయస్సు పరిధిలో (47-90 సంవత్సరాలు) ఉంటే, దయచేసి వారికి ఈ సందేశాన్ని పంపండి.*

Thursday, March 27, 2025

ఆహర విరుద్ధాలు -

ఆహర విరుద్ధాలు -

 మనం భుజించే ఆహరం వరసగా 

 1.రసం .

 2.రక్తం .
 
 3.మాంసం .

 4.మేధస్సు (కొవ్వు ) .

 5. ఎముక .

 6. మజ్జా .

 7. వీర్యము. (ఆర్థవము ).

అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.

 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.

 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.

 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.

 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.

 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .

 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .

 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.

 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.

 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.

 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.

 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.

 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.

       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు. 


Wednesday, March 26, 2025

హరిఃఓం

హరిఃఓం .🌹

*అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!!* 

🕉పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

💧 *తీర్ధం* యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. 

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో 
💦 *పంచామృతాలు* , 
☘ *తులసి దళాలు* , 
🥃 *సుగంధ ద్రవ్యాలు* ,

📿 *మంత్ర శక్తులు* ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

👌 *మొదటిసారి* తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. ( *అకాల మృత్యు హరణం* )

👌 *రెండవసారి* తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ( *సర్వవ్యాధి నివారణం!* )

👌 *మూడవది* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.( *సమస్త పాపక్షయకరం* )

📚 *పురాణాల** ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.
మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. *కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం ముద్ర* వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ రంద్రం *సహస్రార చక్ర*ఋ ఉంటుంది. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.

హరిఃఓం🙏🙏

సేకరణ .

ఆలోచనలు

*ఆలోచనలు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*'ఆలోచనల రూపమే మనం'* అంటాడు *బుద్ధుడు•* 

 మనసులో అమంగళ కరమైన ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, ముఖంలో అవే వికృత భావాలు ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతుంటాయి. 

 *ముఖం - మనసుకు ప్రతీక* అంటారు పెద్దలు• ప్రశాంతమైన మోము కలిగినవారి మనసు *'తేటనీటి కొలను'•* 

 ఆలోచనలు - వికసించిన పువ్వు చుట్టూరా తిరిగే *భ్రమరం* లా శుభాల చుట్టూ పరిభ్రమిస్తాయి. అశుభం వైపు పోకుండా మనసును సున్నితంగా పట్టి ఉంచుతాయి.

 మన సంప్రదాయంలో *దీవెన* కు విశేష స్థానం ఉంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధాప్య దశ దాకా వివిధ సందర్భాల్లో పెద్దల ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు. 

 *మంగళాశాసనం* అంటే మనసా వాచా ఒకరి భావబలం మనల్ని వెన్నంటి ఉండటం. ఆశీర్వాదబలం వెన్నుదన్నుగా ఉంటే విద్యార్థి నుంచి కార్యార్థి వరకు... అందరికీ అన్నింటా సఫలమే!

 పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు, *'అన్నీ తామే, అంతా తామే'* అన్నట్లుగా... కాస్త బెడిసి కొడితే... *'తమ చేతిలో ఏదీ లేదన్నట్లుగా'* మాట్లాడుతుంటారు కొందరు. 

 ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శ్రేయోతత్త్వాన్ని విడిచిపెట్టనివారు - *విజయకాంక్ష* ఉన్నవారు. ఓటమికి వెరవనిది, కుంగిపోనిదీ వారే!

 *చదవడం* అంటే అందరికీ *పుస్తకమే* గుర్తుకు వస్తుంది. 

 ఒక లక్ష్యం ఏర్పరచుకుని, అనుక్షణం శ్రేయోభిలాషతో - ఎవరు తనతో కలిసివచ్చినా, రాకపోయినా దృఢంగా అడుగులేసుకుంటూ గమ్యం వైపు సాగిపోయేవారు మనకు ఎక్కడో అక్కడ అరుదుగా తారసపడతారు. వారిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకుంటే, మన మనసులో *'పుట్టినందుకు ఏదైనా సాధించాలి'* అనే తపనకు బీజం పడుతుంది. మన నిత్య కృషితో అది, ఏదో నాటికి మహావృక్షం అవుతుంది. మన కీర్తిని అజరామరం చేస్తుంది.

 మన ప్రమేయం లేకుండా చెయ్యి కదలదు, కాలు నడవదు. మరి *ఆలోచనలు మాత్రం కట్టు తెగిన కోడెల్లా, కట్ట తెగిన వరద నీటిలా ఇచ్ఛారీతిన ప్రవహిస్తే ఎలా?* వాటికి కళ్లెం వేయాలి. మన ఆలోచనలు మనకు ఉపయోగపడాలి. చెరుపు చేయకూడదు. 

 *శరీరం మీద కాకుండా మనసుపై పెట్టే శ్రద్ధ మేలు చేస్తుంది. మనుషులను ఋషులుగా మాధవులుగా చేస్తుంది.*

 *హృదయం నవనీతం అయితే, నోటి నుంచి కర్ణపేయంగా వెలువడే మాటలు నలుగురికీ దగ్గరయ్యేలా చేస్తాయి.*

 *కీడెంచి మేలెంచమని* మన పూర్వులు చెప్పింది, జీవితంలో ఏమరుపాటును వదిలి అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడానికి. అంతేకాని - ఆ భావాన్నే అంటి పెట్టుకుని, నిత్యం శంకలతో కాలం గడుపుతూ, జీవితాన్ని వృథా చేసుకొమ్మని కాదు. 

 శ్రేయోదాయక ఆలోచనలు మనసును స్వచ్ఛమైన వేదికగా మారుస్తాయి. దానిపై కొలువుదీరడానికి అంతర్యామి ఉవ్విళ్లూరతాడన్నది సత్యం. 

 ఆధ్యాత్మికంగా ఉత్తమ ఆలోచనలకు ఉన్న గొప్ప శక్తి అది. ముముక్షువులు భగవదవతారంగా గుర్తింపు పొందడానికి అదే కారణం.
             🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏

                              🌼శుభమస్తు🌺

తెలుగు సంవత్సరాల పేర్లు...* *వాటి అర్థాలు*

*తెలుగు సంవత్సరాల పేర్లు...* *వాటి అర్థాలు*
                  
1. ప్రభవ అంటే...ప్రభవించునది. 
    అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది.  
    నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు 
    ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. 
    ప్రమోదభరితంగా ఉండేది 
    ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ అంటే 
    సంతానం. సంతాన వృద్ధి 
    కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే 
    శరీర అంగాల్లోని ప్రాణశక్తి, 
    ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ 
    దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది 
    అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. 
    ముఖం ప్రధానాంశం కాబట్టి 
    అంతా శుభంగా ఉండేదని 
    అర్ధం.

8. భావ.... భావ అంటే భావ 
    రూపుడిగా ఉన్న నారాయణుడు. 
    ఈయనే భావ నారాయణుడు. 
    ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి 
    ముందు సంకల్పం చేసే బ్రహ్మ 
    అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది 
    బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే 
    ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా 
    ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు 
    అని అర్థమున్నప్పటికీ    
    సంవత్సరమంతా ప్రమాదాలు 
    జరుగుతాయని భయపడనవసరం 
    లేదు.

14. విక్రమ..విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే 
    సూర్యుడు. సూర్యుడి ప్రధాన  
    లక్షణం ప్రకాశించటం. చిత్రమైన 
    ప్రకాశమంటే మంచి గుర్తింపు 
    పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి 
    గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని 
    అర్థం.

18. తారణ... తరింపచేయడం 
    అంటే దాటించడం. కష్టాలు 
    దాటించడం, గట్టెక్కించడం అని 
    అర్థం.

19. పార్థివ..పృధ్వీ సంబంధమైనది, 
    గుర్రం అనే అర్థాలున్నాయి. 
    భూమికున్నంత సహనం, 
    పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ 
    ఖర్చు శుభాల కోసం ఖర్చై
    ఉంటుందని ఈ సంవత్సరం 
    అర్థం.

21. సర్వజిత్తు.. సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -. సర్వాన్ని ధరించేది.

23.విరోధి..విరోధం కలిగినటువంటిది.

24. వికృతి...వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక 
    రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన 
    పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, 
    ఉద్యానవనం, ఆనందాన్ని 
    కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం 
    కలిగినది.

28. జయ... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ..మనస్సును మధించేది.

30. దుర్ముఖి...చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... 
    దాటించునది అని అర్థం.

36. శుభకృత్..శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను 
    కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను 
    కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస...రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి 
    రూపాంతరం.

51. పింగళ.. ఒక నాడి, కోతి, 
    పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన     
    యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది.`


.

వడదెబ్బ - నివారణా యోగాలు .

వడదెబ్బ - నివారణా యోగాలు .

 * ఉల్లిపాయరసం ని వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అవుతుంది.

 * వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపిలో గాని , రుమాలులో గాని నడినెత్తిన ఉండునట్లు కట్టి నడిచిన వడదెబ్బ తగలదు. జేబులో నైనా ఉంచుకోవచ్చు.

 * నీరుల్లిపాయ రసం రెండు కనతలకు , గుండెకి పూసిన వడ దెబ్బవలన కలిగిన బాధ హరించును. 

 * వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరం పైన నీళ్లు చల్లుతూ , తలపైన మంచు గడ్డలను వుంచి త్రాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

 * కుమ్మున ఉడికించిన మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు త్రాగుచుండిన వడదెబ్బ తగలదు.

 * విశ్రాంతిగా పడుకోపెట్టి కాఫీ తాగుటకు ఇచ్చిన వడదెబ్బ నుండి తట్టుకొందురు.

 * నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనెని వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారించును.

 * వడగండ్లు పడినప్పుడు ఏరి విబూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడువేల్లకు వచ్చినంత మంచినీటిలో వేసి ఇచ్చిన ఎండదెబ్బ నివారణ అగును.

 * నువ్వులనూనేలో చనుబాలు రంగరించి చెవులలో వేసి కొంచం వెచ్చటి నీళ్లలో నెయ్యివేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును . 

 * తరవాణి తేటలో ఉప్పుని చేర్చి ఇవ్వవలెను.

 * తాటి ముంజలు పంచదారతో ఇవ్వవలెను. 

 * నాలుకకు పాత ఉసిరి పచ్చడి రాసి , పుల్లని ఆవు మజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసం ని త్రాగించ వలెను.

 * చన్నీటితో స్నానం చేయవలెను . 

 * వేడివేడి పల్చని గంజిలొ ఉప్పు వేసి త్రాగవలెను.

 * నిమ్మ ఉప్పుని నోటిలో వేసుకోనిన నాలుకకు ఉట ఊరి వడదెబ్బ నివృత్తి అగును.

         తగు జగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి తప్పించుకోగలరు. ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలితే పైన చెప్పిన నివారణా ఉపాయాలు ఉపయొగించుకొని బయటపడగలరు. 

 

Monday, March 24, 2025

యోగాసనాలు & వాటి ప్రయోజనాలు ✨

26 యోగాసనాలు & వాటి ప్రయోజనాలు ✨

పి.ఆర్.కే రెడ్డి గారు "మీ ఆరోగ్యం మీ చేతుల్లో" గ్రూపులో 26 యోగాసనాల ఫొటోలు, మువ్మెంట్స్ వివరంగా చూపించారు. ఆయన్ను మనమందరం అభినందిద్దాం.
ఇప్పుడు ప్రతీ యోగాసనాన్ని మూడు లైన్లలో వివరించాను. మీ ఆరోగ్య ప్రయోజనాల కోసం వాటిని పాటించండి.

---

1. తాడాసనం (Mountain Pose) 🏔️

ఇది శరీరాన్ని సరైన భంగిమలో ఉంచుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మెదడు ప్రశాంతంగా ఉంటుంది.

---

2. వృక్షాసనం (Tree Pose) 🌳

సమతుల్యత పెరిగి, కాళ్ల బలం పెరుగుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

మానసిక ఏకాగ్రత పెంచుతుంది.

---

3. అధో ముఖ శ్వానాసనం (Downward Dog) 🐕

వీపునొప్పిని తగ్గిస్తుంది.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది.

మెదడు దెబ్బతినకుండా రక్షిస్తుంది.

---

4. భుజంగాసనం (Cobra Pose) 🐍

వెన్నునొప్పికి ఉపశమనం ఇస్తుంది.

గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

---

5. ధనురాసనం (Bow Pose) 🎯

కడుపులో కొవ్వు తగ్గుతుంది.

వెన్నుపూస బలంగా మారుతుంది.

జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

---

6. శలభాసనం (Locust Pose) 🦗

వెన్ను, నడుము నొప్పి తగ్గుతుంది.

కడుపు మాసిల్స్ బలపడతాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.

---

7. నవకాసనం (Boat Pose) 🚣‍♂️

పొట్ట చుట్టూ కొవ్వు కరిగిస్తుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

---

8. పశ్చిమోత్తాసనం (Seated Forward Bend) 🧘‍♂️

వెన్నునొప్పి తగ్గుతుంది.

మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

---

9. ఉత్తానాసనం (Standing Forward Bend) 🙇‍♂️

నరాల బలహీనత తగ్గుతుంది.

మెదడుకు శక్తి అందుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

---

10. మత్స్యాసనం (Fish Pose) 🐟

థైరాయిడ్ సమస్యలకు మంచిది.

శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.

---

11. హలాసనం (Plow Pose) 🌾

వెన్నుముక దృఢంగా మారుతుంది.

జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది.

---

12. సర్వాంగాసనం (Shoulder Stand) 🔄

రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది.

మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

---

13. అర్ధమత్స్యేంద్రాసనం (Half Spinal Twist) 🔄

వెన్నునొప్పి తగ్గుతుంది.

జీర్ణక్రియ మెరుగవుతుంది.

మానసిక స్థిరత పెరుగుతుంది.

---

14. వజ్రాసనం (Thunderbolt Pose) ⚡

భోజనం తర్వాత చేయడానికి ఉత్తమమైన ఆసనం.

గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

మోకాళ్ల బలహీనత తగ్గుతుంది.

---

15. గోముఖాసనం (Cow Face Pose) 🐄

భుజాల నొప్పి తగ్గుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

నడుము నొప్పిని తగ్గిస్తుంది.

---

16. కపోతాసనం (Pigeon Pose) 🕊️

నడుము నొప్పి తగ్గుతుంది.

నరాల వాపు తగ్గుతుంది.

మానసిక ప్రశాంతత కలుగుతుంది.

---

17. మండూకాసనం (Frog Pose) 🐸

జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

---

18. ఉష్ట్రాసనం (Camel Pose) 🐫

వెన్నునొప్పి తగ్గుతుంది.

ఛాతీ, ఊపిరితిత్తులు శక్తివంతమవుతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

---

19. సింహగర్జనాసనం (Lion Pose) 🦁

గొంతు సమస్యలకు మంచి పరిష్కారం.

థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ముక్కు, గొంతు, కళ్ల ఆరోగ్యానికి మంచిది.

---

20. మయూరాసనం (Peacock Pose) 🦚

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

శరీర బలాన్ని పెంచుతుంది.

చెడు కొవ్వును కరిగిస్తుంది.

---

21. తిట్టిబాసనం (Firefly Pose) 🦟

భుజాల బలం పెరుగుతుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది.

శరీరాన్ని లైట్‌గా ఉంచుతుంది.

---

22. అష్టావక్రాసనం (Eight-Angle Pose) 🔄

శరీరాన్ని నడిపించే నరాలను బలపరుస్తుంది.

మానసిక ఏకాగ్రత పెరుగుతుంది.

భుజాల, చేతుల బలం పెరుగుతుంది.

---

23. అర్ధచంద్రాసనం (Half Moon Pose) 🌙

సమతుల్యత పెరుగుతుంది.

వెన్నుముక దృఢంగా మారుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది.

---

24. సుప్త వజ్రాసనం (Sleeping Thunderbolt) 😴

మోకాళ్ల నొప్పిని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.

---

25. సిద్ధాసనం (Perfect Pose) 🙏

ధ్యానం, ప్రాణాయామానికి ఉత్తమమైనది.

నరాల బలం పెరుగుతుంది.

మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

---

26. శవాసనం (Corpse Pose) ⚰️

పూర్తిగా రిలాక్స్ అయ్యే ఆసనం.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.

---



🙏🏻👍

Thursday, March 20, 2025

వేసవి పండ్లు

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి అధిక నీటి శాతం ఉండే పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో తప్పక తినాల్సిన కొన్ని పండ్లు ఏంటో తెలుసుకుందాం..

(1).పుచ్చకాయ లో అధికంగా నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

(2).కీరదోసకాయ లో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది

(3).కర్బుజ లోను ఎక్కువ నీటి శాతం ఉంటుంది, ఇది వేసవిలో హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

(4).ద్రాక్ష లో విటమిన్లు, మినరల్స్ లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

(5).బొప్పాయి లో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

వేసవి కాలం పండ్లు (మార్చి-మే):

 వేసవి కాలం పండ్లు (మార్చి-మే):

(1).మామిడి పండ్లు : 

"పండ్ల రాజు", ఒక ప్రసిద్ధ మరియు ప్రసిద్ధ వేసవి పండు.

(2).పుచ్చకాయలు : 

వేడి వాతావరణానికి అనువైన, తాజాదనం మరియు జ్యుసిగల పండు.

(3).బొప్పాయిలు : 

విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

(4).ద్రాక్ష :
 
వేసవి చివరిలో రుచికరమైన పండ్లు.

(5).జ్యుసి ప్లమ్స్ :
 
 తీయని పండ్లు .

(6).చెర్రీస్ : 

ఒక చిన్న, తీపి మరియు జ్యుసి పండు.

(7).నేరేడు పండ్లు : 

సూర్య రక్షణకు సహజ మూలం.

(8).పియర్ :
 
అనేక రకాలతో కూడిన జాక్-ఆఫ్-ఆల్-ట్రేడ్ పండు. 
 
[21/03, 08:38] Pcg Mgmt Ashok Acupressure: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి అధిక నీటి శాతం ఉండే పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో తప్పక తినాల్సిన కొన్ని పండ్లు ఏంటో తెలుసుకుందాం..

(1).పుచ్చకాయ లో అధికంగా నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

(2).కీరదోసకాయ లో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది

(3).కర్బుజ లోను ఎక్కువ నీటి శాతం ఉంటుంది, ఇది వేసవిలో హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

(4).ద్రాక్ష లో విటమిన్లు, మినరల్స్ లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

(5).బొప్పాయి లో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

సృష్టి రహస్య విశేషాలు*

*సృష్టి రహస్య విశేషాలు*

1 సృష్టి ఎలా ఏర్పడ్డది?
2 సృష్టి కాల చక్రము ఎలా నడుస్తుంది?
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి?

(సృష్టి) ఆవిర్బావము.
1. ముందు పరాపరము దీనియందు శివము పుట్టినది
2 శివమునందు శక్తి
3 శక్తి యందు నాదము 
4 నాదమునందు బిందువు
5 బిందువునందు సదాశివుఁడు
6 సదాశివుని యందు మహేశ్వరుఁడు
7 మహేశ్వరుని యందు ఈశ్వరుఁడు
8 ఈశ్వరుని యందు రుద్రుఁడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశము
13 దహరాకాశమునందు వాయువు
14 వాయువునందు అగ్ని
15 ఆగ్ని యందు జలము 
16 జలమునందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషధుల వలన అన్నము 
19. ఈ అన్నము వల్ల...... నర , మృగ , పశు , పక్షి ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్టి ) కాల చక్రము.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు  
ఎంతోమంది విష్ణువులు  
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51వ బ్రహ్మ.
1 కృతాయుగము
2 త్రేతాయుగము
3 ద్వాపరయుగము
4 కలియుగము
నాలుగు యుగాలకు 1 మహాయుగము.
71 మహాయుగాలకు 1మన్వంతరము.
14 మన్వంతరాలకు ఒక సృష్టి (ఒక కల్పము)
15 సంధులకు ఒక ప్రళయము (ఒక కల్పము)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయము)
2000 యుగాలకు ఒక దినము.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహాయుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరాలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరాలు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువు కాలములో ఉన్నాము. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాము
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలానికి 12 సం
1 సంవత్సరానికి 6 ఋతువులు.
1 సంవత్సరానికి 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిథులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారానికి 7 రోజులు
పంచాంగంలో 
1 తిధి. 
2 వారము.  
3 నక్షత్రము.  
4 కరణము.  
5 యోగము.
సృష్టి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గాలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణము 
2 రజో గుణము 
3 తమో గుణము 
( పంచ భూతాలు ఆవిర్భావము)
1 ఆత్మ యందు ఆకాశము 
2 ఆకాశము నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలము 
5 జలము నుండి భూమి అవిర్భవించాయి.
5 జ్ఞానేంద్రియాలు
5 పంచ ప్రాణాలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియాలు
5 కర్మేంద్రియాలు = 25 తత్వంలు
(ఆకాశ పంచీకరణాలు)
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల (జ్ఞానము)
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల (బుద్ధి)
ఆకాశం - జలంతో కలవడంవల్ల (చిత్తము)
ఆకాశం - భూమితో కలవడంవల్ల (అహంకారము) పుడుతుతున్నాయి
(వాయువు పంచీకరణాలు)
వాయువు - వాయువుతో కలవడం వల్ల (వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల (సమాన)
వాయువు - అగ్నితో కలవడంవల్ల (ఉదాన)
వాయువు - జలంతో కలవడం వల్ల (ప్రాణ)
వాయువు - భూమితో కలవడంవల్ల (అపాన) వాయువులు పుడుతున్నాయి.
(అగ్ని పంచీకరణాలు)
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల (శ్రోత్రం)
అగ్ని - వాయువుతో కలవడంవల్ల (వాక్కు)
అగ్ని - అగ్నిలో కలవడంతో (చక్షువు)
అగ్ని - జలంతో కలవడంతో (జిహ్వ)
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణము) పుట్టెను.
(జలము పంచీకరణాలు)
జలం - ఆకాశంలో కలవడంవల్ల (శబ్దము)
జలము - వాయువుతో కలవడంవల్ల ( స్పర్శ)
జలం - అగ్నిలో కలవడంవల్ల (రూపము)
జలం - జలంలో కలవడంవల్ల (రసము)
జలం - భూమితో కలవడం వల్ల (గంధము) పుట్టెను.
(భూమి పంచీకరణాలు)
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాణి )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదము )
భూమి - జలంతో కలవడంతో ( గుహ్యము )
భూమి - భూమిలో కలవడంవల్ల (గుదము) పుట్టెను.
(మానవదేహ తత్త్వ స్వరూపము- విభాగాలు) 
(పంచతన్మాత్రలు)
1 శబ్దము 
2 స్పర్శ
3 రూపము 
4 రసము 
5 గంధము 
(జ్ఞానేంద్రియాలు)
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
(అంతః కరణాలు)
1 మనస్సు
2 బుద్ధి
3 చిత్తము 
4 జ్ఞానము 
5 అహంకారము 
(కర్మేంద్రియాలు)
1 వాక్కు
2 పాణి
3 పాదము 
4 గుహ్యము
5 గుదము
(అరిషడ్వర్గాలు)
1 కామము 
3 క్రోధము 
3 మోహము 
4 లోభము 
5 మదము 
6 మాత్సర్యము 
(శరీరాలు)
1 స్థూల శరీరము 
2 సూక్ష్మ శరీరము 
3 కారణ శరీరము 
(అవస్థలు)
1 జాగ్రదవస్థ
2 స్వప్నావస్థ
3 సుషుప్త్యవస్థ
(షడ్భావ వికారాలు)
1 పుట్టుట
2 పెరుగుట
3.ఉండుట
4 పరిణమించుట
5 క్షిణించుట
6 నశించుట
(షడూర్ములు)
1 ఆకలి
2 దప్పిక
3 శోకము 
4 మోహము 
5 జరా
6 మరణము 
(సప్త ధాతువులు)
1 చర్మము 
2 రక్తము 
3 మాంసము 
4 మేధస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లము
(జీవత్రయాలు)
1 విశ్వుడు
2 తైజసుడు
3 ప్రాఙ్ఞుడు
(కర్మత్రయాలు)
1 ప్రారబ్ధ కర్మలు
2 ఆగామి కర్మలు
3 సంచిత కర్మలు
( కర్మలు)
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
(గుణాలు)
1 సత్వ గుణము 
2 రజో గుణము 
3 తమో గుణము 
(చతుష్టయములు)
1 సంకల్పము
2 అధ్యవసాయము
3 అభిమానము 
4 అవధారణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్షా
(పంచభూతాలు)
1 ఆకాశము 
2 వాయువు
3 అగ్ని
4 జలము 
5 భూమి 
(అవస్థ దేవతలు)
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వినీ దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతుర్వక్త్రుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
 (నాడులు)
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాంధారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
(వాయువులు)
1 ప్రాణము 
2 అపానము
3 వ్యానము 
4 ఉదానము
5 సమానము 
6 కూర్మము
7 కృకరము
8 నాగము
9 దేవదత్తము
10 ధనంజయము
7 ( షట్ చక్రాలు )
1 మూలాధార
2 స్వాధిష్ఠాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ధి
6 ఆజ్ఞా
7 సహస్రారము 
(మనిషి ప్రమాణాలు)
96 అంగుళాలు
8 జానల పొడవు
4 జానల వలయము
33 కోట్ల రోమాలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీళ్ళు 
37 ముారల ప్రేగులు
1 సేరు గుండె
అర్ధ సేరు రుధిరము
4 సేర్లు మాంసము 
1 సేరెడు పైత్యము
అర్ధ సేరు శ్లేష్మము
(మానవ దేహంలో 14 లోకాలు)  
పైలోకాలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భువర్లోకం - హృదయంలో
3 సువర్లోకం - నాభిలో
4 మహర్లోకం - మర్మాంగంలో
5 జనోలోకం - కంఠంలో
6 తపోలోకం - భ్రూమధ్యములో
7 సత్యలోకం - లలాటంలో
అధోలోకాలు 7
1 అతలం - అరికాళ్ళలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకాల్లలో
6 మహాతలం - తొడల్లో
7 పాతాళం - పాయువుల్లో
( మానవ దేహంలో సప్త సముద్రాలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షు సముద్రం - చెమట
3 సురా సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దధి సముద్రం - శ్లేషం
6 క్షీర సముద్రం - జోల్లు
7 శుద్ధోదక సముద్రం - కన్నీరు
( పంచాగ్నులు )
1 కాలాగ్ని - పాదాల్లో
2 క్షుధాగ్ని - నాభిలో
3 శీతాగ్ని- హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 జ్ఞానాగ్ని - ఆత్మలో
7 (మానవ దేహంలో సప్త దీపాలు)
1 జంబుా ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సున
4 శాల్మలి ధ్వీపం - చర్మమున
5 పుష్కర ద్వీపం - గోలమందు
6 కుశ ద్వీపం - మాంసంలో
7 క్రౌంచ ద్వీపం - వెంట్రుకల్లో
10 ( నాదాలు )
1.లాలాదిఘోష -నాదము
2 భేరి - నాదము 
3 చణీ - నాదము 
4 మృదంగ - నాదము 
5 ఘంటా - నాదము 
6 కింకిణీ - నాదము 
7 కళ - నాదము 
8 వేణు - నాదము 
9 భ్రమణ - నాదము 
10 ప్రణవ - నాదము 

శుభమస్తు.

భూలోకంలో అమృతం మజ్జిగ*

*19-Mar-25, Enlightenment Story*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
*భూలోకంలో అమృతం మజ్జిగ*

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు

అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్‌!
తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. 

క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. 
ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్‌ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్‌ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. 
మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. 
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
 *శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

దేశీ బియ్యం రకాలు మరియు వాటి

*దేశీ బియ్యం రకాలు మరియు వాటి ఆయుర్వేద లక్షణాలు మరియు ప్రయోజనాలు*
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
1. రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.
2. కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు. 
3. పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.
4. కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.
5. మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.
6. చింతలూరు సన్నాలు > తెలుపు> సన్నరకం > పంటకాలం>110 నుండి 120 రోజులు.
7. కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.
8. ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.
9. నవార >ఎరుపు>మధ్యరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
10. రామ్ జీరా > తెలుపు> పొట్టిరకము> పంటకాలం 120 నుండి130 రోజులు.
11. ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
12. సిద్ధ సన్నాలు >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి 135రోజులు.
13. గురుమట్టియా > తెలుపు> లావురకం> పంటకాలం130 నుండి135రోజులు.
14. రత్నచోడి > తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
15. మడ మురంగి >ఎరుపు>లావురకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
16. కెంపు సన్నాలు > ఎరుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135రోజులు.
17. దూదేశ్వర్ >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
18. నారాయణ కామిని >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి140 రోజులు.
19. బర్మా బ్లాక్ లాంగ్ >నలుపు>పొడవు రకము>పంటకాలం>130 నుండి 135 రోజులు.
20. బర్మా బ్లాక్ షార్ట్ >నలుపు>పొట్టిరకము> పంటకాలం>130 నుండి135 రోజులు.
21. బాసుమతి > తెలుపు>పొడవు> పంటకాలం>130 నుండి135 రోజులు.
22. గంధసాలె >తెలుపు>పొట్టిరకము> పంటకాలం>135 నుండి 140 రోజులు.
23. వెదురు సన్నాలు >తెలుపు>లావురకం> పంటకాలం>135 నుండి145 రోజులు.
24. కామిని భోగ్ >తెలుపు> పొట్టిరకము> పంటకాలం>140 నుండి145 రోజులు.
25. ఇల్లపుసాంబ > తెలుపు> సన్నరకం> వంటకాలం>140 నుండి145 రోజులు.
26. కాలాబట్టి >నలుపు>లావురకము> పంటకాలం>140 నుండి150 రోజులు.
27. కాలాబట్ >నలుపు>లావురకం> పంటకాలం>140 నుండి150 రోజులు.
28. బాస్ బోగ్ >తెలుపు> పొట్టిరకం> పంటకాలం>140 నుండి150 రోజులు.
29. రధునిపాగల్ > తెలుపు>పొట్టిరకము> పంటకాలం>140 నుండి145 రోజులు.
30. బహురూపి >తెలుపు>లావురకం> వంటకాలం>140 నుండి150 రోజులు.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
*దేశీవరి విత్తనాలు పంట కాలము,మాకు తెలిసిన సమాచారం ఇవ్వబడినది.ఇందులో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. "సర్వేజనా సుఖినోభవంతు"*
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾 
*దేశి రైస్ రకాలు వాటి ప్రాముఖ్యత.*

1. *👉 రక్త శాలి:* ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

2. *👉 కర్పూకవుని:* ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.

3. *👉 కుళ్లాకార్:* ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ ఆహార పంట బియ్యం.

4. *👉 పుంగార్:* ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది మరియు ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది,శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది.ఇది100% మహిళలకు మంచిది.

5. *👉 మైసూర్ మల్లిగా:* ఈ రైసు తెలుపు రంగులో ఉంటుంది.ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు,ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.పిల్లలకు మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

6. *👉 కుజిపాటలియా,సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు:* ఇవి తెలుపు,సన్న రకాలు.ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి.తక్కువ కేలరీలు కలిగి వుంటాయి,గ్లూకోజ్ పదార్థంలు తక్కువగా ఉంటాయి,రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.

7. 👉 రత్నచోడి:* ఈ రైసు తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి.కండపుష్టికి మరియు శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది.శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడే వారు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

8. *👉 బహురూపి,గురుమట్టియా,వెదురు సన్నాలు:* తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి.కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి.మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి.బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతాయి.

9. *👉 నారాయణ కామిని:* ఈ రైసు తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

10. *👉 ఘని:* ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

11. *👉 ఇంద్రాణి:* ఈ రైసు తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము.కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.పెద్దవాళ్లు కూడా తినవచ్చు.గుల్ల భారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

12. *👉 ఇల్లపు సాంబ:* ఈ రైసు తెలుపు, సన్నరకం,ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

13. *👉 చిట్టి ముత్యాలు:* ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదంలకు,పులిహారమునకు,బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

14. *👉దేశీ బాసుమతి:* ఈ రైసు తెలుపు,పొడవు రకము,సువాసన కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది. 

15. *👉 కాలాజీరా:* ఈ రైస్ తెలుపు రంగులో ఉంటుంది.ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

16. *👉 పరిమళ సన్నము,రాంజీరా,రధునీ పాగల్,గంధసాలె,తులసీబాసో,బాస్ బోగ్, కామిని బొగ్:* ఇవన్నీ తెలుపు రకము. సుగంధభరితమైన బియ్యం.ఇవి ప్రసాదంలకు, పులిహారములకు,పాయసములకు చాలా బాగుంటాయి.రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.

17. *👉 దూదేశ్వర్,అంబేమెహర్(scented వెరైటీ ):* ఈ రైసు తెలుపు,బాలింతల స్త్రీలకు పాలు పెరగడానికి తోడ్పడుతాయి.తద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తల్లి పిల్లలకు అధిక పోషకాలు అందుతాయి,తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

18. *👉 కుంకుమసాలి:* ఈ రైసు తెలుపు,రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

19. *👉 చికిలాకోయిలా:* ఈ రైసు తెలుపు,సన్న రకము, దీని వల్ల లాభం కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు,డైలీ కిడ్నీ డయాలసిస్ వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.కిడ్నీకి సంబంధించిన సమస్యల నుండి ఇబ్బంది పడకుండా సహాయపడుతుంది. 

20. *👉 మడమురంగి:* ఈ రైసు ఎరుపు,లావు రకము.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్,ఐరన్, జింక్,కాల్షియం ఉంటాయి.వర్షాకాలంలో అడుగు పైన ముంపును కూడ తట్టుకునే రకము. మంచి దిగుబడిని కూడా ఇస్తుంది.ఇది తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు.

21. *👉 కెంపు సన్నాలు:* ఈ రైసు ఎరుపు, సన్నరకం,ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్,కాల్షియం,జింక్,ఐరన్,అధిక పోషకాలు ఉంటాయి,రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

22. *👉 కాలాబట్టి,కాలాబట్,,బర్మా బ్లాక్,మణిపూర్ బ్లాక్:* ఇవి నలుపు రంగులో ఉంటాయి.ఇవి అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగినవి. ఈ రైస్ వలన కలిగే లాభాలు,క్యాన్సర్ మరియు డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారిన నుండి రక్షణ కల్పిస్తుంది.ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.ఈ బియ్యంలో విటమిన్ బి,ఇ,నియాసిన్,కాల్షియం,మెగ్నీషియం,ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు,పీచు పదార్ధాలు అధికము.ఈ బియ్యంలో ఆంకోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడమే గాక రోగనిరోధక ఎంజైములను క్రియాశీలకము చేస్తుంది. మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

23. *👉 పంచరత్న:* ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది,ఇది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది.అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.ఇది కూడా వండర్పుల్ రైస్.

24. *👉 మా పిళ్లేసాంబ:* ఈ రైసు ఎర్రగా ఉంటుంది.గర్భాధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు చాలా ఉపయోగం.రోజు ఇరువురు కనీసం 5నుండి6 నెలల వరకు తిన్నచో గర్భాధారణ జరుగును. ఇది ప్రాక్టికల్గా నిరూపించబడినది.దీనివలన కండ పుష్టి, దాతు పుష్టి ,వీర్య పుష్టి కలుగును. ఇమ్యూనిటీపవర్ కూడా పెరుగును.

25. *👉 నవార:* ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.ఈ విత్తనం త్రేతాయుగము నాటిది. షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది. మరియు మోకాళ్ళు,మోచేతి కీళ్ళ నొప్పులు,నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యంను వండి బాడీ మసాజ్ లో వాడుతారు పక్షపాతం ఉన్నవారికి. ఈ రైస్ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు.ఇది అన్ని వయసుల వారూ తినవచ్చును.ఒక పూట మాత్రమే తినవలెను. ఈ రైస్ యొక్క ప్రత్యేకత బియ్యం నుండి కూడా మొలకలు వచ్చును. ఇది వండర్ఫుల్ రైస్.

26. *👉 రాజముడి:* ఈ రైస్ తెలుపు ఎరుపు కలిగి ఉంటుంది.దీనిని ప్రాచీన కాలంలో మైసూర్ మహారాజుల కోసం ప్రత్యేకముగా పండించిన బియ్యముల్లో ఇది ఒకటి.దీనికి ప్రత్యేకస్థానం ఉంది.ఈ రైస్లో డైటరీ ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ ,జింక్,ఐరన్ అధికంగా ఉంటాయి. అందువలన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు ప్రీరాడికల్స్ నుండి నిరోధిస్తుంది.శరీరము అశ్వస్థత నుండి కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం యొక్క ఆకృతిని పెంచడానికి సహాయపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
*గమనిక:* దేశవాళీ విత్తనములు ఆన్నిరకాల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ.హైబ్రిడ్ విత్తనాలులో రోగనిరోధక శక్తి ఉండదు.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
*మా లక్ష్యం :*
భావితరాలకు👫 ప్రకృతి ఆహారం.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

బ్రహ్మ ముహూర్తం విశిష్టత!!!*

*🙏🕉️బ్రహ్మ ముహూర్తం విశిష్టత!!!*

*నలుబై ఎనిమిది నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేల్కోని, తమతమ పాఠ్యాంశాలను అధ్యాయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కాని పెద్దల మాటను ఈ విషయంలో చాల మంది పిల్లలు పెడచెవిన పెడతారు.*

*ఇందులోని వాస్తవమేమిటంటే , ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటబట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధనా సంస్థ విధ్యలో వెనకబడటంపై అధ్యాయనం జరిపి అలాంటి విధ్యార్థులు బ్రహ్మ ముహూర్తమున చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్థారించారు.*

*సూర్యోదయానికి నలుబై ఎనిమిది నిమిషాలకు ముందు బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది. ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది. కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతోంది. ఈ సమయాన్ని సరస్వతీ యానం అని కూడా అంటారు.*

*బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ఠే స్వాస్థ్య రక్షార్ధ మాయుషః*
*తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనమ్*

*‘బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుని స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్షు, సర్వ సంపదలు, సుఖ శాంతులు లభిస్తాయి.’*

*"ఆలస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్ అథనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం."*

*ఆలస్యంగా లేచే వానికి విద్య ఎలా వస్తుంది? విద్య లేకుండా ధనం ఎలా? ధనం లేకుంటే మిత్రులుండరు. ఇవి లేకుంటే సుఖముండదు.*

*తెల్లవారుజామున లేచి ఆరోజు ఆరోగ్యంతో నిద్రలేచి నందుకు సృష్టి-స్థితి-లయ కర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకుని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నేరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి.*

*కశ్యప ప్రజాపతికి వినీతకి పుట్టిన అనూరుడు వినీత తొందరపాటు వల్ల జన్మతోనే కాళ్లు లేకుండా జన్మించాడు. బ్రహ్మదేవుడు అతణ్ణి సూర్యరథానికి సారధిగా నియమించి అతను (అనూరుడు) సూర్య రథాన్ని తీసుకువచ్చే సమయానికి ఎవరు నిద్ర లేచి కార్యసాధనలో నిమగ్నలవుతారో వారిపై ఏ గ్రహం, నక్షత్రం చెడు ప్రభావం చూపలేదని వరమిచ్చాడని ఒక కథ.*

*మహర్షి శుశ్రుతుని ప్రకారం తెల్లవారు జాము సమయం ( బ్రహ్మ ముహూర్తం) అమృతం వంటిది. అధర్వణ వేదం ప్రకారం ఈ సమయంలో చేసే సాధన వల్ల సత్వగుణ సంపద పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త...) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన...) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివికా! రాత్రి నిద్రోన్ముఖుడివికా! అంటారు మన మహర్షులు.* 

*తెల్లవారు జామున ఆలోచించి ప్రణాళికలు వేసుకోవటం వల్ల వ్యూహాత్మకంగానూ, ముందు చూపుతోనూ ఆలోచించి ప్రతి స్పందించగల్గుతాం అంటారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.*

*తెల్లవారు జామున లేచే వారికి సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి కాంతి లభించటం వల్ల అది అత్యంత శక్తివంతమైన సమయమనీ, ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి.*

*"కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్*
*తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః"*

*చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు.*

*"తెల్లవారు జాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్!*

*తెల్లవారు జామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి. అప్పుడే దాన్ని ఆనందించగల్గుతాం. దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం, ఆనందం రెండూ తక్కువైపోతాయి. మార థాన్ పరుగు పందెంలో పాల్గొనే వారిలో 90 శాతం పైగా తెల్లవారు జామున లేచి, సాధన చేసి పతకాలు సాధించిన వారే. స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేథావులు, రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, అధికశాతం తెల్లవారు జామున లేచి సాధన చేసిన వారే. తెల్లవారు జామున లేవడం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలచుకున్నవారే. ఇదే విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించారు.*

*తలలో కుడివైపున ఉన్న ఒకానొక గ్రంధి జాగృతమై ఉన్నప్పుడు విద్యాభ్యాస పాటవాన్ని పెంచుతుంది. నువ్వుల నూనె లేదా ఆవునెయ్యి లేదా దీపారాధనకు వాడే ఏ నూనెనైనా వాడి వెలిగించిన దీపం ముందు స్నానాంతరము బ్రహ్మ ముహూర్తమున కూర్చొని ఆ రోజు పనులు ప్రారంభించడం చాలా శుభకరం. ఇలా చేయడ ద్వారా దీపం నుండి వెలువడిన అనుకూల శక్తి ఆ ప్రదేశం చుట్టుతా వ్యాపింపబడి మానసిక బలసమర్థ్యాలను, బుద్ధిబలాన్ని మెరుగుపరుచుతుంది. ఈ కారణంగానే ప్రాచీన మేధావులు మరియు ప్రస్తుతపు పరిశొధకులు విధ్యను ఆర్జించాలని కుతుహలమున్నవారిని బ్రహ్మ ముహూర్తమున మేల్కోనమని చెప్పడం జరిగింది.*

*ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.* 

*బెంజమిన్ ఫ్రాంక్లిన్. ‘గత 50 సంవత్సరాల్లో నేను నిద్రపోతూ ఎప్పుడూ సూర్యుడికి పట్టుబడలేదు.’ అంటారు.. అమెరికా రాజ్యాంగ పితామహుడు థామస్ జెఫర్‌సన్! జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారు జామున ఒక గంటలో చేయగలిగిన పని మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు, మూడు గంటలు పడుతుందని, ఆలోచనా స్పష్టత, అమలు చేసే పటిమ ఆ సమయంలో మెండుగా ఉంటాయని, తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారు జామున తీసుకున్నవేననీ చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.*

*లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి.*

వేదం - రచించిన వారు

*ఇటువంటి సమాచారం పదే పదే రాదు, దయచేసి ముందుకు పంపండి, తద్వారా సనాతన ధర్మం గురించి ప్రజలు తెలుసుకునేలా, నేను మీకు కృతజ్ఞతతో ఉంటాను!!!*

రచన. ఋుషి/ కవి
1-అష్టాధ్యాయి - పాణిని
2-రామాయణం - వాల్మీకి
3-మహాభారత— వేదవ్యాస్
4-ఎకనామిక్స్ - చాణక్య
5-మహాభాష్య - పతంజలి
6-సత్సహసారిక సూత్రం- నాగార్జున
7-బుద్ధచరిత - అశ్వఘోష
8-సౌంద్రానంద్ - అశ్వఘోష్
9-మహావిభాషాస్త్రం - వసుమిత్ర
10- స్వప్నవాసవదత్త - భాస్
11-కామసూత్ర - వాత్స్యాయన
12-కుమారసంభవం - కాళిదాస్
13-అభిజ్ఞాన్శకుంతలం - కాళిదాసు
14-విక్రమోర్వశియన్ - కాళిదాస్
15-మేఘదూత్ - కాళిదాస్
16-రఘువంశం - కాళిదాస్
17-మాళవికాగ్నిమిత్రం - కాళిదాస్
18-నాట్యశాస్త్ర - భరతముని
19-దేవి చంద్రగుప్తం - విశాఖదత్తు
20-మృచ్ఛకటికం - శూద్రక్
21-సూర్య సిద్ధాంత - ఆర్యభట్ట
22-వృహత్సింత - బరమిహిర్
23-పంచతంత్ర. - విష్ణు శర్మ
24-కథాసరిత్‌సాగర్ - సోమదేవ్
25-అభిధమ్మకోష్ - వసుబంధు
26-ముద్రరాక్షస - విశాఖదుత్త
27-రావణ సంహారం. - భటిట్
28-కిరాతార్జునీయం - భారవి
29-దశకుమార్చరితం - దండి
30-హర్షచరిత - వనభట్ట
31-కాదంబరి - వనభట్ట
32-వాసవదత్త - సుబంధు
33-నాగానంద్ - హర్షవధన్
34-రత్నావళి - హర్షవర్ధన్
35-ప్రియదర్శిక - హర్షవర్ధన్
36-మాల్తీమాధవ్ - భవభూతి
37-పృథ్వీరాజ్ - విజయ్ జయనక్
38-కర్పూర్మంజరి - రాజశేఖర్
39-కవితమాన్స - రాజశేఖర్
40-నవసాహసంక్ చరిత్ - పదం గుప్తా
41-శబ్దశాసన్ - రాజ్భోజ్
42-బృహత్కథామంజరి - క్షేమేంద్ర
43-నైషధచరితం - శ్రీహర్ష్
44-విక్రమంకదేవచరిత - బిల్హణ
45-కుమార్‌పాల్చరిత్ - హేమచంద్ర
46-గీత్‌గోవింద్ - జైదేవ్
47-పృథ్వీరాజ్రసో - చంద్రవర్దై
48-రాజతరంగిణి - కల్హన్
49-రస్మల - సోమేశ్వర్
50-శిశుపాల్ వధ - మాఘ
51-గోద్వహో - వాక్పతి
52-రామచరిత్ - సంధ్యాకర్నంది
53-ద్వ్యాశ్రయ కవిత్వం - హేమచంద్ర

వేద జ్ఞానము:-

Q.1- వేదం అని దేనిని అంటారు?
జవాబు- దివ్య జ్ఞాన గ్రంథాన్ని వేదం అంటారు.

Q.2- వేదాల జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు?
సమాధానం: దేవుడు ఇచ్చాడు.

Q.3- దేవుడు వేదాల జ్ఞానాన్ని ఎప్పుడు ఇచ్చాడు?
సమాధానం- సృష్టి ప్రారంభంలో భగవంతుడు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు.

Q.4- దేవుడు వేదాల జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు?
సమాధానం- మానవజాతి సంక్షేమం కోసం.

Q.5- ఎన్ని వేదాలు ఉన్నాయి?
సమాధానం: నాలుగు.
1-ఋగ్వేదం
2-యజుర్వేదం
3-సంవేదం
4-అథర్వవేదం

Q.6- వేదాల బ్రాహ్మణులు.
 వేద బ్రాహ్మణుడు
1 - ఋగ్వేదం - ఐతరేయ
2 - యజుర్వేదం - శతపథం
3 - సామవేదం - తాండ్య
4 - అథర్వవేదం - గోపత్

Q.7- వేదాలలో ఎన్ని ఉపవేదాలు ఉన్నాయి?
సమాధానం - నాలుగు.
 వేదం ఉపవేదం
 1- ఋగ్వేదం - ఆయుర్వేదం
 2- యజుర్వేదం - ధనుర్వేదం
 3 -సంవేదం - గాంధర్వవేదం
 4- అథర్వవేదం - అర్థవేదం

ప్రశ్న 8- వేదాలలోని భాగాలు.
సమాధానం: ఆరు.
1 - విద్య
2 - కల్ప
3 - నిరుక్త
4 - వ్యాకరణం
5 - శ్లోకాలు
6 - జ్యోతిష్యం

Q.9- దేవుడు ఏ ఋషులకు వేదాల జ్ఞానాన్ని ఇచ్చాడు?
జవాబు- నలుగురు ఋషులకు.
 వేద ఋషి
1- ఋగ్వేదం - అగ్ని
2 - యజుర్వేదం - గాలి
3 - సంవేదం - ఆదిత్య
4 - అథర్వవేదం - అంగీర

Q.10- భగవంతుడు ఋషులకు వేదాల జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడు?
సమాధానం- సమాధి స్థితిలో.

Q.11- వేదాలలో ఎలాంటి జ్ఞానం ఉంది?
సమాధానం- అన్ని నిజమైన శాస్త్రాల జ్ఞానం మరియు శాస్త్రం.

Q.12- వేదాలలోని అంశాలు ఏమిటి?
సమాధానం: నాలుగు.
 సేజ్ థీమ్
1- ఋగ్వేదం - జ్ఞానం
2- యజుర్వేదం - కర్మ
3- సమవే - ఆరాధన
4- అథర్వవేదం - సైన్స్

Q.13- వేదాలలో.

ఋగ్వేదంలో.
1- మండలం - 10
2 - అష్టపది - 08
3 - సూక్త - 1028
4 - అనువాక్ - 85
5 - రిచెన్ - 10589

యజుర్వేదంలో.
1- అధ్యాయం - 40
2- మంత్రం - 1975

సామవేదంలో.
1- ఆర్చిక్ - 06
2 - అధ్యాయం - 06
3- రిచాయన్ - 1875

అథర్వవేదంలో.
1- కుంభకోణం - 20
2- సూక్త - 731
3 - మంత్రం - 5977

Q.14- వేదాలను చదివే హక్కు ఎవరికి ఉంది? జవాబు: వేదాలను చదివే హక్కు మానవులకు మాత్రమే ఉంది.

Q.15- వేదాలలో విగ్రహారాధనకు నిబంధన ఉందా?
సమాధానం- అస్సలు కాదు.

Q.16- వేదాలలో అవతారవాదానికి ఆధారాలు ఉన్నాయా?
సమాధానం లేదు.

Q.17- అతిపెద్ద వేదం ఏది?
సమాధానం-ఋగ్వేదం.

Q.18- వేదాలు ఎప్పుడు ఉద్భవించాయి?
సమాధానం- వేదాలు సృష్టి ప్రారంభం నుండి భగవంతునిచే ఉద్భవించబడ్డాయి. అంటే 1 బిలియన్ 96 కోట్ల 8 లక్షల 43 వేల సంవత్సరాల క్రితం.

Q.19- వేద-జ్ఞానానికి సంబంధించిన ఎన్ని సపోర్టింగ్ ఫిలాసఫీలు (ఉప భాగాలు) ఉన్నాయి మరియు వాటి రచయితల పేర్లు ఏమిటి?
సమాధానం-
1- న్యాయం యొక్క తత్వశాస్త్రం - గౌతమ ముని.
2- వైశేషిక దర్శనం - కనద్ ముని.
3- యోగదర్శనం - పతంజలి ముని.
4- మీమాంస తత్వం - జైమిని ముని.
5- సాంఖ్య తత్వశాస్త్రం - కపిల్ ముని.
6- వేదాంత తత్వశాస్త్రం - వ్యాస ముని.

Q.20- గ్రంధాల సబ్జెక్ట్‌లు ఏమిటి?
సమాధానం- ఆత్మ, భగవంతుడు, ప్రకృతి, ప్రపంచం యొక్క మూలం, విముక్తి అంటే అన్ని రకాల భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానం-శాస్త్రం మొదలైనవి.

Q.21- ఎన్ని ప్రామాణికమైన ఉపనిషత్తులు ఉన్నాయి?
సమాధానం: పదకొండు మాత్రమే.

Q.22- ఉపనిషత్తుల పేర్లు చెప్పండి?
సమాధానం-
01-ఇష్ (ఈశావాస్య)
02-చేయవచ్చు
03-కఠినమైనది
04-ప్రశ్న
05-ముండక్.

కాకుల రహస్య జీవితం – అపోహలూ, నిజాలూ

కాకుల రహస్య జీవితం – అపోహలూ, నిజాలూ!
---------
కాకులు మన సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అవి తెలివైనవి, సామాజికంగా ప్రవర్తించగలవు, మరియు అనేక అపోహల కారణంగా భయాందోళన కలిగించగలవు. కానీ, నిజానికి కాకులు చాలా ఆసక్తికరమైన జీవులు. వాటి ప్రవర్తన, ఆరోగ్యంపై ప్రభావం, మరియు మనిషితో ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ముఖ్యం.


---

1. కాకుల రకాలు మరియు రంగులు

కాకులు ప్రపంచవ్యాప్తంగా వందలాది జాతులలో ఉన్నాయి. సాధారణంగా మనం చూసే కాకులు నలుపు రంగులో ఉంటాయి, కానీ మరికొన్ని జాతులు బూడిద, నీలం, తెలుపు, మరియు గోధుమ రంగుల్లో కూడా కనిపిస్తాయి.

🟢 ఇండియన్ హౌస్ క్రో (Corvus splendens) – నలుపు, బూడిద రంగుల్లో ఉంటుంది.
🔵 కామన్ రేవెన్ (Corvus corax) – పెద్దదిగా, పూర్తిగా నలుపుగా ఉంటుంది.
⚪ అల్‌బినో క్రో – జన్యు లోపాల కారణంగా తెల్లగా ఉండే అరుదైన కాకి.


---

2. కాకుల తెలివితేటలు – శాస్త్రీయ అధ్యయనాలు

కాకులు అత్యంత తెలివైన పక్షుల్లో ఒకటి. వాటి మెదడు చిన్నదైనా, సమస్యలు పరిష్కరించగల సామర్థ్యం ఎక్కువ.

🧠 సమస్య పరిష్కార నైపుణ్యం – కాకులు సాధనాలను ఉపయోగించి ఆహారం పొందగలవు.
👀 ముఖాలను గుర్తుంచుకోవడం – ఒకసారి చూసిన వ్యక్తిని గుర్తుపెట్టుకొని, దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాయి.
🔄 సమూహ జ్ఞానం – ఒక కాకి నేర్చుకున్నది మిగతా కాకులతో పంచుకుంటుంది.


---

3. కాకుల ఆయుష్షు – 1000 సంవత్సరాల అపోహ

📌 చాలామంది నమ్మే అపోహ – కాకులు 1000 సంవత్సరాలు బతుకుతాయి.
✅ నిజం – సహజ వాతావరణంలో 10-15 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి.
🏡 జంతు సంరక్షణ కేంద్రాల్లో 20-30 సంవత్సరాలు కూడా బతకగలవు.


---

4. కాకులు పగ పట్టే స్వభావం

👤 వారిని హానిచేసే వారిని గుర్తుంచుకోవడం – ఒకసారి ప్రమాదం ఏర్పడితే, దానిని గమనించి తమ పిల్లలకూ బోధిస్తాయి.
🦅 సమూహ దాడులు – శత్రువుగా భావించిన వారిపై సమూహంగా కలిసి దాడి చేయగలవు.


---

5. ఇండ్ల మీద కాకులు అరచడం – అపశకునమా?

☑ కాకులు ఒక ఇంటి మీద అరుస్తూ ఉండడానికి కొన్ని సహజ కారణాలు ఉన్నాయి:
🍽 ఆ ఇంటి పైకప్పుపై ఆహారం ఉండటం.
🏠 ఆ ఇంటి దగ్గర గూడు చేసుకోవడం.
🩹 ఒక గాయపడిన కాకి అక్కడ ఉండటం.

🚫 అయితే, ప్రజలు దీనిని అపశకునంగా భావించి అనేక అపోహలను నమ్మారు.


---

6. మృతుల ఆత్మలతో కాకుల సంబంధం

🕊️ భారతీయ సంప్రదాయంలో – మృతుల శాంతి కోసం కాకులకు పిండ ప్రదానం చేస్తారు.
🍚 కాకులు ఆహారం తింటే – ఆత్మ తృప్తి చెందిందని భావిస్తారు.
🚫 వాస్తవం – కాకులు ఆకలితో ఉంటే ఆహారం తింటాయి, లేదంటే తినవు.


---

7. మానవ ఆరోగ్యంపై కాకుల ప్రభావం

😷 కాకులు వ్యర్థ పదార్థాలను తినే ప్రాణులు, కొన్ని వైరస్లు వ్యాప్తి చేయగలవు.
🚮 కానీ, అవి చెత్తను తినడం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.


---

8. కాకుల అపోహలతో ప్రజల భయం

👂 అపోహ – "కాకులు ఎక్కువగా అరుస్తే, చెడు జరుగుతుంది!"
✅ నిజం – కాకులు తమ పరిసరాలను మాత్రమే గమనిస్తాయి.


---

9. కాకుల మిస్టరీ – 10 నిజమైన ఉదాహరణలు

📌 1. ఒక ఇంటి పక్కన కాకులు తరచూ అరుస్తున్నాయి. తెలుసుకోగా, అక్కడ కోడిపుంజు ఉండేది!
📌 2. ఓ రైతు పొలంలో కాకులు ఎక్కువగా వచ్చాయి. చివరికి, అది తేనెటీగల ప్రాబ్లమ్ అని తెలిసింది.
📌 3. ఓ ప్రయోగంలో కాకులు చాక్లెట్ ర్యాపర్స్‌ను తొలగించి లోపలి చాక్లెట్ తినగలవని గుర్తించారు.
📌 4. భారతదేశంలోని ఒక ఆలయంలో రోజూ భక్తులు కాకులకు ప్రసాదం పెడతారు.
📌 5. మృతదేహాల దగ్గర కాకులు కనిపిస్తాయనే అపోహ ఉంది. కానీ, అవి అక్కడి ఆహార మిగులు వల్లే వస్తాయి.
📌 6. ఓ ప్రాంతంలో కాకులు అరుస్తూ ఉండేవి. తీరా చూస్తే, కొత్త రకం క్రిములు అక్కడ ఎక్కువగా ఉన్నాయి.
📌 7. కాకులు భాషను గుర్తించగలవని శాస్త్రీయ అధ్యయనాల్లో నిరూపించబడింది.
📌 8. ఓ కాలేజీలో విద్యార్థులు రోజూ భోజనం పెడుతుండటంతో కాకులు వారికి అలవాటుగా మారాయి.
📌 9. గాయపడిన కాకిని రక్షించడానికి ఇతర కాకులు సమూహంగా వస్తాయి.
📌 10. కాకులు తమ చుట్టూ ఏమి జరుగుతుందో అత్యంత జాగ్రత్తగా గమనిస్తాయి.


---

10. ముగింపు

కాకులు తెలివైన, ఆసక్తికరమైన జీవులు. వాటిపై అపోహలు నమ్మకుండా, శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం అవసరం.
🌍 మన ప్రకృతిని గౌరవించి, కాకులను కూడా ఒక జీవ పరంపరలో భాగంగా చూడాలి.
🔍 "కాకులు మన పరిసరాల్లో అద్భుతమైన పరిశోధకులు – అపోహలను వదిలిపెట్టి, వాటి నిజమైన రహస్యాలను అర్థం చేసుకుందాం!"

Wednesday, March 19, 2025

సృష్టి నియమాలు: ఆరోగ్యం, ఆహారము, నిద్ర మరియు మైదునము

🌿 సృష్టి నియమాలు: ఆరోగ్యం, ఆహారము, నిద్ర మరియు మైదునము
-----------
💖 ఆరోగ్యమే మహాభాగ్యం!

మన జీవితం నడిచే మార్గాన్ని నిర్ణయించే నాలుగు ముఖ్యమైన నియమాలు – ఆహారము, నిద్ర, మైదునము, ఆరోగ్యం. ఇవి మన శరీరం, మనస్సు, ఆత్మ కోసం ఎంతో అవసరం. శరీర ధర్మాన్ని, జీవన సూత్రాన్ని, సృష్టి రహస్యాన్ని అవగాహన చేసుకోవాలంటే, ఈ నియమాలను పరిపాలించగలగాలి.

🍎 1. ఆహారము (Nutrition) – జీవానికి ఆధారం

✅ త్రిగుణ సంబంధం: సాత్వికం, రజసికం, తమసికం
✅ సాత్విక ఆహారం (పండ్లు, కూరగాయలు, నెయ్యి, తేనె, గోధుమ, పాలు) శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
✅ రజసిక ఆహారం (మసాలా, ఉప్పు, కారంపెరుగుదల) శరీరానికి శక్తిని ఇస్తుంది కానీ మితిమీరితే ఒత్తిడికి దారి తీస్తుంది.
✅ తమసిక ఆహారం (పురాతన భోజనం, మాంసాహారం, ఆల్కహాల్) శరీరాన్ని బలహీనపరుస్తుంది.
✅ తిండి ఓ ఔషధం! దాన్ని మన ఆరోగ్యానికి కలిసొచ్చేలా మార్చుకోవాలి.

😴 2. నిద్ర (Sleep) – జీవన శక్తిని పునరుద్ధరించే సమయం

💤 త్రిగుణ సంబంధం: సాత్వికం, తమసికం
💤 చాలా తక్కువ నిద్ర – మానసిక ఒత్తిడిని, వ్యాధులను కలిగిస్తుంది.
💤 చాలా ఎక్కువ నిద్ర – మందబుద్ధి, అధిక అలసటకు దారి తీస్తుంది.
💤 సమతుల్యమైన నిద్ర – శరీరానికి, మనస్సుకు ఉత్తమ ఔషధం!

🌿 3. మైదునము (Reproduction) – సృష్టి సహజ ధర్మం

🔹 త్రిగుణ సంబంధం: సాత్వికం, రజసికం, తమసికం
🔹 మైదునం నియంత్రణలో ఉంటే సాత్విక గుణం, అధికమైన రతి రజస గుణం, అసమతుల్యత తమస గుణం పెంచుతుంది.
🔹 శరీర ధర్మాన్ని గౌరవించాలి, సంయమనంతో జీవించాలి.

⚕️ 4. ఆరోగ్యం – ఈ మూడు నియమాల సమతుల్యతే!

🔹 ఆహారం + నిద్ర + మైదునం = ఆరోగ్య జీవితం
🔹 నియంత్రణలేని జీవితం వ్యాధులకు కారణం – నియంత్రణలో జీవితం ఆయుష్షును పెంచుతుంది!
🔹 జీవితం ఓ యాత్ర, ఆరోగ్యం ఓ ఆయుధం – ఆరోగ్యాన్ని కాపాడుకుంటే యాత్ర విజయవంతం!

🙏 ముగింపు

మన శరీరం ఓ దేవాలయం, మన జీవితం ఓ యజ్ఞం!
ఈ సృష్టి నియమాలను పాటిస్తూ, దేవుడిచ్చిన గొప్ప వరంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన జీవన ప్రయాణాన్ని ధర్మబద్ధంగా నడిపించాలి.
✅ ఆహారాన్ని సుభిక్షంగా, నిద్రను శాంతిగా, మైదునాన్ని నియంత్రణగా, ఆరోగ్యాన్ని సంపదగా భావిస్తే – జీవితం పరిపూర్ణం!

Monday, March 17, 2025

30 సంవత్సరాలుగా అదుపులో లేని షుగర్‌ను 30 రోజుల్లో నియంత్రించేందుకు ప్రత్యేకమైన ఆహార పద్ధతి.

30 సంవత్సరాలుగా అదుపులో లేని షుగర్‌ను 30 రోజుల్లో నియంత్రించేందుకు ప్రత్యేకమైన ఆహార పద్ధతి.
----------
(రామలింగారెడ్డి అనుభవంతో సిద్ధమైన ప్రామాణిక విధానం)
---------
🌿 1. ఉదయం ఖాళీ కడుపుతో ప్రత్యేక కషాయం
---------
✅ తయారీ విధానం:
1️⃣ మెంతులు – 1 స్పూన్ (రాత్రి నానబెట్టాలి)
2️⃣ బెండకాయ – 1 చిన్న ముక్కలు చేసి
3️⃣ మునక్కాయ –ఒక్క భాగము 1 ముక్కలు చేసి
4️⃣ కరివేపాకు – 20 ఆకులు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)
5️⃣ ఇవన్నీ 100 ml నీటిలో 10 నిమిషాలు నానబెట్టి
6️⃣ మెంతులను కలిపి, 5 నిమిషాలు మంట మీద వేడిచేసి
7️⃣ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసి పొరగడుపున తాగాలి.
----------
📌 ఈ కషాయం వల్ల ప్రయోజనాలు:
✅ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి
✅ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, శరీరం సహజంగా షుగర్ నియంత్రిస్తుంది
✅ నరాల సమస్యలు తగ్గి, ఎముకల బలహీనత తగ్గుతుంది
---------
🥣 2. ప్రత్యేకమైన మిల్లెట్ డైట్ (జొన్నలు, రాగులు, కొర్రలు)

✅ రాత్రి నానబెట్టే విధానం:
1️⃣ జొన్నలు – 2 కిలోలు
2️⃣ రాగులు – 2 కిలోలు
3️⃣ కొర్రలు – 1 కిలో

🔹 వీటిని పిండి కొట్టించుకుని అన్నీ కలిపి భద్రపరచాలి.
🔹 రాత్రి టిఫిన్ కోసం తగినంత పిండి తీసుకుని, కప్పు పెరుగు కలిపి నానబెట్టాలి.
🔹 ఉదయం టిఫిన్ కోసం:

దోశలా చేసుకోవచ్చు

పొంగనాలు చేసుకోవచ్చు

ఇడ్లీలా చేసుకోవచ్చు
--------
📌 ప్రయోజనాలు:
✅ స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుంది
✅ బరువు అదుపులో ఉంటుంది
✅ మలబద్ధకం సమస్య తగ్గుతుంది
------
🍽️ 3. భోజన నియమాలు

✅ ఉదయం: పై చెప్పిన కషాయం + మిల్లెట్ టిఫిన్
✅ మధ్యాహ్నం: నచ్చిన తిండిని తినొచ్చు (బియ్యం తగ్గించడం ఉత్తమం)
✅ రాత్రి: ఉదయమే నానబెట్టిన మిల్లెట్ పిండితో టిఫిన్ చేసుకోవాలి

🚫 తప్పించుకోవాల్సినవి:
❌ తీపి పదార్థాలు
❌ శుద్ధి చేసిన పిండి పదార్థాలు
❌ కార్బొహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం
-------
☕ 4. అదనపు సూచనలు

✅ టిఫిన్ తర్వాత కాఫీ చాయిలో షుగర్ ఫ్రీ టాబ్లెట్ వాడాలి.
రోజుకు రెండుసార్లు తాగిన ఏమీ కాదు. రియల్ సుగర్, బెల్లం వాడవద్దు
✅ పండ్లు తినవచ్చు, కానీ పరిమితంగా మాత్రమే తినాలి.
------
షుగర్ తగ్గించే కషాయాలు ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా షుగర్ తగ్గే కంటెంట్ ప్రూఫ్స్ తెలిసి ఉంటే ఇంకా వేరే కషాయాలు కూడా యాడ్ చేసుకోవచ్చు,
ఏ కషాయాలు పడితే అవి త్రాగి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుకోకండి

-------
📊 100 గ్రాములకు షుగర్ తగ్గించే గుణాల శాతం

📌 మెంతులు – 100 గ్రాములకు 25% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 10-15, యాంటీడయాబెటిక్ సమర్థత 85-90%
📌 బెండకాయ – 100 గ్రాములకు 3-4% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 20-25, యాంటీడయాబెటిక్ సమర్థత 60-70%
📌 మునక్కాయ – 100 గ్రాములకు 4-5% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 30-35, యాంటీడయాబెటిక్ సమర్థత 50-60%
📌 కరివేపాకు – 100 గ్రాములకు 6-7% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 5-10, యాంటీడయాబెటిక్ సమర్థత 70-80%
📌 జొన్నలు – 100 గ్రాములకు 7-9% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 55-65, యాంటీడయాబెటిక్ సమర్థత 40-50%
📌 రాగులు – 100 గ్రాములకు 12-15% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 50-55, యాంటీడయాబెటిక్ సమర్థత 60-70%
📌 కొర్రలు – 100 గ్రాములకు 8-10% డైట్ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 50-55, యాంటీడయాబెటిక్ సమర్థత 55-65%

📌 ఈ ఆహార పదార్థాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాక, నెమ్మదిగా గ్లూకోజ్ విడుదల చేయడం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది.
-------
🔬 5. మందుల ప్రభావం & అనుభవం

✅ రామలింగారెడ్డి అనుభవం ప్రకారం ఈ పద్ధతిని 30 రోజులు పాటించడం వల్ల షుగర్ లెవెల్స్ 80-160 mg/dL మధ్య వచ్చాయి.
✅ 50% మందులు తగ్గించుకోవచ్చు.
✅ 90 రోజులు పాటిస్తే, 90% మందులు మానేయగలిగారు.
----------
⚠️ తదుపరి మందుల తగ్గింపు వైద్యుల సూచన మేరకు చేయాలి.
-----------
🎯 6. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

ఈ పద్ధతిని పాటించడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు, ఇంకా ఈ సమస్యలు కూడా తగ్గుతాయి:
✅ అధిక బరువు (ఒబెసిటీ)
✅ బిపి (అధిక రక్తపోటు)
✅ చర్మ సమస్యలు
✅ కీళ్ల నొప్పులు & నరాల బలహీనత
--------
🔚 ముగింపు

ఈ పద్ధతిని రామలింగారెడ్డి స్వయంగా పాటించి, 30 రోజుల్లో షుగర్ కంట్రోల్ చేసుకున్నారు.
ఈ ఆహార నియమాలు సంస్కృతిలో భాగమైన సహజ వైద్యం.
ఏదైనా రసాయన మందులను తక్కువ చేయడమే ఆరోగ్యానికి మంచిది.
ఈ నియమాలను 90 రోజులు పాటిస్తే సర్వం సెట్!
--------
📢 మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి!

Sunday, March 16, 2025

సర్వరోగ నివారిని ప్రాణాయామం

సర్వరోగ నివారిని ప్రాణాయామం..🚩

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది. 

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. 

వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
బయటికి వెళ్లి పోతుంది.
గుండెకు సత్తువ లభిస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
జఠరాగ్ని పెరుగుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

3. తీసుకోవలసిన జాగ్రత్తలు
మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.

గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.

ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.

ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.

ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియాలాపై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

ఆయుర్వేదం ప్రకారం మానవునికి ఏర్పడే అన్ని రకాల జబ్బులు, వాటి కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

ఆయుర్వేదం ప్రకారం మానవునికి ఏర్పడే అన్ని రకాల జబ్బులు, వాటి కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు – సమగ్ర పరిశీలన.
-----------
భూమిపై మానవ జీవితం అనేక వ్యాధులతో కూడిన ఒక ప్రయాణం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాటలకు అర్థం ఏమిటంటే, ఆరోగ్యంగా ఉంటేనే మిగతా జీవిత ఆనందాలను అనుభవించగలం. అయితే, ఆరోగ్యాన్ని నాశనం చేసే అనేక వ్యాధులు మనిషికి ఎదురవుతాయి. ఆయుర్వేదం ప్రకారం, శరీరం, మనస్సు, జీవకణాల స్థాయిలో ఏర్పడే అన్ని రకాల రోగాలను పూర్తిగా అర్థం చేసుకొని, వాటి నివారణ మార్గాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.

1. వ్యాధుల విభజన (Classification of Diseases in Ayurveda)
---------
ఆయుర్వేదం ప్రకారం, మానవ వ్యాధులను విభజించే విధానం ప్రాచీన కాలం నుంచీ ఉండింది. ఈ విభజన ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా ప్రాముఖ్యత పొందింది.

1.1 ప్రకృతి సంబంధిత వ్యాధులు (Diseases Due to Nature's Influence)
---------
వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు

అలెర్జీలు (Allergies)

దగ్గు, జలుబు (Cold & Cough)

తేమ కారణంగా వచ్చే చర్మవ్యాధులు (Fungal Infections)

వేడి కారణంగా వచ్చే జ్వరాలు (Heat Strokes)

కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు
-------
ఊపిరితిత్తుల సమస్యలు (Asthma, Bronchitis)

కంటి సమస్యలు (Eye Irritations, Dry Eyes)

హృదయ సంబంధిత వ్యాధులు

1.2 శరీరంలో దోషాల అసమతుల్యత వల్ల వచ్చే వ్యాధులు

వాత దోషం (Vata Disorders):

నాడీ సంబంధిత సమస్యలు (Neurological Disorders)

గుండెపోటు (Heart Attack)

సంధివాతం (Arthritis)

మోకాళ్ళ నొప్పులు (Knee Pain)

పిత్త దోషం (Pitta Disorders):

కాలేయ సమస్యలు (Liver Diseases)

మలబద్ధకం (Constipation)

చర్మ సమస్యలు (Skin Diseases like Psoriasis, Acne)

కఫ దోషం (Kapha Disorders):

మధుమేహం (Diabetes)

ఊబకాయం (Obesity)

గొంతు సమస్యలు (Thyroid Issues)

1.3 మానసిక ఆరోగ్య సమస్యలు (Mental Health Disorders)

ఒత్తిడి (Stress)
--------
ఆందోళన (Anxiety)

మానసిక మాంద్యం (Depression)

మతిమరుపు (Dementia, Alzheimer's)

1.4 జీవనశైలి సంబంధిత వ్యాధులు (Lifestyle Disorders)

అధిక రక్తపోటు (Hypertension)

గుండెపోటు (Heart Attack)

థైరాయిడ్ సమస్యలు

మధుమేహం (Type 2 Diabetes)

అధిక కొవ్వు (Cholesterol Problems)

1.5 వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు (Genetic Disorders)

హృదయ వ్యాధులు (Heart Diseases)

క్యాన్సర్ (Cancer)

మధుమేహం (Diabetes - Type 1)

మూత్రపిండ సమస్యలు (Kidney Failure)

2. ఆయుర్వేదం ప్రకారం వ్యాధుల ముఖ్య కారణాలు (Major Causes of Diseases in Ayurveda)

2.1 ఆహారపు అలవాట్లు (Dietary Habits)

అసమతుల్యమైన ఆహారం

ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం

మితిమీరిన మధురపదార్థాల వినియోగం

ఆల్కహాల్, ధూమపానం

2.2 జీవనశైలి (Lifestyle Factors)

వ్యాయామం లేకపోవడం

సరైన నిద్ర పొందకపోవడం

మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం

ఎక్కువ సార్లు మందులు వాడడం

2.3 హార్మోనల్ అసమతుల్యత (Hormonal Imbalances)

థైరాయిడ్ సమస్యలు

ఇన్సులిన్ లెవల్స్ అసమతుల్యత (Diabetes)

మహిళలలో హార్మోన్ల అసమతుల్యత (PCOD/PCOS)

3. ఆయుర్వేద నివారణ మార్గాలు (Ayurvedic Prevention & Treatment Methods)
---------
3.1 పంచకర్మ చికిత్స (Panchakarma Therapy)

శరీరంలోని విషాలను తొలగించడానికి ప్రత్యేక చికిత్స

నాడీ శుద్ధి కోసం ఉపయోగించే ఆయుర్వేద పద్ధతి

స్ట్రెస్, ఒత్తిడిని తగ్గించే ప్రత్యేకమైన ఆయుర్వేద విధానం

3.2 సహజ నివారణ పద్ధతులు (Natural Remedies)

A. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Diet)
--------
తులసి, అశ్వగంధ, గాలోయ్ వంటి మొక్కలతో ఔషధాలు

సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోవడం

అధిక మసాలాలు తినకుండా జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం

B. రోజువారీ జీవనశైలి మార్పులు (Daily Lifestyle Changes)

ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు తాగడం

యోగా మరియు ధ్యానం చేయడం

ఉదయాన్నే నడక లేదా వ్యాయామం చేయడం

C. ఆయుర్వేద ఔషధాలు (Ayurvedic Medicines & Herbs)

నిద్రలేమి: బ్రాహ్మి, అశ్వగంధ

ఊబకాయం: త్రిఫలా, మేతి గింజలు

పేగు సమస్యలు: హరిద్రా (Turmeric), జీలకర్ర

చర్మ వ్యాధులు: నిమ్మరసం, గంధం, ఆలివ్ ఆయిల్

4. ఆయుర్వేద జీవన విధానం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు

1. సంభార్యమైన ఆహారం: కూరగాయలు, గింజలు, సేంద్రియ ఆహారం తీసుకోవడం

2. శరీర శుద్ధి: పంచకర్మ చికిత్సను అనుసరించడం

3. నిత్యం వ్యాయామం: యోగాసనాలు, నడక, ప్రాణాయామం చేయడం

4. ధ్యానం & మానసిక ఆరోగ్యం: రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం
--------
5. సహజ ఆయుర్వేద ఔషధాలు: తులసి, అశ్వగంధ, త్రిఫలా వంటివి ఉపయోగించడం

ముగింపు (Conclusion)
----------
మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం మన చేతిలోనే ఉంది. ప్రకృతితో సమతుల్యంగా జీవిస్తూ, ఆయుర్వేద జీవనశైలిని పాటిస్తే అనేక వ్యాధులను నివారించవచ్చు. ఆరోగ్యంగా ఉండటం కోసం రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకుంటే, మానసిక & శారీరకంగా ఉత్తమ స్థితిని పొందవచ్చు 

Tuesday, March 11, 2025

సర్వం శ్రీకృష్ణార్పణం అనడానికి కారణం

సర్వం శ్రీకృష్ణార్పణం
          అనడానికి
          కారణమేమిటి...
          ఫలమేమిటి.

*సమాధానం:*

*ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. *

*మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.*

*చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి.*

* ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా? *

*లేక 'మోక్షం' పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం.* 

*మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే శ్రీమద్భగవద్గీత లో (గీతా శాస్త్రం )శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.* 

*అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. *

*అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం 'మూడు త్యాగాలు' చేసినట్లవుతుంది.* 

*"మొదటిది కర్తృత్వ త్యాగం" :*

*ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే 'అహంకారం' వదలాలి. *

*ఏ కర్మయినా ఆ భగవంతుడే* *చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి.*

*ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము.*

* కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.*

*"రెండోది ఫలత్యాగం" :*

* ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి.*

* అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు.*

* నేను ఏమి చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.*

*"మూడోది సంగత్యాగం" :*

*ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి.* *ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు.*

*అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని* *మనస్ఫూర్తిగా అనుకోవాలి.* 

*ఈ 'త్రివిధ త్యాగాలు' ఎలా చెయ్యాలి...? *

*ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు.* 
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.*

*పై 'త్రివిధ' త్యాగాలను 'త్రికరణశుద్ధి'గా అవలంబించాలి..*

*సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు..*
  
*జై శ్రీకృష్ణ *

మహానంది ,నవనంది,క్షేత్రములదర్శనం.*

*మహానంది ,నవనంది,క్షేత్రములదర్శనం.* 

       *మహానంది -కర్నూలు జిల్లా* 
🔔 🔔 🔔 🔔 🔔
          
ఆలయాల దర్శనంలో - మహానంది, నవనందుల క్షేత్రములదర్శించినవనందులవిశిష్టత,ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.......

శివాలయంలో శివునికి ఎదురుగా నందిశ్వరుడు
ఉంటాడు. అనుక్షణం శివుణ్ని అంటిపెట్టుకొని ఆరాధిస్తుంటాడాయన. అందుకే వారిద్దరి మధ్య నుంచి వెళ్ళకూడదని, నందిని పూజిస్తే సాక్షాత్తూ శివుని అనుగ్రహం పొందవచ్చని చెబుతారు. మన రాష్ట్రంలోని నవ నందులను దర్శిస్తే జన్మ జన్మల పాపాలు పోయి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి.
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం.

🌻 *నవనందుల దర్శనం*🌻

      🌹 *నవ నందుల క్షేత్రం -1* 🌹

నందుల్లో మొదటిది ప్రథమ నంది. ఇది చామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ కు సమీపాన ఉంది. సూర్యాస్తమ సమయాల్లో
(కార్తీక మాసంలో) నందీశ్వరుని మీద సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం.
(14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామిఆలయంలోనాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండ
లం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు ఉంటాడు.

               🌹 *నవ నందుల క్షేత్రం -2* 🌹

నంద్యాల బస్ స్టాండ్ కు సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నాగ నంది కొలువై ఉంటాడు. నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు.
(కడమకాల్వ కు సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నందివిగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

         🌹 *నవ నందుల క్షేత్రం -3* 🌹

సోమ నంది నంద్యాల కు తూర్పు వైపున (ఆల్మోస్ట్ నంద్యాల పట్టణానికి లోపల)
 జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు.

         🌹 *నవ నందుల క్షేత్రం -4* 🌹

సూర్య నంది నంద్యాల నుండి మహానందికి 
వెళ్లే మార్గంలో రోడ్డు పై ఉన్నది. సరిగ్గా చెప్పాలంటే నంద్యాల నుండి 4 కి. మీ. దూరం వెళితే బొల్లవరం అనే గ్రామం వస్తుంది. 
అక్కడి నుంచి కుడి వైపు తిరిగి కిలోమీటరు దూరం వెళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రోజూ సూర్యకిరణాలు లింగం పై పడటం ఇక్కడి విశేషం.

              🌹 *నవ నందుల క్షేత్రం -5* 🌹

శివ నంది కూడా నంద్యాల నుండి మహానంది 
కి వెళ్లే మార్గంలో ఉంటుంది. నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినాక ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా ల్యాండ్ మార్క్ గా చెప్పవచ్చు. ఇది మిగిలిన 8 నంది ఆలయాల కంటే పెద్దది. అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా ఉంటుంది.

            🌹 *నవ నందుల క్షేత్రం -6* 🌹

మహానంది రోడ్డు మార్గంలో, మహానంది 
ఇంకా రాకమునుపే 2 మైళ్ళ ముందర ఎడమ వైపు తిరిగితే తెలుగు గంగ కెనాల్ కనిపిస్తుంది. ఆ కెనాల్ ను ఆనుకొని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కి. మీ. వెళితే విష్ణు(కృష్ణ నది) నందిఆలయం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీహరి శివుణ్నిప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

        🌹 *నవ నందుల క్షేత్రం -7* 🌹

నంద్యాల నుండి మహానందికి వెళ్లేటప్పుడు, మహానంది గుడికి ముందర కొద్ది దూరంలో ... పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దాటితే గరుడ నందిని దర్శించుకోవచ్చు. గరుత్మంతుని తల్లి వినతాదేవి తను వెళ్ళే పని
లో ఎటువంటి ఆటకం కలగకుండా ఉండేందు
కై పరమేశ్వరుణ్ణి ప్రార్ధించిన ప్రదేశమిది.

             🌹 *నవ నందుల క్షేత్రం -8* 🌹

మహానంది లోనిది స్వయంభూలింగం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఇక్కడి పవిత్ర కొలనులలో మునిగితేలుతారు. కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగల సమయాల్లో జనం అధికం
గా వస్తారు కాబట్టి మిగితా సమయాల్లో వెళితే బాగుతుంది.

              🌹 *నవ నందుల క్షేత్రం -9* 🌹

వినాయక నంది చిన్న ఆలయం. ఇది మహా
నంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటు
oది. ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తరువాత ఎడమ పక్కన, కోనేటి గట్టున ఉంటుంది. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని వినికిడి.

               🌺 *వసతులు*🌺
నంద్యాలలో ఉండటానికి లాడ్జీలు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి12 -15వరకుహోటళ్లు ఉన్నాయి. మీ బడ్జెట్ ను బట్టి ఏసీ, నాన్- ఏసీ గదులను అద్దెకు తీసుకోవచ్చు.

 🌻 మహానందిలోనే వసతి కావాలంటే టిటిడి నిర్మించిన 28 గదుల సత్రంలో ఉండవచ్చు. అలాగే మహానంది దేవస్థానం నిర్మించిన 5 గదుల సత్రం, పాపిరెడ్డి కాటేజి, నాగనంది సదనంలో 25 గదులతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలకు చెందిన వసతి గృహాలు వున్నాయి. వీటితో 
పాటు ప్రైవేట్ వసతి, టూరిజం అతిథి 
గృహాలు కూడావున్నాయి.
           

వివరములకు :
ఫోన్ నెంబర్లు : దేవస్థానం కార్యాలయం - 
08514 234726, 234727, 234728 
పున్నమి అతిథి గృహం 9441733829

     హరహర మహాదేవ శంభో శంకరా 
              ఓం నమః శివాయ...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏