కొందరి స్త్రీలలో ముఖ్యముగా యుక్తవయస్సులో ఉన్నటువంటి బాలికలలో అతిరక్తస్రావం జరుగుతుంది. నెలకు 10 నుంచి 15 రోజుల వరకు కూడా బహిష్టు రూపంలో రక్తస్రావం జరుగును. మరికొందరిలో నెలకు రెండుసార్లు బహిష్టు అవుతారు. ఎదిగే వయస్సులో అటువంటి సమస్య రావటం వలన రక్తం విపరీతంగా బయటకి పోయి శరీర దౌర్బల్యానికి గురిఅవుతారు.
వారం రొజుల క్రితం ఇటువంటి సమస్యతో బాధపడుతున్న ఒక కుటుంబం నన్ను సంప్రదించారు . యువతి వయస్సు 18 సంవత్సరాలు . ఆ యువతికి బహిష్టు సమయంలో విపరీత రక్తస్రావం జరుగుతుంది.దానివలన బాగా బలహీన పడిపోయింది .
బహిష్టు సమయంలో జరిగే రక్తస్రావమునకు మగ్గిన చక్కెరకేళి అరటిపండుకు నాటు ఆవునెయ్యి పూసి తినిపించమని చెప్పాను . కేవలం 3 రోజుల్లో సమస్య తీరినది.
No comments:
Post a Comment