Sunday, January 19, 2020

మొలలు వ్యాధి ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు ( piles )

 *  పాతబియ్యం , పాతగోధుమలు వాడవలెను.

 *  బార్లీ , సగ్గుబియ్యం జావ వాడవలెను.

 *  బీరకాయ, పొట్లకాయ కూరలు తినవలెను .

 *  పెసరపప్పు తినవలెను . కందిపప్పు , మినపపప్పు తినవద్దు.

 *  కోడి మాంసం , గుడ్డు నిషిద్దం . ఎప్పుడైనా ఒకసారి మేకమాంసం అతి తక్కువ మోతాదులో మసాలా చాలా తక్కువ మోతాదులో కలిపి తీసుకొవచ్చు.

 *  పాతపచ్చళ్ళు పూర్తిగా నిషిద్దం.

 *  ఎక్కువసేపు ప్రయాణాలు చేయరాదు .

 *  పళ్ల రసాలు తీసుకోవచ్చు . ముఖ్యంగా యాపిల్ రసం తీసుకోవలెను .

 *  కఠినంగా ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువసేపు కూర్చోరాదు. స్పాంజితో చేసినవి కూడా వాడకూడదు . బూరుగు దూది లేదా పత్తితో చేసినవి వాడవలెను.

 *  పెరుగుతోటకూర, మెంతికూర, పాలకూర, గంగపాయల కూర , చక్రవర్తికూర వంటి ఆకుకూరల తరుచుగా తీసికొనవలెను.

 *  మలబద్దకం లేకుండా చూసుకొనవలెను. సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి .

 *  ఆవునెయ్యి , ఆవుమజ్జిగ, ఆవుపాలు వాడుకుంటే మంచిది .

 *  శరీరానికి వేడిచేసే పదార్థాలు తీసుకోరాదు . వీలయినంత ఎక్కువ మజ్జిగ తీసికొనవలెను.

 *  కొత్తబియ్యం, కొత్తగోధుమలు వాడరాదు.

 *  కొత్తచింతపండు , కొత్తబెల్లం నిషిద్దం.

 *  నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడరాదు.

 *  ఆహారంలో నూనె తగ్గించి వాడుకొనవలెను.

 *  కొడి చేప , రొయ్యలు వాడరాదు.

 * చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన ఆహారాన్ని తినకూడదు.

 *  వంకాయ , గోంగూర, సొరకాయ, బచ్చలి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలల సమస్య ఉన్నవారు తీసుకోకూడదు .

       మొలల సమస్య ఉన్నవారు శరీరంలో వాతం , వేడి పెరగకుండా జాగ్రత్తపడుతూ సరైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకొనవలెను .

     మొలలకు సంబంధించి సంపూర్ణ చికిత్సకు నన్ను సంప్రదించవచ్చు. రక్తం కారే తీవ్రమైన సమస్య ఉన్నను కేవలం 10 రోజులలోపు రక్తం ఆగిపోయి నొప్పి తగ్గుతుంది . మొలల పిలకలు కూడా ఎటువంటి సర్జరీ లేకుండా ఊడిపోతాయి.

No comments:

Post a Comment