Wednesday, February 19, 2025

పిప్పి పన్ను బాధ హరించుటకు సిద్దయోగాలు

పిప్పి పన్ను బాధ హరించుటకు సిద్దయోగాలు  - 

 *  కర్పూర తైలం ( టర్పంటైన్ ) లో దూది తడిపి ఆ దూదిని పిప్పిపన్ను పైన పెట్టి నొక్కి పట్టి ఉంచిన పిప్పిపన్ను బాధ తగ్గును . 

 *  జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు దూది పైన వేసి పిప్పిపన్ను రంధ్రములో పెట్టిన పిప్పిపన్ను బాధ తగ్గును. 

 *  కుప్పింటాకు చెట్టు ఆకు పసరు పిప్పిపన్ను రంధ్రములో వేసిన పిప్పిపంటి లోని పురుగు చచ్చి ఉపశమనం కలుగును. 

 *  జిల్లేడు పాలు రెండు చుక్కలు దూదికి అంటించి పిప్పి పన్ను రంధ్రము నందు ఉంచిన పిప్పిపన్నులోని పురుగు చచ్చిపడిపోవును. 

  

ప్రాచీన భారతీయ యోగవిద్యలో షట్కర్మ విధానం - సంపూర్ణ వివరణ

ప్రాచీన భారతీయ యోగవిద్యలో షట్కర్మ విధానం - సంపూర్ణ వివరణ.

    ప్రాచీన భారతావనిలో యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యత కలదు. యోగవిద్యలో "హఠయోగం" అనే యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యం కలదు. ఈ హఠయోగాన్ని ప్రచురపరచిన వారిలో శ్రీ గోరక్ష నాథులు ప్రధానులు . ఈ శ్రీ గోరక్షనాధులు మత్స్యేంద్ర నాథుల శిష్యులు అనియు , గోరక్ష నాథుల శిష్యులు శాoభువులు అనియు అనేక గ్రంథాలలో రాయబడి ఉంది. గోరక్షనాధులు శ్రీ స్వాత్మా రామయోగీంద్రులకు హఠయోగమును భోధించిరి . వీరు హఠయోగ ప్రదీపిక అను గ్రంథమును రచించిరి.

           "హ" అనగా సూర్యనాడి "ఠ " అనగా చంద్రనాడి "హఠ" అనగా సూర్యచంద్ర నాడుల సమగోగ్యము . రాజయోగము శ్రేష్టమైనది మరి హఠయోగము గురించి అడగగా హఠయోగులు చెప్పు సమాధానం ఏమనగా ఈ సంప్రదాయము నందు ప్రాణకళ , చిత్తకళ అను రెండు యోగమార్గములు కలవు. హఠయోగం ప్రాణకళ , రాజయోగమే చిత్తకళ . ఆయుర్వేదం నందు అంతఃపరిమార్జనము , బహిహపరిమార్జనము , శస్త్రప్రణిధానము అని చికిత్సలు మూడు విధానములు హఠయోగము నందు కూడా ఈ మూడే ప్రధానములు . అంతః పరిమార్జన అనగా ఆయుర్వేదము నందు పంచకర్మ విధానము . ఇదియే హఠయోగము నందు షట్కర్మ విధానం .

          ఇప్పుడు మీకు హఠయోగము నందలి షట్కర్మ విధానం గురించి సంపూర్ణముగా వివరిస్తాను.

  ధౌతి , వస్తి , నేతి , త్రాటకము , నౌలి , కపాలభాతి ఈ ఆరింటిని కలిపి షట్కర్మలు అంటారు.

 * ధౌతి -

        నాలుగంగుళముల వెడల్పు ఇరవై మూరల పొడుగు కలిగిన వస్త్రమును నీటియందు తడిపి వర్తిగా చుట్టుచూ నోటి మార్గమున కొంచెంకొంచెం మింగి ఆరు అంగుళముల కొన బయటవైపు మిగులునట్లు చూసుకుని మింగుట ఆపి కడుపునందలి అవయవములను కుడిపక్కగానో , ఎడమపక్కగానో నీటి సుడి వలే వేగముగా చుట్టవలెను . ఈ విధముగా చేసి మెల్లమెల్లగా గుడ్డను బయటకి లాగవలెను. ఈ విధముగా చేయుటవలన మర్దన జరిగి శరీరము నందలి 72000 నాడులు మధించబడి ప్రక్కమూలల యందు ఉండు దోషములు బయటకి వచ్చును.

        ఈ ధౌతి పద్దతిలో జలధౌతి , సూత్రధౌతి , వస్త్రధౌతి , పవనధౌతి అను నాలుగు విధములైన ధౌతి కర్మములు కలవు. తైల , ఘృతాది ఔషదాలు శరీర అంతర్భాగము నందు మర్దన చేయుట కూడా ఈ ధౌతి ప్రక్రియ నందే చేరును .

 * వస్తి -

              ఈ వస్తి క్రియ నందు వస్తి నిరూహము , అనువాసము అని రెండు రకాలు కలవు.

    గుద ద్వారము నుండి వస్తి యంత్రము ద్వారా కషాయాదులతో చేయు ప్రతిక్రియ నిరూహవస్తి అనబడును.

     ఆయా రోగ నాశకరము అగు తైలాదులతో వస్తి యంత్రముతో చేయు ప్రతిక్రియ అను వాసనవ వస్తి అనబడును.

          చిటికెన వ్రేలు దూరనంతటి రంధ్రములు గలదియు , 8 అంగుళాల పొడవు గలదియు నునుపైనదియు , వెదురుతోగాని , తగరము మొదలగు లోహములతోగాని తయారుచేయబడిన నాళమును గ్రహించి దానికి తైలమును పూసి తెలివిచేత గుద ద్వారమున మెల్లగా లోపలికి చొప్పించి నాభి లోతుగల నీటి యందు ఉత్కఠాసనం న ఉండి నాళము గుండా నీటిని లోపలికి పీల్చి తరువాత చెప్పబోవు నౌళి కర్మచే కడుపును జాడించి నీటిని బయటకి వదులుట .దీనినే వస్తికర్మ అందురు.

         దీనిలో జలవస్తి , వాయువస్తి అని రెండు రకాల పద్ధతులు కలవు. కొందరు గుదము నందు నాళమును ప్రవేశపెట్టకుండానే వస్తికర్మ చేయుదురు. నాళము ఉపయోగించి చేయుటయే నిరపాయకారము .

      ఈ వస్తికర్మలో తిరిగి మూడు విధములు కలవు. అందులో వరసగా నిరూహవస్తి , అనువాసవ వస్తి , ఉత్తర వస్తి అని కలవు.

       ఉత్తర వస్తి అనగా సీసముతో తయారు అయిన సన్నని నాళమును పన్నెండు అంగుళముల పొడవుగలదిగా గ్రహించి పురుషుడి మూత్రనాళము నందు లోపలికి చొప్పించి పాలు , తైలం , జలములను యుక్తిచేత నాళము గుండా పంపి నౌలి ప్రక్రియ ద్వారా జాడించి మెల్లగా బయటకి వదులున్నట్లు చేయుట . ఈ పద్దతిని మూత్రాశయ దోష నివారణ కొరకు చేయుదురు . దీనిని యోగులు "వజ్రోలి" అని పిలిచెదరు.

         ఈ వజ్రోలి సిద్ధిపొందిన యోగుడు శుక్రధారణమును , శుక్రస్తంభమును గలవాడై చిరకాలమును యవ్వనవంతుడు అయి ఉండునని హఠయోగ సిద్ధాంతము .

 * నేతి -

            దీనినే ఆయుర్వేదము నందు నస్యకర్మ అందురు. మూరెడు పొడవు , మూడు పెనలు వేసిన నూలుతాడుకు నెయ్యి పూసి మెల్లమెల్లగా ముక్కు రంధ్రము నుంచి లోపలికి పంపి పైకి పీల్చి నోటి మార్గము నుంచి ఆ తాడును బయటకి లాగి మెల్లమెల్లగా ముందుకు వెనక్కు అంటూ ఉండవలెను . ఈ విధానం వలన శిరఃకపాలం శోధించబడును . దివ్యదృష్టి కలుగును. మెడకొంకులకు కలుగు రోగములను శీఘ్రముగా హరించుట యందు ఈ నేతి కర్మ శ్రేష్టమైనది.

 * త్రాటకము -

           ఏకాగ్రత చిత్తుడు అయ్యి నిశ్చలమైన దృష్టి వలన సూక్షమైన లక్ష్యమును కన్నీరు స్రవించువరకు చూడవలెను . దీనివలన వాయవు , నేత్రము స్థిరత్వము పొందును. ఇలా దీక్షగా చేసి కొంచెముసేపు కనులు మూసి తరువాత తటాలున తెరిచి ఎదురుగా నిర్మలమైన ఆకాశమును ఏకాగ్రత చిత్తుడై సూర్యబింబము కనుపడినట్లు తోచువరకు చూడవలెను. ఈ త్రాటకము నాశిక కొనవద్ద సిద్ధించినచో ఇలా సిద్దిపొందిన సాధకునకు సకలవ్యాధులు నివర్తించును. భ్రూమధ్యమము నందు సిద్ధించిన ఖేచరీ , దివ్యదృష్టి, యోగసిద్ధి కలుగును.

         ఈ త్రాటక ప్రక్రియ వలన నేత్రరోగములు తగ్గును. తంద్ర మొదలగు వ్యాధులు తగ్గును. ఈ త్రాటక ప్రక్రియ అత్యంత రహస్యమైనది.

 * నౌలి - 

          ఈ నౌలి ప్రక్రియ నందు భుజములను వంచుకొని కడుపునందలి అవయవములు కుడిపక్కగా నైనా , ఎడమ పక్కగా నైనా నీటి సుడి వలే అతివేగముగా చుట్టవలెను . దీనిని సిద్ధులు నౌలి కర్మగా వ్యవహరిస్తారు . ఈ నౌలి ప్రక్రియ ఆచరించటం వలన అగ్నిమాంద్యము పోగొట్టబడును. వాతాది సకలరోగాలను నశింపచేయును . హఠ క్రియలకు కిరీటము వంటి ప్రక్రియ ఇది.

 * కపాల భాతి -

          కమ్మరి వారివద్ద ఉండు గాలి తిత్తి వలే ఉచ్వాస , నిశ్చ్వాసాలను వేగముగా చేయుటనే కపాల భాతి అందురు. ఈ ప్రక్రియ వలన కఫదోషాలు పోగొట్టబడును .

          షట్కర్మలు వలన శరీరం యెక్క లావు , శరీరం నందలి మలాది దోషాలను పోగొట్టుకొని శరీరాన్ని శుద్ది చేసుకొనిన పిమ్మట ప్రాణాయామం చేయవలెను . షట్కర్మలు ఆచరించిన తరువాత చేయు ప్రాణాయమం వలన యోగము అత్యంత త్వరితముగా సిద్ధించును . ఈ షట్కర్మలు మాత్రమే కాకుండా కొంతమంది యోగులు కిలికర్మ , చక్రికర్మ , వజ్రోలి , శంఖ ప్రక్షాళనం మొదలగు శోధన కర్మలను కూడా అభ్యసించుదురు.

             శంఖ ప్రక్షాళన అనగా నోటితో జలమును తాగి మలద్వారం గుండా బయటకి పంపుట. లేక నాశికా రంధ్రము గుండా జలమును గ్రహించి వేరొక ముక్కు రంధ్రము నుండిగాని నోటి మార్గము ద్వారా గాని బయటకి పంపుట. ఇటువంటి విద్యలు కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చుకొని సాధన చేయవలెను . ఇందులో మరికొన్ని యోగ ప్రక్రియలు కూడా కలవు. వాటి గురించి చెప్తాను .

         సూర్యభేదనము , ఉజ్జయని , సీతార్కరి , శీతలీ , భస్త్రిక , భ్రామరీ , మూర్చ, ప్లావిని , భుజకీకరణము మొదలగు కుంభకముల గురించి జాలంధర , ఉడ్యాన , మూలబంధనం వంటి యోగ విద్యలను కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చి అభ్యసించవలెను . ఇందు సిద్ధి కలిగినవారికి ముసలితనము పొయి పదహారు సంవత్సరముల కలిగిన పడుచువారు వలే మారుదురు.

            అపానవాయువును మీదికి లేపి మూలాధారం పైకి ఆకర్షించుట వలన ప్రాణవాయువును కంఠము క్రిందికి తీసుకొని వెళ్లగలిగిన సిద్దుడు వృద్ధుడు అయినప్పటికి పదాహారు సంవత్సరాల పడుచువానిగా మారును అని కొన్ని రహస్య యోగ గ్రంథాలలో ఉన్నది. ఇచ్చట వాయవు అనగా పాశ్చాత్త్యులు చెప్పినట్లు కేవలం ఉచ్చ్వాస , నిశ్చ్వాసాల చే లోపలికి వెలుపలికి పోవు గాలి కాదు . ఆయుర్వేదం నందు యోగ శాస్త్రము నందు చెప్పబడిన సంకోచ వికాసాది రూపము కలిగిన చలనశక్తి .

       ఈ సందర్భమున మీకు ఒక హఠయోగి గురించి చెప్తాను . ఆయన పేరు శ్రీ యోగి ఓరుగంటి నరసింహం గారు . వీరు డిసెంబర్ 29 తారీఖు 1942 వ సంవత్సరము నందు లాహోరులో జరిగిన అఖిల భారత ఆయుర్వేద సమ్మేళనం నందు సభాపతి సమక్షంలో పైన చెప్పిన వజ్రోలి కర్మ సహాయముతో 40 తులముల పాదరసమును మూత్రమార్గముచే లోపలికి ఆకర్షించి తిరిగి అదే మార్గమున బయటకి విసర్జించి అందరిని ఆశ్చర్యచకితులను చేసినారు . 

       ఇంతగొప్ప యోగులు కలిగిన మన కర్మభూమి పాశ్చాత్త్యా సంస్కృతి మోజులో పడి మన మూలలను నాశనం చేసుకుంటున్నాము.

 
.

Sunday, February 9, 2025

చేజారిన విద్యావ్యవస్థ:

As received 


చేజారిన విద్యావ్యవస్థ:

బడాయి బసవయ్యల డాబుసరే వాళ్ళ ప్రాణానికొచ్చింది !

✅ సత్తె కాలం ..
ఏడో తరగతి లో పబ్లిక్ పరీక్షలు . 
అదొక వార్నింగ్ సిగ్నల్ .
అటు పై పది ...
 సరిగా చదవని వాళ్ళు ఫెయిల్ అయ్యేవారు .  
ఇంటర్ .. 
పది లో తప్పించుకున్నా... సరుకు లేనివారు ఇంటర్ లో ఫెయిల్ అయ్యేవారు .

ఇష్టపడి చదివే వారు , ప్రతిభ ఉన్న వారు మాత్రమే డిగ్రీ దాక చేరేవారు .
 డిగ్రీ కి ఒక విలువ... గౌరవం . 
డిగ్రీ చదువంటే సొంతకాళ్ళ పై నిలబడి గౌరవంగా జీవించడానికి పాస్ పోర్ట్ .

ఆ సత్య కాలం లో ... ✅✅
నూటికి ... అరవై డెబ్భై మంది పది లేదా ఇంటర్ లో ఫెయిల్ అయ్యేవారు .
 వారికి వాస్తవం తెలిసొచ్చేది .
 నిజాయతీ .. కష్టపడడం లాంటి విలువలు తెలిసొచ్చేది . 
 ఆలస్యంగా నైనా చదువు విలువ తెసులుసుకొన్న వారు కష్టపడి చదివి పది/ఇంటర్ పాస్ అయ్యి ఉన్నత చదువులకు వెళ్లే వారు .. పది లో ఫెయిల్ అయ్యి అటుపై ఐఏఎస్ సాధించినవారు కూడా వున్నారు .

 చిన్నప్పుడే దెబ్బ తగలడం తో ITI లాంటి చదువు చదివినా BHEL లాంటి సంస్థలో జాబ్ కొట్టేవారు . ఇలాంటి ప్రతిభ లేని వారు unskilled లేబర్ గా స్థిరపడేవారు ..
 వృత్తి ఏదైనా కష్ట పడి పని చేసేవారు .
 ఆ సత్య కాలం లో ఆవారా గాళ్ళ సంఖ్య తక్కువ. ✅

 ❌❌కలికాలం చదువుల మాయా ప్రపంచం .. ఆవారా గాళ్ళ లోకం! 
  
ఏడో క్లాస్ పరీక్షల్ని ఎత్తేసారు .
ఇప్పుడు .. పదో తరగతి పరీక్షలంత బోగస్ వ్యవహారంప్రపంచం లో ఇంకోటి ఉండదు . 
కంచె దగ్గరుండి మరీ చేను మేయిస్తుంది.
 డీఈవో స్థాయినుంచి ప్రయత్నించి అందరినీ పాస్ చేయిస్తారు .
 మాస్ కాఫీయింగ్ కూడా రాని వారు ... ఆన్సర్ షీట్ పై కనీసం ప్రశ్నలని ..అయిదారు సార్లు రాయడం రాని వారు మాత్రమే .. పదిలో ఫెయిల్ అవుతారు .వారిని కూడా జూన్ లోగా ఇంకో ఎక్సమ్ పెట్టి పాస్ చేయించి ఇంటర్ లో చేరేలా చేస్తారు 

నిజాయితీగా పదో తరగతి పరీక్షలు జరిగితే ఉత్తీర్ణతా శాతం ముప్పై దాటదు. 
ఆలా జరిగితే ఇంటర్ కళాశాలలు సగానికి పైగా మూసేసుకోవాల్సిందే .

పదో క్లాసులో మాస్ కాఫీయింగ్ లో పాస్ అయ్యిన చెత్త సరుకు కార్పొరేట్ జూనియర్ కాలేజీ లో చేరుతుంది . 
." మా వాడు కార్పొరేట్ లో ఐఐటీ సెక్షన్ లో ఉన్నాడు" అని అమ్మ అబ్బా గొప్పలు చెప్పుకొంటారు .

  కైనెటిక్ ఎనర్జీ అనే పదాన్ని తప్పులు లేకుండా రాయడం రాదు . వాడికి ఐఐటీ సీట్ వస్తుందని ఆ కార్పొరేట్ వాడు చెప్పడం .. దాన్ని నువ్వు నమ్మడం .. కిట్టి పార్టీ ల లో / మందు పార్టీ ల లో గొప్పలు చెప్పుకోవడం .... ఈ తమాషా ఏంటి ? అని ఎవరూ అడగరు.

ఇంటర్ ..
 . కొంత మంది ఫెయిల్ . 
బట్టి కొట్టి... అటుపై కాపీ కొట్టి... ఉదార మార్కుల స్కీమ్స్ తో మిగతా వారు పాస్ .
 ఫెయిల్ అయ్యిన వాడు సప్లిమెంట్ లో పాస్ .

ఐఐటీ లో సీట్ కొట్టేవాడు ఎవడో కార్పొరేట్ వాడికి ముందుగానే తెలుసు . 
వారికి సీవో బ్యాచ్ కోచింగ్ . 
మిగతా వారికి జనరల్ బ్యాచ్ లో .. వాచి పోయింగ్ .

 
 ఇంటర్మీడియట్ అని ఆంగ్లంలో తప్పులు లేకుండా రాయడం కూడా రాని లక్షలాది మంది . చదువుకొన్న నిరక్షరాస్యులు ఇంటర్ సర్టిఫికెట్ పట్టుకొని ఉన్నత విద్య కోసం తయారు . .
"అమ్మ నాన్న దగ్గర డబ్బుంది.. నాకు మంచి కాలేజ్ లో సీట్ గ్యారెంటీ" అని వారికి తెలుసు .

డాబుసరి పేరెంట్స్ .. డబ్బు లేకపోయినా పొలం పుట్రా అమ్మేయాలి . 
తప్పదు !! 
" మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు?" అని పక్కింటి వాళ్ళు .. పై ఇంటి వాళ్ళు ప్రాణాలు తోడేస్తారు .
కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుంది . 
బిల్డ్ అప్ లేకపోతె ఎలా ? 

సరిగ్గా ఇలాంటి .. పొట్ట పొడిస్తే అక్షరం రాని వారి కోసమే గత ఇరవై ఏళ్లగా దేశ వ్యాపితంగా అనేక ఇంజినీరింగ్ కళాశాలలు .. స్టార్ హోటల్స్ ను తలపించే ప్రైవేట్ యూనివర్సిటీ లు వెలిసాయి .
తాజ్ హోటల్ .. గ్రాండ్ కాకతీయ హోటల్స్ లెవెల్ లో వీరి బిల్డింగ్ లుంటాయి .

 పేరు గొప్ప ..‼️‼️
 ఇమేజ్ బిల్డ్ అప్ కోసం ప్రైవేట్ యూనివర్సిటీ వాడు వీవీఐపీ ల ను తెస్తుంటాడు .
 ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు పండగ . 
రామోజీ ఫిలిం సిటీ ని మరిపించేలా సెట్టింగ్స్ వేసి హంగామా చేస్తారు .

మా వాడు ఫలానా కాలేజీ / యూనివర్సిటీ అని డాబు సరి పేరెంట్స్ గొప్పలు .
 పొట్ట పొడిస్తే అక్షరం రాని సుంటకు డబ్బు కట్టి సీట్ ఇప్పించామని వాళ్లకు తెలుసు .
 ఆ మాటకొస్తే అందరికీ తెలుసు .
 ఎవడూ మాట్లాడడు . 
... రాజు గారి దేవత వస్త్రాల సీక్వెల్ స్టోరీ .

ఊరు పరమ దిబ్బ .❌❌

అక్కడ ఒకటో- అయిదు శాతం ఫాకల్టీ మాత్రమే చదువు చెప్పే ప్రతిభ కలిగుంటారు.
 మిగతా... బోగస్ సర్టిఫికెట్స్ బ్యాచ్ . 

పది శాతం విద్యార్థులు చదువు పై ఫోకస్ పెడితే ఎక్కువ .
 మిగతా వారికి చదువు అలవాటు ఎప్పుడో ఆరో తరగతిలోనే తప్పింది .ఇప్పుడు ఎలా చదవగలరు ? అసలు అంత అవసరం ఏమొచ్చింది ?
అమ్మ అబ్బా సంపాదించిన డబ్బు ఉందని వారికి తెలుసు . 

చేరింది... క్లబ్ లాంటి విద్య సంస్థలో . 
బయటే అదొక విద్య సంస్థ .
 లోన జరిగేది వేరు . 
ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కే కాలేజీ కొన్ని రూమ్స్... ఒక ఫ్లోర్... అలాట్ అయిపోతుంది ..
 అక్కడ తాగొచ్చు .
 రీల్స్ తీసుకోవచ్చు .
 బయటకు రాకుండా ఏమైనా చేసుకోవచ్చు .
 ప్రిన్సిపాల్ గారి ఆజ్ఞ .
 పాపం అంత కన్నా ఏమి చేయగలడు ? 
 వదిలేస్తే క్లాసు రూమ్ లోనే ఓటిటీ సినిమాలు జరిగిపోతాయి మరి . 
రెండో ఏడాది గడిచే సరికి డ్రగ్స్ .. గ్రూప్ సెక్స్ .
 నాలుగేళ్లు ఇదే మార్గం లో ప్రగతి .

బాల్యం నుంచి అలవాటయిన కాఫీయింగ్ ఎలాగూ వుంది .
 దగ్గరుండి మరీ ప్రైవేట్ యూనివర్సిటీ/ ఇంజనీరింగ్ కాలేజీ వాడే కాపీ రాయిస్తాడు . 
ఇంటర్నల్ మార్కులు వేయిస్తాడు .
 డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో పెట్టి convocation పేరుతొ హుంగామ చేయించి మరీ పంపుతాడు . 

చేతికి డిగ్రీ సర్టిఫికెట్ వచ్చింది .

"వదినా/అన్నయ్య ! .. మీ వాడికి జాబ్ వచ్చిందా ? ప్యాకెజీ ఎంత??” అని పొడుచుకొని తినే .. పక్కింటి పై ఇంటి వాళ్ళు ఎలాగు ఉన్నారు .
 డొల్ల డొక్కు సర్టిఫికెట్ తో ఉద్యోగం ఎవడిస్తాడు ?
దానికీ ఒక మార్గం కనిపెట్టేసారు .  

అమెరికా లో ఎవడినో పట్టుకొంటే ప్రాక్సీ ల సాయం తో GRE టోఫెల్ పరీక్షలు రాయించి .. బోగస్ ఇంటర్వ్యూ చేయించి జాబ్ ఇప్పిస్తాడు . 
వచ్చే జీతం లో ఇంత శాతం అని వాడిది .
 మిగిలిన సగం జీతం లో లో కొంత ఇచ్చి ఇండియా లో ఉన్న వాడితో పని చేయించుకొంటే .. తాను అమెరికా లో కొత్త దందా చేస్తూ కోట్లు కూడా పెట్టవచ్చు . 
అన్నీ కలిసొస్తే ఇండియా లో రాజకీయాల్లో చేరి పదవి గౌరవం కొట్టెయ్యొచ్చు .

స్కూల్ దశ నుంచి జాబ్ సాదించే దాక .. బోగస్ పధ్ధతి ని అనుసరించి .. అదే గొప్ప అని నమ్మించి .. డాబుసరి బతుకు బతకడం తెలుగు వాడు నేర్చిన కళ.
 కాపీ రైట్స్ .. పేటెంటెడ్ హక్కులు వాడి సొంతం . 

ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రైవేట్ యూనివర్సిటీ ల లో చదువు కోసం వెళ్లి కాపీ రాయుళ్ల పీర్ ప్రెషర్ తట్టుకోలేక .. బూజ్ .. డ్రగ్స్... ఫ్రీ సెక్స్ .. దారి పట్టలేక సతమమయిన విద్యార్థులు .. తాను మంచి ఇంజనీరింగ్ కాలేజీ లో చదివినా తనకు రావాల్సిన అమెరికా జాబ్ ను ప్రాక్సీ గాడు తన్నుకు పోవడంతో బాధ పడిన సిన్సియర్ వ్యక్తుల .. ఆత్మ గోష వూరక పోతుందా ?

వచ్చాడు ఒక ట్రంప్ .

ట్రంపో..
 వంపో...
ఇసుక తో కట్టిన భవనం నిలుస్తుందా ?
ఎదో కొంత కాలం సాగింది .

వంద మంది వెళ్లారు కాబట్టి దొంగదారి.. రహదారి అయిపోతుందా ?
 బడాయి బసవయ్యల పిల్లల జీవితాలు డేంజర్ లో ! 

 తల్లితండ్రుల డాబుసరి .. ఇప్పుడు వారి సంతానం ప్రాణాలకొచ్చింది . 
లక్షలు ఖర్చు పెట్టి మందు బాబులను .. మద్యం పాపలను .. డ్రగ్స్ కేటుగాళ్లను .. తయారు చేసి వదిలితే ?

ఎవరిదీ పాపం ? 
తొలి విలన్ .. డాబుసరి పేరెంట్స్ .
 రెండో విలన్ .. గతి తప్పిన విద్యా వ్యాపారం .
 మూడు .. రాజకీయం .

ధర్మం అధోగతి పాలయితే .. కరెక్షన్ తప్పదు . 

జరిగింది గోరంత . 
జరగబొయ్యేది కొండంత ! 
చూస్త్తూ .. వుండండి .

భాగవతం నుండి తెలుసుకోవలసిన పది విషయాలు....

భాగవతం నుండి తెలుసుకోవలసిన పది విషయాలు........
.1. పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి.
కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది
2. సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి 
3. యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోऽతిరుష్టం విశతే తమోऽన్ధమ్
భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలి అనుకున్నవారికి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బుద్ధి పాడవౌతుంది జ్ఞ్యానం నశిస్తుంది. ఆ పని కాలేదంటే "ఇది పరమాత్మకు ఇష్టం లేదేమో" అని పరమాత్మకు నమస్కరించాలి.
పరమాత్మ చెడగొట్టిన దాన్ని గురించి చేయడానికి ఆలోచించేవాడికి మనసు కోపాక్రాంతమవుతుంది. అజ్ఞ్యానములో చేరుతుంది. భగవంతుడు చెడగొట్టిన పని గురించి ఆలోచించవద్దు
4. శరీరం ఉన్న వాడు తింటే శరీరము లేని వాడి కడుపు నిండుతుంది. పాంచభౌతిక శరీరం లేని వాడికి శరీరం ఉన్నవాడు తింటే కడుపు నిండుతుంది. అగ్ని జలము వలన పుడుతుంది (విద్యుత్ శక్తి). సజాతీయములతో పుట్టుక జరుగదు. విద్యుత్తు నీటి నుండి పుడుతుంది. వేడికి సంబంధించిన దానితో వేడి పుట్టదు. విజాతీయం ( విరుద్ధమైన ధర్మం) ఉన్న వాటితోనే పుడుతుంది. అలాగే శరీరం లేని వాడికి కడుపు నిండాలంటే శరీరం ఉన్నవాడు తినాలి. మరి శరీరం లేని వాడికి కడుపుంటుందా? ఉండదు. కానీ మనసు ఉంటుంది. అది నిండితే చాలు. ఎక్కడో ఉన్న కొడుకుకు మేలు జరిగితే (ఉదా: మనవడు పుడితే) ఇక్కడే ఉన్న తండ్రి మనసు నిండుతుంది. అంటే తృప్తి అనేది ఎక్కడ ఉన్నా పుడుతుంది. అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. పరలోకములోకి నిండేది కడుపు కాదు తృప్తి. ఈ లోకములో పూజిస్తే పైలోకములో ఉన్నవాడు తృప్తిపడతాడు.
5. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేऽను సమ్పదః
ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యమ్ సంపదలు ఎవరి దగ్గరకు వస్తాయి? అన్ని మంచి గుణములూ కలవాడికి, ఉత్తం శీలము కలవాడికి, చేసిన ఉపకారం మరచిపోని వాడికీ, పెద్దవారిని ఆశ్రయించి ఉన్నవాడికీ అన్ని సంపదలూ స్వయముగా వచ్చి వరిస్తాయి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు గోవులూ దేవతలూ పరమాత్మ నా విషయములో ప్రసన్నమవుదురు గాక.
6. సప్తర్షులు యజ్ఞ్యం నిర్వహించినపుడు ఋషులు వారి భార్యలతో ప్రదక్షిణం చేసినపుడు అగ్నిహోత్రుడు వారిమీద వ్యామోహపడ్డాడు. ఆ వేదనతో అగ్నిహోత్రుడు చిక్కిపోయి, హవిస్సులను కూడా తీసుకోవట్లేదు. అది గమనించిన భార్య ఆయా భార్యల రూపములో వ్యవహరించింది. అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు. ఋషులు ఆ విషయం తెలియక తమ భార్యలనూ అగ్నిహోత్రునీ శపించాడు. అగ్నిహోత్రుని భార్య నచ్చజెప్పడం వలన ఋషులు శాపాన్ని ఉపసంహరించారు. అప్పటినుంచీ భార్యాభర్తలు ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిహోత్రునికి కళ్ళు కనపడకుండా ఉండాలన్న శాపమిచ్చారు. ఈ విషయం శంకరుడు స్కాంధ పురాణములో చెప్పాడు. అగ్నీ వాయువూ శంకరుని అంశలే. అందుకే కుమారస్వామి ఆరుగురి నుంచి జన్మించాడు: భూమి, భూమి భరించలేకపోతే అగ్ని, వాయువు, నీరు, శంకరుడు ఇలా ఆరుగురినుంచి షడ్యః అని కుమారస్వామి పుట్టాడు. అందుకే కృత్తికలు ఆరుగురు వచ్చారు. కుమారస్వామి అగ్ని పుత్రుడయ్యాడు. అలాగే హనుమంతుడు వాయు పుత్రుడు. అగ్నీ వాయువూ శంకరుడూ ఒకరే.
7. మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే
8. న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా |౨-౩౯-౨౯|
మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ |౨-౩౯-౩౦|
హద్దు లేని ప్రేమనిచ్చేవాడు భర్త మాత్రమే. తల్లీ తండ్రీ అంత ప్రేమను ఇవ్వలేరు. అందుకు భర్తను అవమననించవద్దు. అయోధ్యాకాండము_-_సర్గము_39
9. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః భయంకరైః
విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః
పాలియ్యని ఆవుల మెడలో గంటలు పెడితే కొంటారా. మానవుడు గుణములచే గౌరవము పొందును గానీ,ఆడంబరముచే కాదు. 
10. తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా - పరమాత్మకు సంతోషం కలిగింపచేసేదే పని, పరమాత్మయందు బుద్ధి నిలిపేదే చదువు.

How Should Parents and Teachers Guide Children for a Better Future

How Should Parents and Teachers Guide Children for a Better Future?
---------------
For children to grow into responsible citizens, parents and teachers must provide effective guidance. Instilling discipline, love, time management, and values is crucial for their mental, physical, and social development. Teachers should not only educate but also impart moral values. Parents should understand their children's psychology and nurture them in the right way.

10 Guidelines Teachers Should Teach Children

1. Moral Values: Teach honesty, responsibility, kindness, and integrity.

2. Self-Confidence: Encourage children to believe in their abilities.

3. Time Management: Help them balance studies, play, and rest.

4. Independent Thinking: Develop problem-solving skills.

5. Value of Hard Work: Teach them that success comes through effort.

6. Use of Technology: Promote beneficial use of technology.

7. Health Care: Encourage healthy eating, exercise, and proper sleep.

8. Active Listening: Teach them to listen carefully to parents and teachers.

9. Social Responsibility: Instill the habit of helping others and showing respect.

10. Traffic Rules: Educate them on road safety and responsible driving.

10 Parenting Tips for Raising Responsible Children

1. Friendly Bonding: Talk with love and understand children’s emotions.

2. Understanding Situations: Know what children are going through without pressuring them.

3. Monitoring Education: Respect their studies and provide the necessary support.

4. Physical & Mental Health: Ensure they eat healthy, sleep well, and exercise.

5. Time Management: Balance study, play, and relaxation effectively.

6. Handling Mistakes Gently: Explain their mistakes lovingly instead of blaming them.

7. Friendship Choices: Know who their friends are and guide them wisely.

8. Freedom to Express: Encourage children to share their thoughts and problems.

9. Independence & Responsibility: Teach them to manage their tasks independently.

10. Teaching What to Believe: Guide them in distinguishing right from wrong.

The Importance of Dress Code in Schools

A dress code plays a crucial role in shaping children’s personalities. Up to the 10th grade, every school should strictly follow its existing uniform policy, irrespective of religion. Wearing a uniform fosters equality among students.

Authorities, teachers, and parents should work together to promote the school uniform, as it strengthens discipline, respect, and social harmony. Following a uniform policy aligns with the laws of both the country and the Creator.

Government Laws & Strict Actions for Dress Code Enforcement

The school dress code is an essential part of maintaining discipline in educational institutions. The state government should take strict measures to ensure its implementation.

Schools must continue with their existing dress code without forced changes.

Anyone attempting to alter the dress code should face legal consequences.

A unified education system should promote equality, avoiding religious or economic divisions.

Pressure to include religious attire in school uniforms should be strictly opposed.

Any attempts to alter the school uniform forcibly should be met with strict legal action.

By enforcing a proper dress code, teachers, parents, and students can feel secure in educational institutions. The government should pass a bill to prevent any unnecessary modifications to school uniforms.

Conclusion

Children are the future citizens of the nation. It is the responsibility of teachers and parents to guide them with love, discipline, responsibility, and respect. Only through collective effort can we prepare them for a better future.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, టీచర్లు ఎలా మార్గనిర్దేశం చేయాలి?

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, టీచర్లు ఎలా మార్గనిర్దేశం చేయాలి?
-----------
పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమర్థంగా మార్గనిర్దేశం చేయాలి. పిల్లల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి క్రమశిక్షణ, ప్రేమ, సమయపాలన, విలువలు నేర్పించడం కీలకం. టీచర్లు విద్యాబోధనతో పాటు నైతిక విలువలను కూడా అందించాలి. తల్లిదండ్రులు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని సరైన విధంగా పెంచాలి.

టీచర్లు పిల్లలకు నేర్పించాల్సిన 10 మార్గదర్శకాలు
---------------
1. నైతిక విలువలు: నిజాయితీ, బాధ్యత, సహాయం, మరియు శీలం నేర్పించాలి.

2. ఆత్మవిశ్వాసం: పిల్లలు తమ సామర్థ్యాలను నమ్మేలా ప్రోత్సహించాలి.

3. టైం మేనేజ్మెంట్: చదువు, ఆట, విశ్రాంతి సమతుల్యంగా ఉండేలా అలవాటు చేయాలి.

4. స్వతంత్ర ఆలోచన: సమస్యల్ని స్వయంగా పరిష్కరించే సామర్థ్యం పెంచాలి.

5. శ్రమకు విలువ: కష్టపడితేనే విజయం సాధించగలరని తెలియజేయాలి.

6. టెక్నాలజీ వినియోగం: ఉపయోగకరమైన టెక్నాలజీ ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలి.

7. ఆరోగ్య సంరక్షణ: సరైన ఆహారం, వ్యాయామం, మరియు మంచి నిద్ర అలవాటు చేయాలి.

8. శ్రద్ధగా వినడం: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఏకాగ్రతతో వినడం నేర్పించాలి.

9. సామాజిక బాధ్యత: సహచరులకు సహాయపడటం, ఇతరులను గౌరవించడం అలవాటు చేయాలి.

10. ట్రాఫిక్ నిబంధనలు: రోడ్ల మీద నడుచుకోవడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం నేర్పించాలి.

తల్లిదండ్రులు పిల్లల మీద తీసుకోవాల్సిన శ్రద్ధ & పాటించాల్సిన 10 మెలకువలు
---------------
1. స్నేహపూర్వక అనుబంధం: పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి, వారిని అర్థం చేసుకోవాలి.

2. పరిస్థితులను అర్థం చేసుకోవడం: పిల్లలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలి, ఒత్తిడికి గురిచేయకూడదు.

3. చదువుపై నిఘా: పిల్లల చదువును గౌరవిస్తూ, అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలి.

4. శారీరక & మానసిక ఆరోగ్యం: ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం అలవాటు చేయాలి.

5. సమయపాలన: పిల్లల ఆట, చదువు, విశ్రాంతి సమయాన్ని సమతుల్యంగా కేటాయించాలి.

6. చిన్న చిన్న తప్పులను తక్కువగా చూడాలి: పిల్లలు తప్పులు చేస్తే ప్రేమతో అర్థం చెప్పాలి, వెంటనే నిందించకూడదు.

7. స్నేహితుల ఎంపిక: పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

8. ఎటువంటి విషయాలనైనా మాట్లాడే స్వేచ్ఛ: పిల్లలు తమ సమస్యలు తల్లిదండ్రులకు స్వేచ్ఛగా చెప్పేలా ప్రోత్సహించాలి.

9. స్వతంత్రత & బాధ్యత: పిల్లలు తమ పనులు స్వయంగా చేసుకునేలా అలవాటు చేయాలి.

10. ఏం నమ్మాలో, ఏం నమ్మకూడదో వివరిస్తూ పిల్లల మెంటాలిటీ అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

డ్రెస్ కోడ్ – అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా పాటించాలి

పిల్లల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో డ్రెస్ కోడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

10వ తరగతి వరకు ఏ స్కూల్లో అయితే ఏ డ్రెస్ కోడ్ అమలులో ఉందో, అదే కొనసాగించాలి.

అది ఏ మతమైనా కావచ్చు, కానీ నిర్దిష్టంగా పాటించాలి.

స్కూల్ యూనిఫామ్‌ను పాటించడం వల్ల విద్యార్థులలో సమానత్వ భావన పెరుగుతుంది.

అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పిల్లలకు యూనిఫామ్‌ను ప్రోత్సహించాలి.

ఇది పాటించినప్పుడే మన సమాజం, మన దేశం బాగుపడుతుంది.

దేవుడి నియమాలు, సృష్టికర్త నియమాలు కూడా పాటించినట్టే అవుతుంది.

పిల్లలు విద్యాసంస్థల్లో ఏకతాభావంతో పెరగాలి, మతం, వర్గం, ధనస్థితి వంటి విభజనల నుండి దూరంగా ఉండాలి.

స్కూల్ యూనిఫామ్ వల్ల పిల్లల్లో క్రమశిక్షణ, గౌరవం, సమానత్వం, సంఘభావం పెరుగుతుంది.

డ్రెస్ కోడ్ కోసం ప్రభుత్వ చట్టాలు & కఠిన చర్యలు

పాఠశాలలలో డ్రెస్ కోడ్ అనేది విద్యాసంస్థల క్రమశిక్షణను నిలబెట్టే ఒక ముఖ్యమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.

ఏ స్కూల్లో అయితే ఏ డ్రెస్ కోడ్ అమలులో ఉందో, అదే తప్పనిసరిగా కొనసాగించాలి.

ఇది బలవంతంగా మార్చాలని ప్రయత్నించిన వారిపై ప్రభుత్వ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు విధించాలి.

ఒకే దేశం, ఒకే విధానంతో విద్యార్థులలో సమానత్వాన్ని పెంచాలి.

మతపరమైన దుస్తులను స్కూల్ యూనిఫామ్‌లో భాగం చేయాలని ఒత్తిడి తెస్తే, అలాంటి చర్యలను అడ్డుకోవాలి.

స్కూల్ యూనిఫామ్‌పై బలవంతపు మార్పులు చేయాలని చూస్తే, వారికి కఠినమైన శిక్షలు విధించే విధానాన్ని అమలు చేయాలి.

ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు విద్యాసంస్థల్లో నిస్సంకోచంగా ఉండగలరు.

ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేసి, స్కూల్ యూనిఫామ్‌పై మార్పులు తేవాలన్న దురుద్దేశాలను అడ్డుకోవాలి.

ముగింపు:

పిల్లలు భవిష్యత్ పౌరులు, మంచి సమాజం కోసం వారికి సరైన మార్గనిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత టీచర్లు, తల్లిదండ్రులది. ప్రేమ, క్రమశిక్షణ, బాధ్యత, గౌరవం కలిపి నేర్పినప్పుడే సమర్థమైన తరం తయారవుతుంది.
పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేయడం ఒక్కరికి కాదు, సమాజం అంతా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత!

Thursday, February 6, 2025

తెల్ల జొన్నల మాల్ట్*


*<>•<>•<>•<>•<>•<>•<>•<>•>*
   *ఆరోగ్య మస్తు*
*====================*
*తెల్ల జొన్నల మాల్ట్*
*++++++++++++++++++++*
*తయారీవిధానం*
: తెల్లజొన్నలను ఒకకిలో తెచ్చుకొని ఒకరోజు నీళ్ళలో నానవేయండి. తర్వాత వడకట్టి తడి నూలుబట్టలోవేసి మూటకట్టి 1,2రోజు విలువవుంచండి. మరునాటికి ఆ జొన్నలు మొలకెత్తుతాయి. అప్పుడు వాటిని తీసి బాగా ఎండించిన తరువాత బాండీలో వేసి కొంచెం నేతితో దోరగా వేయించి పిండిలాగా విసురుకొని నిలువవుంచుకోండి.

*ఉపయోగాలు*
  ఈ జొన్నపిండిని పైనచెప్పిన ప్రకారం జావ(మాల్టు) లాగా కాచి పిల్లలచేత తాగించండి. పూర్వకాలం జొన్నన్నం, జొన్నసంకటి, జొన్నరొట్టెలు తిన్న మనపెద్దలు ఎంత బలిష్టులుగా ఎంతదీర్ఘాయువుతో ఎంత ఆరో గ్యంగా జీవించేవారో అదేవిధంగా ఈజావ తాగిన బిడ్డలుకూడా అంతే ఆరోగ్యంగా అభివృద్ధి చెందగలుగుతారు.

10 అంతేగాక తెల్లజొన్నలు మానవులకు ముఖ్యంగా పిల్లలకు, యువకులకు శారీరకపుష్టిని, వీర్యవృద్ధిని, మనోహరమైన రుచిని అందిస్తయ్. ముఖ్యంగా మానవశరీరంలో సకలరోగాలకు మూలమైన వాత, పిత్త, శ్లేష్మములనబడే త్రిదోషములను సమస్థాయికి తెచ్చి ఈ పదార్థం తిన్నంతకాలము ఆ 1 శక్తులకు ఏవ్యాధులు రాకుండా కాపాడగలుగుతయ్. తెల్లజొన్నలు పై ప్రకారంగా వాడటంవల్ల అతి త్వరగా జీర్ణమై శీఘ్రంగా ధాతుశక్తిగా రూపాంతరం చెందుతూ బిడ్డలను దీర్ఘకాయులుగా, సుందరశరీరులుగా నిరోగులుగా, తీర్చిదిద్దుతయ్.

*తల్లులకు సూచన* 
 ఇంత గొప్ప శక్తిగల ధాన్యం
అందుబాటులో ఉన్నా కూడా కొద్దిపాటి శ్రమతో జావగా తయారుచేసి బిడ్డలచేత తాగించగల అవకాశం వుండికూడా నేటి తల్లులు ఈసత్యాన్ని తెలుసుకోలేక వందల రూపాయలు ఖర్చుపెట్టి అంగళ్ళలో కొన్న మాల్టులను బిడ్డలకు వాడుతున్నారు. ఇకనైనా తల్లులు తమ స్వహస్తాలతో చేసిన స్వగృహమాల్టులను బిడ్డలచేత తాగించవలసిందిగా కోరుతున్నాం.

  * *తెల్ల జొన్నల సూప్*
    *+++++++++++++++++++*
1 తెల్ల జొన్న లు-100గ్రాములు
2. అన్నం వండింది -1/4 కప్పు
3. పెరుగు -1/4 కప్పు
4. ఉల్లిపాయ ముక్కలు1/4కప్పు
5. పచ్చిమిర్చి ఒకటి
6. జీలకర్ర ఒక చెంచా
7. ఇంగువ పావు చెంచా
8. ఉప్పు తగినంత

 *తయారు చేయు విధానం*
 :-
 తెల్ల జొన్నల పిండి చేసుకుని దానిలో తగినంత నీళ్లు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పావు కప్ప అన్నంలో కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి దాన్ని తెల్ల జొన్నలులో కలపాలి
 పెరుగులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంకా వేసి గ్రైండ్ చేయాలి. దాన్ని సూపులో కలపాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి
ఒక మట్టి పాత్రలో, ఎనిమిది పది గంటల అలాగే ఉంచుకున్న తర్వాత త్రాగాలి.. చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటాది.

*తెల్ల జొన్నలు మాల్ట్ తయారు చేయు విధానం*:-
***************************
ఒక కేజీ "తెల్ల జొన్న లు రాత్రి నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఒక బట్టలో వేసి మూట గట్టి.. రెండు రోజులు అలాగే ఉంచితే మొలకలు వస్తాయి
 వాటిని ఎండబెట్టి.. పొడి చేసి నిలువు చేసి పెట్టుకోవాలి
*👉 కావలసిన పదార్థాలు*
 1. తెల్ల జో న్నుల పిండి 50 గ్రాములు 
2. ఖర్జూరం గింజలు తీసినవి-2
3. బెల్లం 20 గ్రాములు 
4.నెయ్యి 10-20ml
5. పుచ్చకాయ గింజలు 1/4 చెమ్చా 
6. సబ్జా గింజలు పావు చెంచా
7. వేయించిన వేరుశెనగ గింజలు
5 గ్రామలు 
8. బాదం, జీడిపప్పు, కిస్మిస్
-20 గ్రాములు 
9.నువ్వులు పావు చెంచా
9.నీళ్లు 200ml 

*👉 తయారుచేయు విధానం*
:--
200ml లో 50 గ్రాములు తెల్ల జొన్న పిండి వేసి వేడి చేయాలి.. 50 ml నీళ్ళ లో బెల్లము ఖర్జూరము.. విడిగా నానబెట్టుకోవాలి.. తెల్ల జొన్నల పిండి ఉడుకుతున్నప్పుడు దానిలో వేసేయాలి.. స్టవ్ మీద ఉన్నప్పుడు మీగత పదార్థాలు కూడా వేసి వేయాలి... కొద్దిసేపటి తర్వాత తాగడానికి రెడీ గా ఉంటావి 
 👉ఉదయం లేదా సాయంత్రం పూట దీనిని సేవించవచ్చు.. 
 రాత్రి భోజనం బదులు కూడా సేవించవచ్చు... 

 

Wednesday, February 5, 2025

శ్వాశకోశ వ్యాధులు (ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు) - అద్భుతమైన ఆయుర్వేద నివారణ మార్గాలు:*

✍️ *శ్వాశకోశ వ్యాధులు (ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు) - అద్భుతమైన ఆయుర్వేద నివారణ మార్గాలు:*

👉 ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీ అందరి కోసం మేము అందిస్తున్న గొప్ప ఆరోగ్య సూచనలు. దయచేసి చివరి వరకు చదివి మీ మిత్రులందరికీ షేర్ చేయండి.

✍️ *ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఏమిటి?*

👉ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు క్షయ వంటి ఊపిరితిత్తులతో సంబంధం ఉన్న వ్యాధులకు వర్తిస్తుంది.

👉 శ్వాస సమస్యలన్నీ ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించినవే.

✍️ *ఊపిరితిత్తుల సమస్యలు రావడానికి కారణాలు:*

👉 *ధూమపానం -*

సిగరెట్లలోని విష రసాయనాలు మంటను కలిగించడం ద్వారా ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తాయి మరియు ఊపిరితిత్తులలోన గాలి తిత్తుల యొక్క స్థితిస్థాపకత మరియు పనితీరును బలహీనపరుస్తాయి.

👉 *కాలుష్యం-*

వాయు కాలుష్య కారకాలను స్థిరంగా పీల్చడం వల్ల మంట వస్తుంది, చివరికి ఊపిరితిత్తులకు నష్టం జరుగుతుంది.

👉 *వైద్య పరిస్థితులు -*

కొన్ని వైద్య పరిస్థితులు రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కోయిడోసిస్, స్టోగ్రెన్స్ సిండ్రోమ్, ఎంఫిసెమా మొదలైనవి ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా కారణమవుతాయి.

👉 *వైద్య చికిత్సలు -*

కొన్ని వ్యాధులకు చికిత్స పొందడం వల్ల కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, యాంటీబయాటిక్స్, యాంటికాన్వల్సెంట్స్ వంటివి ఊపిరితిత్తుల సమస్యలకు కూడా దారితీస్తుంది.

✍️ *శ్వాసకోశ వ్యాధి లక్షణాలు:-*

👉 *దగ్గు:*

దగ్గు అనేది ఒక రక్షణ వ్యవస్ధ, ఇది శ్వాసకోశ వాయుమార్గంలోనున్న శ్లేష్మాన్ని, గాలి పీల్చినపుడు చేరు విషపదార్థాలను లేదా ఇతర పదార్థాలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని తొలగించుటకు ఉపయోగపడుతుంది. దగ్గు అనేది ప్రయోజనకారా లేదా అప్రయోజనకారా అనేది దాని చర్యపై ఆధారపడి ఉంటుంది. ప్రయోజనకారక దగ్గు శ్వాసకోశ వాయుమార్గంలోనున్న శ్లేష్మాన్ని, స్రావాలను తొలగిస్తుంది. తీవ్రమైన జ్వరము, డిస్పినియా(ఊపిరి ఆడకపోవడం) లేదా రక్తముతో కూడిన లేదా ధారాళమైన కఫముతో పాటు వచ్చే ఎడతెగని దగ్గు లేదా ఉధృతమైన దగ్గుకి తక్షణ వైద్య సేవలు అవసరము. దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధి యొక్క సాధారణ లక్షణము.

👉 *డిస్పినియా:*

డిస్పినియా (ఊపిరి ఆడకపోవడం) కొన్నిసార్లు శ్వాసకోశ వ్యవస్థ, గుండె జబ్బులు, ఆందోళన లేదా ఇతర కారణాలవల్ల వస్తుంది. జబ్బుతో ఉన్న కాలంలో అకస్మాత్తుగా వచ్చే ఊపిరాడకపోవడం లాంటి, ప్రత్యేకంగా ఇతర లక్షణాలతో పాటు విడువకుండా దగ్గు వస్తున్నట్లైతే దానిని వ్యాధిగా గుర్తించి తక్షణమే వైద్యునిచే పరీక్ష చేసుకోవాలి. ఊపిరాడకపోవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సాధారణ విషయం కాదు. దానిని తీవ్రమైన విషయంగా తీసుకుని డాక్టర్ ని సంప్రదించాలి.

👉 *వీజింగ్:*

ఊపిరిపీల్చినపుడు, వదలినపుడు చాలా ఎక్కువగా వచ్చే శబ్దమే వీజింగ్. ఏవైనా బయటి వస్తువుల గాలిని పీల్చి వాయు మార్గాన్ని అడ్డగించినపుడు లేదా శ్లేష్మం లేదా అధికస్రావాలు, నొప్పితో కూడిన వాపు లేదా అసాధారణ కణజాలం వలన ముక్కులోని గాలిమార్గం అడ్డగించినపుడు లేదా వాయు మార్గం సన్నగా ఇరుకుగా అయినపుడు వీజింగ్ అనేది సంభవిస్తుంది. శ్వాసకోశముల పనితీరు క్షీణించుచున్నదని చెప్పడానికి వీజింగ్ అనే వ్యాధి చిహ్నంగా చెప్పవచ్చు.

👉 *ఛాతీ నొప్పి:*

ఛాతీ నొప్పి సాధారణంగా , ఛాతీ గోడల ఎముకలు, కండరాలు, ఊపిరితిత్తులపైన పొర (ప్లూరా) ఊపిరితిత్తులు మొదలగు వాని సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య చిన్నదవవచ్చు లేదా తీవ్ర మైనది లేదా ప్రాణాంతకమవవచ్చు మరియు శాశ్వతమైనది లేదా ఊపిరిపీల్చేటప్పుడు మాత్రమే రావచ్చు. జ్వరం లేదా దగ్గుతోపాటు ఛాతీలో నొప్పి వస్తే అది అంటువ్యాధిగా గుర్తించవచ్చు. మీకు ఛాతీనొప్పి వస్తున్నట్లనిపించినట్లైతే సత్వర వైద్యసేవలు పొందాలి.

👉 *హిమోప్టిసిస్:*

హిమోప్టిసిస్ (దగ్గునపుడు నెత్తురు పడుట) స్వచ్ఛమైన నెత్తురు లేదా నెత్తుటి జీర లేదా ముద్దతో కూడిన శ్లేష్మము లేదా లేత గులాబీరంగు నురుగులో కనిపించవచ్చు. ఎడతెగని దగ్గు వలన ఇది సంభవిస్తుంది. లేదా ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిని సూచించవచ్చు. హిమోప్టిసిస్ అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణము.

👉 *సైనోసిస్:*

చర్మము రంగు నీలిరంగులోగాని, వంగపండురంగులోగాని మారినపుడు సైనోసిస్ గా గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా పెదవుల చుట్టూ, గోరు మొదళ్ళలో కనిపిస్తుంది. రక్తము సరిపోయినంత ఆక్సిజన్ ని తీసుకోవడంలేదని దీనికి గుర్తు. నెమ్మదిగా శ్వాసకోశ వ్యాధి ముదురుతున్నట్లు లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కి గుర్తుగా సైనోసిస్ కనిపించవచ్చును.

👉 *వాపు:*

కాళ్ళు, చేతులు, చీలమండల దగ్గర వాపు ఉన్నట్లైతే అది శ్వాసకోశ వ్యాధి కి చిహ్నంగా చెప్ప వచ్చును. హృదయరోగములతో ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు తోడైనప్పుడు వాపు అనేది విలక్షణంగా కనిపిస్తుంది. చాలా సార్లు గుండె, ఊపిరితిత్తులు ఒకే రకమైన లక్షణాలను కనపరుస్తాయి. ఎందుకంటే చాలా రకాలైన వ్యాధులకు ఈ రెండు అవయవాలు ప్రభావితమౌతాయి.

👉 *శ్వాసకోశముల వైఫల్యం:*

శ్వాసకోశ వైఫల్యము అనేది తీవ్రమైన, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధికి ఆనవాలు. తీవ్రమైన అంటు వ్యాధి, ఊపిరితిత్తుల వాపు, గుండె ఆగి కొట్టుకొనుట , తీవ్ర శ్వాసకోశవ్యాధి తీవ్రమైన శ్వాసకోశముల వైఫల్యం యొక్క లక్షణములు. ఊపిరితిత్తులు రక్తాన్ని ఆక్సిజనీకరణము చేయలేనప్పుడు లేదా సాధారణంగా రక్తంలోని కార్బన్-డై-ఆక్సైడ్ ను వేరుచేయలేనప్పుడు దీర్ఘకాలిక తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం వస్తుంది.

👉 *న్యుమోనియా:*

న్యుమోనియా అనేది బాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాల వల్ల ఒకటి లేదా రెండు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది ఊపిరితిత్తులలో చీము మరియు ద్రవంతో నిండిపోయి, శ్వాస తీసుకోవడం కష్టతరం మరియు ఆక్సిజన్ తీసుకోవడం పరిమితం చేసే పరిస్థితి. న్యుమోనియా ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేయగలిగినప్పటికీ, శిశువులు మరియు పిల్లలు, వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు) మరియు అంతర్లీన ఆరోగ్య సమస్యలు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. 

👉 *బ్రాంకైటిస్:*

ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్‌ఫ్లమేషన్ (వాపు) వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ జబ్బునే వైద్యపరిభాషలో 'బ్రాంకైటిస్' అంటారు.

✍️ *పాటించాల్సిన నియమాలు:*

బాగా పాతపడిన బియ్యం, పాతగోధుమలు, పాత మినప్పప్పు, పాత పెసరపప్పు, మేకపాలు, మేక నెయ్యి, మేకమాంసం, లేత దొండకాయలు, ఏమాత్రం
ముదరకుండా బాగా లేతగావున్న వంకాయపిందెలు, లేత ముల్లంగి, కేరెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, తోటకూర, కొయ్యతోటకూర, పాలకూర, మెంతికూర, బీర, పొట్ల, లేత అరటికాయ, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, వేపపువ్వు ఇలాంటి ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి.

👉జిగురుగా ఉండేవి, అతి తియ్యగా ఉండేవి, పుల్లగా ఉండేవి, పులిసిన ఆహారపదార్థాలు పూర్తిగా మానాలి. 

👉పాలకన్నా పెరుగుకన్నా పులవకుండా ఉన్న మజ్జిగ ఈవ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుందని గుర్తించండి. పాలతో వండిన పదార్థాలు పూర్తిగా మానేస్తే మంచిది.

👉శనగపిండి, చింతపండు, కొబ్బరి ఈ మూడింటినీ మరిచిపోగలిగితే ఉబ్బసం వ్యాధిని ప్రతి ఒక్కరూ జయించినట్లే!!

👉చేపలు, రొయ్యలు, సొరకాయ, ముదురు వంకాయ, గోంగూర, బచ్చలి, కంద, పెండలం, బంగాళాదుంప, చేమదుంప, చింతపండు వేసిన వంటలు, ఊరగాయ పచ్చళ్ళు, అతిగా పెరుగు వాడకం ఇవన్నీ దగ్గు, జలుబు, ఆయాసం, తుమ్ములున్న వారికి పూర్తిగా నిషేధం అని మరీమరీ గుర్తు చేస్తున్నాను. 

👉పగలు నిద్రపోవడం మానేయండి. ఇది ఈ వ్యాధిలో అత్యవసరం.

✍️ *ఆయుర్వేద గృహ చికిత్సలు:*

ఊపిరి పీల్చుకోవడం (శ్వాస) లో ఇబ్బంది కలిగినపుడు పాటించాల్సిన నియమాలు:

👉1 టీస్పూన్ లైకోరైస్ రూట్ (యష్టి మధు) ను ఒక కప్పు నీటిలో రెండు నిమిషాలు ఉడకబెట్టి లైకోరైస్ టీ తయారు చేయండి. 

👉టీ తాగే ముందు 5 నుండి 10 చుక్కల మహానారాయణ్ ఆయిల్ జోడించండి లేదా ½ టీస్పూన్ సాదా నెయ్యిని ఉపయోగించండి.

👉 ఈ టీని ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఒక సిప్ తీసుకోండి.

👉కొన్ని సందర్భాల్లో, లైకోరైస్ టీ వాంతిని ప్రేరేపిస్తుంది. కానీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కఫాను తొలగిస్తుంది మరియు శ్వాస నాళాల యొక్క దుస్సంకోచాన్ని ఉపశమనం చేస్తుంది మరియు వ్యక్తి సాధారణంగా వెంటనే మంచి అనుభూతి చెందుతాడు.

👉మీరు ఈ లైకోరైస్ టీని అత్యవసర పరిస్థితులకు మాత్రమే కాకుండా, మీరు ఉబ్బసం వచ్చే అవకాశం ఉన్నట్లయితే, ప్రతిరోజూ నివారణగా ఉపయోగించవచ్చు.

👉 హైపర్‌టెన్షన్ ఉన్న వ్యక్తులు లైకోరైస్ టీని ఎక్కువగా ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది శరీరంలో సోడియం నిలుపుకునేలా చేస్తుంది. కావున అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వీళ్ళు ఆస్తమా దాడిని నివారించడానికి తీసుకోవచ్చు.

👉ఒక కప్పు వేడినీటిలో 1 టీస్పూన్ దాల్చిన చెక్క మరియు 4 టీస్పూన్ త్రికాటు కలపండి. 10 నిమిషాల వరకు అలాగే మూత ఉంచి, త్రాగడానికి ముందు తేనె 1 teaspoon కలిపి తీసుకోండి. మీరు ఈ టీని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు. 

👉సగం లైకోరైస్ మరియు సగం అల్లంతో చేసిన టీ ఆస్తమా నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. 

👉ఒక కప్పు నీటికి ½ టీస్పూన్ బే లీఫ్ మరియు ¼ టీస్పూన్ పిప్పాలిని 1 టీస్పూన్ తేనెలో కలిపి ప్రయత్నించండి. రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు.

👉 రద్దీ మరియు శ్వాసలోపం నుండి ఉపశమనం కలిగించే మరొక నివారణ ¼ కప్పు ఉల్లిపాయ రసం,
ఒక టీస్పూన్ తేనె మరియు ½ టీస్పూన్ నల్ల మిరియాలు కలిపిన రసం తీసుకోవచ్చు. ఇది
ఉబ్బసం యొక్క తక్షణ ఉపశమనం కోసం సమర్థవంతమైనది..

👉శీతోపాలాది ½ టీస్పూన్, పిప్పలి చిటికెడు, అబ్రక్ భస్మ చిటికెడు... ఈ మొత్తం మిశ్రమాన్ని తేనెతో కలిపి తీసుకోండి. దీర్ఘకాలిక ఉపయోగం కోసం రోజుకు ఒకసారి తీసుకోండి.

 👉మీరు ½ కప్ బచ్చలికూర రసాన్ని చిటికెడు పిప్పలితో కలిపి రోజుకి రెండుసార్లు త్రాగండి.

👉కొద్దిగా బ్రౌన్ ఆవాల నూనెను కర్పూరం తో కలిపి మీ ఛాతీపై రుద్దడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. 

👉 ఆవాలు మరియు పిప్పలి ( మీకు పిప్పలి లేకపోతే నల్ల మిరియాలు) కలపడం ద్వారా టీ తయారు చేయండి. 1 కప్పు వేడి నీటిలో ఒక్కొక్కటి ¼ టీస్పూన్ కలిపి 10 నిమిషాల వరకు మూత ఉంచండి. తర్వాత 2 టీస్పూన్ల తేనె కలిపి రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగండి.

👉1 టీస్పూన్ బ్రౌన్ ఆవాల నూనెను 1 టీస్పూన్ సహజ సేంద్రీయ చక్కెరతో కలపండి. ఖాళీ కడుపుతో రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోండి.

👉 ఆస్తమా శ్వాసకు మూల కారణం ముక్కు మరియు సైనస్‌ల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈ సందర్భంలో, ప్రతి నాసికా రంధ్రంలో 5 నుండి 10 చుక్కల వరకు గోరువెచ్చని నెయ్యి వేయవచ్చు.

👉 మీకు క్రానిక్ బ్రోన్చియల్ ఆస్తమా ఉంటే, ఒలిచిన అరటిపండులో సుమారు 7 లవంగాలను చొప్పించి, రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం అరటిపండుని తినండి. ఒక గంట పాటు ఏమీ తినకండి, ఆపై 1 కప్పు నీళ్లు వేడిగా త్రాగండి.

👉ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకోవచ్చు.. ఇది ఊపిరితిత్తులకు శక్తినిస్తుంది మరియు ఉబ్బసం శ్వాసను తగ్గిస్తుంది.

👉 ఆస్తమా నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే ప్రభావవంతమైన యోగా ఆసనాలు విల్లు మరియు నాగుపాము భంగిమలు, వజ్రాసనంలో కూర్చోవడం లాంటివి చేయవలెను.

👉 మీ ఉబ్బసం మరియు గురకకు ఆహార అలెర్జీ కారణంగా ఉంటే, సమస్యాత్మక ఆహారాన్ని నివారించండి. 

👉అదేవిధంగా, దుమ్ముతో నిండిన పుస్తకాలు, బూజు పట్టినవి, మరియు కొన్ని రసాయనాలు వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

👉 అన్ని చీజ్‌లతో సహా చాలా పాల ఉత్పత్తులను నివారించండి. 

👉పులియబెట్టిన ఆహారాలు మరియు ఉప్పు పదార్థాలు వాడకండి.

👉దోసకాయ, బీరకాయ మరియు ట్యూనా చేపలు వంటి అన్ని హైడ్రోఫిలిక్ ఆహార పదార్థాలను నివారించండి. 

👉 పుట్టగొడుగులు, వేరుశెనగలు, వాల్‌నట్‌లు మరియు ఇతర గింజలు మరియు ఈస్ట్‌లకు దూరంగా ఉండాలి.

మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి....!!

మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి....!!

స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.

అశ్వత్థమేకం పిచుమందమేకం

న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|

కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ

పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||

అశ్వత్థ = రావి

(100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

పిచుమందా = నిమ్మ

(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

న్యగ్రోధ = మర్రి చెట్టు

(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

తింత్రిణి = చింత

(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

కపిత్థ = వెలగ

(80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)

బిల్వ = మారేడు

(85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)

అమలకా = ఉసిరి

(74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)

ఆమ్రాహ్ = మామిడి

(70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)

వాపి - నుయ్యి

ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)

ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం.

రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.

ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి.

అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని

మూఢ నమ్మకాలుగా భావించి, ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం.

యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది,

కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి.

ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది.

గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.

గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.

పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||

మూలంలో బ్రహ్మ,

కాండములో విష్ణువు,

శాఖలలో శంకరుడు,

ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు అని చెప్పబడినది.

తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.

భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.

జంబుద్వీపే..!* *భరతవర్షే!..!* *భరతఖండే..!!!*

🔔 *సత్సంగం* 🙏🏻

*జంబుద్వీపే..!*
              *భరతవర్షే!..!*
                      *భరతఖండే..!!!*
              
*సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము.*
*మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.*

*అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?*
```
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా,ఐరోపా,ఆఫ్రికా,ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా (భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన ‘భరతవర్షం’ ఒకటి.```

*మిగిలిన 8 వర్షములు ఇవి:*

1) కేతుముల వర్ష 
2) హరి వర్ష 
3) ఇలవ్రిత వర్ష 
4) కురు వర్ష 
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 
7) కింపురుష వర్ష 
8 ) భద్రస్వ వర్ష


పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు,ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్,ఇరాన్,సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కస్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది.
ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం (ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికతకు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు.
ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్ని ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరూ దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కుఱుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు.

ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని!!

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంటి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను బోధిస్తోంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని బోధిస్తోంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను బోధించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి.

తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి.
ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు.

రోజు మార్నింగ్ ఒక గ్లాస్ బూడిద గుమ్మడి జూస్ తాగడం వల్ల కలిగే ఉపయోగాలు 

💥 మెరుగైన జీర్ణక్రియ, వాపు తగ్గించడం మరియు బరువు నిర్వహణ వంటివి ఉన్నాయి. ఇందులో ఫైబర్, నీరు, విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి మరియు కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

📌జీర్ణక్రియ

⚡బూడిద గుమ్మడికాయలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకం మరియు ఉబ్బరం చికిత్సకు సహాయపడుతుంది.

⚡దీని శీతలీకరణ లక్షణాలు కడుపు పొరను ఉపశమనం చేస్తాయి మరియు ఎసిడిటీ తగ్గిస్తాయి.

⚡పెప్టిక్ అల్సర్లు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలకు సహాయపడుతుంది.

📌బరువు నిర్వహణ

⚡బూడిద గుమ్మడికాయ రసంలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది.

⚡ బరువు తగ్గడానికి లేదా బరువు నిర్వహణకు సహాయపడుతుంది.

📌 ఇన్ఫ్లమేషన్ 

⚡బూడిద సారం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణమని నమ్ముతారు.

📌రక్తంలో చక్కెర

⚡బూడిద గుమ్మడికాయ యొక్క తక్కువ గ్లైసెమిక్ సూచిక రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

⚡ఎలుకలలో చేసిన పరిశోధన బూడిద గుమ్మడికాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తుంది.

📌ఇతర ప్రయోజనాలు

⚡గుండెల్లో మంట, వికారం మరియు ఊపిరితిత్తుల సమస్యలకు బూడిద గుమ్మడికాయ సహాయపడుతుంది.

 ⚡ కాలేయ పనితీరు మెరుగుపరచడం

⚡శక్తి స్థాయిలు పెంచడానికి మరియు బలహీనతకు సహాయపడుతుంది.

⚡ కీళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

⚡ హైడ్రేషన్‌కు సహాయపడుతుంది.

⚡ కంటి చూపుకు సహాయపడుతుంది.

⚡చుండ్రు మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

⚡గౌట్ లేదా అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలకు సహాయపడుతుంది.

చింతకాయ తొక్కుతో అద్భుతమైన రుచి – ఆరోగ్యానికి మేలు!

చింతకాయ తొక్కుతో అద్భుతమైన రుచి – ఆరోగ్యానికి మేలు!
----------
రాంబాబు గారు మీ ఆరోగ్యం మీ చేతుల్లో గ్రూపులో ఉంచిన ఈ రుచికరమైన చింతకాయ తొక్కు, పల్లీలు కలిపిన వంటకం గురించి చెప్పుకోవాల్సిందే! ఇది రుచి పరంగా ఎంతో ప్రత్యేకమైనదే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

తయారీ విధానం (Step by Step):

1. చింతకాయ తొక్కు: ముందుగా చింతకాయ తొక్కును శుభ్రంగా సేకరించాలి.

2. పల్లీలు వేయించాలి: ఓ పాన్ తీసుకుని, నెయ్యి లేదా నూనెలో పల్లీలను మాడకుండా సన్నగా వేయించాలి.

3. నూరటం / మిక్సీ పట్టడం: వేయించిన పల్లీల్లో ఒక స్పూన్ చింతకాయ తొక్కు వేసి రుబ్బుకోవాలి లేదా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.

4. ఉప్పు, మిర్చి: ముందుగానే సరిపడా ఉప్పు, మిర్చి కలిపి ఉంటుంది. అయినా మీకు తక్కువగా అనిపిస్తే రుచి చూసుకుని మరింతగా జోడించుకోవచ్చు.

5. పోపు వేయడం: చివరగా కొద్దిగా నువ్వులు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, మిరపకాయలతో పోపు వేసుకుంటే మరింత రుచిగా మారుతుంది.

రుచి గురించి చెప్పాలంటే… నాలుక మీద లాలాజలం!

ఈ వంటకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కాకరపాక రుచిని అందిస్తూ, జీర్ణశక్తిని పెంచుతుంది. సహజమైన పదార్థాలతో తయారవడం వల్ల ఇది ఆరోగ్యానికి హానికరం కాకుండా, శరీరానికి శక్తినిస్తూ మంచి జీర్ణక్రియను కలుగజేస్తుంది.

ఈ ఫోటోను చూసిన వెంటనే నాకేమో నాలుక మీద లాలాజలం ఉత్పత్తి అవుతోంది! దగ్గరుంటే, ఇట్టే తీసుకుని తినే వాడి నేమో! కానీ ఫోటో కాబట్టి తినలేకపోతున్నా. అసలు ఆ పల్లీల కరగనంత ముచ్చటైన వాసన, చింతకాయ తొక్కు యొక్క తీపి-పులుపు మేళవింపు, పోపులోని నువ్వుల రుచితో కలిపి ఓ అద్భుతమైన స్మాకీ ఫ్లేవర్… వర్ణించలేని రుచి! ఒక్కసారి తిన్నవారు మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.

ఇంకా ఏ విధంగా తినవచ్చు?

తొక్కుతో కూడా తినవచ్చు: కొంతమంది చింతకాయ తొక్కుతోనే తింటే మరింత ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు.

ఇతర ఆహారాలతో కలిపి: అన్నం, రొట్టెలు, దోసెలు, చిరుతిండి లాంటి ఏవైనా ఆహారాలతో కలిపి తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది!

ముగింపు:

ఇంత అద్భుతమైన వంటకాన్ని మీ ఆరోగ్య గ్రూపులో అందరికీ తెలియజేసిన రాంబాబు గారికి మెనీ మెనీ థ్యాంక్స్! మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే! రుచికి తోడు, ఆరోగ్యాన్నీ బహుమతిగా ఇచ్చే ఈ వంటకాన్ని తప్పక ప్రయత్నించండి.


ఆలోచనలకు అంతు చిక్కని సమస్య – మానసిక అనిశ్చితి ఆరోగ్యంపై ప్రభావం

ఆలోచనలకు అంతు చిక్కని సమస్య – మానసిక అనిశ్చితి ఆరోగ్యంపై ప్రభావం
-------------
సృష్టి – ఒక అద్భుతమైన రహస్యము
-----------
సృష్టి అనేది మానవుల తలకెక్కలేని అద్భుత రహస్యంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం, విశ్వం, జీవం, చావు – ఇవన్నీ మనం గ్రహించదగిన విషయం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మేధావులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు అనేక వాదనలు తెస్తున్నారు, కానీ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.

సీక్రెట్లు – ఎప్పటికీ కనిపెట్టలేని రహస్యమా?
---------
మన అనుభవంలో మనకు తెలిసినదాని కంటే తెలియనిదే ఎక్కువ. మానవుడు తన పరిధిలో ఎన్నో విషయాలను అర్థం చేసుకున్నాడు. కానీ ఇంకా అనేక మిస్టరీలు మిగిలే ఉన్నాయి.

విశ్వం ఎలా ఏర్పడింది?

జీవం ఎలా వచ్చింది?

చావు తర్వాత ఏం జరుగుతుంది?

ఆత్మ అనేది ఉందా?

దైవం ఉందా, లేదా?

ఇవి ఎప్పటినుండో మానవ మనస్సుకు చిక్కని ప్రశ్నలు. శాస్త్రం కూడా కొన్ని అంశాలను తేల్చినప్పటికీ, అసలు మూలం ఏమిటో అర్థంకావడం లేదు.

పాపం – పుణ్యం ఉన్నాయా?
----------
ఒక వ్యక్తి చేసిన పనిని అతని దృష్టిలో పాపంగా లేదా పుణ్యంగా చూడవచ్చు. కానీ ఆ పని యొక్క పరిణామాలు ఏమిటో సమాజం నిర్ణయిస్తుంది. కొన్ని సమాజాల్లో ఒక నడవడికను సన్మార్గంగా చూడగా, మరికొన్ని సమాజాల్లో అదే పనిని పాపంగా చూస్తారు.

మనిషి చేసే పనులన్నీ తన మనస్సును ప్రభావితం చేస్తాయి. మంచి చేసే వ్యక్తికి మానసిక ప్రశాంతత లభిస్తుంది, చెడు పనులు చేసే వ్యక్తికి భయం, నిద్రలేమి, మానసిక సంఘర్షణ పెరుగుతాయి.

ఆత్మ – ఇది నిజమా, ఊహా?
----------
ఆత్మ అనేది ఒక దివ్యశక్తిగా లేదా ఒక శక్తి తరంగంగా అనేక మతాలు, తత్వవేత్తలు భావిస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు ఇది కేవలం మానసిక భావన మాత్రమే అంటారు. కానీ, మరికొందరు శాస్త్రవేత్తలు శరీరం మృతిపొందిన తర్వాత కూడా కొన్ని శక్తులు మిగిలిపోతాయని పరిశోధనల్లో గమనించారు.

(మనుషులకే కాకుండా ఇతర జీవులకు కూడా ఆత్మ ఉందని కొందరు నమ్ముతారు. ఉదాహరణకు, కొన్ని జంతువులు మనుషుల్లా స్పందిస్తాయి, భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి. కుక్కలు, కోతులు, ఏనుగులు – ఇవన్నీ తమ పరిసరాలను అర్థం చేసుకుని భావోద్వేగాలతో స్పందిస్తాయి. కాబట్టి, మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఆత్మ ఉంటుందని అనేకమంది విశ్వసిస్తున్నారు.)

మానసిక అనిశ్చితి – ఆరోగ్యంపై ప్రభావం.
----------
ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకనప్పుడు మనస్సు భయంతో నిండిపోతుంది. నిత్యం ఒకదానికొకటి ఢీకొనే ఆలోచనలు మన ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి.

1. ఒత్తిడి (Stress) పెరుగుతుంది

శరీరంలో కోర్టిసోల్ అనే హార్మోన్ అధికమై, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

2. ఆందోళన (Anxiety) పెరుగుతుంది

మనసు ప్రశాంతంగా ఉండదు, చిన్న విషయాలకే అసహనపడతారు. దీని ప్రభావంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

3. నిద్ర సమస్యలు వస్తాయి

శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరకదు, దీని వల్ల జీర్ణక్రియ, మానసిక స్థితి దెబ్బతింటాయి.

4. ఆహారం సరిగ్గా అరిగదు

మానసిక ఒత్తిడిలో ఉండే వ్యక్తికి జీర్ణాశయ రసాయనాలు సరైన మోతాదులో విడుదల కావు. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు.

5. శరీర బలహీనత పెరుగుతుంది

శరీరం, మానసిక ఒత్తిడితో, అలసటతో నిస్సత్తువగా మారుతుంది.

మానసిక ప్రశాంతత ఎలా పొందాలి?

1. విశ్వాసం పెంచుకోవాలి

మనం తెలుసుకోవలసినదాన్ని తెలుసుకుంటూ, తెలియనిదాన్ని దేవుడి ఇచ్ఛగా భావిస్తూ ముందుకు సాగాలి.

2. అలవాట్లను మెరుగుపరచుకోవాలి

మానసిక ప్రశాంతత కోసం యోగ, ధ్యానం, క్రమబద్ధమైన జీవనశైలి పాటించాలి.

3. సహజమైన జీవనశైలి పాటించాలి

సహజ ఆహారం, ఆరోగ్యకరమైన నిద్ర, పాజిటివ్ ఆలోచనలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ముగింపు

మనిషి ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటాడు. కానీ, కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే మన ఆరోగ్యాన్ని దెబ్బతినేలా చేసుకోకూడదు. ప్రశాంతంగా, ఆనందంగా జీవించడమే నిజమైన విజయం.

"ఆలోచించు – కాని, మానసిక ప్రశాంతతను కోల్పోకు!"

K. రామలింగారెడ్డి, 
(సమాజ శ్రేయోభిలాషి) 
చంద్ర నగర్ కాలనీ.

నమ్మకం – ఆరోగ్యం మరియు విజయం.

నమ్మకం – ఆరోగ్యం మరియు విజయం.
---------
🔴 నమ్మకం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
✔ నమ్మకంతో తీసుకున్న ఔషధం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
✔ ప్లేసిబో ఎఫెక్ట్ ద్వారా శరీరం త్వరగా కోలుకుంటుంది.
✔ స్ట్రెస్ తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
✔ అపనమ్మకం అయితే, ఔషధం పని చేయకపోవచ్చు!

నమ్మకం vs అపనమ్మకం
-----------
పూర్తి నమ్మకంతో చేసే పని

పూర్తి నమ్మకంతో చేసిన ప్రతి పని అత్యంత శక్తివంతమైనది.
మనసు, శరీరం, మరియు ఆత్మ సక్రమంగా ఒక దిశలో పనిచేస్తే, 90%-100% విజయాన్ని సాధించవచ్చు.

కొంచెం అనుమానంతో చేసే పని
------------
అనుమానం పని పట్ల శక్తిని తగ్గిస్తుంది.
ఇది సాధారణంగా విజయాన్ని 50%-70% వరకు మాత్రమే సాధించవచ్చు.

"నమ్మకం లేకుండా ప్రయత్నం చేసినప్పుడు, సఫలత గాని, సమర్ధత గాని మనసులో ఉండదు."

ఆరోగ్యం మరియు నమ్మకం

100% నమ్మకంతో టాబ్లెట్లు వేసుకుంటే

✔ నమ్మకంతో తీసుకున్న ఔషధాలు తమ పూర్తి ప్రభావాన్ని చూపుతాయి.
✔ ప్లేసిబో ఎఫెక్ట్ ద్వారా శరీరంలో ఆరోగ్య పరిణామాలు సాధించవచ్చు.
✔ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
✔ ఆరోగ్యం త్వరగా పునరుద్ధరించబడుతుంది.

కొంచెం నమ్మకం తక్కువ ఉంటే

❌ ఔషధ ప్రభావం తగ్గుతుంది.
❌ శరీరం తక్కువగా స్పందిస్తుంది.
❌ ఔషధం యొక్క ఫలితం సరిగా కనిపించదు.

నమ్మకంతో మారిన జీవిత ఉదాహరణలు
----------
అర్జునుడు మరియు కృష్ణుడు

మహాభారతంలో అర్జునుడు కృష్ణుడిపై 100% నమ్మకం ఉంచి యుద్ధంలో విజయం సాధించాడు.

ఏసు ప్రభువు

ఏసు నమ్మకంతో అనేక రోగులను నయం చేసి, అంధులకు కంటి చూపు ఇచ్చి, మరణించినవారిని బ్రతికించారు.
"మీ విశ్వాసం మీకు ఆరోగ్యం ఇచ్చింది" అనే ఆయన మాటలు నమ్మకమే నిజమైన వైద్యం అని తెలియజేశాయి.

అబ్రహాం లింకన్ – నమ్మకమే విజయ మార్గం!

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అనేక అపజయాలు ఎదుర్కొన్నా, తాను అధ్యక్షుడవుతాననే నమ్మకంతో చివరికి అత్యుత్తమ నాయకుడిగా ఎదిగాడు.

స్వామి వివేకానంద – నమ్మకమే శక్తి!

"నమ్మకంతో నిండిన వ్యక్తి అశక్తుడైన వంద మందికంటే శక్తిమంతుడు!" అని స్వామి వివేకానంద చెప్పారు.
ఆయన నమ్మకంతో హిమాలయాలకు వెళ్లి యోగ సాధన చేశారు, ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికతను చాటిచెప్పారు.

ఎపీజే అబ్దుల్ కలాం – నమ్మకమే సైన్స్!

పేద కుటుంబంలో జన్మించిన డా. ఎపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి మిస్సైల్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు.
ఆయన నమ్మకంతో శ్రమించి, భారతదేశాన్ని అణు శక్తి దేశంగా మారుస్తూ అధ్యక్షుడిగా ఎదిగారు.

ముగింపు

"నమ్మకం జీవితం గమనించే శక్తి. అపనమ్మకం అడ్డంకి."

✅ నమ్మకంతో చేసే ప్రతీ పని విజయవంతం అవుతుంది.
✅ నమ్మకం మనలోని శక్తిని పెంచి, కార్యాచరణకు సిద్ధం చేస్తుంది.
❌ అపనమ్మకం మాత్రం సాధనకు అడ్డంకిగా మారుతుంది.

గుర్తుంచుకోండి:
---------
"నమ్మకం మార్గదర్శి. దానిని ముద్రించి ముందుకు సాగండి, ఫలితాలు మీకు కనిపిస్తాయి!"

Monday, February 3, 2025

రాగిలు మాల్ట్ తయారు చేయు విధానం*:-


++++++++++++++++++++++
*రాగిలు మాల్ట్ తయారు చేయు విధానం*:-
***************************
ఒక కేజీ "రాగులు రాత్రి నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఒక బట్టలో వేసి మూట గట్టి.. రెండు రోజులు అలాగే ఉంచితే మొలకలు వస్తాయి
 వాటిని ఎండబెట్టి.. పొడి చేసి నిలువు చేసి పెట్టుకోవాలి
👉 కావలసిన పదార్థాలు
 1.రాగి పిండి 50 గ్రాములు 
2. ఖర్జూరం గింజలు తీసినవి-2
3. బెల్లం 20 గ్రాములు 
4.నెయ్యి 10-20ml
5. పుచ్చకాయ గింజలు 1/4 చెమ్చా 
6. సబ్జా గింజలు పావు చెంచా
7. వేయించిన వేరుశెనగ గింజలు
5 గ్రామలు 
8. బాదం, జీడిపప్పు, కిస్మిస్
-20 గ్రాములు 
9.నువ్వులు పావు చెంచా
9.నీళ్లు 200ml 
👉 తయారుచేయు విధానం:--
200ml లో 50 గ్రాములు రాగిపిండి వేసి వేడి చేయాలి.. 50 ml నీళ్ళ లో 
 బెల్లము ఖర్జూరము.. విడిగా నానబెట్టుకోవాలి.. రాగి జావ ఉడుకుతున్నప్పుడు దానిలో వేసేయాలి.. స్టవ్ మీద ఉన్నప్పుడు మీగత పదార్థాలు కూడా వేసి వేయాలి... కొద్దిసేపటి తర్వాత తాగడానికి రెడీ గా ఉంటావి 
 👉ఉదయం లేదా సాయంత్రం పూట దీనిని సేవించవచ్చు.. 
 రాత్రి భోజనం బదులు కూడా సేవించవచ్చు... 

 




ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం సర్వేభవంతు సుఖిన: సర్వే సంతు నిరామయా: సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.

-: ఓం శ్శాంతిః శ్శాతిః శ్శాంతిః

Sunday, February 2, 2025

గజ్జి తామరకి అంతేకాకుండా. వ్రాణాలకి అనేక చర్మ వ్యాధులకు నివారణ లభిస్తుంది.


  గజ్జి తామరకి అంతేకాకుండా. వ్రాణాలకి అనేక చర్మ వ్యాధులకు నివారణ లభిస్తుంది.
 వేప చిగుళ్ళు 25 గ్రాములు 
 మంచి పసుపు 25 గ్రాములు 
 పాత బెల్లము 100 గ్రాములు 
 ఈ మూడు కలిపి ముద్దగా నూరి కుంకుడు కాయ పరిమాణంలో మాత్రలు కట్టుకొని నీడలో ఆరబెట్టుకొని ఉదయము సాయంత్రము ఒకటి లేదా రెండు మాత్రలు వేసుకోవాలి.
 అలాగే పైపూతకి 🌱
 ఆవాల నూనె 50 ml
 వేప నూనె 25ml 
 కానుగ నూనె 25 Ml
 గన్నేరు ఆకు రసం 50 ml
 పిచ్చి కుసుమ ఆకు రసం 25 Ml
 వేప ముదిరిన ఆకురసం 25 Ml
 ఈ మూడు నూనెలు కలిపి మట్టి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి కాగానే.
 ఈ మూడు ఆకు రసంలో నూనెలో వేసి చిన్న మంటపైన రసములన్ని నూనెలోకి కలిసిపోయి నూనె మిగులు వరకు కాచుకొని దించి చల్లార్చుకుని భద్రపరచుకోవాలి.
 ఉపయోగాలు:-
 గజ్జి తామర దురదలు సోరియాసిస్ పుండ్లు దద్దుర్లు అనేక చర్మవ్యాధులు తగ్గుతాయి.
 జై ఆయుర్వేదం 🙏🌱

Saturday, February 1, 2025

పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు

పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

     ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను 

 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు - 

 పిండిపదార్దాలు - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా , ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.  

            పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

  పుదీనా ఆకుతో చికిత్సలు - 

  * పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 

 * పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును. 

 * బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు . 

 * పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును. 

 * క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది . 

 * నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 

 * దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 

 * ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును. 

 * గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును. 

 * పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును. 

 * కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 

 * గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును. 

 * పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 

 * నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు . 

        పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును. 

            సమాప్తం 

 
     

అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.

అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.

 ఈ అగద తంత్రము . ఆయుర్వేదాన్గములలో ఒకటి అసలు ఆయుర్వేదంగములు 8 . అవి 

 1. శల్య తంత్రము.
 2. శౌలాక్య తంత్రము.
 3. కాయ చికిత్స .
 4. భూత విద్య.
 5. కౌమార భ్రుత్యము.
 6. అగద తంత్రము.
 7. రసాయన తంత్రము.
 8. వాజికరణ తంత్రము.

 ఈ 8 విభాగములు ఆయుర్వేదం లొని భాగాలు అందులొ ఈ అగద తంత్రము అనునది అనేక రకమయిన విషాలు శరీరం నందు ప్రవేశించి నానా విధములగు బాధలు శరీరమున ఏర్పడినప్పుడు అట్టి భాధలను ఉపశమింప చేసి మరణం కలగకుండా కాపాడుటకు ఉద్దేశింపబడింది . 

       అనేక రకములు అగు పాములు , తేళ్ళు, ఎలుకలు, పిచ్చి కుక్కలు , సాలిళ్ళు , దోమలు మొదలగు జంతువులు విష జంతువులు. ఈ జంతువుల యెక్క బాగాలు అనగా శుక్రము, చొంగ మొదలగు భాగములు కూడా విషం అనియు అవి తీవ్రమయిన వ్యాధులను కలుగజేయు ప్రభావం కలవు అని మన పూర్వీకులు కనుగొన్నారు .

 విషము పుట్టుక - 

 దేవదానవులు అమృతం కొరకు పాలసముద్రం చిలుకుతున్నప్పుడు అమృతం కంటే విశేష కాంతి కలదియు , నీలవర్ణం అయిన వస్తువోకటి పుట్టి లోకమును నశింప చేయుటకు క్షణక్షణం వ్యాపించచుండగా దానిని చూసి జగత్తు అంతా విషాద భరితం అయ్యెను . అందువలన దానికి విషం అని పేరు వచ్చింది. అప్పుడు ఆ విషం ఈశ్వరునిచే ఎదుర్కొనబడినది. ఆ తరువాత ఆ విషం తన అసలు రూపం వదిలి కృత్రిమ రూపం ధరించి స్థావర, జంగమ ల యందు ప్రవేశించెను .

 విష భేదములు - 

 స్థావరం, జంగమం అను విషములు రెండు విధములు . ఇవి ఆక్రుతిమములు ( రూపం కలవి )
అందు స్థావరమునకు 10 , జంగమునకు 16 ద్రవ్యములను ఆశ్రయించుకొని ఉండును. అదే విధంగా సవిషయమనియు , సవిశావిషములు అనియు రెండు విధములు . 

            రసాది దాతువుల యందును , ముస్తకాది కందల యందు ఉండు విషములను స్థావర విషములు అనియు, పాము , ఎలుక , తేలు మొదలగు వానియందు ఉండు విషములను జంగమ విషములు అని అందురు. ఇవి విషములు అన్నింటిలోను తీవ్రమైనవి.

 విష లక్షణ గుణములు - 

 విషములు అన్నియు ఆర్చుట, ఉష్ణం , తీక్షణం , చిక్కదనం లేకుండా ఉండుట, ముందు శరీరం అంతా వ్యాపించి తరువాత జీర్ణం అగుట , శీగ్రంగా చంపుట, అలగే శరీరం నుండి పోవుచూ శరీర బంధాలును ( బాగాలు ) శిధిలం చేయుట , సూక్ష్మ నాళాల యందు కూడా ప్రవేశించుట, జట రాగ్ని వలన కూడా జీర్ణం కాకుండా ఉండుట, దోష ధాతువులను క్షీనింప చేయుట , సూక్ష్మ తత్వం వలన శరీరం యందు అవయవాల నందు ప్రవేశించి వికారం కలగచేయును .

 విష ప్రభావం - 

 విషములు యందు గుణములు తీక్షనములు . అందువలన అవి త్రిదోషములను ప్రకొపిమ్పచేయును . అట్లు విషము చే ప్రకోపించబడిన త్రిదోషములు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోవును. అందువలన విషము పిత్తము వలన జీర్ణం కాలేకపోవడం వలన ప్రాణం బంధించును. విషంతో కూడిన శ్లేష్మం చే పోవు త్రోవ మార్గము శ్లేష్మంచే నిరోదింప బడటం ములాన ఉచ్చ్వాసం బంధింపబడును. అందువల్ల ప్రాణం ఉన్నప్పటికి లేని వాడివలే సంజ్ఞా రహితుడై పడి ఉండును.

          విషం మొదట శరీరం నందు ప్రవేశించి మొదట రక్తమును, తరవాత కఫమును, పిత్తమును,వాతమును వాటి పనులను చెడగొట్టి చివరికి హృదయం నందు ప్రవేశించి ప్రాణాలు హరించును.

 స్థావర విషం యుండు స్థానములు - 

 వేరు , ఆకు , పండు, పువ్వు పట్ట, పాలు, చేప బంక, దాతువులు, దుంప ఈ పది స్థానములు విషం నిలువ ఉండు స్థానములు . అలాగే శుశ్రుతం నందు అశ్హ కూర , గుంజ, సుగంద, నల్ల యష్టిమధుకం , గన్నేరు , గురువింద, ఈశ్వరి, పోత్తిదుంప, గంజాయి మొక్కల వేర్లు విషపురితమైనవి .

    నేపాళ గింజ మద్య ఉండు సన్నని ఆకు , చేదు అనప, పాల టేకు, ప్రెంకనమ్ , అందుగ, మొక్కల యెక్క ఆకులు విషం కలవి.

     ఈ విధంగా స్థావర విషాలు 55 రకాలుగా ఉంటాయి అని శుశ్రుతుడు తన గ్రంధంలో వివరించాడు.

 ధాతు విషాలు - 

 పాదరసం, తాలకం , తామ్రము , సత్తు, సీసము , తగరము, అంజనము, మణిశిల, పాషానములు , మణులు ఇవి ధాతు విషములు .

 కంద విషాలు - 

 సక్తుకము, ముస్తకము, కూర్మము , నార్వికము, సర్షపము , ఫైకథమ్ , వత్స నాదము,శ్వేత శృంగి, కాలకుటము , మేష శృంగి, ధర్దుకము, హాలాహలము, కర్మాట ము గ్రంది. , హరిధ్రకము, రక్త శృంగి, కీసరము, యమధంష్ట్రా అనునవి 18 కంద విషములు 

        పైన చెప్పిన 18 విధములు అగు కంద విషములు ప్రాణాంత కములు. మొదటి 8 ఔషధాల యందు , మిగిలిన 10 రసవాదం ( బంగారం తయారు చేయు విద్య.) యందు ఉపయోగిస్తారు.

 స్థావర విషం లక్షణాలు - 

 స్థావర విషం జ్వరము, ఎక్కిళ్ళు, దంత హర్షము, మింగుడు పడకుండా ఉండుట, మరపు వచ్చుట, వమనం ( వాంతి ) , అరుచి, శ్వాస, మూర్ఛ వీటిని కలుగచేయును .

 మూల విషం లక్షణాలు. - 

 మూల విషం భక్షణ వలన చుట్టుకొని పొవుట, ప్రలాపం, మొహం కలుగును. పత్ర విషం 
( ఆకు లొని ) విషం వలన ఆవులింతలు, శరీరం చుట్టుకొని పొవుట, శ్వాస లొ ఇబ్బంది కలుగును.
ఫల విషం వలన వృషణాల వాపు , దాహం , అన్నా ద్వేషం కలుగును. పుష్ప విషం వలన వాంతి , మూర్ఛ కలుగును. పట్టచేప జిగురు విషము వలన నోటి వాసన, జిహ్వాకాటిన్యం , తలనొప్పి, సొల్లు కారుట, కలుగును. క్షార విషం వలన నోట నురుగ వచ్చుట, విరేచనం , నాలుక బరువు ఎక్కుట కలుగును. ధాతు విషం వలన గుండె యందు పీకుడు , మూర్ఛ కలుగును. సాధారణంగా ఈ విషములు అన్నియు తినిన కొంతకాలం తరువాత ప్రాణములు హరించును.

 స్థావర విషం లక్షణములు -

 స్థావర విషం తిన్న వానికి మొదటి వేగమున నాలుక నల్లగా మారి మోద్దుబారుతుంది. మూర్ఛ , శ్వాస, వాంతి కలుగును. రెండొ వేగమున వణుకు, తాపము, కం టం నందు భాద కలుగును, మూడో వేగమున గుండె యందలి భాద మొదలగును. ఆమాశయం నందు శుల మొదలై కన్నులు రంగు మారి పచ్చబడి వాచుట కలుగును. నాలుగో వేగమున పక్వాశయం నందు పోటు , ఎక్కిళ్లు , దగ్గు తలబరువు కలిగించును. అయిదో వేగమున కఫం కారుట, కళ్ళు పోటు, ఆరో వేగమున తెలివి నశించి విరేచనం ఎక్కువ అగును. ఏడో వేగమున మెడ, వీపు, నడుములు నిలవకపోవుట ఆతరువాత ప్రాణం పొవుట సంభవించును .

  మాటలు సరిగ్గా రానివారికి మాటలు తెప్పించే రహస్య యోగం -

వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయలు రసం పొసి బాగా కలిపి ఒక రాత్రి నానబెట్టి తరువాత ఎండబెట్టి బాగా ఎండబెట్టి బాగా ఎండిన తరువాత మళ్ళి దంచి మెత్తగా తయారుచేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి , మాటలు ముద్దగా పలికేవారికి , మాటలు ఆగిఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి స్వచ్చముగా మాటలు వస్తాయి.
 
     లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధమును నాలిక పైన రాయుచున్నను మాటలు త్వరగా వచ్చును . 

 
   

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 * పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 * పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 * పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 * పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 * పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 * తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 * ఉసిరిక పచ్చడి - పెరుగు = శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 * నెయ్యి - చక్కెర - పెరుగు = వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 * చక్కెర - పెరుగు = దప్పిక, తాపాన్ని హరించును . 

 * పెసరపప్పు - పెరుగు = రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

  
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు. బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు - 

  * పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

 
  వెన్న ఉపయోగాలు - 

    
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     

చర్మవ్రణము ( keloid ) గురించి వివరణ -

చర్మవ్రణము ( keloid ) గురించి వివరణ - 

      చర్మవ్రణ సమస్య ప్రస్తుత కాలంలో కనిపించే ప్రధానమైనది. ఈ సమస్యకు అల్లోపతి మరియు హోమియోపతి వైద్యవిధానములో సంపూర్ణ పరిష్కారం లేదు . ఆయుర్వేదం నందు ఈ సమస్యకు సంపూర్ణ పరిష్కారం కలదు. ఈ సమస్యలో ప్రధానంగా శరీరం మీద కొన్ని భాగాలలో ముఖ్యముగా ఛాతి మధ్యభాగములో మరియు ఉదరము , గడ్డము కింద , భుజముల దగ్గర ఉబ్బెత్తుగా వ్రణము లేచును . అది రాయివలె గట్టిగా ఉంటుంది. కొంతకాలము అయిన పిదప దాని నుంచి తెల్లటి పదార్ధము బయటకి వచ్చును . ఇది చిన్నగా వ్యాప్తి చెందుతూ మిగిలిన భాగాలకు కూడా వ్యాపించును . 

         ఈ సమస్య ప్రధానముగా రక్తదోషము వలన సంభంవించును . శరీరం నందు అధికమైన వాతాది దోషములు ప్రకోపము చెంది రక్తము పైన ప్రభావం చూపించుట మూలన రక్తం దోషము పొంది చర్మముపైన వ్రణము ఏర్పడును . ఈ సమస్య గురించి మరింత సమాచారం మీకు అందచేస్తాను . ముందు వ్రణాల గురించి మీకు వివరిస్తాను . 

         వ్రణాలు 2 రకాలు . అవి వరసగా 

             * శారీరకములు . 

             * ఆగస్తకములు . 

     వాతాదిదోషములు చేత జనియించిన వ్రణములు శారీరకములు . శస్త్రాలు , మిగిలిన ఆయుధాలు వలన కలుగు దెబ్బల చేత జనియించిన వ్రణములుని ఆగస్తకములు అని పిలుస్తారు . 

 * వాతదోషము పొందుట వలన కలుగు వ్రణ లక్షణాలు - 

     వ్రణము కదలకుండా గట్టిగా ఉండును. చీము మెదలైనవి మెల్లగా స్రవించును . అధికమైన బాధ కలిగి ఉండును . పోటు కలుగును . అదురుచుండును . శ్యామవర్ణం కలిగి ఉండును . ఈ లక్షణములు కలిగిన వ్రణము వాతముచే జనియించింది అని తెలుసుకొనవలెను . 

 * పిత్తజ వ్రణ లక్షణములు - 

       దప్పిక , మూర్చ , జ్వరం , తాపము , లోపల చెడిపోయి పగులుతున్నట్లు ఉండటం , దుర్గన్ధముతో కూడిన చీము స్రవించుట మొదలైన ఈ లక్షణములు కలిగినది పిత్తప్రకోపముచే జనించిన వ్రణము అని తెలుసుకొనవలెను . 

 * కఫజ వ్రణ లక్షణము - 

       మిక్కిలి జిగటగా ఉండటం , భారముగా ఉండటం , నునుపు కలిగి ఉండటం , నిశ్చలముగా ఉండటం , కొంచము నెప్పి కలిగి ఉండటం , తెల్లటి రంగుతో కలిగి ఉండటం , చీము కొంచము స్రవించుట , వ్రణము పక్వము చెందుటకు చాలా సమయం పట్టును . ఇటువంటి లక్షణాలు కలిగింది కఫదోషము వలన జనియించిన వ్రణము అని తెలుసుకోవలెను . 

     పైన చెప్పిన విధముగా శరీరంలో ఏర్పడు దోషముల వలన శరీరంపైన వ్రణాలు ఏర్పడును .
ఈ చర్మవ్రణములు వృద్ధిచెందుతూ మనిషిని కురుపిని చేయును . 

      ఈ చర్మవ్రణాల నివారణకు ప్రత్యేకమైన చికిత్స అవసరం . ఈ సమస్యతో ఇబ్బందిపడువారు చికిత్సకోరకు నన్ను సంప్రదించగలరు.  

      

కండ్ల కలక నివారణ మార్గాలు -

కండ్ల కలక నివారణ మార్గాలు - 

 * 30 గ్రాముల పసుపు చూర్ణమును ,250 ml నీటిలో వేసి కలిపి ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకొనుచున్న కండ్ల కలకలు తగ్గును . కొట్టిన పసుపు మంచిది . 

 * పంచదార 3 గ్రాములు 100 ml నీటిలో వేసి కరిగించి గంటకొకసారి ఆ నీళ్లతో కండ్లు తడుపుచున్న కండ్ల కలక హరించును . 

 * పటిక చూర్ణము 3 గ్రాములు , కోడిగుడ్డు తెల్ల సొనతో నూరి గుడ్డకు పట్టించి నేత్రములపై పట్టి వలె వేయుచుండిన యెడల కండ్లు నీరుకారుట , కండ్ల వాపులు హరించును . 

 * నీరుల్లి ( Red onion ) రసం రెండు లేదా మూడు చుక్కలు కండ్లలో వేయుచుండిన యెడల కండ్ల కలకలు హరించును . 

 * కలబంద మట్ట పైన పచ్చటి పోర తీసివేసి లోపలి జిగురు వంటి భాగం 11 సార్లు కడిగి పసుపు అద్ది కళ్లు మూసుకుని కనురెప్పల పైన వేసి జారకుండా శుభ్రమైన గుడ్డతో కట్టుకట్టి గంట పాటు ఉంచవలెను . ఇలా రెండుపూటలా చేయుచున్న కంటి ఎరుపులు , దురద , వాపు తగ్గును . 

    పైన చెప్పిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్నది పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 

  
   

నిమ్మకాయతో చికిత్స -

నిమ్మకాయతో చికిత్స - 

  అజీర్ణం ( Dyspepsia ) - 

   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 

  మలాశయం బాధ ( Bowel Trouble ) - 

    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

 స్థూలకాయం ( Obesity ) - 

    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.

 ముఖ సౌందర్యం ( cosmetic ) - 

   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 

  చలి జ్వరం - ( Maleria ) 

     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 

   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.

 రక్తస్రావం - 

    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 

    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 

  దంతశుద్ధి - 

     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.

          

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 

           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.

 * "A" విటమిన్ -

       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .

              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.

 * "B" విటమిన్ -

         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.

           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.

 * "C" విటమిన్ -

          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.

 * "D" విటమిన్ - 

         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.

              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .

 * "E " విటమిన్ -

          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.

              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.

          

తిప్పసత్తు తయారీ విధానము -

తిప్పసత్తు తయారీ విధానము - 

   ముదిరిన తిప్పతీగ వ్రేళ్ళను తెచ్చి కత్తితో పైన పొట్టు తీసి సన్నని ముక్కలుగా కొట్టి దంచి నీటిలో కడగవలెను . జిగురు వచ్చు వరకు దంచి కడగవలెను. కడిగిన నీళ్లు ప్రత్యేకముగా ఉంచవలెను. జిగురు రాకపోయినా దంచి కడుగుటను మాని మొదట కడిగిన నీళ్లను వెడల్పాటి పళ్ళెములో పోయవలెను. సత్తు అంతా తెల్లగా అడుగున పేరి నీరు పైకి తేలును. ఆ నీటిని వంచివేయవలెను . ఈ విధముగా రెండోసారి , మూడోసారి తిప్పతీగని కడిగిన నీటిని పళ్ళెము లొ పొసి ఉంచవలెను. ఇందులొ తయారు అగు సత్తు మొదటి దాని అంత తెల్లగా ఉండదు. పైకి తేలిన నీటిని ఎప్పటికప్పుడు వంచివేయచుండవలెను . ఇటుల చేరిన సత్తుని బాగుగా ఎండు వరకు ఉంచిన అవి ముక్కలు అగును. ఇది రెండు రొజులలొ తయారు అగును . 

                 రాత్రుల యందు పాత్ర ను మూతతో కప్పి ఉంచవలెను. మూలికను దంచునప్పుడు రోలుకు కాని , రోకలికి కాని సున్నము తగలరాదు. సున్నము తగిలినచో సత్తు విరిగిపోవును. పళ్లెము కి కూడా సున్నము తగలనివ్వరాదు. 

             ఈ సత్తుని ప్రత్యేకంగా వాడుట యే కాక ఇతర ఔషదాలతో కూడా కలిపి ఇవ్వవచ్చు.

 దీని ఉపయోగాలు - 

 * దీనిని తేనెతో తీసుకుంటే కఫం పోవును .

 * బెల్లముతో తీసుకున్నచో మలబద్దకం పోవును . 

 * పంచదారతో ఇచ్చిన పైత్యమును , నేతితో ఇచ్చిన వాతమును హరించును. 

  * దీనిని అనుపానములతో ఇచ్చిన సర్వరోగములు పోగొట్టును . 

 * షుగర్ వ్యాధిగ్రస్తులు విడవకుండా వాడితే షుగర్ 
అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. 

 * ఎప్పుడు నోరు పూస్తుంది అనేవారు తిప్పసత్తుని కర్పూర శిలజిత్ ని పంచదారతో గాని నేతితో గాని కలిపి తీసుకుంటే శరీరంలో అతివేడి తగ్గును . 

 * పొడిదగ్గు కి కూడా ఇదే మిశ్రమాన్ని వాడవలెను.

 * వేడి శరీరం ఉన్నవారు ప్రతిరోజు తిప్పసత్తు వాడితే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి.

 గమనిక - ఆయుర్వేద పచారి షాపుల్లో మీకు తిప్పసత్తు దొరకును. మీకు వీలుంటే సొంతంగా చేసుకోవచ్చు .

    

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు -

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు - 

 
     ఈ సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం. ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.

  విరుద్ద ఆహారపదార్థాలు - 

 * నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.

 * తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు . 

 * ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు. 

 * కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.

 * చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.

 * చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు . 

 * పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు. 

 * ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు 

 * ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.

 * మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .

 * మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.

 * ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .

 * ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.

 * పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.

 * పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .

 * తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును 

 * ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.

 * నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.

 * ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.

 * తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును 

 * రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.

 * బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు . 

 * అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు . 

     పైన చెప్పిన విధంగా విరుద్ద ఆహార పదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగంధరం ,గ్రహణి వంటి రోగాలు కలుగును.