*<>•<>•<>•<>•<>•<>•<>•<>•>*
*ఆరోగ్య మస్తు*
*====================*
*తెల్ల జొన్నల మాల్ట్*
*++++++++++++++++++++*
*తయారీవిధానం*
: తెల్లజొన్నలను ఒకకిలో తెచ్చుకొని ఒకరోజు నీళ్ళలో నానవేయండి. తర్వాత వడకట్టి తడి నూలుబట్టలోవేసి మూటకట్టి 1,2రోజు విలువవుంచండి. మరునాటికి ఆ జొన్నలు మొలకెత్తుతాయి. అప్పుడు వాటిని తీసి బాగా ఎండించిన తరువాత బాండీలో వేసి కొంచెం నేతితో దోరగా వేయించి పిండిలాగా విసురుకొని నిలువవుంచుకోండి.
*ఉపయోగాలు*
ఈ జొన్నపిండిని పైనచెప్పిన ప్రకారం జావ(మాల్టు) లాగా కాచి పిల్లలచేత తాగించండి. పూర్వకాలం జొన్నన్నం, జొన్నసంకటి, జొన్నరొట్టెలు తిన్న మనపెద్దలు ఎంత బలిష్టులుగా ఎంతదీర్ఘాయువుతో ఎంత ఆరో గ్యంగా జీవించేవారో అదేవిధంగా ఈజావ తాగిన బిడ్డలుకూడా అంతే ఆరోగ్యంగా అభివృద్ధి చెందగలుగుతారు.
10 అంతేగాక తెల్లజొన్నలు మానవులకు ముఖ్యంగా పిల్లలకు, యువకులకు శారీరకపుష్టిని, వీర్యవృద్ధిని, మనోహరమైన రుచిని అందిస్తయ్. ముఖ్యంగా మానవశరీరంలో సకలరోగాలకు మూలమైన వాత, పిత్త, శ్లేష్మములనబడే త్రిదోషములను సమస్థాయికి తెచ్చి ఈ పదార్థం తిన్నంతకాలము ఆ 1 శక్తులకు ఏవ్యాధులు రాకుండా కాపాడగలుగుతయ్. తెల్లజొన్నలు పై ప్రకారంగా వాడటంవల్ల అతి త్వరగా జీర్ణమై శీఘ్రంగా ధాతుశక్తిగా రూపాంతరం చెందుతూ బిడ్డలను దీర్ఘకాయులుగా, సుందరశరీరులుగా నిరోగులుగా, తీర్చిదిద్దుతయ్.
*తల్లులకు సూచన*
ఇంత గొప్ప శక్తిగల ధాన్యం
అందుబాటులో ఉన్నా కూడా కొద్దిపాటి శ్రమతో జావగా తయారుచేసి బిడ్డలచేత తాగించగల అవకాశం వుండికూడా నేటి తల్లులు ఈసత్యాన్ని తెలుసుకోలేక వందల రూపాయలు ఖర్చుపెట్టి అంగళ్ళలో కొన్న మాల్టులను బిడ్డలకు వాడుతున్నారు. ఇకనైనా తల్లులు తమ స్వహస్తాలతో చేసిన స్వగృహమాల్టులను బిడ్డలచేత తాగించవలసిందిగా కోరుతున్నాం.
* *తెల్ల జొన్నల సూప్*
*+++++++++++++++++++*
1 తెల్ల జొన్న లు-100గ్రాములు
2. అన్నం వండింది -1/4 కప్పు
3. పెరుగు -1/4 కప్పు
4. ఉల్లిపాయ ముక్కలు1/4కప్పు
5. పచ్చిమిర్చి ఒకటి
6. జీలకర్ర ఒక చెంచా
7. ఇంగువ పావు చెంచా
8. ఉప్పు తగినంత
*తయారు చేయు విధానం*
:-
తెల్ల జొన్నల పిండి చేసుకుని దానిలో తగినంత నీళ్లు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పావు కప్ప అన్నంలో కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి దాన్ని తెల్ల జొన్నలులో కలపాలి
పెరుగులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంకా వేసి గ్రైండ్ చేయాలి. దాన్ని సూపులో కలపాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి
ఒక మట్టి పాత్రలో, ఎనిమిది పది గంటల అలాగే ఉంచుకున్న తర్వాత త్రాగాలి.. చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటాది.
*తెల్ల జొన్నలు మాల్ట్ తయారు చేయు విధానం*:-
***************************
ఒక కేజీ "తెల్ల జొన్న లు రాత్రి నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఒక బట్టలో వేసి మూట గట్టి.. రెండు రోజులు అలాగే ఉంచితే మొలకలు వస్తాయి
వాటిని ఎండబెట్టి.. పొడి చేసి నిలువు చేసి పెట్టుకోవాలి
*👉 కావలసిన పదార్థాలు*
1. తెల్ల జో న్నుల పిండి 50 గ్రాములు
2. ఖర్జూరం గింజలు తీసినవి-2
3. బెల్లం 20 గ్రాములు
4.నెయ్యి 10-20ml
5. పుచ్చకాయ గింజలు 1/4 చెమ్చా
6. సబ్జా గింజలు పావు చెంచా
7. వేయించిన వేరుశెనగ గింజలు
5 గ్రామలు
8. బాదం, జీడిపప్పు, కిస్మిస్
-20 గ్రాములు
9.నువ్వులు పావు చెంచా
9.నీళ్లు 200ml
*👉 తయారుచేయు విధానం*
:--
200ml లో 50 గ్రాములు తెల్ల జొన్న పిండి వేసి వేడి చేయాలి.. 50 ml నీళ్ళ లో బెల్లము ఖర్జూరము.. విడిగా నానబెట్టుకోవాలి.. తెల్ల జొన్నల పిండి ఉడుకుతున్నప్పుడు దానిలో వేసేయాలి.. స్టవ్ మీద ఉన్నప్పుడు మీగత పదార్థాలు కూడా వేసి వేయాలి... కొద్దిసేపటి తర్వాత తాగడానికి రెడీ గా ఉంటావి
👉ఉదయం లేదా సాయంత్రం పూట దీనిని సేవించవచ్చు..
రాత్రి భోజనం బదులు కూడా సేవించవచ్చు...
No comments:
Post a Comment