లక్షణాలు -
* గాస్ట్రిక్ సమస్య వస్తుంది.
* విరేచనం ఫ్రీగా ఉండదు.
* విరేచనంలో జిగురు , రక్తం పడుతుంది.
* కడుపులో ఒక ప్రత్యేకమైన స్థలం లో నొప్పి అనిచెప్పలేము . కడుపు అంతా ఎక్కడ నొక్కినా నొప్పి అనిపిస్తుంది. ఎక్కువమందిలో ఈ కడుపునొప్పి బొడ్డుకింద, పొత్తికడుపు మీద తరచూ కనిపిస్తుంది. విరేచనం అయితే నొప్పి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది.
* కొన్నిరోజులు మలబద్దకం ఉంటుంది. మరికొన్ని రోజులు విరేచనాలు బాధపడతారు
* విరేచనానికి వెళ్లిన తరువాత ఇంకా పూర్తి అవ్వనట్టు , ఎంతసేపు కూర్చున్నా ఇంకా వస్తుందేమో అనిపిస్తుంది. ఒక్కోసారి గాలి వస్తూ ఉంటుంది.
* విరేచనంలో విరేచన భాగం తక్కువ , జిగురు పదార్ధం ఎక్కువ ఉంటుంది.
* భోజనం చేసిన వెంటనే విరేచనానికి వెళ్తున్నారు అంటే ఈ వ్యాధి ఉన్నట్టే అనుకోవాలి.
* కడుపు ఉబ్బరం ఏర్పడి కడుపు పగిలిపోతుంది ఏమో అన్నంతగా భయం కలుగుతుంది. నిజానికి అంత ఉబ్బరం ఉండదు. కాని రోగికి అలా అనిపిస్తుంది.
* కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ , గుండెల్లో మంట, వాంతి వికారం , కొద్దిగా అన్నం తినేసరికి కడుపు నిండిపోవడం వెంటనే ఆకలి వెయ్యడం ఇవన్ని తరచూ కనిపించే లక్షణాలు .
* పేగులు అరవడం , అజీర్తి , జీర్ణశక్తి నశించిపోవడం , విరేచన మార్గం దగ్గర కత్తెరతో కత్తిరించినట్లు అవ్వడం వంటి బాధలు కనిపిస్తాయి . ఆకలి ఉండదు. ఏమి తినాలి అనిపించదు.
* తలనొప్పి , నీరసంగా ఉండటం , టెన్షన్ , దడగా ఉండటం , మూత్రాన్ని ఎక్కువుసేపు నిలుపుకోలేకపోవడం , అతిగా మూత్రం కి వెళ్ళవలసి రావటం , మూత్రాశయంలో నొప్పి తరచుగా కనిపిస్తాయి
* విరేచనం ఒక ప్రత్యేక సమయంలో కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు అవడం అది కూడా జిగురులా ఉండటం .
అల్లోపతి వైద్య విధానంలో దీనిని మానసిక వ్యాధిగా పరిగణిస్తారు. ఆయుర్వేదం కూడా చింత , శోకం , భయం వలన ఈ వ్యాధి కలుగును అని చెప్తుంది. ఆయుర్వేదంలో దీనిని "సంగ్రహణి " అని పిలుస్తారు .
కడుపులో నొప్పి వస్తూ స్కానింగ్ లో ఏ లోపం కనిపించకుండా ఉంటే అది కచ్చితంగా సంగ్రహణి అవుతుంది.
ఈ వ్యాధి ఎక్కువుగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల్లో గమనించాను. అదేవిధంగా ఎక్కువ మానసిక ఒత్తిడికి గురి అయ్యే ఉద్యోగస్తులు , పలు రంగాలలో వ్యక్తులకు వస్తుంది. మానసిక సంఘర్షణకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకొవడం తప్పనిసరి . అదేవిదంగా ఆహరం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తల ను పాటించవలెను .
ఔషదాలు -
* శొంఠి నిప్పుల మీద కాల్చి మెత్తగా దంచి బాగా జల్లించి దానికి నాలుగు రెట్లు ఆవునెయ్యి , ఆవునెయ్యికి నాలుగురెట్లు నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి నీళ్లన్నీ ఇగిరిపోయే వరకు మరిగించండి. నీరంతా మరిగాక గిన్నెలో నెయ్యి , శొంఠి మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ నేతిని చక్కగా వడకట్టి ఒక చెంచా మోతాదులో రెండుపూటలా వేడివేడి అన్నంలో వేసుకొని తినండి .ఈ వ్యాది చక్కగా తగ్గుతుంది .
* మారేడు లేత పిందెలు సేకరించి దంచి దాని గుజ్జులో శొంఠి పొడి కలిపి బెల్లం పాకం పట్టుకొని ఉసిరికాయ అంత ఉండలు చేసుకుని రెండుపూటలా మజ్జిగ తో తీసుకోండి .
* ఈ వ్యాధిలో మజ్జిగే అసలైన మందుగా ఆయుర్వేదం చెప్తుంది . వారం రోజుల నుంచి నెల రోజుల వరకు అవసరాన్ని బట్టి ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు కేవలం మజ్జిగ అన్నం , మజ్జిగ రసం మాత్రమే తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఏ మందులు అవసరం లేకుండానే ఈ వ్యాధి తగ్గుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది .
No comments:
Post a Comment